రూపాయి టీచర్.. 

బతుకునిచ్చేది అమ్మానాన్న. బతుకు నేర్పేది బడి టీచర్. అందుకే గురు బహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరభాహ్మ తస్మైశ్రీ గురవేనమ  అన్నారు. జీతాలు తీసుకుని పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారు. అదే జీతాలు తీసుకుని పాఠాలు చెప్పని టీచర్లు కూడా ఉంటారు. కానీ తనకు వచ్చిన జీతంలో 30 శాతం విద్యార్థులు భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే టీచర్ ని ఎక్కడైనా చూశారా.. చూడకపోతే ఆ టీచర్ ని పరిచయం చేస్తాను పదండి..  పేరు పద్మావతి. ఓ ప్రభుత్వ టీచర్. ఆందరూ ప్రేమగా రూపాయి టీచర్ అంటారు. అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో విధుల్లోకి వెళ్ళింది పద్మావతి. ఆ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు.. ఎలాగైన ఆ పరిస్థితిని మార్చాలని. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లలను బడిలో చేర్పిస్తే వారి పేరుమీద డబ్బులు జమ చేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. పిల్లల పేరు మీద రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్డీ) అకౌంట్‌ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు.      పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతోపాటు, పొదుపుపై పాఠాలు చెబుతూ.. వారి ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆమె ఏ పాఠశాలకు వెళ్లినా పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. పేదలకు వీలైనంత సేవ చేయడమే లక్ష్యమంటున్న పద్మావతి, ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు. కృష్ణా జిల్లాలోఅవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.    

బెంగాల్ లో దుబ్బాక స్కెచ్! పీకే ఆడియోతో పరేషాన్ 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక గత నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య  హోరాహోరీ పోరు నడిచింది. పోలింగ్ కు ముందు రోజూ వరకూ ఎవరికి ఎడ్జ్ ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే పోలింగ్ రోజు ఉదయానికే సంచలన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరారన్నది దాని సారాంశం. ఈ వార్త నియోజకవర్గంలో చర్చగా మారింది. పోలింగ్ పైనా ప్రభావం చూపింది. సీన్ కట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు.  దుబ్బాక ఉప ఎన్నిక లాంటి సీనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ లో జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత ఆందోళనకర పరిస్థితులు బెంగాల్ లో కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందా  ? లేక బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొద్దిపాటి మెజార్టీతో అయినా మమత మళ్లీ అధికారంలోకి వస్తారని కొన్ని సర్వేలు చెప్పినా.. బీజేపీ పుంజుకునే అవకాశం లేకపోలేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.  హోరాహోరీ పోరు సాగుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో లీకై కలకలం రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆడియోలో పీకే వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ గా చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని  ప్రజలు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం.  ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో బెంగాల్ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండించారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని ప్రశాంత్ జోస్యం చెప్పారు.  

చిక్కడు దొరకడు.. వెంటాడు వేటాడు 

అది బీజాపూర్ అడవి. ఆ అడవిలో జవాన్లు టెంట్లు వేసుకుని పాహారా కాస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్క సారిగా తుపాకీ తూటాల చప్పుడు. భద్రత బలగాలపై మావోయిస్టులు త్రిశూల వ్యూహంతో మెరుపుదాడి చేశారు. తుపాకుల మోతల మధ్య అడవిని పొగ కమ్మేసింది. ఆ పొగ తేలిపోగానే 22 మంది జవాన్లు రక్తపు మడుగులో కనిపించారు. మిగిలిన జవాన్లు ఆ దాడి నుండి తేరుకుని చూసే సరికి  కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌స కనిపించలేదు. ఏమైపోయారు అని జవాన్లు ఆలోచనలో పడ్డారు అక్కడ శవాలుగా పడిపోయిన జవాన్లను చూశారు అందులో కూడా రాకేశ్వర్ సింగ్ కనిపించలేదు. జవాన్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉందని గ్రహించిన మావోయిస్టులు.. సేఫ్‌ జోన్‌కు వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అందుకు ఎవరో ఒక జవాన్‌ను బందీగా తమ వెంట తీసుకెళ్లడమే మంచిదని ‌భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌సను అపహరించారు. అంతా అనుకున్నట్లే జరిగిందని భావించి, ఆపరేషన్‌ను ముగిద్దామని నిర్ణయించినట్లు తెలిసింది.   కట్ చేస్తే .. ఆ గెరిల్లా దళ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఇప్పుడు సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయాడా? ఆ తర్వాతే మావోయిస్టుల నుంచి బందీగా ఉన్న జవాను విడుదలపై చర్చల ప్రస్తావన మొదలైందా? ఈ ప్రశ్నలకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. మూడో తేదీ సాయంత్రానికే వారు సేఫ్‌ జోన్లకు పయనమై.. కొందరు మావోయిస్టులను వ్యూహాత్మకంగా టేకులగూడెం వద్ద రాకేశ్వర్‌తోపాటు ఉంచారు. గెరిల్లా దళానికి చెందిన మావోయిస్టులు 10 బృందాలుగా బీజాపూర్‌, దంతెవాడ, సుక్మా అడవుల్లోని సేఫ్‌ జోన్లకు వెళ్లారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. హిడ్మా ఇప్పుడు ప్రభుత్వాలు, భద్రతా బలగాలకు టార్గెట్‌గా మారడంతో.. అతనికి నాలుగంచెల భద్రతను కల్పిస్తూ.. సేఫ్‌ జోన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఐదో తేదీకల్లా.. ఎక్కడివారక్కడ సేఫ్‌ అని నిర్ధారించుకున్నాక.. రాకేశ్వర్‌ సింగ్‌ తమ చెరలో ఉన్నాడని, మధ్యవర్తుల పేర్లు చెబితే వదిలేస్తామంటూ మావోయిస్టుల నుంచి లేఖ విడుదలైంది. అప్పటికీ పోలీసుల నుంచి కోబ్రా కమాండో కోసం గాలింపు చేపడుతున్నామని, కూంబింగ్‌ కొనసాగుతోందనే ప్రకటన రావడంతో.. వ్యూహాత్మకంగా రాకేశ్వర్‌ ఫొటోను విడుదల చేశారు. దీన్ని బట్టి.. ఆపరేషన్‌ జరిగాక కేవలం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లడానికే జవాన్‌ను అపహరించినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత చర్చల్లో భాగంగా జైళ్లలో మగ్గుతున్న తమ వారు 150 మందిని విడుదల చేయాలని, ఆపరేషన్‌ ప్రహార్‌ను నిలిపివేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాలని మావోయిస్టులు నిర్ణయించినా.. బస్తర్‌ విలేకరుల ఒత్తిడితో రాకేశ్వర్‌ను గురువారం విడుదల చేశారు. ఇప్పుడు మావోయిస్టులపై ప్రతీకారానికి సీఆర్పీఎఫ్ సిద్దమవుతోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా హిడ్మాతో పాటు ఆయన దళం  కథ ముగిస్తామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్.  ఈ ఆపరేషన్‌ కోసం బీజాపూర్  ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు  కుల్దీప్‌ సింగ్  తెలిపారు.  నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.  ఏడాదిలోగా హిడ్మా అంతు చూస్తామని హెచ్చరించారు.  భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు.  

కేసీఆర్, జగన్.. మధ్యలో షర్మిల.. అంతా సెంటిమెంట్ గేమ్? 

ఖమ్మంలో  షర్మిల గర్జించారు. పంచ్ డైలాగులతో కేసీఆర్‌ సర్కారును కుమ్మేశారు. కేసీఆర్ సర్కారును, కల్వకుంట్ల కుటుంబాన్ని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడుకున్నారు షర్మిల. ప్రజల కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు సభా వేదికగా ప్రకటించారు షర్మిల. తాను కేసీఆర్, జగన్‌లు వదిలిన బాణాన్ని కాదంటూ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఈ స్థాయిలో కౌంటర్ చేసిన నేత ఈ మధ్య కాలంలో మరెవరూ లేరు. షర్మిల ఇంత ఘాటుగా నిలదీసినా.. అదికార పక్షం నుంచి పెద్దగా ప్రతివిమర్శలు రావడంలేదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు షర్మిలను లైట్ తీసుకుంటున్నాయి. ఆమె మానాన ఆమెను వదిలేస్తున్నాయి. కేసీఆర్‌పై ఆమె చేసిన విమర్శలు చూస్తుంటే.. నిజంగా ఆమె గులాబీ బాస్‌పై దండెత్తడానికే వస్తున్నారని అనిపిస్తుంది. జగన్‌ను విభేదించే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు కనిపిస్తోంది.  అయితే కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఇదంతా కేసీఆర్, జగన్‌లు కలిసి ఆడుతున్న నాటకమని అంటున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రస్తుతం షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. ఈ రెండేళ్లు షర్మిలను పొలిటికల్‌గా ప్రమోట్ చేసి.. ఎన్నికల సమయంలో ఆమెను బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలనేది కేసీఆర్ వ్యూహం అని భావిస్తున్నారు. అందుకు, వాళ్లు చేసే విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎన్నికల నాటికి షర్మిల పార్టీ తెలంగాణలో కాస్త బలోపేతం అయ్యేలా గులాబీ పార్టీ సహకరిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ఏకు మేకుగా మారుతున్న బీజేపీ నుంచి ప్రజల చూపు షర్మిల పార్టీ వైపు డైవర్ట్ చేస్తారు. కాంగ్రెస్‌కూ ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీని ముందుంచుతారు. తెలంగాణలో షర్మిల పార్టీ సెట్ అయ్యాక.. ఎన్నికల సమయంలో ఆ పార్టీ పుట్టి ముంచేస్తారు. షర్మిలకు ఓటేస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే.. మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారంటూ కొత్త వివాదం తెరపైకి తీసుకొస్తారు కేసీఆర్. అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇద్దరు అన్నాచెల్లెల్లు కలిసి రెండు రాష్ట్రాలను మునపటిలా ఏకం చేసి.. మళ్లీ సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తారంటూ సెంటిమెంట్ రాజేయడం కేసీఆర్ మైండ్‌గేమ్‌లా కనిపిస్తోందని అంటున్నారు. ఇదంతా అబూత కల్పనగా కొట్టిపారేయలేమని.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు విషయంలో కేసీఆర్ అదే పని చేశారని గుర్తు చేస్తున్నారు.  2018లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. గులాబీ బాస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయి. అటు రాహుల్ గాంధీ.. ఇటు చంద్రబాబు చేతులు కలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. ఇదే కేసీఆర్‌కు అనుకోని వరంగా మారింది. చంద్రబాబును ఆంధ్రా బూచీగా చూపిస్తూ.. మళ్లీ ఆంధ్రా వాళ్ల చేతిలో తెలంగాణను పెడతారా? అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఓటర్లలో ప్రాంతీయ విధ్వేషం రగిలించారు. ప్రజలూ నమ్మారు. కేసీఆర్‌ను గెలిపించారు. సేమ్ టూ సేమ్.. ఇదే స్ట్రాటజీని ఈసారి షర్మిల పేరుతో కేసీఆర్ ప్లే చేస్తారని అంచనా వేస్తున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి.. బీజేపీ, కాంగ్రెస్‌ను సైడ్ చేసి.. ప్రజలను కొత్తపార్టీ వైపు మళ్లించి.. ఎన్నికల వేళ షర్మిలను దోషిగా చూపించి.. గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టడమే కేసీఆర్ వ్యూహం అంటున్నారు.  షర్మిలను గెలిపిస్తే.. జగన్‌తో కలిసి మళ్లీ తెలంగాణ, ఆంధ్రలను కలిపేస్తారని.. ఓటర్లలో సెంటిమెంట్ రాజేసి ఆ మేరకు ఎన్నికల్లో ప్రయోజనం పొందటమే కేసీఆర్ ఎత్తుగడ అని చెబుతున్నారు. షర్మిల స్వతహాగా పార్టీ పెట్టలేదని.. జగన్, కేసీఆర్‌లు కలిసే ఆమెతో పార్టీ పెట్టించారని.. ఇదంతా ఆ ఇద్దరు సీఎంలు ఆడుతున్న రాజకీయ డ్రామా అని ఆరోపిస్తున్నారు. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కేసీఆర్, జగన్‌లు మాయల మరాఠీలే.

కుక్కలతో ఎన్నికల ప్రచారం..

అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు పోటీ పడి ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం అంటే బహిరంగ సభలు. ఇంటింటి ప్రచారం.  వాహనాలపై ర్యాలీలు, పాదయాత్రలు, ఇవే ఎన్నికల ప్రధాన అస్రాలు. కానీ ఈ ప్రాంతంలో ఒక అభ్యర్థులు క్రేజీగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థులు ఏం చేశారు. ఎలా ప్రచారం చేశారు అని అనుకుంటున్నారా..? అయితే మరెందుకు ఆలస్యం.. నెక్స్ట్ పేరాకి వెళ్ళండి.   అసలే కరోనా కాలం.. అందులోనూ పంచాయతీ ఎన్నికలు. ప్రచారానికి వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డ చేయడం ఎందుకు అనుకున్నారేమో ఆ అభ్యర్థులు.. కొత్త ప్రచారానికి తెర లేపారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.  ఓపెన్ చేస్తే.. అక్కడి వీధుల్లో ఊర కుక్కలు ఎక్కువ. అందులోనూ ఖాళీగా ఉన్నాయి. ఆ విషయాన్నీ గమనింకేగిన మనుషులకంటే అదే నిశ్వాసంగా పనిచేస్తాయనుకున్నారేమో.. అందుకే ఆ అభ్యర్థులు వీధి కుక్కలతో ప్రచారం చేస్తున్నారు. భావించారు రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు.  కట్ చేస్తే.. ఆ అభ్యర్థులు కుక్కల నడుముకి ప్రచార పోస్టర్లు అంటించి. తమకే ఓటు వెయ్యాలని పోస్టర్లపై కోరారు. ఈ ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీరు మనుషులేనా... మీకు బుద్ధుందా" అని వన్యప్రాణుల ప్రేమికులు ఫైర్ అయ్యారు. విమర్శలు వస్తున్నా... తాము చేసిన పనిని సమర్థించుకుంటున్నారు అభ్యర్థులు. ఏ గోడలపైనో అంటిస్తే... ఎవరూ చూడట్లేదట. అదే కుక్కలపై అంటిస్తే... అందరి దృష్టీ పడుతుందనీ... అలాగైనా తమ పోస్టర్లు చూస్తారని ఇలా చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.తాము ఏ కుక్కలకూ హాని చెయ్యట్లేదనీ... జస్ట్ పోస్టర్ అంటించి... కుక్కలకు తామే ఆహారం కూడా వేస్తున్నామని చెప్పుకుంటున్నారు. పైగా... ప్రజలు తమ ఐడియాను స్పాగతిస్తున్నారనీ... చెప్పుకుంటున్నారు.  ఈ విషయం తెలుసుకున్న జంతు హక్కుల పోరాట యోధురాలు రీనా మిశ్రా  కొత్త ప్రచారం పేరు చెప్పి... కుక్కలపై పోస్టర్లు అంటించడమేంటని ఆమె ఫైర్ అయ్యారు. ఎవరైనా సదరు అభ్యర్థి ముఖంపై పోస్టర్ అంటిస్తే... ఆ అభ్యర్థికి ఎలా ఉంటుంది అని ఆమె ప్రశ్నించారు. జంతువుల పై ప్రచారం చేయడంపై ఆ అభ్యర్థుల ఉద్దేశం ఏంటని.. ఆమె ప్రశ్నించారు.  జంతువులకూ కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయన్న ఆమె... వాటికి పోస్టర్లు అంటించడమంటే... హింసించడమే అన్నారు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని... ఇలాంటి ప్రచారం చేసే అభ్యర్థులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇలా ఈ అంశం వివాదాస్పదంగా మారింది.  

బెంగాల్ పోలింగ్ లో హింస..  ఐదుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ ఉద్రిక్తంగా మారింది. కూచ్‌బెహార్‌ జిల్లాలో తృణమూల్‌, బీజేపీ  కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  అంతకుముందు ఇదే ప్రాంతంలో ఓ యువ ఓటరు మృతిచెందారు.  కాల్పుల ఘటనతో కూచ్ బెహార్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.  కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్‌ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్‌ బుర్మాన్‌ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్‌ ఏజెంట్‌ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని బీజేపీ కౌంటరిచ్చింది.  యువకుడిపై కాల్పుల తర్వాత తృణమూల్‌,  బీజేపీమద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణకు దిగారు. బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది భారీగా మోహరించారు.   హుగ్లీ ప్రాంతంలో భాజపా అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్‌ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ప్రజా బాణమా? బీజేపీ బాణమా?

పోలా. అదిరిపోలా. ఖమ్మంలో షర్మిల స్పీచ్ అదిరిపోలా. 40 నిమిషాల అద్భుత ప్రసంగం. ఏ పెద్ద స్థాయి నేతకూ తీసిపోని వాక్ ప్రవాహం. తాను అల్లాటప్పాగా పార్టీ పెట్టలేదని.. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదంటూ సభ వేదికగా సింహగర్జన చేశారు షర్మిల.  సింహం సింగిల్‌గానే వస్తుంది. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదన్నారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు షర్మిల. చెప్పడమైతే తాను సింగిల్‌గానే వస్తున్నానంటూ చెబుతున్నారు కానీ, ఖమ్మం ప్రసంగాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే.. అలా అనిపించడం లేదంటూ విశ్లేషిస్తున్నారు. 40 నిమిషాల స్పీచ్‌లో 38 నిమిషాలు కేసీఆర్ సర్కారును కుమ్మేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో నిమిషం మాత్రమే కేటాయించారు. అంటే, కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ఆమె ఉద్దేశ్యమా? పెట్రోల్ ధరలు పెరగడం కనిపించడం లేదా? గ్యాస్ రేట్లు మంట పుట్టించడం లేదా? రాష్ట్ర విభజన హామీల అమలు కోసం తెలంగాణ అలమటించడం లేదా? ఐటీఐఆర్ రద్దు చేసింది కేంద్రం కాదా? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా కేంద్రం తెలంగాణకు ఎంతో ద్రోహం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క సమస్యపైనా షర్మిల విమర్శల బాణం ఎక్కుపెట్టకపోవడం వ్యూహాత్మకమా? ఉద్దేశ్యపూర్వకమా? అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.  షర్మిల బీజేపీని విమర్శించేందుకు ఒకే ఒక్క నిమిషం కేటాయించడం స్ట్రాటజీనే అంటున్నారు. "రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు." ఇంతే ఈ మూడు ముచ్చట్లే. పైపైన చేసిన ఈ చిన్నపాటి విమర్శలే. ఇంకేమీ అనలేదు. బీజేపీని గట్టిగా నిలదీయలేదు. పువ్వుతో కొట్టినట్టు బీజేపీపై సుతిమెత్తని విమర్శలకే పరిమితమయ్యారని అంటున్నారు.  తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తూ.. బీజేపీ వేగంగా దూసుకొస్తోంది. అందులోనూ బీజేపీ జాతీయ పార్టీ కూడా. కమలనాథులకు బలం, బలగం మెండు. కొండనైనా ఢీకొట్టగల సత్తా వారిది. అలాంటిది.. తెలంగాణలో కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్న షర్మిలకు.. కేసీఆర్‌తో పాటూ కమలం పార్టీ కూడా ప్రధాన శత్రువే. కేవలం గులాబీ బాస్‌పైనే విమర్శలకు ఎక్కుపెడితే.. మరి, బీజేపీకి ఎలా చెక్ పెడతారు? ఇంత చిన్న విషయం తెలీకుండానే షర్మిల పార్టీ పెట్టబోతున్నారా? లేక, కావాలనే ఆమె బీజేపీని నిలదీయలేదా? అనే అనుమానాలు. ప్రచారంలో ఉన్నట్టుగానే.. షర్మిల బీజేపీ వదిలిన బాణం అనేందుకు ఖమ్మం సభే ఉదాహరణ అంటున్నారు. తొలి మీటింగ్‌తోనే షర్మిల ఎజెండా ఏంటో తెలిపోయిందని.. ఇన్నాళ్లూ బీజేపీ చేస్తూ వచ్చిన విమర్శలే షర్మిల నోటి నుంచి వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కమలనాథులు కేసీఆర్‌ మీదకు షర్మిల బాణాన్ని వదిలారని అంటున్నారు.  బీజేపీ నాయకులు కేసీఆర్‌పై ఇన్నాళ్లూ చేసిన విమర్శలన్నీ ఒక ఎత్తు. ఒక్క సభతో షర్మిల కేసీఆర్‌ను నిగ్గదీసి అడిగిన విధానం మరోఎత్తు. "తెలంగాణ ఆత్మగౌరవం దొర చెప్పుకింద నలిగిపోతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిస అయింది. నీళ్లన్నీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే.. నిధులు కూడా వారికే.. నియామకాలు కూడా కేసీఆర్‌ కుటుంబానికే. నడిరోడ్డుపై లాయర్లను హత్య చేస్తే చర్యలేవి? టీఆర్ఎస్‌కు ఓట్లేస్తేనే జీతాలు పెంచుతామని టీచర్లను బెదిరించారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైంది? వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు.. కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు." అంటూ కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.  సూటిగా, సుత్తి లేకుండా షర్మిల చేసిన విమర్శలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయి. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలను ఈజీగా తీసుకోవడం.. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్‌ నిలదీయదని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ.. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు. అంతే, అక్కడితో సరిపెట్టారు. తెలంగాణలో రోజురోజుకీ కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతుండటంతో హస్తం పార్టీని షర్మిల తన ప్రత్యర్థిగా భావించడం లేదని సరిపెట్టుకున్నా.. మరి, బీజేపీని ఎందుకు గట్టిగా నిలదీయలేదనేదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ అంటున్నట్టు.. షర్మిల బీజేపీ వదిలినా బాణమా?

ఏపీలో కొవిడ్ టీకాల కొరత? 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 11 నుంచి దేశ వ్యాప్తంగా టీకా మహోత్సవం నిర్వహించాలని అన్ని రాష్ట్రాల సీఎం లకు ప్రధాని మోడీ సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సరిపడా కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం కేవలం  2 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.  ఒకటి రెండు రోజుల్లో ఉన్న  స్టాక్ కూడా అయిపోతుందని అంటున్నారు.  ఏపీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలనుకుంటున్న జగన్ సర్కార్ కు... వ్యాక్సిన్ల కొరత ఆటంకాలు కల్పించేలా ఉంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ చక్కగా సాగుతోందని.. కరోనా నివారణకు కేంద్రం సూచించిన చర్యలు ఏపీ ప్రభుత్వం పాటిస్తోందని లేఖలో చెప్పారు జగన్. కరోనా కట్టడిలో కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని  చెప్పారు. ప్రధాని సూచన మేరకు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టీకా మహోత్సవం నిర్వహిస్తామని.. అయితే అందుకు అత్యవసరంగా 25 లక్షల వ్యాక్సిన్ డోస్ లు అవసరం ఉన్నాయంటూ లేఖలో  వెల్లడించారు సీఎం జగన్.  దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతోందని లేఖలో గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామన్నారు. టీకా మహోత్సవంలో ఏపీ పాల్గొనాలి అంటే తక్షణమే అవసరానికి సరిపడే విధంగా 25 లక్షల డోసులు పంపాలని లేఖలో జగన్ కోరారు. జగన్ లేఖను బట్టే ఏపీలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాక్ లెక్కలు, మంత్రి చెప్పిన మాటలు బట్టి చూస్తే..  మరో రెండు రోజులకు సరిపడినంత స్టాక్ మాత్రమే ఉంది. తరువాత కూడా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగాలి అంటే కేంద్ర నుంచి త్వరగా వ్యాక్సిన్ రావాలి. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోంది. మరి అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసే అంత స్టాక్ కేంద్రం దగ్గర ఉందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. 

గర్భం తో తైక్వాండో.. బంగారు విజయం...

కొంత మంది పుట్టామా.. పెరిగామా... బతికినామా.. చచ్చిపోయామా అన్నట్లు ఉంటారు. మరో కొందరు అయితే వాళ్ళ పుట్టుక ఒక చరిత్ర కాకపోయినా.. చాచేలోపు చరిత్ర సృష్టించాలనుకుంటారు.  చరిత్ర పుటల్లో  వారికంటూ కొన్ని పేజీలు ఉండాలనుకుంటారు. అందరూ సాహసం చేయాలనుకుంటారు. కానీ కొందరు ప్రయత్నం మాత్రమే చేస్తారు. మరికొందరైతే ప్రాణాలకు కూడా తెగిస్తారు. అలా సాహసం కోసం ప్రాణాలు తెగించిన వారిలో ఒక లేడీ ఉంటే..? ఆ లేడీ గాజులు వేసుకునే అమ్మాయి కాకుండా, గర్జించే పులి అయితే ..? ఆ లేడీ పులి ఎలా ఉంటుందో మీరే చూడండి.    ఆమె వయసు 26 సంవత్సరాలు. పెళ్లి అయింది. క్రీడాలు అంటే ప్రాణం. ఎనిమిది నెలల గర్భం కూడా. ఆ గర్భం తో క్రీడలో పోటీపడడమే అరుదు అనుకుంటే.. అందులోనూ పతకం కొల్లగొట్టడమంటే అసాధారణం! ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది నైజీరియాకు చెందిన క్రీడాకారిణి. తైక్వాండో ప్లేయరైన అమితాస్‌ ఇద్రిస్‌ ఎనిమిది నెలల గర్భవతి. స్థానిక స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన తైక్వాండో పోటీల్లో మిక్స్‌డ్‌ పూమ్సే కేటగిరిలో అమితాస్‌ స్వర్ణ పతకం సాధించింది. అంతేకాదు.. మరో మూడు విభాగాల్లోనూ పతకాలు సాధించి ఔరా అనిపించింది. 

73 మంది ఎయిమ్స్  డాక్టర్లకు కరోనా 

దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. కరోనా రోగులతో హాస్పిటల్స్  నిండిపోతున్నాయి. బెడ్లు దొరక్క వైరస్ బాధితులు అవస్థలు పడుతున్నారు. కరోగా పేషెంట్లకు చికిత్స అందించేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. అయితే కరోనా కేసులు టెన్షన్ పెట్టిస్తుండగా.. కొత్తగా మరో కలవరం కనిపిస్తోంది. కరోనా హాట్ స్పాట్లుగా హాస్పిటల్స్ మారిపోతున్నాయి. ఎయిమ్స్ లో భారీగా డాక్టర్లు వైరస్ భారీన పడ్డారు. మధ్యప్రదేశ్ లోని  ఎయిమ్స్  కరోనా మహమ్మారికి నిలయంగా మారింది. ఎయిమ్స్ లోని 53 మంది డాక్టర్లు, విద్యార్థులకు కరోనా సోకింది.  వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా వైరస్ బారిన పడిన వారి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భోపాల్ ఎయిమ్స్ కు నిత్యమూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ‌(ఎయిమ్స్‌)లో 20 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 18 మంది రెసిడెంట్‌ డాక్టర్లు కాగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు. సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కూడా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరందరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మొత్తం 700 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 2500 మంది రెసిడెంట్‌ డాక్టర్లు పనిచేస్తున్నారు. మరో 4000 మంది నర్సులు, 2,000 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని నివారణకు ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ఢిల్లీలోని మరో ప్రముఖ ఆసుపత్రి సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో కూడా 37 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు పెద్ద ఎత్తున కరోనా భారీన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. 

యువతి బంపర్ ఆఫర్..

ఈ రోజుల్లో స్కూల్ పుస్తకానికి, ముఖ పుస్తకానికి. పోటీ పెడితే ముఖ పుస్తకమే గెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనిషి జీవితంలో నిత్యావసర సాధనంగా మారింది సోషల్ మీడియా. మనం ఎవరినైనా టార్గెట్ చేయాలంటే జస్ట్ వాళ్ళ ఫేస్ బుక్, ఇన్ స్టా  చూస్తే చాలు వాళ్ళ వీక్నెస్లు ఇట్టే పసిగతీయొచ్చు. అందుకే కొందరు సోషల్ మీడియాని మోసాల మీడియా గా వాడుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు హాట్‌గా మాట్లాడితే చాలు.. వాళ్లకు హచ్చు కుక్కలా లొంగిపోయి చెప్పిందల్లా చేసి నష్టాల పాలవుతున్నారు యువకులు. నేరాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు మాత్రం రావడం లేదు.   ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్. కుత్బుల్లాపూర్‌లో నివసించే ఓ యువకుడు. పది పాస్ అయి ఇంటర్లో అడుగు పెట్టినట్లు. అప్పుడే కొత్త ఫోన్ తీసుకుని పేస్ బుక్ అనే ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఓ యువకుడు. తన మొబైల్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. అదే సమయంలో తనకు ప్రియా అనే ఓ యువతి రిక్వెస్ట్ పెట్టింది. అమ్మాయి రిక్వెస్ట్ చూసిన యువకుడు జాతిరత్నాలు సినిమాలో చిట్టి సాంగ్ వేసుకున్నాడు. మొదట కరోనాకు ఇచ్చే ఫస్ట్ డోస్ లా రొమాంటిక్ చాటింగ్ జరిగింది. తర్వాత అమ్మాయి చాలా హాట్ గా వీడియో కాల్ కోరింది. ఇక అంతే మనోడి తీగలు తేలిపోయి. ఆవేశం కట్టలు తెచ్చుకుంది. మసక మసక చీకటిలో సాంగ్ పడుకున్నాడు. సొల్లు కారుస్తూ హచ్చు కుక్క లా వీడియో కాల్ కి గ్రీన్ సింగల్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్ కోరింది. ఇక అంతే నెక్స్ట్ సాంగ్ జోరుమీద ఉన్నవాడిని జోడి కడతావా.. డైరెక్ట్ న్యూడ్ వీడియో కాల్ చేశాడు. అల కొద్దీ సేపు మైకం లో మాట్లాడుకున్నారు. అంతలో అర్జెంట్ వర్క్ లో ఉన్నపుడు కరెంట్ పోయినట్లు. యువకుడు బాగా పీక్స్ లోకి వెళ్ళాక సడెన్ గా వీడియో కాల్ కట్ అయింది.. మనోడు డేటా ప్రాబ్లెమ్ అనుకున్నాడు. కట్ చేస్తే.. అదే అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. యువకుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ ఫోన్ కాల్ తో పిడుగుపడింది. ఆ యువకుడు తెల్ల మొహం వేసుకున్నాడు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ లో ఏమైందో మీరే చూడండి.  ఫోన్ కాల్ లో అమ్మాయి.. నువ్వు  మాట్లాడిన వీడియో కాల్ రికార్డింగ్ చేశాను. నాకు రూ.11,999 లు పంపాలని బంఫర్ ఆఫర్ ఇచ్చింది. లేదంటే నీ వీడియోను ఫేస్ బుక్ లో ఉన్న స్నేహితులందరికీ పంపిస్తానని బెదిరించింది. అంత డబ్బులు నా దగ్గర లేవని యువకుడు చెప్పడంతో ఆ వీడియోను ఫేస్ బుక్ చేసింది. వీడియోలను చూసిన నా స్నేహితులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపాడు. తదనంతరం ఆ యువకుడు పేటీఎమ్ ద్వారా రూ.1000 లు పంపించాడు. అయినప్పటికీ వీడియోను ఫేస్ బుక్ లో డిలేట్ చేయకపోవడంతో దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణా రెడ్డి తెలిపారు.            

మహారాష్ట్రలో లాక్ డౌన్! వ్యతిరేకిస్తున్న వ్యాపారులు

కరోనా పంజాతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  మాల్స్, మల్టీప్లెక్స్ లు, మార్కెట్లు, నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను మూసివేయాలని, వారాంతంలో పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని తెలిపింది. అయితే మహారాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని వాణిజ్య సంఘాలు  తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ (ఎంఏసీసీఐఏ) సోమవారం నుంచి తాము దుకాణాలన్నీ తెరుస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని దాదాపు 800కు పైగా వాణిజ్య, పరిశ్రమ సంఘాలు ఎంఏసీసీఐఏ కింద పని చేస్తున్నాయి. అయితే ఇతర ముఖ్య వర్తక సంఘాలు సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్), ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ (ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ ఫేర్ అసోసియేషన్) మాత్రం లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నాయి.  గత బుధవారం వివిధ ట్రేడ్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమ నిర్ణయాన్ని వెలువరించగా, కొన్ని సవరణలు కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాడు సీఎం కొన్ని సవరణలను ప్రకటిస్తారని భావిస్తున్నామని ఎంఏసీసీఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లలిత్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సవరణలను ప్రకటించకున్నా, దుకాణాలను తెరవాలని తాము నిర్ణయించామని, ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పండగ సీజన్ లో షాపుల మూసివేత కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని, ఇప్పటికే గత సంవత్సరం నెలకొన్న పరిస్థితులతో భారీ నష్టాల్లో ఉన్న తాము, మరోసారి కష్టాల్లోకి జారాలని భావించడం లేదని, అన్ని రకాల వాణిజ్య కేంద్రాలను మూసివేయడం సహేతుకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తాము ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, ముఖ్యమంత్రిపై తమకు గౌరవం ఉందని, తాము చట్టాన్ని అతిక్రమించాలని భావించడం లేదని ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ ప్రతినిధి వీరేన్ షా వ్యాఖ్యానించారు.

జగన్ ను ఎదిరిస్తా! వైఎస్ షర్మిల కార్యాచరణ 

ఖమ్మం సంకల్ప సభలో తన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు వైఎస్ షర్మిల.  దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై8న పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. తాను తెలంగాణ బిడ్డేనని చెప్పారు. ఈ గడ్డ మీదే పుట్టాను... ఇక్కడే పెరిగానంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెడుతున్నానని షర్మిల చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎంతవరకైనా పోరాడుతానని తెలిపారు బరాబర్ ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.  పదవులు ఉన్న లేకున్నా ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు షర్మిల. సింహం సింగిల్ గానే వస్తుంది... తాను టీఆరెస్,బీజేపీ, కాంగ్రెస్ లకు గురిపెట్టిన ప్రజల బాణంగా వస్తున్నానని తెలిపారు. ఎవరో చెప్తే పార్టీ పెట్టలేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతాని షర్మిల స్పష్టం చేశారు. మాట మీద నిలబడే వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా.. తెలంగాణ కు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటానని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకోసం నేను నిలబడుతా, నేను కొట్లాడుతా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ పోరాడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను  వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. పంచ్ డైలాగులు, ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆత్మగౌరవం దొర చెప్పుకింద పడి నలిగిపోతోంది. నీళ్లన్నీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే.. నిధులు కూడా వారికే నియామకాలు కూడా కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు’’ అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బంగారు తెలంగాణ సాధ్యమైందా అని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం బానిసైందా? అనిప్రశ్నించారు. దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి.. లేదా నోరు మూసుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఒకలా.. తర్వాత మరోలా మారిపోతారని దుయ్యబట్టారు.  సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు షర్మిల. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నించడానికి తన పార్టీ అవసరమన్నారు. రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. దొర చెప్పుకింద తెలంగాణ నలిగిపోతుందన్నారు షర్మిల.   కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు. నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్‌ మాత్రం నిలదీయదని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు. ఎవరు ఏమన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.

దొర చెప్పుకింద నలిగిపోతోంది.. షర్మిల సంచలనం

ఖమ్మం సంకల్ప సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను  వైఎస్ షర్మిల టార్గెట్ చేసింది. పంచ్ డైలాగులు, ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడింది. సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతు ప్రశ్నల వర్షం కురిపించింది. సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు షర్మిల. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నించడానికి తన పార్టీ అవసరమన్నారు. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. దొర చెప్పుకింద తెలంగాణ నలిగిపోతుందన్నారు షర్మిల.  కేసీఆర్‌ తాను తప్పు చేస్తే ముక్కు రాస్తా అన్నాడని, అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధ్యమైందా అని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం బానిసైందా? అనిప్రశ్నించారు. దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి.. లేదా నోరు మూసుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఒకలా.. తర్వాత మరోలా మారిపోతారని దుయ్యబట్టారు. నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్‌ మాత్రం నిలదీయదని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు. ఎవరు ఏమన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్‌ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? అని షర్మిల ప్రశ్నించారు. ప్రైవేట్‌ రంగంలోనూ వైఎస్‌ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? అని మరోసారి ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్‌ తెల్లరేషన్‌ కార్డు ఇచ్చారని, 108 అంబులెన్స్‌ల ఆలోచన వైఎస్‌ తప్ప ఏ నాయకుడూ చేయలేదని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క కొత్త కార్డు రాలేదని తప్పుబట్టారు. కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు. ఉద్యమంలో అమరులైనవారికి నా వందనాలు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు చీమకుట్టినట్లు లేదు. నడిరోడ్డుపై లాయర్లను హత్య చేస్తే చర్యలేవి? దున్నపోతుపై వాన పడినట్లు ప్రభుత్వం తీరు ఉంది. వారికి ఓట్లేస్తేనే జీతాలు పెంచుతామని టీచర్లను బెదిరించారు. ఆత్మగౌరవం దొర చెప్పుకింద పడి నలిగిపోతోంది. నీళ్లన్నీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే.. నిధులు కూడా వారికే నియామకాలు కూడా కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు’’ అని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవు, కార్పొరేషన్లకు నిధులు లేవు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్‌ పాలన సాగింది. వైఎస్‌.. ప్రజాదర్బార్‌లో వందల మంది కష్టాలు తీర్చారు. ఇప్పుడున్న నాయకుడు ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా? ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? సచివాలయంలో అడుగుపెట్టని ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరు. తాను అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశాడు. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. సింగరేణి కార్మికుల మైనింగ్‌ సమస్య తీరిందా? కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా? తెలంగాణ ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను.  ఖమ్మంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, 18 ఏళ్ల కిందట ఏప్రిల్ 9న వైఎస్సార్ చేవెళ్ల నుంచే పాదయాత్ర చేసి విజయవంతం అయ్యారని వెల్లడించారు. ఇప్పుడదే రోజున  తన తండ్రి అడుగుజాడల్లో ఖమ్మం జిల్లా గుమ్మం నుంచే తన రాజకీయ తొలి అడుగులు వేసేందుకు షర్మిల మీ ముందుకు వచ్చింది అని పేర్కొన్నారు. రాజన్న బిడ్డ కొత్త పార్టీ పెడుతుందని తెలియగానే, మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ప్రసంగించారు.

అవినీతి కేసుల్లో జగన్ ప్రపంచ రికార్డ్! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం నుంచి ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ సర్కార్ ను కడిగిపారేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా సీఎం జగన్ టార్గెట్ గా వాయిస్ పెంచారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ రెండు వందల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మాతమ  దగ్గర ఉన్నాయని.. అవసరమైనప్పుడు బయటపెడుతామని చెప్పారు. ఉపఎన్నికలో వైసీపీ ధనప్రవాహన్ని అడ్డుకుంటాం అని సత్యకుమార్ స్పష్టం చేసారు. దేశంలో అవినీతి కేసుల్లో జగన్ రెడ్డిది ప్రపంచ రికార్డ్ అని అన్నారు. మరో ఆరు నెలల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న ప్రజల భావనే మా మాట అని సత్య కుమార్ అన్నారు. రమణ దీక్షితులు తాడేపల్లిలో ముఖ్యమంత్రి దగ్గర అర్చకత్వం చేసుకోవడం ఉత్తమం అని సత్య కుమార్ ఎద్దేవా చేసారు. విదేశీ మతాచారాన్ని అనుసరిస్తున్న సీఎంని విష్ణుమూర్తితో పోల్చడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. రమణ దీక్షితుల మాటలు బ్రాహ్మణ సమాజానికి అవమానకరం అని ఆరోపించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ కలయిక చూస్తే జగన్ కి వెన్నులో వణుకు పుడుతుందన్నారు సత్యకుమార్. పవన్ సినిమా ప్రీమియర్ షో, ఫ్యాషన్ షో అడ్డుకోవడం ఇందుకు నిదర్శనంఅన్నారు. ఇక12 న తిరుపతి పార్లమెంట్ లో బీజేపీ అగ్రనేతల ప్రచారం ఉంటుందని వెల్లడించారు. తిరుపతిలో నడ్డా రోడ్ షో అదే రోజు పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభ ఉంటుందని అన్నారు.  ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అని అన్నారు. మా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది అని తెలిపారు. ఒకసారి మోడికి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారు అని, వైసిపి కి, టిడిపి కి ఓటు వేసిన ఉపయోగంలేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కి ఓటేస్తే మా ఎంపీ ప్రజలకు అండగా ఉంటారు అని వెల్లడించారు. తిరుపతి ప్రజలు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారు అని అన్నారు.  

ఉన్నావ్ దోషి భార్యకు బీజేపీ టికెట్

అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు. ఉన్నావ్ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనర్ బాలికపై అత్యా.చార కేసులో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ దోషిగా తేలారు. 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. అయితే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీచేయబోతున్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు యూపీ పంచాయితీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు.  రే-ప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కమలనాథులు నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ‘‘కుల్‌దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడదు. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చాం. ఇప్పటికే ఆమె ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప.. నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదు.’’ అంటున్నారు. తప్పు చేసినా పర్వాలేదు.. గెలిచే సత్తా ఉంటే చాలు అన్నట్టుగా బీజేపీ తీరు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు.

104ఏళ్ల బామ్మ.. 2సార్లు కరోనా..

కరోనాతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆరోగ్యవంతులు, బలవంతులను కూడా పీల్చి పిప్పి చేస్తోంది. అనారోగ్యులైనా, వయసు మళ్లిన వారికైనా కొవిడ్ సోకితే ఇక అంతే. ఆసుపత్రి నుంచి తిరుగొచ్చేది కష్టమే. అలాంటిది, ఆ బామ్మ రెండుసార్లు కొవిడ్‌ను జయించింది. 104 ఏళ్ల ముది వయసులో మృత్యుంజయురాలిగా నిలిచి వైద్యులనే ఆశ్చర్యపరిచింది.  కొలంబియాలోని తుంజా ప్రాంతానికి చెందిన ఆ బామ్మ పేరు కార్మెన్‌ హెర్నాండెజ్‌. వయసు 104 ఏళ్లు. గతేడాది జూన్‌లో ఆమె మొదటిసారి వైరస్‌ బారినపడ్డారు. కార్మెన్‌ను స్థానిక శాన్‌జోస్‌ నర్సింగ్‌ హోమ్‌లో చేర్చి చికిత్స చేశారు. అప్పుడే ఆమె కోలుకోవడం కష్టమని వైద్యులు భావించారు. అయితే, అనూహ్యంగా ఆమె కరోనాతో పోరాడి గెలిచారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, మార్చిలో ఆ బామ్మకు రెండోసారి కరోనా సోకడం కలకలంగా మారింది. అంత పెద్ద వయసులో రెండోసారి కొవిడ్ రావడంతో ఆమె ప్రాణాలను కాపాడటం కష్టమే అనుకున్నారు వైద్యులు. ఆమెను తుంజా యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి.. ఐసీయూలో మెరుగైన చికిత్స  అందించారు. 21 రోజుల తర్వాత ఆమె మరోసారి వైరస్‌పై విజయం సాధించారు. మనోధైర్యంతో రెండుసార్లు కరోనాను జయించిన బామ్మకు ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.    104 ఏళ్ల వయసులో కార్మెన్‌ రెండు సార్లు కరోనా నుంచి కోలుకోవడం.. వైద్యుల్లోనే గాక ప్రపంచంలోనే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు నింపుతోందన్నారు హాస్పిటల్ డైరెక్టర్. గతంలో కార్మెన్ చర్మ క్యాన్సర్‌ను సైతం ఇలానే జయించారు. 

త్వరలో రైళ్లు బంద్! రైల్వే బోర్డు క్లారిటీ..

ఇప్పటికే నైట్ కర్ఫ్యూ. మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు. స్కూళ్లు, థియేటర్లు, బార్లు, పబ్‌లు అన్నీ మూసేస్తారట. త్వరలోనే రైళ్లు కూడా బంద్. ఇలా రోజుకో న్యూస్. వీటన్నిటిలోకి రైళ్లు బంద్ అనే మాట వలస కూలీలను హడలెత్తిస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించి, రైళ్లు నిలిపేస్తే.. ఇక తమ పని క్లోజ్ అంటూ కూలీలు భయాందోళన చెందుతున్నారు. గత అనుభవాలను గుర్తు చేసుకొని వణికిపోతున్నారు. దీంతో, పోలో మంటూ వలస కూలీలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. రైల్వే స్టేషన్లన్నీ కూలీలతో నిండుతున్నాయి. రైళ్ల ముందు కార్మికులు క్యూ కడుతున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పుడు నిండుగా కనిపిస్తున్నాయి.  రైళ్లన్నీ ఫుల్ అవుతుండటంతో రైల్వే శాఖ అలర్ట్ అయింది. సడెన్‌గా ఇంత మంది ఎందుకు ప్రయాణిస్తున్నారని ఆరా తీసింది. వలస కూలీలు స్వగ్రామాలకు తిరిగి వెళుతున్నారని తెలిసింది. త్వరలోనే రైళ్లు బంద్ చేస్తారనే ప్రచారమే వారిలో రద్దీకి కారణమని గుర్తించారు. వెంటనే రైల్వే బోర్డు ఛైర్మన్‌ సునీత్‌ శర్మ స్పందించారు. ఇప్పట్లో రైళ్లను నిలిపివేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌ను బట్టి మరిన్ని రైళ్లను పెంచుతామని హామీ ఇచ్చారు.    ‘‘రైలు సేవలను తగ్గించడం లేదా నిలిపివేసే ప్రణాళికేదీ లేదు. అవసరమైనన్ని రైళ్ల రాకపోకలను కొనసాగిస్తాం. వేసవి సీజన్‌లో రైళ్లలో రద్దీ సహజమే. ప్రస్తుతం రైళ్ల కొరత లేదు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రైళ్ల సేవలను కూడా పెంచుతాం’’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. అంతేగాక, రైళ్లలో ప్రయాణించేందుకు కొవిడ్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి అని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. రైల్వేలో అలాంటి పత్రం అడగట్లేదని.. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ. 

కొవిడ్ వ్యాక్సిన్‌ బదులు రేబిస్ వ్యాక్సిన్

పెద్ద పొరబాటే జరిగింది. కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేపుతోంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మహిళలు బాధితులుగా మారారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందీ దారుణం. కొవిడ్ టీకా వేయించుకునేందుకు షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ వచ్చారు ముగ్గురు మహిళలు. సరోజ్ (70), అనార్కలి (72), సత్యవతి (60) కలిసి వ్యాక్సిన్ తొలి డోసు తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ బదులు రేబిస్ టీకాలు వేసి పంపించారు.  టీకా తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్లిన సరోజ్‌కు మత్తుగా, అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది. ఆమె అదో రకంగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. మొదట్లో ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదు వైద్యులకు. అంతలోనే ఆమె తాను కొవిడ్ టీకా తీసుకున్నట్టు డాక్టర్లకు చెప్పింది. దీంతో రసీదు చెక్ చేసిన వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాళ్లకు ఇచ్చింది కొవిడ్ టీకా కాదు రేబిస్ వ్యాక్సిన్ అని తెలుసుకొని చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.