అప్పుడు 'జనతా గ్యారేజ్'.. ఇప్పుడు 'ఖుషి'
మైత్రి మూవీ మేకర్స్ కి సెప్టెంబర్ 1 లక్కీ డేట్ లా ఉంది. ఏడేళ్ల క్రితం మైత్రి నిర్మించిన 'జనతా గ్యారేజ్' 2016, సెప్టెంబర్ 1 విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమిది. అప్పటికిది ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. నేటితో 'జనతా గ్యారేజ్' విడుదలై ఏడేళ్లు పూర్తయింది. అయితే ఈరోజు మైత్రి మరింత 'ఖుషి'గా ఉంది.