English | Telugu

‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ మారుతుందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. నుపూర్ స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ రవితేజ తొలిసారి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను అక్టోబ‌ర్ 20న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ మూవీ రిలీజ్ డేట్ మారనుంది. అంటే మూవీ రిలీజ్ వెన‌క్కి వెళ్ల‌టం లేదు. ప్రీ పోన్ అవుతుంద‌ని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఎప్పుడో అక్టోబ‌ర్ 20న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అక‌స్మాత్తుగా ప్రీ పోన్ చేయ‌టానికి కార‌ణం ప్ర‌భాస్ అని తెలుస్తోంది. అస‌లు ప్ర‌భాస్‌కి, ‘టైగర్ నాగేశ్వరరావు’కి ఉన్న లింకేంటి? అనే అనుమానం రావ‌చ్చు. వివ‌రాల్లోకి వెళితే సెప్టెంబ‌ర్ 28న ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘స‌లార్‌’ మూవీ అనుకోకుండా వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ మేక‌ర్స్ త‌మ సినిమాను సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. డైరెక్ట‌ర్ వంశీ ఇప్ప‌టికే ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేయ‌టంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇక‌పై ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌ను వేగ‌వంతం చేసి సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువడుతుంద‌ని మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. స్టూవ‌ర్టుపురం దొంగ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ ఆధారంగానే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను రూపొందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.