ఆరా సర్వే అర్థ సత్యం.. ముక్కోణం ఖాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వస్తాయో తెలియదు? అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు. అన్నిటినీ మించి అప్పటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అసలే తెలియదు. సో... ఇప్పటి కప్పుడు ఎన్నికలు జరిగితే, అంటూ మొదలయ్యే... ఎన్నికల సర్వేలు ఆ కాసేపు ఆనందానికి, కాదంటే, రాజకీయ  మేథోమధన చర్చలకు పనికోస్తాయే తప్ప, ఎప్పుడో జరిగే ఎన్నికల ఫలితాలను ఇప్పుడే పక్కా చేసేందుకు అంతగా ఉపకరించక పోవచ్చును.   అయితే, అంతమాత్రం చేత, సర్వ్ లన్నీ శుద్ధ దండగ అనికాదు.  సర్వేల ప్రయోజనం సర్వేలకు వుంది. ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని, వ్యూహాలను అల్లుకుంటాయి. ఆ విధంగా సర్వేల వలన ఎదో ప్రయోజనమా ఉంది కాబట్టే, ఎన్నికల వ్యూహాలను అమ్ముకునే రాజకీయ బేహారి ప్రశాంత్ కిశోర్ మొదలు అదే బాటలో అడుగులు వేస్తున్న ఆరా మస్తాన్ వరకు ఎవరికి వారు వారు ప్రతి రెండు మూడు నెలకోసారి వండి వారుస్తున్న సర్వేలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదుకే, రాజకీయ గీతచార్యులు. సర్వేలన్నీ సత్యం కాదు, అసత్యములును కాదు.. ఆంటారు. నిజం,సర్వే ఫలితాలు సత్యాలు కాకపోయినా, అసత్యాలు కూడా కాదు. ఒక , పాత రైల్వే గైడ్ లాగ .. ఒక  సూచికగా మాత్రం పనిచేస్తాయి.    అలా చూసినప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్’గా డిస్కస్ అవుతున్న ఆరా మస్తాన్ (ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్) సర్వే, నివేదిక, అక్షర సత్యం కాదు, కానీ, భవిష్యత్ రాజకీయ విశ్లేషణకు ఒక సూచికగా అయితే, కొంత వరకు ఉపకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.   ఆరా సర్వే చెప్పిన, ఓట్ల శాతం లెక్కలను పక్కన పెడితే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందనేది, అందరికీ తెలిసిన విషయమే.కాదనడం కుదరదు. నిజానికి, 2019 ఎన్నికల్లోనే రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అందుకే, సారు ... కారు .. పదహారు  బోల్తా కొట్టింది. కారు 16లో నాలుగు బీజేపీ, మూడు కాంగ్రెస్ పట్టుకు పోయాయి. మిగిలిన తొమ్మిది మాత్రమే తెరాసకు మిగిలాయి. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికార తెరాస సిట్టింగ్ స్థానాలను గెలుచుకుంది. అదే విధంగా జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ బీజేపే నాలుగు నుంచి 48 స్థానాలకు చేరింది. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, హుజురాబాద్ తోపాటుగా, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఓడి పోయింది. అందులో, హుజూర్ నగర్ అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన  కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే, నాగర్జున సాగర్ లోనూ ఏడెనిమిది సార్లు, అదే స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి,  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఓడిపోయారు. దుబ్బాక, హుజురాబాద్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు. హుజురాబాద్’లో అయితే కాంగ్రస్ అభ్యర్ధికి కేవలం మూడు వేల పైచిలుకు ఒతులు మాత్రం పోలయ్యాయి. సర్వే లెక్కలు పక్కన పెట్టి, వాస్తవ ఫలితాల అధారంగా విశ్లేషణ చేసినా, గతంలో పోల్చితే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నది నిజం.ఇంకా బలపడే ప్రయత్నం మరింత బలంగా  చేస్తోంది. అది కూడా నిజం. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడమే కాకుండా,  కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాల  పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు, ఒక్కొకరు ఒక్కొక నియోజక వర్గంలో మొత్తం 119 నియోజక వర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించి, పార్టీ క్యాడర్ తో కలిసి పనిచేయడం మాములు విషయం కాదు. తెలంగాణపై పార్టీ దృష్టి పెట్టింది అనేందుకు ఇదొక  నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పరుగు లు తీస్తోంది. పార్టీ క్యాడర్లోనూ  జోష్ పెరిగిందన్నది నిజం. అదీ గాక ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాస్ రూట్ లెవల్ నుంచి పై స్థాయి వరకు పటిష్ట యంత్రాంగం వుంది. సో.. ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ  తెరాసకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక తెరాస విషయం అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సెంటిమెంట్ చాల వరకు చల్లారింది. గతంలో లాగా బలంగా పని చేసే పరిస్థితి అయితే లేదు. అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం అయితే నేమీ, మఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ ఎత్తుగడలు ఇతరత్రా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్నీ కలిపినా, తెరాసకు ఉండే అడ్వాన్ టేజీ ఉండనే ఉంటుంది. వుంది కూడా. తెరాస పనైపోయిదని అనుకోవడం, అనుకునేందుకు బాగుటుంది కానీ, అది పూర్తిగా వాస్తవం కాదు. సో.. ఆరా సర్వే  ఎందుకు చేసినా, ఎవరి కోసం  చేసినా, వండి వార్చిన వంటకమే అయిన, కొంచెం రుచిగానే  ఉందని అంటున్నారు. కొంచం కాస్త అటూ ఇటుగా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలానే ఉందని, విశ్లేషకులు సైతం అంటున్నారు.

శాంతి దూత‌కు అవ‌మానం.. కెన‌డాలో గాంధీ విగ్ర‌హ ధ్వంసం

పుట్టిన‌వూరు, దేశం దాటి అంత‌ర్జాతీయ ఖ్యాతిగాంచిన‌వారిని ముఖ్యంగా శాంతిప‌థానికి ప్ర‌తినిధిగా వున్న మ‌హోన్న‌తుల‌ను అన్ని ప్ర‌భుత్వాలూ ఆద‌రిస్తాయి. దేశంలో ఏదో ఒక ప్ర‌ధాన న‌గ‌రంలో విగ్ర‌హం ఏర్పా టు చేసి ఆ మ‌హావ్య‌క్తి ప‌ట్ల త‌మ ప్ర‌త్యేక అభిమానాన్ని ప్ర‌క‌టించుకుంటారు. ఇలా  ప్ర‌పంచ దేశాల్లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన మ‌హోన్న‌తుడు గాంధీజీ. ఆసియా, ఆఫ్రికా, యూర‌ప్ దేశాల్లో ఆయ‌న ప‌ట్ల  ఎంతో అభిమానం వుంది. భార‌త స్వాతంత్య్రోద్య‌మ నాయ‌కునిగా ప్ర‌పంచ‌దేశాలను ఆక‌ట్టుకున్న గొప్ప నాయ‌కుడు మ‌హాత్మా గాంధీజీ. కాలంతో పాటు ప్ర‌పంచ రాజ‌కీయ‌వాతావ‌ర‌ణం కూడా ఎంతో మారిపోయిం ది. ఏ దేశంలోనూ శాంతికాముకుల‌కు ఆద‌ర‌ణ అంత‌గా లభించ‌ని దుస్థితి ఏర్ప‌డింది.  అందుకు తాజా ఉదాహ‌ర‌ణే కెన‌డాలో గాంధీ విగ్ర‌హాన్ని విద్రోహులు కూల్చివేయ‌డం.  కెనడా లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు కుల్చేసారని భారత రాయభార కార్యాలయం తెలి పింది. కెనడా లో వున్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కుల్చేయడాన్ని భారత ప్ర‌భుత్వం  ఖండించింది. కెనడాలో ఉన్న భారతీయులని భ‌యపెట్టడానికి చేసిన చర్య గా అనుమానిస్తున్నారు. కెనడాలోని ఒంటా రియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతం లో ఉన్న గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు అక్కడ పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణ కోసం భారత ప్రభుత్వం బుధ వారం నాడు కెనడా గవర్నమేంట్ ని కోరింది. ఒంటారియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతంలో ని  గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ విద్వంసకరచర్యని  అక్క‌డి భారతీయ సమాజం తీవ్రం గా ఖండించింది.భారతీయుల మనో భావాలూ దెబ్బతినేలా ఉందని,దీనిపై చర్యకి  అక్కడ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేసారు. భారతీయ ప్రజలని భయ భ్రాంతులకి  గురిచేయడానికి చేసిన విద్వేషపురిత చర్య అని  ఒట్టావా లోని హైకమిషన్ తెలిపింది. నేరస్తులని వెంట‌నే  న్యాయస్థానం ముందు ఉంచాలని భారతప్రభుత్వం  కోరి న‌ట్టు  ఒక ప్రకటనలో తెలిపారు.భారత రాయభార కార్యాలయం కుడాదీన్ని తీవ్రం గా ఖండించింది, నిందితులపై కఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  ఖలిస్తాన్ యార్క్ రింజాల్ పోలీసు ప్రతినిధి అమీ బౌడ్రూ గాంధీ విగ్రహాన్నిఎవరో గ్రాఫిక్ పదాలతో వక్రీ కరించారని రాశారు. విగ్రహంపై ఖలిస్తాన్, అబ్శబ్ద్ అని రాసి ఉన్నాయన్నారు. యార్క్ పోలీసులు ఎలాంటి నేరాలను సహించరని, జాతి, జాతీయ లేదా జాతి మూలాల ఆధారంగా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బౌడ్రూ చెప్పారు. ఈ విగ్రహం ముప్పై సంవత్సరాలకు పైగా రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు దేవాలయ ప్రాంతంలో మహాత్మా  విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు.  ఇక్కడ పెద్ద సంఖ్య లో భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రిడ్జ్‌మండ్‌లో చాలా ఏళ్లుగా మేం ప్రశాంతంగా జీవిస్తున్నామని, అయితే అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని భారతీయ సంతతి ప్రజలు చెబుతున్నారు.

కేరళలో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ వైరస్?

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘మంకీపాక్స్’ ఇప్పుడు భారత్ కూ పాకింది. . ఒక పక్కన కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తుండగానే మంకీపాక్స్ విజృంభిస్తోంది.  ఇప్పటి వరకూ  59 దేశాల్లో 8 వేల 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ తో ముగ్గురు మరణించారు. ఇంతవరకు భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదన్న ఊరటకు చెక్ పడింది. దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్  గురువారం వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, అతని నుంచి సేకరించిన నమూనాలను వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు వీణా జార్జ్ తెలిపారు. పుణె ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే మంకీపాక్స్  ధ్రువీకరించగలమని మంత్రి  పేర్కొన్నారు. వ్యాధి బాధితుడిగా భావిస్తున్న వ్యక్తి యుఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని వీణా జార్జ్ వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వైద్య నిపుణుల అబ్జర్వేషన్ లో ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయితే.. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు ఇదే అవుతుంది. ఇంతకు ముందు ఉత్తర ప్రదేశ్ లోని ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు వచ్చాయి. ఆ చిన్నారి నమూనాలను పరీక్షించినప్పుడు ఆమెకు మంకీపాక్స్ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెకు మంకీపాక్స్ లేదని నిర్ధారించారు. తాజాగా లక్షణాలు కనిపించిన కేరళ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయితే.. ఇదే దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా రికార్డులకు ఎక్కుతుంది. నిజానికి ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇంత వరకు నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 80 శాతం ఐరోపా దేశాల్లోనే కనిపించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జులై 11 నాటికి అమెరికాలో సుమారు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 1958లో పరిశోధన కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడింది. దీంతో ఈ వైరస్ ను మంకీపాక్స్ అని పిలుస్తున్నారు. మంకీపాక్స్ రావడానికి కొద్ది రోజుల ముందు సాధారణంగా జ్వరంతో కూడి ఫ్లూ, తలనొప్పి వస్తాయని, కొద్ది రోజుల తర్వాత ముఖం మీద దద్దుర్లతో మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత  చేతులతో పాటు శరీరానికి ఈ దద్దుర్లు వ్యాపిస్తాయని వైరాలజీ  నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ ఇన్ క్యుబేషన్ సమయం 5 నుంచి 21 రోజులు ఉంటుందని వారు వెల్లడించారు.  

బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో  రిషి ముందంజ‌

భార‌త సంత‌తికి చెందిన వారు విదేశాల్లో రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం ఈమ‌ధ్య వింటున్నాం. అమెరికా లో, బ్రిట‌న్‌లోనూ భార‌త సంత‌తికి చెందిన‌వారినే వారి మంత్రిమండ‌లిలో కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌డం భార‌త్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం.  ఇపుడు తాజాగా  రిషి సునాక్ ఏకంగా బ్రిట‌న్ ప్ర‌ధాని పీఠాన్ని ఎక్క‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.  బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ స్థానాన్ని భర్తీ  చేసేదెవరనేది తేల్చేం దుకు ఎన్నికలు  మొదలయ్యాయి.  జాన్స‌న్ ప్ర‌ధానిగా వున్న‌పుడు ప్రీతీ ప‌టేల్‌ను హోం సెక్ర‌ట‌రీగా, అలోక్ శ‌ర్మ‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల ప్మెంట్ సెక్ర‌ట‌రీగా, రిషి సునాక్‌ను ట్ర‌జ‌రీ ఛీఫ్ సెక్ర‌ట‌రీగా  బ్రిట‌న్ రాణి నియమించారు. అప్ప‌ట్లో ఆయ‌న కొత్త ఛాన్స‌ల‌ర్ సాజిద్ జావిద్ వ‌ద్ద ప‌నిచేశారు.  అనంత‌రం జ‌రి గిన రాజ‌కీయ ప‌రిణామాల్లో జాన్స‌న్ త‌న ప‌ద‌వి కోల్పోయారు. ఇపుడు ప్ర‌ధాని రేసులో వున్న ప్ర‌ముఖ నాయకుల‌లో  రిషి  ఒక‌రు. ప‌టేల్ యుకే సెక్యూరిటీ, ఇమిగ్రేష‌న్,  వీసా పాల‌సీల ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. కాగా 39 ఏళ్ల క‌న్స‌ర్వేటివ్ పార్టీ ఎంపి రిషి ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ‌మూర్తి కుమార్తె అక్ష‌త‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఎంబిఏ చ‌దివారు, పెట్టుబ‌డుల అంశంలో నిపుణురాలుగా సుప‌రిచితురాలు.  భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు.  తొలి రౌండ్‌ లో  ఆయ‌న ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అభ్యర్థులైన లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి నిష్క్రమించారు. అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు.  ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది  గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవ రెట్‌ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2 లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న  ప్రధాని పదవిని  అందు కుంటారు. కాగా, ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పలు రౌండ్లలో జరిగే ఓటింగ్‌లో కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీ నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఇలా చివరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిలోంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. 

వందేళ్ల యువ‌కుడిని.. సాధించాల్సింది ఎంతో వుంది

లిథియం బ్యాటరీలు లేని ప్రపంచాన్ని ఈ రోజుల్లో ఊహించలేరు. వాటిని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ప్రొఫెసర్ జాన్ బన్నిస్టర్ గూడెనఫ్ ఈ నెలలో తన 100వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2019 నోబెల్ గ్రహీత తన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయ‌న‌.  నా వయసు వందేళ్లు మాత్రమే, నేను ఇంకా చాలా సాధించా ల్సి వుంద‌ని  2015లో  తన జీవితచరిత్ర రాస్తున్న  స్టీవ్ లెవిన్‌తో  అన్నారు. అయితే, ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, గూడెనఫ్ లిథియం బ్యాటరీల సృష్టికర్త  కాదు. గుడ్ నఫ్‌తో నోబెల్‌ను పంచుకున్న బ్రిటీష్-అమెరికన్ శాస్త్రవేత్త స్టాన్ విటింగ్‌హామ్, కరెంట్ ప్రవాహానికి ఎల క్ట్రాన్‌లను విరాళంగా అందించగల లిథియంను టైటానియం సల్ఫైడ్ షీట్‌లలో నిల్వ చేయవచ్చని మొదట ప్రతిపాదించాడు. అయినా,  విటింగ్‌హామ్  సెల్ ఎప్పటికీ పరిశ్రమలోకి రాలేదు; అది తరచుగా మంటలు అంటు కుంటోంది. గుడ్‌నఫ్ దీనిని కోబాల్ట్-ఆధారిత కాథోడ్‌తో పూర్తి చేసి, ఈ రోజు దాదాపు ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకే ఉత్పత్తిని రూపొందించింది. గూడెనఫ్ శాస్త్రీయ ప్రపంచానికి రాక్‌స్టార్, అతని ఉత్త‌మ ప్ర‌వాస విద్యార్ధులు  చాలా మంది తమ గురువు శతాబ్ది పుట్టినరోజును జరుపుకోవడానికి ఈ నెలాఖరులో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో సమావేశమవుతున్నారు. పాండిచ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రామసామి మురుగన్ గూడెనఫ్ విద్యార్థులలో ఒకరు. అతను తన గురువు సహకారం లిథియం బ్యాటరీల కంటే ఎక్కువగా ఉందని అన్నారు.  డిజిటల్ కంప్యూ టర్‌ల కోసం రాండమ్-యాక్సెస్ మెమరీలో అతని పని,  అయస్కాంత పరస్పర చర్యల కోసం గుడ్‌నఫ్-కనమోరి నియమాలు సైన్స్‌కు సమానంగా ముఖ్యమైనవి" అని మురుగన్ చెప్పారు.  మరో విద్యార్థి, ఐఐటి బిహెచ్‌యు, వారణాసికి చెందిన ప్రొఫెసర్ ప్రీతం సింగ్, గూడెనఫ్  సూపర్ కండక్టివిటీకి, ప్రత్యేకించి క్రాస్ ఓవర్ కండక్టివిటీ వంటి విష‌యాల్లో ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగ్ తెలియ‌జేశారు.  సోడియం సూపర్యోనిక్ కండక్టర్  ఆవిష్కర్త గా కూడా  ఆయ‌న ప్ర‌సిద్ధుడు అని సింగ్ చెప్పారు. అసమానతలకు వ్యతిరేకంగా విజయం గూడెనఫ్  విజయాలు ముఖ్యంగా గుర్తించదగినవి.  ఆయ‌న మౌలిక  పనిత‌నం, నైపుణ్యాలు. వ్యక్తి గత జీవితంలో, ముఖ్యంగా య‌వ్వ‌న‌ద‌శ‌లో అనేక పోరాటాల నేపథ్యంలో వచ్చింది. అతని జీవితచరిత్ర రచయిత అతని బాల్యం ఆనందంగా గ‌డ‌వ‌లేద‌న్నారు. ఎందుకంటే అతని  తల్లి దండ్రులు గొడవ ప‌డ్డారు, అతని తల్లి అతన్ని అంత ప్రేమ‌గా పెంచ‌లేదు. పాఠశాలలో  యువ  జాన్ డైస్లె క్సియాతో పోరాడాడు, ఇది పాఠాలను అర్థం చేసుకోవడం లేదా ప్రార్థనా మందిరంలో కొనసాగడం  కష్ట తరం చేసింద‌ని లెవిన్ చెప్పారు. బదులుగా, అతను అడవులు, దాని జంతువులు, మొక్కల అన్వేషణలో పూర్తిగా అంకిత‌మ‌య్యారు.  చివ రికి, యేల్‌లోకి ప్రవేశించడానికి తన వైకల్యాన్ని అధిగమించాడు, గణితం లో మాగ్నా కమ్ లాడ్ లో ఉత్తీర్ణత సాధించాడు. తరువాత అతను రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్‌ సైన్యంలో పనిచేశాడు. అతను విద్యావేత్తగా తిరిగి వచ్చినప్పుడు, చికాగో విశ్వవిద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు ఎగతాళిగా చేశారు. గూడెనఫ్ కోబాల్ట్ కాథోడ్‌ను ఎలా అభివృద్ధి చేశాడో మరియు నిప్పాన్ టెలిగ్రాఫ్, టెలిఫోన్  ఆదేశానుసారం గూడెనఫ్ తన తరగతిలో ప్రవేశించిన షిగెటో ఒకాడా అనే జపనీస్ విద్యార్థిచే సాంకేతికతను ఎలా దొంగి లించాడనే దాని గురించి లెవిన్ వివరంగా వివరించాడు. ఎన్‌టిటి కి వ్యతిరేకంగా యూనివర్శిటీ  ఆఫ్ టెక్సాస్ దాఖలు చేసిన సుదీర్ఘమైన 500-మిలియన్ డాల‌ర్ల‌ దావా ఫలితంగా ఏర్పడింది. ఎపిసోడ్‌కి చిన్న భారతీయ సంబంధం ఉంది. గూడెనఫ్ ఒకాడాను  అక్షయ పాధి అనే భార‌తీయునితో కలిసి పని చేసేలా చేసింది. గూడెనఫ్ ఒకాడా ఈ సాంకేతిక దొంగ‌త‌నాన్ని  కనుగొన్నప్పుడు, అతను కోర్టు లో సాక్ష్యంగా ఉపయోగించేందుకు తన నోట్‌బుక్‌లో వివరాలను నమోదు చేయమని పాధిని అడిగాడు, కానీ పాధి క్షమించండి, అతను నా స్నేహితుడు అని చెప్పి నిరాకరించాడట‌. లీవిన్  ఖాతా ప్రకారం, గుడెన‌ఫ్  అతని సాంకేతికత నుండి ఎంతో  లాభపడిన వ్యక్తులచే క్ర‌మేపీ ఆ సాంకే తిక‌త  స్వల్పంగా మార్చబడినట్లు కనిపిస్తుంది, అయినప్పటికీ అతను దీని ద్వారా ప్రభావితం కాలేదని అనిపించింది. గుడ్‌ఎనఫ్, బదులుగా, అతని జీవితమంతా జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తిగా మిగిలి పోయారు. మురుగన్  90 ఏళ్ల వయస్సులో కూడా, ఆయ‌న‌ ప్రయోగశాలను సందర్శించి, ప్రతి పండితులను కలుసు కునేవారు. పని, సాంకేతిక సమస్యలు, వాటిని పరిష్కరించడానికి సాధ్యమయ్యే దిశ లను చర్చించేవార‌ని గుర్తుచేసుకున్నాడు. గూడెనఫ్ "భారతదేశం  భారతీయ పండితులను ఇష్టపడుతుందని ,  మేము భారతీ య సంస్కృతి గురించి చాలా చర్చించుకునేవాళ్ళమ‌ని కూడా అతను చెప్పాడు. తాను మొదటిసారిగా గూడెనఫ్ గదిలోకి వెళ్లినప్పుడు, మీ తలపాగా ఎక్కడ ఉంది? అని శాస్త్రవేత్త అడిగారని ప్రీతం సింగ్ గుర్తు చేసుకున్నారు. సింగ్‌లందరూ సిక్కులు కాదని తనకు చెప్పాలని ఆయన వివరించారు. మురుగన్ , సింగ్ (అలాగే లెవిన్) గుడ్‌నఫ్  హాస్యం,  అతని ప్రత్యేకమైన నవ్వు  గురించి ప్రస్తావించారు, దీని రికార్డింగ్ కొన్నిసార్లు మనిషి గురించిన కథనాలలో పొందుపరచబడింది. మీరు అతనితో అత్యంత తెలివితక్కువ ఆలోచన గురించి చర్చించవచ్చు అని గూడెనఫ్ ప్రజలను చాలా సౌకర్యంగా చేస్తుందని సింగ్ గమనించాడు. ......

బీజేపీ సర్ప యాగాన్ని కేసీఆర్ అడ్డుకుంటారా?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అందుకే రాజకీయ శతృ మిత్ర సంబంధాలు, ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న,మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. అవి ఇప్పడు బీజేపీ మిత్ర పక్షాలు కాదు. ఒకప్పుడు అటల్ బిహరీ వాజ్ పేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. పోరాపచాలు వచ్చిన అయిదేళ్ళు సర్కార్’ను నడిపించారు. అలాగే, 2014లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించినా, మోడీ ఫస్ట్ కాబినెట్’లో మిత్ర పక్షాలకు స్థానం కల్పించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. నిజమే, ఇప్పటికీ, మోడీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే, కానీ, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గరు కంటే లేరు.  కేంద్ర మంత్రివర్గంలోనే కాదు, ఎన్డీఎలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును.ఒకప్పుడు, బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు మిత్ర బంధాన్ని తెంచుకుని బయటకు వెళ్లి పోయాయి, కాదు, చాలా వరకు పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండ పొగబెట్టి బయటకు పంపారని అంటారు.2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకో ఏమో, మొదలైన కమల దళం మిత్ర పక్షాలను సమిధలుగా చేసే సర్ప యాగం 2019 ఎన్నికల నాటికే చాలావరకు పూర్తయింది.  ఇక 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగ సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ  ఇలా ఒకొక్క పార్టీ  బయటకు వెళ్లి పోయాయి.  అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేసిందా అంటే లేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది. రేపో మాపో బీజ్పీలో విలీనం అయ్యేదుకు సిద్ధంగా ఉంది.మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉన్నాం.బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే  చరిత్రగా మిగిలిపోతుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. మెల్టింగ్’ మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత శివసేన చరిత్ర ముగింపుకు చేరుతుందని, అందులో సందేహం లేదని అంటున్నారు.  అలాగే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు నేత నితీష్ కుమార్’ ను సొంత పార్టీలోనే వంత్రిని చేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుని, నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి వర్ఫ్గంలో ఉన్న జేడీయు  ఆర్సీపీ సింగ్’ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దమైన నేపధ్యంలో, నితీష్ కుమార్, ఆయనకు రెండవసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్, సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది. త్వరలో సింగ్’ బీహార్ షిండే కాబోతున్నారని తెలుస్తోంది.  అయితే,  బీజేపీ టార్గెట్ మిత్రపక్షాలేనా అంటే కాదు ... అదివేరే కథ. కమల దళం అన్ని పార్టీలను సమదృష్టితోనే చూస్తోంది. అందుకే .. ఇప్పడు తెలంగాణలో కలకలం మొదలైంది. అందుకే రెండున్నర గంటల ప్రెస్ మీట్’లో ముఖ్యమంత్రి కేసేఆర్’ రెండు వందల సార్లు, షిండే పేరు తలచుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. కానీ, ప్రస్తుతం హ్యాండ్, మాంచి రైజింగ్’ లో ఉన్నా మోడీ, షా జోడీని కేసీఆర్ తట్టుకోగలరా? కమల దళం సర్పయాగాన్ని అపగలరా? అంటే, అది ఇప్పుడే చెప్పలేమని, పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయితేనే కానీ, క్లారిటీ రాదని అంటున్నారు.

ప్ర‌తిష్ట కోస‌మే .. ప్ర‌జారోగ్యం పై దృష్టి

ఏ ప్ర‌భుత్వానికయినా ప్ర‌జారోగ్యం కీల‌కం. కానీ ఆంధ్రప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగానే వుంది. ఏ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోనూ ఆరోగ్య శ్రీ కార్డుకు విలువ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పాల‌న‌లో ఆస్ప‌త్రుల్లో రోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లూ వుండ‌బోవ‌ని ప్ర‌చారం చేయించుకున్నారు. కానీ వాస్త‌వానికి ప‌రిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.  ప్ర‌భుత్వ ఆరోగ్య‌ప‌థ‌కాలు, కార్డులు వ‌ల్ల ప్ర‌జ‌లు ఏమాత్రం త‌మ‌కు ఆస్ప‌త్రుల‌ప‌ట్ల ధీమా ఇవ్వ‌లేక‌పోయాయి. ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లకే ప‌రిమితం అయింది కానీ ఆస్ప‌త్రులు, మందుల ల‌భ్య‌త‌, మందుల్లో నాణ్య‌త అనే అనేకానేక అంశాల్లో లోపాల గురించీ నిరం త‌రం విప‌క్షాలు, ప్ర‌జ‌లు గోడు పెడుతూనే వున్నారు. కానీ అవ‌న్నీ ప‌ట్ట‌నట్టే వ్య‌వ‌హ‌రిస్తూ, సంబంధిత మంత్రి, అధికారులు మాత్రం ప్ర‌జ‌ల ఆవేశాన్ని త‌గ్గించే తీపి మాట‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. స‌మ‌స్య ను ప‌రిష్క‌రించాల్సిన వారు కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డంతోనే స‌రిపెట్టుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌డానికే ఇపుడు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న లక్ష్యం తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  రాష్ట్రంలో ఆరోగ్య‌శ్రీ ద్వారా అందించే చికిత్స‌ల సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. పెంచ‌ద‌ల‌చిన చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చేందుకు ఏర్పా ట్లు చేయాల‌న్నారు.  కానీ ఆస్ప‌త్రుల‌కు వెళుతున్న రోగులు వారి రోగాలు ఆ ప‌థ‌కంలో పేర్కొన్నజాబితాలో లేవ‌ని డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్ప‌డంతో రోగులు హ‌తాశుల‌వుతున్నారు. ఆరోగ్య శ్రీ అంటూ  ధైర్యాన్నిస్టున్న‌ట్టు  భ్ర‌మ క‌ల్పించ డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వం చెప్పాలి. కాగా ఇప్పుడు రాజ‌కీయ అవ‌స‌రాల‌కు  ప్ర‌జారోగ్యం జ‌గ‌న్ టీమ్‌కు గుర్తొచ్చింది అన్న ఆరోప‌ణ‌లు విన‌ప‌డుతున్నాయి.    చికిత్స‌ల జాబితాను త్వ‌ర‌లోనే ఖ‌రారు చేస్తామ న్నారు. తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల యంలో సీ.ఎం  బుధ‌వారం వైద్య ఆరోగ్య శాఖ‌ స‌మీక్ష నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి ఆగ‌స్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్‌ను అమ‌లు చేయ‌డానికి పూనుకున్నారు. ఆరోగ్య‌శాఖ రివ్యూ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకు న్నారు.  గ్రామీణ ప్రాంతాల్లోని క్లినిక్‌లు,  పీహెచ్‌సీల‌కు డిజిట‌ల్ వీడియో  అనుసంధాన‌త  ఉండాల‌ని  ముఖ్య మంత్రి  జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఆరోగ్య‌శ్రీ కింద‌చ‌డ‌బ్బు నేరుగా రోగి బ్యాంకు ఖాతాలోకి, అక్క‌డి నుంచి ఆస్ప‌త్రికి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆస్ప‌త్రిలో చేరిన రోగి నుంచి ముందుగా అగీకార ప‌త్రం, చికిత్స పూర్త‌యిన త‌ర్వాత ధృవీక‌ర‌ణ ప‌త్రం, అందులో ప్ర‌భుత్వం నుంచి అందిన స‌హా యం వివ‌రాలు స్ప‌ష్టం గా వుండాల‌ని సీఎం ఆదేశించారు.  అంతేగాక‌, రోగుల‌కు ఆరోగ్య ఆస‌రా స‌హాయం వివ‌రాలు సేక‌రించా ల‌ని జ‌గ‌న్ సూచించారు. రోగి నుంచి అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేశారా, ఉచి తంగా వైద్యం చేశారా మొద‌లైన వివ‌రాలు కూడా వీలు క‌ల్పించాల‌న్నారు. ఎవ‌రైనా లంచం అడిగినా,  అధికంగా ఫీజులు వ‌సూ లు చేసినా, టోల్ ఫ్రీ నంబ‌ర్ ద్వారా ఏసీబీకీ ఫిర్యాదు చేసేలా అవ‌గాహ‌న క‌ల్పిం చాల‌ని స్ప‌ష్టం చేశా రు. 108, 104 లాంటి సర్వీసుల్లోనూ లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసు కోవాలని, ఆ వాహనా లపై కూడా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని ముఖ్య మంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈనెల చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని ఆదేశిం చారు. పీహెచ్ సీ మొదలు, బోధనాసుపత్రి వరకూ సరి పడా వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. నాణ్య మైన వైద్యం అందించాలన్న ఉద్దేంతోనే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులకు వివరిం చారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కొత్త జాతీయ చిహ్నంపై రాజ‌కీయ ర‌గ‌డ‌

కొత్త ఇల్లు కట్టుకున్న‌వారికి పాత ఇల్లు న‌చ్చ‌దు, కొత్త సొబ‌గుల‌తో ఇంటి రూపు మార్చిన‌వారికి పాత ఇంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో పోల్చు కోవ‌డం స‌సెమీరా న‌చ్చ‌దు.  కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన  కొత్త జాతీయ‌చిహ్నం పై ఇపుడు రాజ‌కీయ ర‌చ్చ పెచ్చు మీరుతోంది. బిజెపికి త‌మకున్నంత‌ దేశ‌భ‌క్తి దేశంలో మ‌రెవ్వ‌రికీ ఉండ‌ద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కం. విప‌క్షాల‌కు మాత్రం క‌మ‌ల‌నాధుల దేశ‌భ‌క్తి కేవ‌లం కాషాయ‌ప‌ర మైన‌ది. తాము చేసిన ప్ర‌తీ ప‌ని దేశ‌భ‌క్తితో చేస్తున్న‌ట్టు మోదీ ప్ర‌భుత్వం భ‌జ‌న చేయించుకోవ‌డం  బాగా అల‌వాట‌యింది.   అందువ‌ల్ల విప‌క్షాలు చిన్న విమ‌ర్శచేసినా తిట్టిపోయ‌డానికి వేయి గొంతుక‌లు సిద్ధంగా వుంటాయి. సార‌నాధ స్తూపం కంటే మేం నిర్మించిన‌దే మ‌హా గొప్ప అని బాకా బ‌జాయించుకుంటున్న త‌రుణంలో విప క్షాల చిన్న‌పాటి పోలిక‌ను మోదీ స‌ర్కార్ బొత్తిగా సహించ‌లేక‌పోతోంది.  శాంతికి చిహ్నంగా వుండాల్సిన‌వి ప్ర‌జ‌ల్ని ఆగ్ర‌హోరుద్రులుగా మార్చేందుకు స్పూర్తినిచ్చేవిగా సింహాలు వున్నాయ‌ని దేశం లోని విప‌క్షాలు,    సార‌నాధ్ స్తూపం ప్ర‌త్యేక‌త తెలిసిన‌వారూ మండిప‌డుతున్నారు. జాతీయ చిహ్నం బిజెపి ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబంలా వుందిగాని అందులో జాతీయ‌త వీస‌మెత్త‌యినా  లేద‌న్న ఆరోప‌ణ‌లే బ‌లంగా విన‌ప‌డుతు న్నాయి. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం మీద కొత్త‌గా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్రభుత్వం  అర్ధం లేనివ‌ని కొట్టిపారేస్తోంది. కానీ ఆలోచించి ఆ ఆరోప‌ణ‌ల వెన‌క సార‌మేమిట‌న్న‌ది కేంద్రం ప్ర‌భుత్వం ర‌వ్వంతయినా గ్ర‌హించ‌డం లేదు.  అది అచ్చం సార‌నాథ్‌లోని సింహాల చిహ్నంలానే వుంద ని  భావించడ‌మే  బిజెపి నేత‌ల పొర‌పాటు కానీ దాన్ని తెలుసుకోలేక‌పోతున్నార‌ని  విప‌క్షాలు గోల చేస్తున్నా యి. కాగా రెండు నిర్మాణాల‌ను స‌రి పోలుస్తున్న‌పుడు వాటి సైజు, ఎత్తుని కూడా లెక్క‌లోకి తీసుకోవాల‌ని కేంద్ర గృహ‌,  ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర‌దీప్ సింగ్ పురి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం పైన ఉన్న కాంస్య జాతీయ చిహ్నం పరిపూర్ణ ప్రతిరూపం అని ఆయన  అన్నా రు. ఎత్తు, రంగు కాదు.. అస‌లు ఆ చిహ్నం తెలియ‌జేసే జాతీయ‌తను తారుమారు చేస్తున్నార‌ని చ‌రిత్ర కారులూ ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. తాము చేప‌ట్టిన‌వ‌న్నీ శాస్త్ర‌ప్ర‌కార‌మే చేస్తున్నామ‌ని భ‌జ‌న చేయించు కోవ‌డం బిజెపి నేత‌లు  కాస్తంత త‌గ్గించుకోవాలని విశ్లేష‌కులు అంటున్నారు. ఎవ‌రు ఎన్ని చెప్పినా, సూచించినా త‌మ పంథాను మార్చు కోకుండా ఈ విధంగా జాతీయ‌త‌ను అప‌హాస్యం చేయ‌డానికే బిజెపి కంక‌ణం క‌ట్టుకున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  కొత్త చిహ్నం  33 మీటర్ల ఎత్తులో వుంద‌ని , అసలు సారనాథ్ చిహ్నం 1.6 మీటర్ల  ఎత్తు ఉండగా, కొత్త పార్లమెంట్ భవనం పైభాగంలో ఉన్న కాంస్య చిహ్నం 6.5 మీటర్ల ఎత్తులో భారీగా ఉందని కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ అన్నారు.  అసలు సారనాథ్ చిహ్నం కేవ‌లం 1.6 మీటర్ల ఎత్తు ఉంటుం దని,  కొత్త  పార్ల మెంటు భవనం పైభాగంలో ఉన్న చిహ్నం భారీగా . 6.5 మీటర్ల ఎత్తులో ఉంద‌ని  అని మంత్రి చెప్పారు. ఒక శిల్పా న్ని,  బొమ్మ‌ని చూసిన‌పుడు దాని అందం, గాంభీర్యం అనేది చూసేవారి దృష్టిమీద ఆధార‌ప‌డి వుంటుం ద‌ని, ఈ కొత్త భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన కాంస్య చిహ్నాన్ని విప‌క్షాలు విమ‌ర్శించ‌డంలోనే వారి దృష్టి తెలు స్తోంద‌ని మంత్రి ఎద్దేవా చేశారు.  ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విమర్శలు, ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌లో వ‌క్రీక‌రిం చింద‌న్న విమ‌ర్శ‌ల‌కు మంత్రి  ప్రతిస్పందించారు. కానీ హిందూత్వ‌భావ‌న‌లో  కొట్టుకుపోతున్న పార్టీవారు క‌నీసం సార‌నాధ్ స్తూపానికి ఇవ్వాల్సిన గౌర‌వం కూడా ఇవ్వ‌డంలేద‌న్న‌ది వారి అత్యాధునిక ఆలోచ‌న స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  అస‌లు వివాదమేమంటే, కొత్త పార్ల‌మెంటు భ‌వనం పై ఏర్పాటుచేసిన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాల కోర‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ని, సింహాలు రౌద్రంగా వున్నాయ‌ని, అస‌లు ఈ చిహ్నం అశోకుని రాజ‌ధాని సార‌నాధ్‌లోని చిహ్నం వ‌లెనే వుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయ‌డంతో విప‌క్షాలు మండిప‌డు తున్నాయి. అయితే భార‌త పురావ‌స్తుశాఖ మాజీ అధికారి బి.ఆర్ మ‌ణి మాత్రం సార నాధ్‌లోని అస‌లు స్తంభం  7 నుంచి  8 అడుగుల ఎత్తు వుండ‌గా, ఈ  కొత్త జాతీయ చిహ్నం అంతకంటే మూడు రెట్లు ఎత్తు వుందన్నారు. అయితే దీన్ని మ‌రీ రాజ‌కీయ‌ప‌రంగా వివాదం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని  ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 

జగన్ కు విశాఖ ఉక్కు సెగ!

జగన్ కు ఎల్లడలా నిరసనలే వ్యక్తమౌతున్నాయి. అమరావతి వీడి విశాఖకు మకాం మార్చి అక్కడ నుంచే పాలన సాగించాలన్న యోచనలో ఉన్న జగన్ కు విశాఖ ఉక్కు సెగ బలంగా తాకుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలన్నది కేంద్రం నిర్ణయమే అయినా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా జగన్ పైనే పడుతోంది.   నోరు తెరచి అడగకుండానే ప్రతి విషయంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలబడుతూ వస్తున్న జగన్ కనీసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగకుండా మిన్నకుండటంపై  విశాఖ వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మరో వైపు కేంద్రం విశాఖ ఉక్కులోని ఒక్కో విభాగాన్ని వాయు వేగంతో ప్రైవేటుకు అప్పగించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇది ఉక్కు కార్మికులలో ఆగ్రహాన్ని పెంచడమే కాకుండా అడ్డుకోవాలన్న కృత నిశ్చయంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.  కార్మికుల ఆగ్రహం కేంద్రంలోని మోడీ సర్కార్ తో పాటు అంతే తీవ్రంగా ఏపీలోని జగన్ సర్కార్ పైనా వ్యక్తమౌతోంది.  ఆంధ్రుల హక్కు అంటూ నినదించి దక్కించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం ప్రై ‘వేటు’ వేయడాన్ని అడ్డుకోవడం అటుంచి వత్తాసు పలుకుతారా అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేస్తుంటే అక్కడి రైతులు ఉవ్వెత్తున ఉద్యమించారు. కోర్టులు మొట్టికాయలు వేశాయి. అయినా జగన్ లో చలనం లేదు.. మా ఆగ్రహాన్ని మాత్రం జగన్ నే కాదు ఆయన సర్కార్ ను కూడా కదిలించేస్తుందని వారు అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని విస్మరించినా ఊరుకున్నాం కానీ, యావదాంధ్ర పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.   ఝార్ఖండ్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి  చెందిన  బొగ్గు గనిని ఏక పక్షంగా కేంద్రం రద్దు చేసిందని,  అలాగే  బ్లాస్ట్ ఫర్నేస్ ను  గత ఆరు నెలల నుంచి మూసేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతూనే.. అంతకు మించి తీవ్రతతో జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.  ఉన్న బొగ్గుగనిని రద్దు చేయడమే కాకుండా.. ఇంకో వైపు వేరే చోటు నుంచి బొగ్గు తెచ్చకోవడానికి వీల్లేకుండా   రైల్వే వ్యాగన్స్ ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంందులు పెడుతుంటే.. జగన్ ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. అన్ని విషయాలలోనూ కేంద్రానికి వత్తాసు పలికిన జగన్  రాష్ట్రం కోసం కనీసం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయలేదని కూడా ఎందుకు అడగడం లేదని నిలదీస్తున్నారు.  విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం రాష్ట్రప్రభుత్వం ముదుకు రావాల్సి ఉండగా అందుకు భిన్నంగా మీ చిత్తం వచ్చినట్లు ప్రైవేటుకు కట్టబెట్టండి అంటూ జగన్ సర్కార్ చేతులు ముడుచుకు కూర్చోవడమేమిటని నిలదీస్తున్నారు.   ఈ నేపథ్యంలో విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పాలన సాగించాలని భావిస్తున్న జగన్ కు ఉక్కు సెగ గట్టిగానే తగులుతుందని పరిశీలకులు అంటున్నారు. 

నీటి త‌త్వం మారిందా..ఎందుకిలా పోటెత్తుతోంది!

మనిషి మనసుకి నీటికి అలాగే మనిషి మనసుకి చంద్రుడికి సంబంధం ఉంది. ఎలాగైతే మనసు ఆలోచ నలు త్వరగా మారుతాయో అలాగే నీరు కూడా ముందుకి వెన్నక్కి వెళతాయి.కానీ ఇప్పుడు వున్నా పరిస్టితి పౌర్ణమి వచ్చిన సందర్బంలోనే వరదలు రావడం, ఆ నీరు వెన్నక్కి రావడం జరుగుతోంది ప్రకృతిలో జరిగే విపత్తులని సముద్రంలో జరిగే అలజడులన‌నుస‌రించి  ముందే  శాస్త్ర‌వేత్త‌లు గుర్తిస్తారు. అలాంటి సముద్ర తీరంలో మార్పులు దేనికి సంకేతాలు. వరదలకి సూపర్ మూన్ కి సంబంధం ఉందా  అంటే అవుననే అంటున్నారు ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త‌లు.  దానివల్లే వరదనీరు సముద్రంలోకి  వెళ్ళకుండా వెన క్కి మరులుతోంద‌ని,  భూమి పై వాతావరణాన్ని సముద్రాలూ ఎంతో  ప్రభావితం చేస్తాయ‌నీ  అంటున్నా రు.  ఋతుపవనాలు తూఫాన్ కి సముద్రాలే పుట్టిల్లు. సముద్ర అంతర్గతంగా  ప్రవహించే ఉష్ట  లేదా శీతల పవనాలు సమీప ప్రదేశాలలో ఉష్ణోగ్రతలని ప్రభావితం చేస్తాయి.  మాములుగా  ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి.  కానీ ఈసారి  వచ్చే పౌర్ణమి ఎంతో శక్తి వంతమైనది గా కనిపిస్తోంది.  ఈ పౌర్ణమి ప్ర‌భావం సముద్రం పై ఎక్కువగానే ఉంది. గురు త్వాక ర్షణ శక్తి కారణంగా వర్షాలతో పోటెత్తుత్తున్న వరద నీటిని కూడా తనలో కలవనివట్లేదు సాగరం. దానివల్ల పోట్లు ఎక్కువై వరదనీరు వెనక్కి వచ్చి ముంపు గ్రామాలకు  వరద ముప్పు ఎక్కువగా  వుంది. అద్భుత సన్నివేశానికి భూలోకం సాక్షిగా ఉంటుం దనే అనందం కన్నా దీని వల్ల వరద నీరు సముద్రంలో కలవ కుండా వెనకకి రావడం కలవర పెడుతోం ది.  సముద్రంలో ఈ ఆటుపోట్లు ఎంతకాలం ఉంటాయనేది  కూడా ప్రశ్నార్ధకం గా మారింది. సముద్రంలో క‌ల‌వాల్సిన  వరద నీరు గురత్వాకర్షణ కారణంగా వెనక్కి వస్తోంది. చంద్రుడి లో వుండే గురుత్వాకర్షణ శక్తి అధికం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది, ఈ సమయం లో తీరప్రాంతాలలో వర్షాలు తుఫాన్ లు వచ్చి వరదలకి దారితీస్తాయని ఖగోళ శాస్తవేత్తలు భావి స్తున్నారు. చంద్రుడు భూమికి అత్యం త దగ్గరకి వచినప్పుడు చంద్రుడి  గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ గా ఉంటుంది.ఆ సమయం లో సముద్రం లో అలలు సాదారణ స్థితి కంటే ఎక్కువగా పోటు ఎత్తుతాయి.ఆ అమయం లో సముద్రం ముందుకు దూసుకు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వున్నాయి.ఏది ఏమైనా ప్రకృతిలో వచ్చే విపత్తులకి మానవ తప్పిదాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి అనేది మాత్రం స్పష్టం.

త‌ల్లీ గోదారీ.. శాంతించ‌వ‌మ్మా

ప్ర‌కృతి ప్ర‌కోపించింది,  గోదావరి కన్నెర్ర చేసింది.  వేదంలా కాకుండా ఉగ్రంగా ప్రవహిస్తూ జనాలను బయపెడుతోంది. తల్లి గోదావరి ఉగ్రగోదావరిగా మారింది. గోదావరికి వరద రావడం సహజమే అయినా.. వందేళ్లలో ఈ స్థాయిలో వరద రాలేదనీ, అదీ జులై నెలలో ఈ స్థాయి వరద ఎన్నడూ లేదనీ, ఇది   ఊహించ‌ని విప‌త్తనీ అధికారులే కాదు.. గోదావరి తీరాన నివసించే జనమూ అంటున్నారు.   రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని నీటి ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నియి. ముఖ్యంగా తెలంగాణాలోని క‌డెం ప్రాజెక్టులోకి వ‌ర‌ద ఉధృతి   భ‌యోత్పాతం క‌ల్పించింది. అనేక గ్రామాలు ముంపున‌కు గురయ్యాయి. ప్రాజెక్టు డ్యామేజ్ అయి ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయన్న ఆందోళన అధికారుల్లోనే కాదు స్థానికుల్లోనూ వ్యక్తమైంది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ గురు వారం ఉద‌యానికి ఉధృతి    త‌గ్గుముఖం ప‌ట్టింది.  ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా  ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. లెఫ్ట్ కెనాల్‌కు గండి పడటంతో ప్రాజెక్టు కు ముప్పు తప్పింది. అయినప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది.  భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నీటి మట్టం 59.40 అడుగులకు చేరింది. 17,58,166 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు పెద్దపల్లి జిల్లాలోనూ గోదా వరి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల వెళ్లే వాహనాలను పోలీసులు గోదావరిఖని బస్టాండ్ వద్ద నిలిపి వేశారు. తెలంగాణ-మహ రాష్ట్ర మధ్య రవాణా నిలిచిపోయింది.  లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 22,15,760 క్యూసెక్కులకు చేరుకుంది. సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగు వకు విడుదల చేయనున్నారు. ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 14,77,975 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 8.38 టీఎంసీలకు చేరుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి  21760 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ ప్రస్తుతం నీటి మట్టం 1397.82 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎం సీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 9.156 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3553.33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3553.33 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 638.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు  ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.84 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,04,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు(90 టీఎంసీల)కు గాను ప్రస్తుత నీటి మట్టం 1087.40 అడుగుల(74.506 టీఎంసీలు)కు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు 36 గేట్ల ద్వారా 4,16,934 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూన్ మొదట నుండి ప్రాజెక్టు లోకి 107.831 టీఎంసీలు వరద చేరింది. మొత్తం ఔట్ ఫ్లో 53.391 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో..ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వ‌ద్ద‌ వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. వదర ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడ వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్  వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ లు  పాల్గొన్నా యి. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3,  ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు సహా యక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని జాగ్రత్తలు తీసు కోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు.  తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,05,840 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,09,031 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా కొనసాగుతుంది.

జగన్ మకాం మార్చేస్తారా?

తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని రాజు అంటే వందిమాగధులు కాదనక చస్తారా? ఏపీలో జగన్ పాలన అలాగే ఉంది. జగన్ ఔనంటే ఔను.. కాదంటే కాదు.. కేబినెట్, అధికార యంత్రాంగం పరిస్థితి అంతే ఇప్పుడు జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీకి రాజధాని లేకండా చేశారన్న విమర్శలను తిప్పి కొట్టడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఏకంగా తన మకాం విశాఖకు మార్చేసి అక్కడ నుంచే పాలన సాగించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా రాష్ట్రంలో 175కు 175అసెంబ్లీ స్థానాలలో విజయమే లక్ష్యంగా పని చేయాలన్న పిలుపు ఇచ్చిన ఆయన ఎన్నికలకు రెడీ అయిపోవాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారు. అమరావతిని ఇప్పటికే నిర్వీర్యం చేసిన జగన్ ఇక దాని ఊసు కూడా రాష్ట్రంలో ఎవరూ ఎత్తకుండా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించేసుకున్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భవనాల అన్వేషణ కూడా సాగిస్తున్నారు. వారంలో ఐదు రోజులు విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగించేందుకు సర్వం సిద్ధం చేసేశారు.  అమరావతి విషయంలో కోర్టు తీర్పు తరువాత నుంచి మూడు రాజధానులు అని జగన్ నోట ఎప్పుడు వచ్చినా జనం దానిని ఓ పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.  అన్ని విధాలుగా పాలనకు అనువుగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంచిన అమరావతికి దిక్కు లేదు కానీ మూడు రాజధానులా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల పాటను పక్కన పెట్టి విశాఖ కేంద్రంగా పాలన సాగించడం ద్వారా అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేశానన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందుకు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నుంచి అమరావతి నుంచి సాధ్యమైనంత త్వరగా (పారి)పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అమరావతి అభివృద్ధి కోసం అంటూ అక్కడి భూములను అమ్మకానికి పెట్టి, చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వడానికి నిర్ణయించేసి.. సాధ్యమైనంత సొమ్ము దండుకుని.. కోర్టు తీర్పు అమలు చేస్తున్నామని చెబుతూనే ఆ పనులు నత్తనడకన సాగిస్తూ.. కర్నూలు న్యాయరాజధాని అన్న మాట ఎత్తకుండానే.. పాలనా రాజధానిగా తాను మొదటి నుంచీ చెబుతున్న విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని జగన్ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.   అమరావతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి చిన్నచిన్న పనులు చేస్తూ.. జగన్ తన మకాం విశాఖకు మార్చేయనున్నారని పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం. అయితే పాలనా రాజధాని అని విశాఖకు మకాం మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయన్న భయంతోనే క్యాంపు కార్యాలయం పేర కొత్త నాటకానికి తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మకాం విశాఖకు మారిస్తే అందరి దృష్టినీ ప్రజా సమస్యల నుంచి మళ్లించే అవకాశం ఉంటుందనీ, విపక్షాలు, ప్రజలూ కూడా విశాఖ నుంచి పాలన అన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ, రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చనీయాంశంగా మారుతుందనీ, పాలనా వైఫల్యాలపై విమర్శల దాడి ఆగిపోతుందనీ  జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

ఏపీలో ప్రభుత్వ కనుసన్నల్లో ప్రకృతి విధ్వంసం!

ప్రకృతి సమతుల్యం దెబ్బతింటే జరిగే విధ్వంసం ఊహకు అందనిది. అందుకే ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.ప్రపంచదేశాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరుపుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో కూడా ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు, అందుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉంది. అయితే ఏపీలో ప్రభుత్వం కనుసన్నలలో యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. విపత్తులను సహజ రక్షణగా నిలుస్తున్న అడవులు నరికేస్తున్నారు. కొండలు తవ్వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కనుసన్నలలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో వారి పర్యవేక్షణలో సాగుతోంది. ఈ విధ్వంసం అంతా ప్రభుత్వ పెద్దల స్వ ప్రయోజనం కోసమే జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కోసం లేటరైట్‌, బాక్సైట్‌ ఖనిజాల దోపిడీ జరుగుతుంటే.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై తెలుగుదేశం  ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. కొండలను తవ్వేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. భవిష్యత్ తరాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. ఐదేళ్ల పాటు ప్రజల సంపదకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు స్వయంగా దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారు. కొండలను పిండి చేసేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. ఖనిజాలను తవ్వేస్తున్నారు. ఇది నిజంగా దారుణం, దౌర్భాగ్యం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీపై ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ప్రభుత్వం పాల్పడుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ ప్రకృతి విధ్వంసం.. కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందన్నారు. రుషి కొండను బోడి కొండ చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ తవ్వకాలను ఆపాలని స్టే ఇచ్చినా లెక్క చేయలేదు. చివరికి సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేసింది. అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ఇక కర్నూలులో రవ్వల కొండను పిండి చేశారు. కొండను తవ్వేసిన వారిని వదిలేసి తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కేసులు పెట్టి వేధించిందీ ప్రభుత్వం అంటూ విమర్శించారు.మన్యంలోని భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి భారతీ సిమెంట్స్‌కు పంపిస్తున్నారు.   కుప్పం పరిధిలోని శాంతిపురంలో విలువైన గ్రానైట్‌ కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారు.    తెలుగుదేశం ఆ స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చి అందులో మూలికల మొక్కలు పెంచాలని భావించింది. ఇప్పుడు ఆ వర్సిటీ రిజిస్ట్రారే దగ్గరుండి అక్రమతవ్వకాలు జరిపిస్తున్నారు. ఇవేమీ తెలుగుదేశం చెబుతున్న మాటలు కావు. ఎక్కడ ఏ కొండను తవ్వేసింది. ఎక్కడెక్కడ అడవులను నరికేసింది అన్నీ గూగుల్ మ్యాప్ లో స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబు అన్నారు.   కాకినాడలో మడ అడవుల నరికివేత ఇష్టానుసారంగా సాగుతుంటే అటవీ శాఖ ఏం చేస్తోందని నిలదీశారు.   అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏకంగా 62 మంది మరణించడానికి కారణం అక్రమ ఇసుక తవ్వకాలు కాదా. ఇసుక మాఫియా విచ్చలవిడి గా ఇసుకను తవ్వేయడమే అందుకు కారణమని బాబు ధ్వజమెత్తారు.  చిత్తూరు జిల్లా బండపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 75 చోట్ల ఇటువంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు తాను చేసిన ప్రతి ఆరోపణనూ నిరూపించడానికి సిద్ధమన్నారు.ఇప్పటికైనా వీటిని అడ్డుకోకుంటే చరిత్ర హీనులుగా మారిపోతారని ఆయన అధికారులను హెచ్చరించారు. మైనింగ్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులూ, సీఎస్ సహా తప్పు చేసిన ఏ అధికారనినీ వదలబోమనీ, అందరినీ చట్టం ముందుకు తీసుకువస్తామని చంద్రబాబు అన్నారు. కూడా ముందుకు రావాలి. చర్యలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరెక్కడున్నా తప్పు చేసిన అందరినీ చట్టం ముందుకు తెస్తాం’ అని చెప్పారు.    

మహోగ్రంగా గోదావరి వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అయితేనేమీ.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలు వల్ల అయితేనేమీ.. వేదంలా ఘోషిస్తూ.. ప్రవాహించే గోదావరి.. ఉగ్రరూపంలోకి మారి దిగువ ప్రాంతాలకు ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలే కాదు.. గోదావరి పరివాహక ప్రాంతాలు సైతం నీట మునుగుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో.. భద్రాచలం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.   భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి.. పలు చోట్ల కొండ చరియలు  విరిగిపడ్డాయి. అయితే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షపు నీరంతా గోదావరిలో కలిసి.. దిగువకు ప్రయాణిస్తోందీ. దీంతో తెలుగు రాష్ట్రాలకు గోదావరి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా.. రెండు రాష్ఱాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. తెలంగాణలో బాసర నుంచి  భ్రదాచలం వరకు.. ఆపై ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి బీభత్స స్థాయిలో ప్రవహిస్తూ... ఆయా ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.   అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌తోపాటు భద్రచాలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.   ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి వద్ద గల రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ వద్ద   గోదావరి భారీ స్థాయిలో ప్రవహిస్తోంది.  కోవ్వూరులోని గోష్పాద క్షేత్రం  నీట మునిగిపోయింది.   కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఏటూరునాగరం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. ఆ క్రమంలో పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగవకు వదిలారు. మరోవైపు.. గోదావరికి భారీగా వరద నీరు పొటెత్తడంతో.. ఆయా పరివాహక ప్రాంతాలతోపాటు లంక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరదలతో నిరాశ్రయలైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి... వారికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను గోదావరి జిల్లాలో ఎటువంటి పరిస్థితినైనే ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు.  . ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు  విడుదల చేశారు.

సంక్షేమం గీత దాటితే సంక్షోభమే!

శ్రీ లంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో చెలరేగిన ప్రజాందోళనలు, హింసాత్మక సంఘటనలపై మన దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంపై విభిన్న కోణాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పీఠాన్ని అందుకునేందుకు, రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు, ఉచిత వరాలను నిచ్చెనలుగా చేసుకుని, అధికారానికి అడ్డ దారిగా, దగ్గరి దారి (షార్ట్కట్) గా భావిస్తున్న నేపధ్యంలో, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందనే, వాదన బలాన్ని పుంజుకుంటోంది.  నిజమే. సంక్షేమం గీత దాటితే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో, ప్రభుత్వాలు, ‘ఓటు బ్యాంక్’ పథకాలకు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పులు చేసి మరీ  పతకాలు అమలు చేస్తున్నాయి. మీటలు నొక్కి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇటీవల ఏపీ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి, నొక్కిన మీటల లెక్కలు చెప్పి, మొత్తం 175 సీట్లు తమవే అన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇలా ప్రజలను ఓటర్లుగా, ఓటర్లను అమ్ముడుపోయే సరుకుగా భావించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఫలితంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోవడంతో పాటుగా,ప్రభుత్వ ఉద్యోగులకు  సకాలంలో  జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అలాగే, అప్పుల భారం పెరిగే కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయలేక పోతున్నాయి. కోతలు విధిస్తున్నాయి. చేతులేత్తెస్తున్నాయి. మరో వంక అభివృద్ధి, దీర్ఘకాల సుస్థిర ప్రయోజనాలపై ప్రభుత్వాలు దృష్టి నిలపలేక పోతున్నాయి. శ్రీ లంకలో జరిగింది అదే, అందుకే మన దేశంలోనూ శ్రీ లంక తరహా పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఘటికలు వినిపిస్తున్నాయని, హెచ్చరికలు వినవస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నత్రి నరేద్ర మోడీ, షార్ట్కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని, చేసిన వ్యాఖ్యాలు ఇప్పడు దేశంలో ప్రధాన చర్చనీయంశాలు అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ, ప్రత్యేకించి ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయక పోయినా, షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడితే,  షార్ట్ సర్క్యూట్ ఖాయమని చేసిన హెచ్చరిక మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా అందరికీ వర్తిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు  ఏపీ, తెలంగాన స్టేట్ గవర్నమెంట్స్’ సీరియస్’గా తీసుకోవాలని  అంటున్నారు. ప్రధాని మోడీ ఎక్కడా ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా, ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు.. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు. నిజానికి ప్రధాని  మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి గతులు, అప్పులు ఆదాయాలపై దృష్టిని కేంద్రేర కరించింది. ముఖ్యంగా, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట అడ్డదారిలో చేస్తున్న అప్పులకు సంకెళ్ళు  బిగించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అప్పులు చేయకుండా రాష్ట్రాల రుణ పరిమితిని ఎప్పటికప్పుడ్డు సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్ర తేసుకున్న కటిన చర్యలు సహజంగానే రాష్ట్ర  ప్రభుత్వాలకు రుచించడం లేదు. అయితే, ఆర్థిక నిపుణులు, చివరకు రాష్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు కూడా, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే,ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరని, బెల్ట్స్ బిగించిక తప్పదని అంటున్నారు. అలాగే, శ్రీ లంక పరిణామాల నేపధ్యంలో, ప్రజలు కూడా, సంక్షేమం గీతదాటితే సంక్షోభమే, అనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా శ్రీ లంక పరిణామాలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని అంటున్నారు.

ముగ్గురు అక్క‌చెల్లెళ్లు.. పుట్టిన తేదీ ఆగ‌స్టు 25!

పూర్వం క‌వ‌ల పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, ఆ త‌ర్వాత ఒకేలా వ్య‌వ‌హ‌రించే పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, మ‌నిషిని పోలిన మ‌నుషులు లోకంలో ఏడుగురు వుంటార‌ని ఓ చిత్ర‌మైన సిద్ధాంతం చాలా ప్ర‌చారంలో వుంది. ప్లారిడాకు చెందిన క్రిస్టిన్ లామ‌ర్ట్ ఆనందం మ‌రో ర‌కం. ఆమెకు ముగ్గురు పిల్ల‌లూ మూడేళ్ల తేడాతో జ‌న్మించారు.. అదీ  ఒకే తేదీన‌! త‌న ముగ్గురు పిల్ల‌లు సోఫియా, గ్యులియానా, మియాలు ఆగ‌స్టు 25నే పుట్ట‌డం చిత్రంగా వుంద‌ని, దైవ కృప‌గా భావిస్తున్నాన‌ని అన్న‌ది త‌ల్లి క్రిస్టిన్‌. ఆమే కాదు చుట్టుపక్క‌ల‌వారూ ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. ఇదెలా సాధ్యం?.. ప్ర‌తీవారూ వేసుకుంటున్న ప్ర‌శ్న‌. ఆరేళ్ల సోఫియా 2015 ఆగ‌స్టు 25న పుట్టింది. మూడేళ్ల గ్యులియానా 2018లో అదే తేదీన పుట్టింది.  చిన్నారి  మియా 2021 లో అదే తేదీన జ‌న్మించింది! అంటే ఆగ‌స్టు 25వ తేదీ ఆ యింట, ఆ వీధి వీధంతా  పుట్టిన‌రోజు పండ‌గే.. ప్ర‌తీ సంవ‌త్స‌రం! పెద్ద పిల్ల సోఫియాని క‌డుపుతో వున్న‌పుడు త‌న‌కు ఆగ‌స్టు 23న బిడ్డ పుట్ట‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు క్రిస్టిన్ తో అన్నారు. కానీ సోఫియా 25వ తేదీన పుట్టింది. రెండో బిడ్డ స‌మ‌యంలో డాక్ట‌ర్లు చెప్పిన‌ట్టే జ‌రుగుతుంద‌ని ఆశించింది. కానీ చాలా చిత్రంగా ఆగ‌స్టు 25నే జ‌న్మించి డాక్ట‌ర్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు .. ఆజాదీకా కానుక

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం  మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' పేరుతో  నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగగాగా 75 రోజుల పాటు దేశ ప్రజాలందరికీ, కొవిడ్ వాక్సిన్ మూడవ  డోసు (బూస్టర్ ) ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రస్తుతం 60ఎళ్ల పైబడిన వారికీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మాత్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఈవయస్సు వారిలో రెండు కేవలం ఒక శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో, మహమ్మారి మరో మారు విజృంభించక ముందే సాధ్యమైనంత ఎక్కువ మందికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభమవుతుంది  ఇందులో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌ లో భాగంగా ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి. దేశం మొత్తంలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి, ఐసీఎంఆర్ తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని శాస్త్ర వేత్తలు చేసిన సూచన ఆధారంగా 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా బూస్టర్‌ డోసును ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.  జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్‌ డోసుగా పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దేశంలో 77 కోట్ల మంది ఈ వయసు వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్‌ డోసును తీసుకున్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రం బూస్టర్‌ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16 కోట్లు ఉండగా వారిలో 26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు. 

విక్కీ.. మ‌న‌సున్న అదృష్ట‌వంతురాలు

ఊహించ‌ని మంచి జ‌రిగితే  అంత‌టి అదృష్ట‌వంతులు లేరంటారు. అదృష్టానికి సంబంధించి  అనేక క‌థ‌నాలు, సంఘ‌ట‌న‌లు మ‌నం చాలా వినే ఉంటాం, చూసే ఉంటాం. కానీ  ఆ అదృష్ట‌వంతుల‌కు మంచి మ‌న‌సు వుంటే ఊహించ‌ని మేలు అవ‌త‌లివారికీ జ‌రుగుతుంది. ఈ మాట విక్కీ ఉమోడుకి స‌రిగ్గా  స‌రిపో తుంది. ఆమె త‌క్కువలో వ‌స్తోంద‌ని రెండు సోఫాల్ని ఇంటికి తెప్పించింది. తీరా దాని కుష‌న్‌లు స‌రి చేస్తుంటే ఏకంగా 27 ల‌క్ష‌ల డ‌బ్బుతో ఉన్న రెండు క‌వ‌ర్లు దొరికాయి. అదృష్ట‌మంటే ఇదేరా అనుకున్నా రంతా. ఇత‌రులెవ‌రైనా అయితే ఆ డ‌బ్బును గుట్టుచ‌ప్పుడు కాకుండా  లాక‌ర్‌లో పెట్టేసుకుంటారు. కానీ  విక్కీ అలా చేయ‌లేదు.  ఆమె వెంట‌నే ఆ డ‌బ్బును నిజంగా ఆ డ‌బ్బు ఎవ‌రిదో క‌నుక్కుని తిరిగి ఇచ్చే సింది.  ఇలాటివారు ఈ  రోజుల్లోనూ  వుంటారా అనిపించ‌వ‌చ్చు. కాలిఫోర్నియాకు చెందిన విక్కీ త‌న కొత్త ఇంటికి ఫ‌ర్నీచ‌ర్ కొనాల‌నుకుంది. ఆన్‌లైన్‌లో సోఫాలు  బుక్ చేయడానికి ఒక వెబ్‌సైట్ వెతికింది. ఆమెకు కావాల్సిన ధ‌ర‌లో రెండు మంచి సోఫాలు, వాటికి  త‌గిన కుర్చీల‌ను వెతికింది. కానీ వాటిని ఒక వ్య‌క్తి పైసా చెల్లించ‌కుండానే ఇస్తాన‌ని త‌న  వ‌ద్ద  వున్నాయ‌ని  ఓ పెద్ద‌మ‌నిషి  ఒక  ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. అది ఆమె దృష్టిలో ప‌డింది. ముందు న‌మ్మ‌లేదు. త‌ర్వాత ఫోన్ చేసి ఆ వ్య‌క్తితో మాట్లాడింది.  ఆ వ్య‌క్తి త‌మ బంధువు ఒక‌రు చ‌నిపోవ‌డంతో అత‌నికి సంబంధించిన వ‌స్తువు ల‌న్నీ ఉచితంగా ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేయ‌ద‌ల‌చిన్న‌ట్టు తెలిసింది. విక్కీకి త‌న కొత్త నివాసంలో ఏమీ లేవు గ‌నుక విడిగా కొనే బ‌దులు ఆయ‌నను క‌లిసి వాటిని తీసుకోవాల‌ని అనుకుంది. వెంట‌నే ఆయ‌న్ను క‌లిసి రెండు సోఫాల‌ను, వాటికి త‌గిన రంగులోని రెండు కుర్చీల‌ను కూడా తీసుకుంది. వాటిని ఇంటికి తెచ్చింది.  కొత్త సోఫాల‌ను చూసి ఎంతో మురిసిపోయింది విక్కీ. తీరా వాటిని స‌ద్దుతుంటే సోఫాలో ఇరుక్కుని రెండు క‌వ‌ర్లు క‌నిపించాయి. అదేమిటా అని చూస్తే వాటిలో డ‌బ్బు క‌ట్ట‌లు వున్నాయి! చిన్నా, చిత‌కా కాదు..ఏకంగా మ‌న లెక్క‌ల ప్ర‌కారం 27 ల‌క్ష‌లు! ఆమె ఆశ్చ‌ర్యానికి అంతే లేదు. కానీ వాటిని తాను తీసి దాచుకోలేదు. దేవుడు మాకు జీవితానికి త‌గినంత ఆర్ధిక బ‌లాన్ని, వృత్తి వుద్యోగాల‌నిచ్చాడు, ఈ డ‌బ్బు వుంచుకోలేన‌ని అనుకుందామె. వెంట‌నే సోఫాలు ఇచ్చిన వ్య‌క్తిని క‌లిసి ఆయ‌న‌కి క‌వ‌ర్‌ని అలానే ఇచ్చేసిందామె. ఆయ‌న కూడా ఆమె గొప్ప‌త‌నాన్ని గ్ర‌హించి కొత్త ఫ్రిజ్ కొనుక్కోమ‌ని రెండువేల డాల‌ర్లు ఇచ్చాడు.  ఇంత‌కంటే గొప్ప వ్య‌క్తుల‌ను మ‌నం చూడ‌గ‌ల‌మా?

ముప్పు ముంగిట కడెం ప్రాజెక్టు..వరద ఉధృతి పెరిగితే డ్యాం డ్యామేజ్!

భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే డ్యామ్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని  అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి పరిస్థితినైనా  ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి డ్యామ్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీటి ప్రవాహంపై ఆరా తీసేరు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. భారీ వరద కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 2లక్షల 35 వేల క్యూసెక్కులు ఉండగా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు   కాగా ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది.