విశాఖ ఉక్కుకు చెదలు
ప్రపంచ ప్రఖ్యాత స్టీలుప్లాంటులో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడుల్లో పదిశాతం వాటాను ఉపసంహరించుకోనుంది. ఇలా కొద్ది కొద్ది వాటాలు వెనక్కితీసుకుంటూ చివరికి ఈ పరిశ్రమను పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీని వల్ల ఇప్పటి వరకూ ఉన్న కార్మికుల భద్రత కూడా కొరవడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో లాభాలార్జిస్తున్న ఏకైక పరిశ్రమ ఈ విశాఖ ఉక్కుపరిశ్రమ. జాతికి అంకితమైన ఈ పరిశ్రమ ప్రైవేటుపరమైతే ఆ పారిశ్రామికవేత్తలు మరిన్ని లాభాలను ఆర్జించటంతో పాటు ప్రపంచస్టీలుమార్కెట్టును శాసించటం ఖాయం. ఇప్పటి వరకూ ఈ స్టీలురంగంలో భారతీయులే ఎక్కువగా రాణిస్తున్నారు. అందుకే టాటాస్టీలు, మిట్టల్ స్టీలు పరిశ్రమలు అంతర్జాతీయఖ్యాతిని ఆర్జించాయి. లాభాలబాటలో ఉన్న పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వంలో కొందరు పెద్దల స్వలాభానికి దోహదపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే విశాఖపరిశ్రమలోని సుమారు 17వేల మంది కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడుతున్నారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, బిఎంఎస్, హెచ్ఎంఎస్, టిఎన్టియుసి తదితర కార్మికసంఘాలు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఈ నెల 25న ఐపీఓ జారీ చేద్దామని నిర్ణయించుకుంది. కానీ, మార్కెట్టుపరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆ ప్రతిపాదన మార్చుకుంది. దేశచరిత్రలోనే ఓ ప్రధాని జాతికి అంకితం చేసి లాభాల బాటలో నడిచే గర్వకారణమైన ఈ స్టీలు పరిశ్రమ మరొకటి లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు తెచ్చుకునేలా కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. మంగళవారం మొత్తం ప్రొడక్షన్ను ఆపేసి మరీ తమ నిరసన గళాన్ని వినిపించారు. కార్మికుల ఉద్యోగభద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన విరమించుకోవాలని, పెద్దలు కూడా తమ స్వలాభాన్ని మానుకుని పరిశ్రమను యథాతథంగా నడిపేలా చూడాలని కార్మికనేతలు,రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారు.
అందుకే విశాఖపరిశ్రమలోని సుమారు 17వేల మంది కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పడుతున్నారు. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, బిఎంఎస్, హెచ్ఎంఎస్, టిఎన్టియుసి తదితర కార్మికసంఘాలు ఈ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్నారు. మొదట్లో ప్రభుత్వం ఈ నెల 25న ఐపీఓ జారీ చేద్దామని నిర్ణయించుకుంది. కానీ, మార్కెట్టుపరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఆ ప్రతిపాదన మార్చుకుంది. దేశచరిత్రలోనే ఓ ప్రధాని జాతికి అంకితం చేసి లాభాల బాటలో నడిచే గర్వకారణమైన ఈ స్టీలు పరిశ్రమ మరొకటి లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు తెచ్చుకునేలా కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. మంగళవారం మొత్తం ప్రొడక్షన్ను ఆపేసి మరీ తమ నిరసన గళాన్ని వినిపించారు. కార్మికుల ఉద్యోగభద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన విరమించుకోవాలని, పెద్దలు కూడా తమ స్వలాభాన్ని మానుకుని పరిశ్రమను యథాతథంగా నడిపేలా చూడాలని కార్మికనేతలు,రాష్ట్రప్రజలు కోరుకుంటున్నారు.