భారీ ఎన్కౌంటర్.. కీలక నేత మృతి..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాటేపెల్లి అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగగా.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన మావోల్లో.. ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ఆత్రం శోభన్ (చార్లెస్) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంక మిగిలిన ఇద్దరు.. మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్, ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడు దినేష్ ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ తుపాకితోపాటు రెండు మందుగుండు సామగ్రి డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.