English | Telugu

‘ఖుషి’ పబ్లిక్‌ టాక్‌ -  ముగ్గురికీ సినిమా ప్లస్సే!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఖుషి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాపైన ఆడియన్స్‌కి ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఎందుకంటే విజయ్‌ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఈ ముగ్గురూ ఫ్లాపుల్లో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్‌ అవ్వడం వారి కెరీర్‌కి ఎంతో ముఖ్యం. ఆడియన్స్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో ఈ ముగ్గురికీ అలాగే ఉన్నాయి. ఈ సినిమా మొదటి షో పూర్తయిన తర్వాత పాజిటివ్‌ టాకే వచ్చింది. ఒక కొత్త కథను చూద్దామని థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్‌ పాత కథనే కొత్తగా చూపించిన విధానం బాగా నచ్చింది. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌, సమంత ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేసిన ఈ సినిమాలో ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. విజయ్‌, సమంతల పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఇద్దరూ అద్భుతంగా చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. రొటీన్‌ కథనే తీసుకొని అందంగా మలచిన డైరెక్టర్‌ శివను ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ముగ్గురికీ ఈ సినిమా ప్లస్‌ అవుతుందని అంటున్నారు. అక్కడక్కడా సినిమా కాస్త స్లో అయినట్టు అనిపించినా అదంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆడియన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ చాలా పెద్ద ప్లస్‌ అయిందని చెప్పాలి. హేషామ్‌ అబ్ధుల్‌ వాహెబ్‌ అందించిన పాటలు సినిమా రిలీజ్‌కి ముందే పెద్ద హిట్‌ అవ్వడంతో సినిమాలో ఆ పాటలు మరింత ఆకట్టుకున్నాయంటున్నారు. కొందరు ఈ సినిమా పాటలు వినే సినిమాకి వచ్చామని చెబుతున్నారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సన్నివేశాలకు, సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బాగా చేశారని అంటున్నారు. మ్యూజిక్‌ సినిమాని నిలబెట్టిందనేది కొందరి అభిప్రాయం. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని కొందరంటుంటే, ఫ్యామిలీ సబ్జెక్ట్‌ అయినప్పటికీ యూత్‌ కూడా ఎంజాయ్‌ చేసేలాగే ఉందని కొందరంటున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకి పబ్లిక్‌ నుంచి పాజిటివ్‌ టాకే వచ్చింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.