టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు వివేక్, వినోద్, భాస్కర్ రావు, జువ్వాడి నర్సింగ్ పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నేతలకి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటోన్న సందర్భంగా టీఆర్ఎస్ భవన్కి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఇప్పుడు 13కు పడిపోయింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాం.. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై రాష్ట్రానికి అన్యాయం చేశారు అని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పడింది.. తెలంగాణ అభివృద్ది కోసమే నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని.. 2019 లో గెలిచే పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని.. 2019 నాటికి ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.