English | Telugu

విచారణకు రెడీ అంటోన్న వరలక్ష్మి

ఇటీవల డ్రగ్స్‌ కేసులో సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఎ అధికారులు సమన్లు పంపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని వరలక్ష్మీ అంటున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తను చూసి షాక్‌ అయ్యానంటున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఆదిలింగం తన వద్ద మూడేళ్ళ క్రితం ఫ్రీలాన్స్‌గా పనిచేశాడని, ఇప్పుడతను ఎక్కడ ఉన్నాడో కూడా తనకు తెలియదని అంటోంది వరలక్ష్మీ.
2020లో కేరళలోని తీరప్రాంతంలో నేవీ పోలీసులు ఒక పడవలో 300 కిలోల డ్రగ్స్‌, ఎకె47 రైఫిల్స్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మందిని అప్పుడే అరెస్ట్‌ చేశారు. 14వ వ్యక్తిగా ఆదిలింగం నుంచి అదుపులోకి తీసుకున్నారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఎల్‌టిటిఇ సంస్థకు ఆదిలింగం టీమ్‌ నిధులు చేసేవారని , అంతేకాదు దీని ద్వారా సంపాదించిన డబ్బును క్రిప్టో కరెన్సీలో, సినిమాల్లో పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. ఈ విషయంలో వరలక్ష్మీకి సంబంధం ఉందేమోనన్న అనుమానంతో విచారణకి పిలవాలనుకున్నారు. అయితే వరలక్ష్మి మాత్రం తన గురించి మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని అంటోంది. విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరితే తప్పకుండా వెళ్తానని చెబుతోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.