రోడ్డు ప్రమాదాల్లో తమిళనాడు టాప్..
దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో జరిగినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2015 కు సంబంధించి రోడ్డుప్రమాదాలు, మరణాలకు సంబంధించి నితిన్ గడ్కరీ ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014తో పోలిస్తే 2015లో 2.5శాతం రోడ్డుప్రమాదాలు, 4.6శాతం మరణాలు పెరిగాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కాగా రోడ్డుప్రమాదాల్లో ఏపీ ఏడోస్థానంలో, తెలంగాణలో పదో స్థానంలో ఉన్నాయి. నగరాల వారీగా అత్యధిక ప్రమాదాలు ముంబయిలో, అత్యధిక మరణాలు దిల్లీలో సంభవించాయి. ట్రాఫిక్ జంక్షన్లలోనే 49శాతం ప్రమాదాలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 53.8 శాతం ప్రమాదాలు, 61శాతం మరణాలు సంభవిస్తున్నాయి. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవించాయి. రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారే.