English | Telugu

తొలిరోజే రూ.30.1 కోట్లు కొల్లగొట్టిన ‘ఖుషి’లో చిత్ర యూనిట్‌!

విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘ఖుషి’ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. తొలిరోజు ఇంత భారీగా కలెక్ట్‌ చేయడం విజయ్‌ కెరీర్‌లోనే తొలిసారి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ తొలి షో నుంచి సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ సినిమాకు వెళ్తున్నారు.

యుఎస్‌లో కూడా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘ఖుషి’. యుఎస్‌లో 8 లక్షల డాలర్లు వసూలు చేసి అందరితోనూ వావ్‌ అనిపించుకుంటోంది ‘ఖుషి’. ఈ సినిమాకి సరైన పోటీ లేకపోవడం కూడా బాగా కలిసొచ్చింది. కలెక్షన్లపరంగా ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి విజయ్‌, సమంత, శివ నిర్వాణ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.