వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు.. జగన్ సర్కార్ కు ఈసీ ఆదేశం

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బండారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బట్టబయలు చేసేసింది. వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు.. వైసీపీ కార్యకర్తలేనని చెప్పకనే చెప్పేసింది. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రయ ప్రారంభం కానున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి జోక్యం ఉండరాదన్న ఉద్దేశంతోనే ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం విపరీతంగా ఉంటోందనీ, ఓటర్ల జాబితాలో వారు చేతి వాటం చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.   వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేసిందే ఎన్నికలలో లబ్ధికోసమన్న విమర్శలు చాలా కాలం నుంచీ వస్తున్న సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే లబ్ధిదారులకు పథకాల లబ్ధి అందే విషయం దగ్గర నుంచీ.. ప్రతి పనీ వారి కనుసన్నలలోనే జరిగేలా జగన్ స్కెచ్ వేశారనీ, అందుకే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేశారనీ అంటున్నారు. చివరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉందని చెబుతున్నారు. ‘గడపగడపకూ’ కార్యక్రమంలో కూడా లబ్ధిదారుల వివరాల జాబితాను ఎమ్మెల్యేలు వలంటీర్ల వద్దనుంచే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలుగుదేశం పట్ల మొగ్గు చూపుతున్నారనుకున్న వారికి పథకాలు అందకుండా చేయడం దగ్గర నుంచీ వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వరకూ నానా రకాల అరాచకాలకూ జగన్ సర్కార్ వాలంటీర్లను వాడుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్ల జోక్యం పెచ్చరిల్లిందన్న విమర్శలూ ఉన్నాయి.  

ఏపీ రోడ్లపై అడుగుకో స్విమ్మింగ్ పూల్

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోలేదు..పొరుగు రాష్ట్రం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలంటూ దుమ్మెత్తి పోశారు. పైపెచ్చు వారం వారం రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్షలు నిర్వహించారు. అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీ ప్రయాణం అంటూ గప్పాలు కొట్టుకున్నారు. నాలుగు రోజులు వానలు పడ్డాయో లేదో ఏపీలో రోడ్ల బండారం బయట పడిపోయింది. ఈ మూడేళ్లలో చిన్న గుంత కూడా పూడ్చలేదని రుజువై పోయింది. ఇటీవలే చేసిన సమీక్షలో జూలై 15 నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదని జగన్ ఆర్భాటంగా ప్రకటన కూడా చేశారు. నిజమే కాబోలు అనుకునే వారికి దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన జూలై 15 వచ్చేసింది. నిజమే రోడ్లపై ఒక్క గుంత లేదు. బోలెడు గుంతలు ఉన్నాయి. ఇంచుమించు అడుగుకో గుంత ఉందంటే అతిశయోక్తి కాదు.   వర్షాలకు ఆ గుంతలు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇదే. ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఇక్కడ రోడ్డేది.. అన్నీ నీటి కొలనులేగా అంటారు. ఆ గంతల రోడ్లపైనే, ఈ నీటి తటాకాల్లోనే అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లా..ఈత కొలనులా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఇప్పుడైనా జగన్ సర్కార్ ఈ రోడ్ల మరమ్మతులు చేపడుతుందా అంటే ఆ అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.  దీంతో పనులు చేయిద్దామని ప్రభుత్వం ఒక వేళ పొరబాటున అనుకున్నా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వైసీపీ నేతలే ప్రభుత్వ కాంట్రాక్టులా అయ్యబాబోయ్ అని పారిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీ రోడ్లను ‘ఏ దేవుడూ’ బాగు చేయలేడు.

మంత్రి రోజాకు మరో బిరుదు.. కలెక్షన్ క్వీన్ .. ట

దిసీజ్ ... టూమచ్ అండ్ టూ బాడ్, ఐ సే .. లేదంటే ఏంటండి.. ఒక ఆడ కూతురు .. ఎంతో కష్ట పడి .. కాలి నడకన కొండెక్కి వెంకన్న స్వామికి ఇంకెందరో దేవుళ్ళకు మొక్కి, ఇంకెన్నెన్నో చేసి ఒక మంత్రి పదవి తెచ్చుకుంటే, ఆమెను అన్నేసి మాటలంటారా? ఈజ్ ఇట్ నాట్ బార్బేరియస్, ఇది మహా దుర్మార్గం కాదా, మహా పాపం కాదా ..అని అడుగుతున్నా.  అయినా రోజా అంటే ఎవరు .. మనందరినీ వెండి తెరమీద, బుల్లి తెరమీద ఎంతగానో అలరించిన ఓ అందాల నటి ... జగనన్న ముద్దుల చెల్లి, అంతటి ఆమెను పట్టుకుని అన్నేసి మాటలంటారా? అసలు ఆమె నవ్వుకే ఇవ్వవచ్చును కదండీ ఎన్నో వేల వరహాలు.. అలాంటిది,  జస్ట్ ఓ కోటిన్నర పెట్టి  కొడుకు కోసం మెర్సిడెజ్ బెంజ్ కారు కొని, అబ్బాయికి గిఫ్ట్’గా ఇస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా? ఓ ఆడ లేడీ మీద మీకున్న గౌరవం ఇదేనా ... అసలు మీకేమైనా, ఇంగిత జ్ఞానం ఇత్యాదులున్నాయా? అని కూడా అడుగుతున్నా.  అయినా, నాకు తెలియక అడుగుతాను.. మంత్రి పదవి రాగానే, ముడుపులు ముట్ట రాదు, లంచాలు పుచ్చుకోరాదు అని రూలు ఏమైనా ఉందటండి, లేదు కదా. అలాగే, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు,ఇన్ని నెలలు అయిన తర్వాతనే చేతులు పైకి తీయాలి, లంచాలు పుచ్చుకోవాలి జేబులు నింపుకోవాలి అనే రూలు ఏమైనా వుందా? రాజ్యాంగంలో, ఐ మీన్ .. రాజారెడ్డి రాజ్యాంగంలో అలా అని ఏమైనా  రాశారా?  లేదు కదా, మరి కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు, ‘రారే’ రాజ్యాంగానికి, ‘రారే’ రాజ్యాంగ నిర్మాత జగనన్నకు లేని దురద, ఈ తెలుగు దేశం పార్టీ వాళ్ళకు ఎందుకని అడుగుతున్నా.. ఇంత మాత్రంకే,, ఆమెను  కలెక్షన్ క్వీన్ అనేస్తారా? నిజానికి, ఇచ్చే వాళ్ళుంటే ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే నిక్షేపంగా ముడుపులు పుచ్చుకోవచ్చని కదా గౌరవ పెద్దలు చెప్పింది, చేసి చూపింది. అలా పెద్దలు చూపిన బాటలో మినిస్టర్ రోజా నడిస్తే అది కూడా తప్పేనా..  అంత మాత్రం చేతనే ఆమె ‘కలెక్షన్ క్వీన్’  అయిపోతారా? ఇటీజ్ టూ బాడ్..ఇదేనా మీరు ఒక మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం అని కూడా అడుగుతున్నా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంకెప్పుడు రోజా  మంత్రి పదవి చేపట్టి వంద రోజులు అయినా అవలేదు అప్పుడే కాష్ కౌంటర్ ఓపెన్ చేశారు. కోట్లు సంపాదిస్తున్నారు .. అంటూ గోల చేయకండి .. అస్సలు ఉన్నదే  రెండు సంవత్సరాల టైము ... మళ్ళీ ముందస్తు ఎన్నికలు అంటున్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, పదవిలో ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఆమె అనుకుంటే అది కూడా తప్పు పట్టడం తప్పు కాదా.. అయినా కోటిన్నర అంటే ఎంతండి? ఇంత చిన్న మొత్తానికే ఇంత గొడవ అవసరమా? రెండు రేపులు రేపులు కాదు.. కోటిన్నర ముడుపులు ముడుపులు కాదు, అని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ..ఏమో అదలా ఉంటే, మినిస్టర్ రోజా.. అప్పాయింట్మెంట్ కే రూ. 50 వేలు తీసుకుంటున్నారని, ఇంకొక మాట అంటున్నారు. అవునండి తీసుకుంటే తీసుకుంటారు.. కాలం విలువ, దటీజ్ టైం వేల్యూ.. అది  తెలిసిన వారు కాబట్టి తీసుకుంటే తీసుకుంటారు. జబర్దస్త్’ షోలో ఓ గంట అలా కూర్చుని విరగబడి, పగలబడి నవ్వినందుకే అక్షరాల లక్షల్లో రెన్యూమరేషన్ తీసుకున్న ఆమెకు టైము విలువ బాగా తెలుసు కాబట్టి.. తీసుకుంటే  తీసుకుంటారు. అయినా మంత్రి పదవికోసం ఎంతగా తపించారో తెలుసు కదా.. అడంతా ఉత్తినే చేశారా .. లేదు కదా.

పంజాబీ గాయ‌కుడు ద‌లేర్‌కు రెండేళ్లు జైలు

ఏ దేశంలోనైనా గాయ‌కుడు అన‌గానే చెవికోసుకునేవారు చాలామందే వుంటారు. అందులోనూ ఇటీవ‌లి కాలంలో జాన‌ప‌ద బాణీల‌ప‌ట్ల పిచ్చి ఎక్కువైంది. మ‌రీ ముఖ్యంగా పంజాబీ గాయ‌కుడు ద‌లేర్ మెహందీ అంటే ప‌డిఛ‌స్తున్నారు. అత‌ని పాట అన‌గానే వ‌య‌సుతో నిమిత్తంలేకుండా చిన్నా పెద్దా అంతా ఉర్రూత‌లూగుతారు. అంత క్రేజ్ వున్న గాయ‌కుడు ఊహించ‌ని విధంగా మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసులో రెండేళ్ల జైలు శిక్ష‌కు గుర‌య్యాడు. విన‌డానికి ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నా ఇది నిజం.  పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అప్పీల్‌ను పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు  రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. గురువారం  అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశా లకు తీసుకెళ్లి అక్కడే ఒదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే ఒదలిపెట్టేవారు. ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిర పడా లనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో ఒదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయన కోర్టు శిక్ష వేసింది. 2003లో సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మెహందీ సోదరులు 1998, 1999లో రెండు సార్లు ఇలా చేసి నట్లుగా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ప‌దిమందిని గ్రూప్‌లో సభ్యులుగా యుఎస్‌కు తీసుకెళ్లి అక్రమంగా వదిలిపెట్టారని ఆరోపించారు. మొదటి ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత.. గాయకుడిపై పోలీసులకు మరో 35 ఫిర్యాదులు అందాయి. కొంతమంది ఫిర్యాదుదారుల ప్రకారం.. దలేర్ మెహందీ  కొంత మంది వ్యక్తులను అక్రమంగా విదేశాలకు (ఎక్కువగా కెనడా, యుఎస్) పంపడానికి బదులుగా వారి నుంచి దాదాపు రూ. 12 లక్షలను తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తన విదేశీ కార్యక్రమాలలో డ్యాన్స్ ట్రూప్‌లలో భాగంగా వారిని విదేశాలకు పంపుతానని వాగ్దానం చేసేవారు. దీని తరువాత, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని దలేర్ కార్యాలయంపై దాడి చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత పంజాబ్ పోలీసులకు దలేర్ మెహందీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయి.

హెలికాప్ట‌ర్ కోసం బ్యాంక్ రుణం కోరిన రైతు

రైతే రాజు.. ఒక‌ప్ప‌టి మాట‌. ఈరోజుల్లో రైతు క‌ష్టాలు ఎవ‌రికీ వ‌ద్దురా బాబూ అనిపిస్తుంది. ఊహించ‌ని క‌ష్టాలు అనుభ‌వించిన మ‌హారాష్ట్ర రైతు ఒక‌త‌ను మ‌న ఊహ‌కి అంద‌ని చిత్ర‌మైన ఆలోచ‌న చేశాడు. ఎవ‌రైనా  పిల్ల‌ల చ‌ద‌వుకో, ఇల్లు క‌ట్టుకోవ‌డానికో, వ్య‌వ‌సాయ ప‌నుల‌కో బ్యాంక్ రుణాలు తీసుకుంటారు. కానీ మ‌హారాష్ట్ర హింగోలీ కి చెందిన కైలాష్ ప‌తంగే మాత్రం ఏకంగా హెలికాప్ట‌ర్ కొన‌డానికి రుణం కావాల‌ని బ్యాంక్ వారిని సంప్ర‌దించాడు. 6.6 కోట్ల రుణం కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులు, ఈ సంగ‌తి విన్న‌వారూ కొంత‌సేపు ఆశ్చ‌ర్యం నుంచీ బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఒక్క‌రిద్ద‌రైతే గ‌ట్టిగా న‌వ్వారు, ఇంకొంద‌రు వీడికేమైనా పిచ్చిగాని ప‌ట్టిందేమో.. అనీ అనుకున్నారు. పిచ్చి ఆ రైతుకి ప‌ట్ట‌లేదు. ఆ తెలివైన ఆలోచ‌న చ‌దువుకున్న‌వారికి రాలేదు.  గింజ‌లు, ఎరువుల నాణ్య‌త లోటు, త‌గినంత విద్యుత్ సౌక‌ర్యం లేక‌పోవ‌డం, గిట్టుబాటు ధ‌ర‌కోసం అంద‌రితో గొడ‌వ‌లు, అవ‌మానాలు, వీటికీ తోడు అకాల వ‌ర్షాలూ రైతు జీవితాన్ని కుంగ‌దీస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రైతుల వ్య‌ధ ఇలానే వుంది. పంట‌మార్పిడి, ఆధునిక సేద్యా విధానాలు అనుస‌రించ‌డంలో మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారీల మోసాలు ఒక్క‌టేమిటి అంతా స‌మ‌స్య‌ల వ‌ల‌య‌మే. మ‌ధ్య‌లో బిక్కు బిక్కుమంటూ రైతు. ఇలాంటి బాధ‌లు అనుభ‌వించే ఒక రైతు ఎవ్వ‌రూ ఊహించ‌ని ఆలోచ‌న చేశాడు.  త‌న రెండెక‌రాల భూమిలో వ్య‌వ‌సాయం చేయ‌డం ఇక త‌న‌వ‌ల్ల కావ‌డం లేద‌ని తేల్చుకున్నాడు గోరెగోవ్ జిల్లా త‌క్తోడా గ్రామానికి చెందిన  ప‌తంగే. రెండేళ్లుగా సోయాబీన్స్ పంట వేస్తున్నాడు. కానీ దాని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. పైగా అకాల వ‌ర్షాలు  పెద్ద స‌మ‌స్య‌నే తెచ్చిపెట్టాయిట‌. ఒక రోజంతా ఆలోచించి అత‌ను బ్యాంక్‌కి వెళ్లి రుణం అడిగేడు. హెలికాప్ట‌ర్ కొన‌డానికి అని బ్యాంక్ వారి ప్ర‌శ్న‌ల‌కు  ఒకే స‌మాధానం ఇచ్చాడు. హెలికాప్ట‌ర్ ఏం చేస్తావన్నారు. అత‌గాడు త‌డుముకోకుండా దాన్ని అద్దెకి తిప్పుతాన‌న్నాడు. బ్యాంక్ మేనేజ‌ర్‌, ఉద్యోగులు నోరెళ్ల‌బెట్టారు.. ఆహా ఏమి ఆలోచ‌న చేశావ‌య్యా.. అన్నారంతా. ఆన‌క న‌వ్వు కున్నారంతా.  కానీ ప‌తంగెకి కోపం రాలేదు. చాలా ప్ర‌శాంతంగా.. అయ్యా, మీరు న‌వ్వుతున్నారుగానీ, మాబోటి వారికి పెద్ద పెద్ద క‌ల‌లు క‌నే అర్హ‌త లేదా?  ధ‌నికులేనా పెద్ద క‌ల‌లు క‌నేది?  అని వాళ్ల నోళ్లు మూయించాడు. పైగా వేరే ఏద‌న్నా వ్యాపారం చేసు కుందామంటే పెద్ద పోటీనే ఎదుర్కోవాలి గ‌నుక దీన్ని ఎంచుకున్నాన‌న్నాడు. రైతు తెలివి ముందు ఆఫీసర్లు డంగ్ అయ్యారు.

కోల్‌క‌తాలో బిగ్ బీ గుడి.. వీరాభిమానానికి మ‌చ్చుతున‌క‌

అభిమానం ఉండ‌వ‌చ్చు. వీరాభిమానంతోనే ఇబ్బంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు, సినీస్టార్స్‌కీ ఇటీవ‌లి కాలంలో వీరాభిమానులే ఎక్కువ‌య్యారు. వాళ్ల‌కోసం ఎంత‌టి క‌ష్ట‌మైన ప‌న‌యినా, చిత్ర‌మైన ప‌న‌యినా చేసేస్తారు. క‌టౌట్లు, శిలావిగ్ర‌హాలు పెడ‌తారు, పాలాభిషేకం చేస్తారు. ఆమ‌ధ్య ఎప్పుడో ఖుష్బూ అనే ద‌క్షిణాది న‌టికి ఏకంగా గుడిక‌ట్టార‌ట వీరాభిమానులు. అలానే కోల్‌క‌తాలో బిగ్ బి అమితాబ్‌కీ గుడిక‌ట్టారు. 2017లో స‌ర్కార్ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో కోల్‌క‌తా అమితాబ్ బ‌చ్చ‌న్ అభిమానుల సంఘం గుడి క‌ట్టేసారు. సుబ్రాతా బోస్ అనే శిల్పిచేత ఆర‌డగుల, రెండు అంగుళాల పొడ‌వైన విగ్ర‌హాన్ని త‌యారుచేయించారు.  బాలీఉడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే ద‌క్షిణాదిలోనూ మంచి క్రేజ్ వుంది. యాంగ్రీయంగ్‌మాన్ స్టార్ డ‌మ్‌తో దేశంలో యువత‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నా న‌టుడు అమితాబ్‌. డాన్‌, జంఝీర్‌, షోలే, మ‌ర్ద్‌, బాగ్‌బ‌న్‌, మొహ‌బ్బ‌తే వంటి విరుద్ధ‌మైన చిత్రాల్లో అమితాబ్ న‌ట‌న‌కు యావ‌త్ సినీ ప్రేక్ష‌కులూ ఫిదా అయ్యారు. ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక ఇంగ్లీషు సినీ సంస్థ అమితాబ్ ప్ర‌ధాన పాత్ర‌గా సినిమా తీయాల‌నుకున్నారు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్టు వెన‌క‌బ‌డింది. దాన్ని గురించి మ‌ళ్లీ ఏ స‌మాచార‌మూ లేదు.    వ‌య‌సు మీద ప‌డుతున్నా, ఇప్ప‌టికీ త‌గిన పాత్ర‌లు ఎంపిక చేసుకుని మ‌రీ అంద‌రి మ‌న‌సూ దోచుకుంట‌న్నాడు. ఆమ‌ధ్య ఆర్జీవీ చిత్రం స‌ర్కార్ లో, అలాగే పింక్ అనే చిత్రంలోనూ త‌న న‌ట‌నా ప‌టిమ‌ను మ‌రోసారి రుచి చూపారు బిగ్ బీ. కోల్‌క‌తా తిల్జాలా వెళితే అక్క‌డ ఈ గుడిని చూడ‌వ‌చ్చు. అమితాబ్ విగ్ర‌హం ఆర‌డుగుల రెండు అంగుళాలు వుంటుంది. ఇది పూర్తిగా ఫైబ‌ర్‌గ్లాస్‌తో త‌యారుచేసింది. అంతా బాగానే వుంది మ‌రి ఈ గుడిలో పూజ చేస్తారా, భ‌జ‌న‌లు పాడ‌తారా అన్న‌ది చిన్న సందేహం. బిగ్ బి పుట్టిన‌రోజు కాస్తంత హ‌డావుడి చేయ‌వ‌చ్చునేమో. ఒక‌వేళ భ‌జ‌న చేయాల్సి వ‌స్తే.. రంగ్ బ‌ర్‌సే యాన‌మ‌హ‌, తేరీ బిందియారేన‌మ‌హా, మై ప‌ల్‌దో ప‌ల్ కా షాయ‌రూన‌మ‌హొ, ఓ సాథిరేన‌మ‌హ‌.. అంటూ పాట‌ల‌తో క‌లిపి అర్చ‌న చేస్తారేమో!  

ముర్ము తెలంగాణ పర్యటన రద్దు కారణమేంటి?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన అర్ధంతరంగా రద్దైంది. రద్దుకు కారణం వర్షాలు అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అదే రోజు ఆమె ఏపీలో పర్యటించారు. అధికార, విపక్ష నేతలను కలిశారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విపక్ష నేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీకి ఏపీ బీజేపీ నాయకులు సైతం హాజరయ్యారు. ఈ భేటీ ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలపై ఊహాగానాలకు సైతం తెరలేపింది. ఈ భేటీ అధికార వైసీపీని కంగుతినింపించింది. అదలా ఉంచితే.. ఏపీ  కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితే ఉంది. అయినా ముర్ము ఏపీలో పర్యటించారు. అదే సమయంలో అదే రోజు జరగాల్సిన తెలంగాణ పర్యటనను మాత్రం రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి ముర్ముకు వాయు మార్గంలో గంట సమయం కూడా పట్టదు. అంతే కాకుండా గన్నవరం విమానాశ్రం నుంచి ఢిల్లీకి వెళ్లడం కంటే హైదరాబా నుంచి హస్తిన యానం సులువు. అయినా కూడా ఆమె తెలంగాణకు రాలేదు. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు.  అందుకు కారణమేమై ఉంటుందన్న దానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో ఆమె పర్యటనకు ముందే.. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు ముర్ముకు తమ మద్దతు ప్రకటించేశాయి. అయినా ఆమె ఏపీలో షెడ్యూల్ ప్రకారం పర్యటించారు. అధికార, విపక్ష నేతలతో బేటీ అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతు ఎలాగూ ముర్ముకే. ఇక అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికే తన మద్దతు అని ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించారు. నగరంలో ఆయన రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్బాటం చేశారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ మద్దతు ఎలాగూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థికేనన్న సంగతి విదితమే. అలాగే ఎంఐఎం పరిస్థితి కూడా. ఇక పోతే ముర్ము తెలంగాణ పర్యటనలో కలవగలిగేది, మద్దతు కోరగలిగేది ఒక్క బీజేపీని మాత్రమే.  ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ పర్యటనకు వచ్చినా తనను ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు తప్ప మరే పార్టీ నుంచీ మద్దతుదొరకదు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగా పర్యటనను రద్దు చేసుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే తెలంగాణలో మద్దతు కూడగట్టడం సాధ్యం కాదని తేలిపోవడంతోనే ఆమె రాష్ట్ర పర్యటను రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం నుంచి బీజేపీకి  ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ఓట్లు బహుస్వల్పం. సో రాష్ట్ర బీజేపీ సభ్యులను ఇక్కడ కలిసి మద్దతు కోరడం కంటే హస్తినకు రప్పించుకుని మాట్లాడడమే బెటర్ అని భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.

జ‌గ‌న‌న్న శ‌భాష్ ల   కోసం మ‌హిళా మంత్రుల పోటా పోటీ!

దేశ రాజ‌కీయాల్లోకి మ‌హిళ‌లు మ‌రింత ఉత్సాహంగా వ‌స్తుండ‌డంతో చాలా కాలం నుంచీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మ‌ధ్య ప‌ని పోటీ బాగానే సాగుతోంది. ప్ర‌తీ ఒక్క‌రికీ త‌మ నాయ‌కుని, సీఎం చేత శ‌భాష్ అనిపించుకోవాల‌న్న ఆతృత వుంది. కాబోతే కొంద‌రు నిదానం ప్ర‌ధానం, మ‌రి కొంద‌రు ర్యాకెట్ వేగం, ఇంకొంద‌రు ప‌రిస్థితుల‌ను అనుస‌రించి న‌డ‌చుకోవ‌డం చూస్తున్నాం. మంత్రిమండ‌లిలో ఒక్క‌రి ద్ద‌రు మంత్రులు త‌ప్ప మ‌గ‌వారిలో చాలామంది ప‌నితీరుప‌ట్ల ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చిందులు తొక్కుతున్నారు. కానీ ఆ సంగ‌తి బ‌య‌టికి తెలియ‌నీయ‌డం లేదు. అది గ్ర‌హించుకున్న‌వారు కాస్తంత జాగ్ర‌త్త‌ప‌డే ప‌నిలో వున్నారు. ఈ ద‌శ‌లో జ‌గ‌న్ క్యాబినెట్‌లోని మ‌హిళా మంత్రులు ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ జ‌గ‌న‌న్నతో శ‌భాష్ అనిపించుకోవాల‌ని రెండింత‌లు ఉత్సాహంప్ర‌ద‌ర్శిస్తున్నారు.  వైయస్ జగన్ మలి కేబినెట్‌లో నలుగురంటే నలుగురు మహిలు ఉన్నారు.  వారిలో  మంత్రులుగా ఆర్కే రోజా, విడదల రజినీలు మాత్రం కుందేళ్లులాగా దూసుకుపోతున్నారనే   టాక్  అయితే  వెలగపూడి సచి వాలయం సాక్షిగా హాట్ హాట్‌గా నడుస్తోందట. ఇక మిగిలిన ఇద్దరు  తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు మాత్రం  తాబేళ్ల‌తో పోటీ పడిపోతున్నారట.  అయితే  వీరిలో తానేటి వనిత  జగన్ తొలి కేబినెట్‌లోనే  కాదు. మలి కేబినెట్‌లో సైతం చోటు దక్కించుకొని అదీ కూడా  సీఎం తర్వాత పోస్ట్ అంటే హోం మంత్రి గా పెద్ద‌ ఛాన్స్ కొట్టేసిందని ఫ్యాన్ పార్టీలోని మహామహులు సైతం ఆవిడ  ఆదృష్టం చూసి ఈర్ష్య చెందుతో న్నారనే టాక్ .  కానీ ఆమె తన శాఖపై ఇప్పటికీ పట్టు సాధించలేదనే చర్చ సచివాలయంలో సాగుతోంద ట. ఇక మరో మంత్రి ఉషా శ్రీచరణ్ పరిస్థితి  కూడా దాదాపుగా  అదే తీరులా  ఉందట. మరోవైపు వీరి మంత్రివర్గ సహచరులు విడదల రజినీ, ఆర్కే రోజాలు నువ్వా, నేనా అనే టైప్‌లో మంత్రు లుగా స‌త్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో తరచు వీరిద్దరు సమీక్ష సమా వేశాలు సైతం నిర్వహిస్తున్నారట. అయితే ఎక్కడ ఎలాంటి  సమస్య వచ్చినా  వీరిద్దరు వెంటనే  స్పంది స్తున్నారని,  అలాగే పార్టీ  తరఫున సైతం తమదైన  శైలిలో వాయిస్ వినిపించేస్తున్నారనే  చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో వున్న‌ట్టు వార్త‌.  ఇక  ప్రతిపక్ష పార్టీల నేతల కామెంట్స్‌పై వీరిద్దరు  నాని బ్రదర్స్ అంతగా కాకుండా  ఆచితూచి మాట్లా డుతూ కౌంటర్లు ఇస్తున్నారని  అయితే  ఈ  విషయంలో  మంత్రి రజినీని  ఆర్కే రోజా  ఓవర్ టేక్  చేసే సిందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం  వారే గుర్తు చేస్తున్నారట. వీళ్లీద్దరు ఇంత క్రమశిక్షణ కలిగిన వారిలాగా ఇంత పొందికగా, మంత్రులుగా తమ పని  తాము చేసుకోంటూ,  పోటా పోటీగా దూసుకు పోవడం చూసి వెలగపూడి సచివాలయంలోని సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అయితే  వీరి ఇంతలా క్రమశిక్షణగా మెలగడం వెనుక పెద్ద కథే ఉందనే  ఓ చర్చ అయితే సదరు  సచి వులు కొలువు  దీరిన సచివాలయంలో నడుస్తోందట. తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల  రజినీలు ముగ్గు రు గతంలో టీడీపీలో సైకిల్ సవారీ చేసిన వారే. అయితే ఆర్కే రోజా 2014, 2019 లో జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది.  2019 ఎన్నికల్లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవిని సీఎం జగన్  కట్టబెట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ  జగన్  మలి కేబినెట్‌లో ఆమె పర్యాటక శాఖతోపాటు పలు కీలక శాఖల మంత్రిగా ఛాన్స్ కొట్టేసి దూసుకుపోతున్నారు.    అయితే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మ‌రీ ముఖ్యంగా ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఆమెకు అసమ్మతి సెగ  అలా ఇలా కాదు  గట్టిగానే ఉంది. అందుకు ఆమె రెండో సారి ఎమ్మెల్యే అయి మంత్రిగా పదవి చేపట్టే వరకు అంటే దాదాపు మూడేళ్ల పాటు.. ఆమె నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామా లు అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆమె నియోజకవర్గంలోని దాదాపు 80 శాతం మంది లీడర్ నుంచి కేడర్ వరకు అంతా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చేతిలోకి వెళ్లి చిక్కుకుపోయింది. ఆ క్రమంలో నగరి నియోజకవర్గంలో అసమ్మతి సెగను ఆర్కే రోజా ఒకానొక సమయంలో తట్టుకోలేక తాడే పల్లి ప్యాలెస్ తలుపు సైతం తట్టిందని.. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని ప్యాలెస్‌లోని పెద్దలంతా కూల్ చేశా రని సమాచారం. అనంతరం ఆర్కే రోజాకి మంత్రిగిరి వచ్చి ఆమె ఓళ్లోకి వాలిందని.. అందుకే  ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  నేరుగా  తన రాజకీయ ప్రత్యర్థి మరో మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు నమస్కారం చేసిందనే ఓ టాక్ అయితే నగరి నియోజకవర్గంలో నేటికి ఉంది. అయితే వచ్చే ఎన్ని కల్లో మళ్లీ గెలుపు అంత సులువు కాదని.. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుం టూ ముందుకు సాగితేనే.. ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందుతామనే  ఆలోచనలో  రోజా ఉన్నట్లు ఆమె వర్గం పేర్కొంటోందట.      ఇక మరో మంత్రి విడదల రజినీ. ఈమెగారి  బుర్ర పాదరసం టైప్ అని ఇప్పటికే సచివాలయంలో గుస గుసలు మొదలైనాయట. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దూసు కుపోవాలి అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకుని మరీ దూసుకుపోతోందట. దీంతో మంత్రి రజినీ అంత ర్యం ఆమె వెంట ఉండే  సిబ్బందికే సైతం అంతగా అంతుబట్టదనే  ఓ టాక్ అయితే  సచివాలయంలో  నడుస్తోంది. ఇక  వైద్య ఆరోగ్య శాఖ అంటేనే అత్యంత కీలక శాఖ.. అలాంటిది 32 ఏళ్లకే  ర‌జ‌ని మంత్రిగిరి  కొట్టేసిందనే ఓ భావన ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో తలపండిన నేతల్లోనే కాదు.. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతల్లో సైతం గట్టిగానే ఉందట. ఈ విషయాన్ని పసిగట్టిన ఈ మాజీ సాప్ట్‌వేర్  ఇంజినీర్  ప్లస్ ప్రస్తుత మంత్రిగారు.. తనదైన  శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉం టూనే తన పార్టీలోని అదీ తన సొంత నియోజకవర్గంలోని  అసమ్మతి నేతలను  తన వర్గంలోకి  తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో, ఎలా  చేయాలో అంత సైలెంట్‌గా చేస్తుందని సమాచారం. తన నియోజవకర్గంలోని ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నా, ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నా తాను మాత్రం మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఓ రీతిలో ఆమె చాలా పకడ్బందీగా పావులు కదుపు తోన్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఫ్యాన్ పార్టీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నా,  వారిలో ఇద్దరు సైలెంట్‌గా ఉంటే.. మరోద్దరు మాత్రం తమ పనితనంలో మ‌రీ దూకుడుగా దూసుకుపోతున్నారనే మాట సచివాలయం సాక్షిగా విన‌ప‌డుతోంది. ఇక్క‌డ మొత్తంమీద గ‌మ‌నించాల్సిందేమంటే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్ట‌డానికి, జ‌గ‌న్ ప‌రువు ను కాపాడేందుకు పాటుప‌డుతున్న ఇద్ద‌రు మ‌హిళా ర‌త్నాలు..ర‌జ‌నీ, రోజాలు ఇద్ద‌రూ తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి దూకిన‌వారే  కావ‌డం గ‌మ‌నార్హం

బుల్లెట్ బాబా..!

దేశంలో భ‌క్తి పార‌వ‌శ్యానికి త‌క్కువేమీలేదు. ప్ర‌తీదీ మ‌తం, భ‌క్తితో ముడిపెట్టేయ‌డం అనాదిగా దేశంలో వ‌స్తున్న‌దే. పిల్లాడికి బాగోలేక‌పోయినా, పిల్ల‌దానికి పెళ్లికాబోయినా, కాలేజీ సీటు, విదేశాల‌కు వీసా రాక పోయినా కూడా దేవుడిమీదే భారం వేయ‌డం బాగా అల‌వాట‌యిపోయింది. అందుకే దేశంలో బాబాల హ‌డావుడి ఎక్కువైపోయింది. అయితే ఈ బుల్లెట్ బాబా సంగ‌తి వేరు. దేశంలోని అనేక దేవాల‌యాల్లో ఈ బులెట్ బాబా గుడి ఒక‌టి. ఇది రాజ‌స్థాన్ జోధ్‌పూర్‌లో వుంది. దీని చుట్టూ కూడా భ‌క్త‌గ‌ణం తెగ తిరుగు తూంటారు.  ఇంత‌కీ బులెట్ బాబా గుడి అన‌గానే అక్క‌డ ఏ సాయిబాబా విగ్ర‌హ‌మో వుంటుంద‌నుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే ఇక్క‌డ అలాంటిదేమీ లేదు. చిత్రంగా ఒక 350 సిసి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ వుంది.  దీన్ని పూజించ‌డానికి జోధ్‌పూర్ జ‌నాలే కాదు చాలా దూర ప్రాంతాల నుంచీ కూడా భ‌క్తులు క్యూ క‌డుతున్నారు.  ఈ జోధ్‌పూర్ గుడిని చాలాకాలం నుంచి ఇక్క‌డివారంతా బులెట్ బాబా గుడి అనే పిలుస్తున్నారు. కానీ దీని అస‌లు పేరు ఓం బ‌న్నా ధామ్‌. ఇంత చ‌క్క‌టి పేరుండ‌గా బులెట్ పేరు ఎందుకు పెట్టార‌ని చాలామంది చాలారోజులు తెగ ఆలోచించారు. దీనికి ఒక ఆస‌క్తిక‌ర క‌థ వుంది.  ఈ గుడి  జోధ్‌పూర్ నుంచి  50 కి.మీ దూరంలోని పాలి ప‌ట్ట‌ణం స‌మీపంలోని చోటిలా గ్రామంలో వున్న‌ది. 1988 డిసెంబ‌ర్ 2న ఓమ్ బన్నా అనే పెద్దాయ‌న సందీరా స‌మీపంలోని బాంగ్దీ  నుంచి  ఈ గ్రామానికి బ‌య‌లుదేరారు. ప్ర‌యాణంలో ఆయ‌న అదుపు త‌ప్పి ఒక చెట్టుకి గుద్దుకోవ‌డంతో ఆయ‌న అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించారు. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బండి కొంత దూరంలో గుండ‌లో  ప‌డింది.  మ‌ర్నాడు ఉద‌యం పోలీసులు ఆ మోటార్‌సైకిల్‌ను ద‌గ్గ‌రున్న పోలీసు స్టేష‌న్‌కు తీసికెళ్లారు. చిత్రంగా మ‌ర్నాడు ఆ బండి స్టేష‌న్‌లోంచి మాయ‌మైంది. పోలీసు స్టేష‌న్ నుంచి ఎవ‌రు దొంగిలించార‌బ్బా అనుకు న్నారు పోలీసులు. తీరా చూస్తే స‌రిగ్గా ఆ ప్ర‌మాదం జ‌రిగిన చోట‌నే మ‌ళ్లీ దొరికింది! పోలీసుల‌కు, అక్క‌డి జ‌నానికి ఆశ్చ‌ర్య‌మేసింది. ఇదెలా సాధ్య‌మ‌ని ఒక‌రికొక‌రు ప్ర‌శ్నించుకున్నారు. పోలీసులు మ‌ళ్లీ దాన్ని స్టేష‌న్‌కు తీసికెళ్లారు. అయితే ఈ సారి గొలుసుల‌తో క‌ట్టేసారు. చిత్ర‌మేమంటే మ‌ర్నాడు ఉద‌యంచూస్తే మ‌ళ్లీ బండి గాయ‌బ్‌! ఇలా మాయం కావ‌డంతో ఆ బండికి బులెట్ బాబా అని పేరు వ‌చ్చింది. అమాంతం దానికేదో మంత్ర‌శ‌క్తి వుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మేశారు. అంతే అనుకున్న‌దే త‌డ‌వున అక్క‌డ గుడి నిర్మించారు. అదే బులెట్ బాబా గుడిగా ప్ర‌సిద్ధి చెందింది.  రాజ‌స్థాన్ జోధ్‌పూర్ వెళితే ద‌ర్శించండి.

అరే.. ఇది అచ్చం రిచ‌ర్డ్‌లా వుందే..!

మ‌నిషిని పోలిన మ‌నిషి వుంటాడు.. ఒకేలా వుండేవారు లోకంలో ఏడుగురు వుంటార‌ట‌. వారిలో క‌నీసం ఒక‌రిద్ద‌రూ ఏ క్ష‌ణానైనా ఎక్క‌డైనా ఎదురుప‌డ‌వ‌చ్చు. మ‌నిషి పోలిక‌తో వుండే జంతువులూ వుంటాయంటే న‌మ్ముతారా? ఇప్పుడు ఎంతో జుత్తు వున్న పెద్ద కుక్క అంద‌రి దృష్టీ ఆక‌ట్టుకుంటోంది. ఎందుకంటే అది అచ్చం ప్ర‌ముఖ కోటీశ్వ‌రుడు రిచ‌ర్డ్ బ్రాన్స‌న్‌ని త‌ల‌పిస్తోందిట‌!  దాన్ని చూడ్డానికి వ‌స్తున్న‌వారు చాలామంది దాన్ని చెవులు, మూతిని ప‌ట్టుకుని లాగి మ‌రీ చూస్తున్నార‌ట‌. రిచ‌ర్డ్ కి ఈ సంగ‌తి తెలుసా అని అనుకుంటున్నారు స‌ర‌దాగా!  రిచ‌ర్డ్ విర్జిన్ గ్రూప్ సిఇఓ. ఆయ‌న అనేక రంగాల‌కు చెందిన 400 కంపెనీల‌ను నిర్వ‌హిస్తున్నారు.  రిచ‌ర్డ్ ఫోటోతోపాటు ఈ కుక్క ఫోటోను క‌లిపి చూస్తున్న జ‌నం చాలామంది అచ్చం  ఆయ‌న‌లానే వుండ వ‌చ్చు కానీ ఆయ‌న మ‌హా తెలివిగ‌ల‌వాడు, చ‌క్క‌టి మ‌నిషి. ఆయ‌న్ను దీంతో పోల్చ‌డం అన్యాయం అనీ నెట్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఏమైన‌ప్ప‌టికీ ఇలాంటి విచిత్రాలు స‌ర‌దాగానే తీసుకోవాలి. అంతే త‌ప్ప తాను ఎంతో అభిమానించే వ్య‌క్తిని అవ‌మానిస్తున్నార‌ని గొడ‌వ‌కి దిగ‌కూడ‌దు. మ‌రి రిచ‌ర్డ్ అభిమా నులు ఈ ఫోటో చూసి ప్ర‌శాంతంగా ఎలా న‌వ్వుకుంటారు?

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సర్వం సిద్ధం

రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్  బాక్స్ లు, బ్యాలెట్  పేపర్లు, ఓటు వేసేందుకు ఉప యోగించే ప్రత్యేక పెన్నుల పంపిణీ మొదలుపెట్టింది. అయితే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకం కాను న్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలిసారి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతారు. బిజెపి నాయ‌క‌త్వంలోని కూట‌మి ముర్మును రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా ఎన్నుకోవ డంలోనే విప‌క్షాలపై విజ‌యానికి గ‌ట్టి పునాది వేసింది. ఆమె వెనుక‌బ‌డిన గిరిజ‌న జాతికి  చెందిన మ‌హిళ కావ‌డం, గ‌తంలో జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా పనిచేసిన రాజ‌కీయ‌వేత్త‌గా  ఈ ప‌ద‌వికి అర్హురాలుగా బిజెపి కూట‌మి అభిప్రాయ‌ప‌డింది. కాగా విప‌క్షాలు త‌మ అభ్య‌ర్ధిగా దేశ‌, అంత‌ర్జాతీయ రాజ‌కీయానుభ‌వం మెండు గా వున్న య‌శ్వంత్ సిన్హాను పోటీకి నిల‌బెట్టారు. ప్ర‌స్తుతం వేగంగా మారుతున్న దేశ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ముర్ము కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌న్న అభిప్రాయాలే విన‌ప‌డుతున్నాయి. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు  పోలింగ్  జులై  18న ( సోమవారం) జ‌రుగుతుంది.  కౌంటింగ్  జులై 21న ( గురువారం) జ‌రుగుతుంది. అదే రోజు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.  నామినేషన్ల విష‌యానికివ‌స్తే.. రాష్ట్ర ప‌తి ఎన్నిక‌కు మొత్తం 115 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. కాగా వాటిలో ప‌రిశీల‌న త‌ర్వాత రెండు మాత్ర‌మే అర్హమైనవిగా నిలిచాయి. పోటీలో   ఎన్‌డిఏ త‌ర‌ఫున ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల త‌ర‌ఫున య‌శ్వంత్ సిన్హా ఇద్దరే ఉన్నారు.   ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.   ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు  ఎన్నికైన సభ్యు లు ఉంటారు. అలానే ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు   ఉంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో నామినేటెడ్ సభ్యులు  ఉండరు. రాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన ఓట్ల విలువ అంటే మోజారిటీ మార్క్  5,43,216.  కాగా  ఎన్‌డీఏ  కూటమి అభ్యర్థి ముర్మకు మద్దతు నిస్తున్న పార్టీలకు ఉన్న ఓట్ల విలువ     6,63,634, విపక్షాలు  యశ్వంత్ సిన్హా కి  3,92,551 మాత్రమే. 

ఆరా సర్వే అర్థ సత్యం.. ముక్కోణం ఖాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వస్తాయో తెలియదు? అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు. అన్నిటినీ మించి అప్పటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అసలే తెలియదు. సో... ఇప్పటి కప్పుడు ఎన్నికలు జరిగితే, అంటూ మొదలయ్యే... ఎన్నికల సర్వేలు ఆ కాసేపు ఆనందానికి, కాదంటే, రాజకీయ  మేథోమధన చర్చలకు పనికోస్తాయే తప్ప, ఎప్పుడో జరిగే ఎన్నికల ఫలితాలను ఇప్పుడే పక్కా చేసేందుకు అంతగా ఉపకరించక పోవచ్చును.   అయితే, అంతమాత్రం చేత, సర్వ్ లన్నీ శుద్ధ దండగ అనికాదు.  సర్వేల ప్రయోజనం సర్వేలకు వుంది. ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని, వ్యూహాలను అల్లుకుంటాయి. ఆ విధంగా సర్వేల వలన ఎదో ప్రయోజనమా ఉంది కాబట్టే, ఎన్నికల వ్యూహాలను అమ్ముకునే రాజకీయ బేహారి ప్రశాంత్ కిశోర్ మొదలు అదే బాటలో అడుగులు వేస్తున్న ఆరా మస్తాన్ వరకు ఎవరికి వారు వారు ప్రతి రెండు మూడు నెలకోసారి వండి వారుస్తున్న సర్వేలు చర్చనీయాంశం అవుతున్నాయి. అదుకే, రాజకీయ గీతచార్యులు. సర్వేలన్నీ సత్యం కాదు, అసత్యములును కాదు.. ఆంటారు. నిజం,సర్వే ఫలితాలు సత్యాలు కాకపోయినా, అసత్యాలు కూడా కాదు. ఒక , పాత రైల్వే గైడ్ లాగ .. ఒక  సూచికగా మాత్రం పనిచేస్తాయి.    అలా చూసినప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్’గా డిస్కస్ అవుతున్న ఆరా మస్తాన్ (ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్) సర్వే, నివేదిక, అక్షర సత్యం కాదు, కానీ, భవిష్యత్ రాజకీయ విశ్లేషణకు ఒక సూచికగా అయితే, కొంత వరకు ఉపకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.   ఆరా సర్వే చెప్పిన, ఓట్ల శాతం లెక్కలను పక్కన పెడితే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందనేది, అందరికీ తెలిసిన విషయమే.కాదనడం కుదరదు. నిజానికి, 2019 ఎన్నికల్లోనే రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అందుకే, సారు ... కారు .. పదహారు  బోల్తా కొట్టింది. కారు 16లో నాలుగు బీజేపీ, మూడు కాంగ్రెస్ పట్టుకు పోయాయి. మిగిలిన తొమ్మిది మాత్రమే తెరాసకు మిగిలాయి. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికార తెరాస సిట్టింగ్ స్థానాలను గెలుచుకుంది. అదే విధంగా జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ బీజేపే నాలుగు నుంచి 48 స్థానాలకు చేరింది. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, హుజురాబాద్ తోపాటుగా, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఓడి పోయింది. అందులో, హుజూర్ నగర్ అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన  కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే, నాగర్జున సాగర్ లోనూ ఏడెనిమిది సార్లు, అదే స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి,  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఓడిపోయారు. దుబ్బాక, హుజురాబాద్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు. హుజురాబాద్’లో అయితే కాంగ్రస్ అభ్యర్ధికి కేవలం మూడు వేల పైచిలుకు ఒతులు మాత్రం పోలయ్యాయి. సర్వే లెక్కలు పక్కన పెట్టి, వాస్తవ ఫలితాల అధారంగా విశ్లేషణ చేసినా, గతంలో పోల్చితే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నది నిజం.ఇంకా బలపడే ప్రయత్నం మరింత బలంగా  చేస్తోంది. అది కూడా నిజం. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడమే కాకుండా,  కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాల  పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు, ఒక్కొకరు ఒక్కొక నియోజక వర్గంలో మొత్తం 119 నియోజక వర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించి, పార్టీ క్యాడర్ తో కలిసి పనిచేయడం మాములు విషయం కాదు. తెలంగాణపై పార్టీ దృష్టి పెట్టింది అనేందుకు ఇదొక  నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పరుగు లు తీస్తోంది. పార్టీ క్యాడర్లోనూ  జోష్ పెరిగిందన్నది నిజం. అదీ గాక ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాస్ రూట్ లెవల్ నుంచి పై స్థాయి వరకు పటిష్ట యంత్రాంగం వుంది. సో.. ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ  తెరాసకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక తెరాస విషయం అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సెంటిమెంట్ చాల వరకు చల్లారింది. గతంలో లాగా బలంగా పని చేసే పరిస్థితి అయితే లేదు. అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం అయితే నేమీ, మఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ ఎత్తుగడలు ఇతరత్రా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్నీ కలిపినా, తెరాసకు ఉండే అడ్వాన్ టేజీ ఉండనే ఉంటుంది. వుంది కూడా. తెరాస పనైపోయిదని అనుకోవడం, అనుకునేందుకు బాగుటుంది కానీ, అది పూర్తిగా వాస్తవం కాదు. సో.. ఆరా సర్వే  ఎందుకు చేసినా, ఎవరి కోసం  చేసినా, వండి వార్చిన వంటకమే అయిన, కొంచెం రుచిగానే  ఉందని అంటున్నారు. కొంచం కాస్త అటూ ఇటుగా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలానే ఉందని, విశ్లేషకులు సైతం అంటున్నారు.

శాంతి దూత‌కు అవ‌మానం.. కెన‌డాలో గాంధీ విగ్ర‌హ ధ్వంసం

పుట్టిన‌వూరు, దేశం దాటి అంత‌ర్జాతీయ ఖ్యాతిగాంచిన‌వారిని ముఖ్యంగా శాంతిప‌థానికి ప్ర‌తినిధిగా వున్న మ‌హోన్న‌తుల‌ను అన్ని ప్ర‌భుత్వాలూ ఆద‌రిస్తాయి. దేశంలో ఏదో ఒక ప్ర‌ధాన న‌గ‌రంలో విగ్ర‌హం ఏర్పా టు చేసి ఆ మ‌హావ్య‌క్తి ప‌ట్ల త‌మ ప్ర‌త్యేక అభిమానాన్ని ప్ర‌క‌టించుకుంటారు. ఇలా  ప్ర‌పంచ దేశాల్లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన మ‌హోన్న‌తుడు గాంధీజీ. ఆసియా, ఆఫ్రికా, యూర‌ప్ దేశాల్లో ఆయ‌న ప‌ట్ల  ఎంతో అభిమానం వుంది. భార‌త స్వాతంత్య్రోద్య‌మ నాయ‌కునిగా ప్ర‌పంచ‌దేశాలను ఆక‌ట్టుకున్న గొప్ప నాయ‌కుడు మ‌హాత్మా గాంధీజీ. కాలంతో పాటు ప్ర‌పంచ రాజ‌కీయ‌వాతావ‌ర‌ణం కూడా ఎంతో మారిపోయిం ది. ఏ దేశంలోనూ శాంతికాముకుల‌కు ఆద‌ర‌ణ అంత‌గా లభించ‌ని దుస్థితి ఏర్ప‌డింది.  అందుకు తాజా ఉదాహ‌ర‌ణే కెన‌డాలో గాంధీ విగ్ర‌హాన్ని విద్రోహులు కూల్చివేయ‌డం.  కెనడా లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు కుల్చేసారని భారత రాయభార కార్యాలయం తెలి పింది. కెనడా లో వున్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కుల్చేయడాన్ని భారత ప్ర‌భుత్వం  ఖండించింది. కెనడాలో ఉన్న భారతీయులని భ‌యపెట్టడానికి చేసిన చర్య గా అనుమానిస్తున్నారు. కెనడాలోని ఒంటా రియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతం లో ఉన్న గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు అక్కడ పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణ కోసం భారత ప్రభుత్వం బుధ వారం నాడు కెనడా గవర్నమేంట్ ని కోరింది. ఒంటారియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతంలో ని  గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ విద్వంసకరచర్యని  అక్క‌డి భారతీయ సమాజం తీవ్రం గా ఖండించింది.భారతీయుల మనో భావాలూ దెబ్బతినేలా ఉందని,దీనిపై చర్యకి  అక్కడ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేసారు. భారతీయ ప్రజలని భయ భ్రాంతులకి  గురిచేయడానికి చేసిన విద్వేషపురిత చర్య అని  ఒట్టావా లోని హైకమిషన్ తెలిపింది. నేరస్తులని వెంట‌నే  న్యాయస్థానం ముందు ఉంచాలని భారతప్రభుత్వం  కోరి న‌ట్టు  ఒక ప్రకటనలో తెలిపారు.భారత రాయభార కార్యాలయం కుడాదీన్ని తీవ్రం గా ఖండించింది, నిందితులపై కఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  ఖలిస్తాన్ యార్క్ రింజాల్ పోలీసు ప్రతినిధి అమీ బౌడ్రూ గాంధీ విగ్రహాన్నిఎవరో గ్రాఫిక్ పదాలతో వక్రీ కరించారని రాశారు. విగ్రహంపై ఖలిస్తాన్, అబ్శబ్ద్ అని రాసి ఉన్నాయన్నారు. యార్క్ పోలీసులు ఎలాంటి నేరాలను సహించరని, జాతి, జాతీయ లేదా జాతి మూలాల ఆధారంగా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బౌడ్రూ చెప్పారు. ఈ విగ్రహం ముప్పై సంవత్సరాలకు పైగా రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు దేవాలయ ప్రాంతంలో మహాత్మా  విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు.  ఇక్కడ పెద్ద సంఖ్య లో భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రిడ్జ్‌మండ్‌లో చాలా ఏళ్లుగా మేం ప్రశాంతంగా జీవిస్తున్నామని, అయితే అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని భారతీయ సంతతి ప్రజలు చెబుతున్నారు.

కేరళలో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ వైరస్?

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘మంకీపాక్స్’ ఇప్పుడు భారత్ కూ పాకింది. . ఒక పక్కన కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తుండగానే మంకీపాక్స్ విజృంభిస్తోంది.  ఇప్పటి వరకూ  59 దేశాల్లో 8 వేల 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ తో ముగ్గురు మరణించారు. ఇంతవరకు భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదన్న ఊరటకు చెక్ పడింది. దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్  గురువారం వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, అతని నుంచి సేకరించిన నమూనాలను వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు వీణా జార్జ్ తెలిపారు. పుణె ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే మంకీపాక్స్  ధ్రువీకరించగలమని మంత్రి  పేర్కొన్నారు. వ్యాధి బాధితుడిగా భావిస్తున్న వ్యక్తి యుఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని వీణా జార్జ్ వెల్లడించారు. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం వైద్య నిపుణుల అబ్జర్వేషన్ లో ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయితే.. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు ఇదే అవుతుంది. ఇంతకు ముందు ఉత్తర ప్రదేశ్ లోని ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు వచ్చాయి. ఆ చిన్నారి నమూనాలను పరీక్షించినప్పుడు ఆమెకు మంకీపాక్స్ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెకు మంకీపాక్స్ లేదని నిర్ధారించారు. తాజాగా లక్షణాలు కనిపించిన కేరళ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయితే.. ఇదే దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా రికార్డులకు ఎక్కుతుంది. నిజానికి ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇంత వరకు నమోదైన మంకీపాక్స్ కేసుల్లో 80 శాతం ఐరోపా దేశాల్లోనే కనిపించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జులై 11 నాటికి అమెరికాలో సుమారు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 1958లో పరిశోధన కోసం తీసుకొచ్చిన కోతుల్లో ఈ వైరస్ బయటపడింది. దీంతో ఈ వైరస్ ను మంకీపాక్స్ అని పిలుస్తున్నారు. మంకీపాక్స్ రావడానికి కొద్ది రోజుల ముందు సాధారణంగా జ్వరంతో కూడి ఫ్లూ, తలనొప్పి వస్తాయని, కొద్ది రోజుల తర్వాత ముఖం మీద దద్దుర్లతో మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత  చేతులతో పాటు శరీరానికి ఈ దద్దుర్లు వ్యాపిస్తాయని వైరాలజీ  నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ ఇన్ క్యుబేషన్ సమయం 5 నుంచి 21 రోజులు ఉంటుందని వారు వెల్లడించారు.  

బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో  రిషి ముందంజ‌

భార‌త సంత‌తికి చెందిన వారు విదేశాల్లో రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం ఈమ‌ధ్య వింటున్నాం. అమెరికా లో, బ్రిట‌న్‌లోనూ భార‌త సంత‌తికి చెందిన‌వారినే వారి మంత్రిమండ‌లిలో కీల‌క ప‌ద‌వుల్లోకి తీసుకోవ‌డం భార‌త్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం.  ఇపుడు తాజాగా  రిషి సునాక్ ఏకంగా బ్రిట‌న్ ప్ర‌ధాని పీఠాన్ని ఎక్క‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.  బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ స్థానాన్ని భర్తీ  చేసేదెవరనేది తేల్చేం దుకు ఎన్నికలు  మొదలయ్యాయి.  జాన్స‌న్ ప్ర‌ధానిగా వున్న‌పుడు ప్రీతీ ప‌టేల్‌ను హోం సెక్ర‌ట‌రీగా, అలోక్ శ‌ర్మ‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల ప్మెంట్ సెక్ర‌ట‌రీగా, రిషి సునాక్‌ను ట్ర‌జ‌రీ ఛీఫ్ సెక్ర‌ట‌రీగా  బ్రిట‌న్ రాణి నియమించారు. అప్ప‌ట్లో ఆయ‌న కొత్త ఛాన్స‌ల‌ర్ సాజిద్ జావిద్ వ‌ద్ద ప‌నిచేశారు.  అనంత‌రం జ‌రి గిన రాజ‌కీయ ప‌రిణామాల్లో జాన్స‌న్ త‌న ప‌ద‌వి కోల్పోయారు. ఇపుడు ప్ర‌ధాని రేసులో వున్న ప్ర‌ముఖ నాయకుల‌లో  రిషి  ఒక‌రు. ప‌టేల్ యుకే సెక్యూరిటీ, ఇమిగ్రేష‌న్,  వీసా పాల‌సీల ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. కాగా 39 ఏళ్ల క‌న్స‌ర్వేటివ్ పార్టీ ఎంపి రిషి ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ‌మూర్తి కుమార్తె అక్ష‌త‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఎంబిఏ చ‌దివారు, పెట్టుబ‌డుల అంశంలో నిపుణురాలుగా సుప‌రిచితురాలు.  భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు.  తొలి రౌండ్‌ లో  ఆయ‌న ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా అభ్యర్థులైన లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి నిష్క్రమించారు. అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు.  ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది  గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవ రెట్‌ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2 లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న  ప్రధాని పదవిని  అందు కుంటారు. కాగా, ప్రధాని రేసులో నిలిచే అభ్యర్థులకు కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పలు రౌండ్లలో జరిగే ఓటింగ్‌లో కనీసం 30 ఓట్లు సాధించని అభ్యర్థులు పోటీ నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఇలా చివరకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారిలోంచి ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. 

వందేళ్ల యువ‌కుడిని.. సాధించాల్సింది ఎంతో వుంది

లిథియం బ్యాటరీలు లేని ప్రపంచాన్ని ఈ రోజుల్లో ఊహించలేరు. వాటిని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ప్రొఫెసర్ జాన్ బన్నిస్టర్ గూడెనఫ్ ఈ నెలలో తన 100వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2019 నోబెల్ గ్రహీత తన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయ‌న‌.  నా వయసు వందేళ్లు మాత్రమే, నేను ఇంకా చాలా సాధించా ల్సి వుంద‌ని  2015లో  తన జీవితచరిత్ర రాస్తున్న  స్టీవ్ లెవిన్‌తో  అన్నారు. అయితే, ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, గూడెనఫ్ లిథియం బ్యాటరీల సృష్టికర్త  కాదు. గుడ్ నఫ్‌తో నోబెల్‌ను పంచుకున్న బ్రిటీష్-అమెరికన్ శాస్త్రవేత్త స్టాన్ విటింగ్‌హామ్, కరెంట్ ప్రవాహానికి ఎల క్ట్రాన్‌లను విరాళంగా అందించగల లిథియంను టైటానియం సల్ఫైడ్ షీట్‌లలో నిల్వ చేయవచ్చని మొదట ప్రతిపాదించాడు. అయినా,  విటింగ్‌హామ్  సెల్ ఎప్పటికీ పరిశ్రమలోకి రాలేదు; అది తరచుగా మంటలు అంటు కుంటోంది. గుడ్‌నఫ్ దీనిని కోబాల్ట్-ఆధారిత కాథోడ్‌తో పూర్తి చేసి, ఈ రోజు దాదాపు ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకే ఉత్పత్తిని రూపొందించింది. గూడెనఫ్ శాస్త్రీయ ప్రపంచానికి రాక్‌స్టార్, అతని ఉత్త‌మ ప్ర‌వాస విద్యార్ధులు  చాలా మంది తమ గురువు శతాబ్ది పుట్టినరోజును జరుపుకోవడానికి ఈ నెలాఖరులో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో సమావేశమవుతున్నారు. పాండిచ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రామసామి మురుగన్ గూడెనఫ్ విద్యార్థులలో ఒకరు. అతను తన గురువు సహకారం లిథియం బ్యాటరీల కంటే ఎక్కువగా ఉందని అన్నారు.  డిజిటల్ కంప్యూ టర్‌ల కోసం రాండమ్-యాక్సెస్ మెమరీలో అతని పని,  అయస్కాంత పరస్పర చర్యల కోసం గుడ్‌నఫ్-కనమోరి నియమాలు సైన్స్‌కు సమానంగా ముఖ్యమైనవి" అని మురుగన్ చెప్పారు.  మరో విద్యార్థి, ఐఐటి బిహెచ్‌యు, వారణాసికి చెందిన ప్రొఫెసర్ ప్రీతం సింగ్, గూడెనఫ్  సూపర్ కండక్టివిటీకి, ప్రత్యేకించి క్రాస్ ఓవర్ కండక్టివిటీ వంటి విష‌యాల్లో ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగ్ తెలియ‌జేశారు.  సోడియం సూపర్యోనిక్ కండక్టర్  ఆవిష్కర్త గా కూడా  ఆయ‌న ప్ర‌సిద్ధుడు అని సింగ్ చెప్పారు. అసమానతలకు వ్యతిరేకంగా విజయం గూడెనఫ్  విజయాలు ముఖ్యంగా గుర్తించదగినవి.  ఆయ‌న మౌలిక  పనిత‌నం, నైపుణ్యాలు. వ్యక్తి గత జీవితంలో, ముఖ్యంగా య‌వ్వ‌న‌ద‌శ‌లో అనేక పోరాటాల నేపథ్యంలో వచ్చింది. అతని జీవితచరిత్ర రచయిత అతని బాల్యం ఆనందంగా గ‌డ‌వ‌లేద‌న్నారు. ఎందుకంటే అతని  తల్లి దండ్రులు గొడవ ప‌డ్డారు, అతని తల్లి అతన్ని అంత ప్రేమ‌గా పెంచ‌లేదు. పాఠశాలలో  యువ  జాన్ డైస్లె క్సియాతో పోరాడాడు, ఇది పాఠాలను అర్థం చేసుకోవడం లేదా ప్రార్థనా మందిరంలో కొనసాగడం  కష్ట తరం చేసింద‌ని లెవిన్ చెప్పారు. బదులుగా, అతను అడవులు, దాని జంతువులు, మొక్కల అన్వేషణలో పూర్తిగా అంకిత‌మ‌య్యారు.  చివ రికి, యేల్‌లోకి ప్రవేశించడానికి తన వైకల్యాన్ని అధిగమించాడు, గణితం లో మాగ్నా కమ్ లాడ్ లో ఉత్తీర్ణత సాధించాడు. తరువాత అతను రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్‌ సైన్యంలో పనిచేశాడు. అతను విద్యావేత్తగా తిరిగి వచ్చినప్పుడు, చికాగో విశ్వవిద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు ఎగతాళిగా చేశారు. గూడెనఫ్ కోబాల్ట్ కాథోడ్‌ను ఎలా అభివృద్ధి చేశాడో మరియు నిప్పాన్ టెలిగ్రాఫ్, టెలిఫోన్  ఆదేశానుసారం గూడెనఫ్ తన తరగతిలో ప్రవేశించిన షిగెటో ఒకాడా అనే జపనీస్ విద్యార్థిచే సాంకేతికతను ఎలా దొంగి లించాడనే దాని గురించి లెవిన్ వివరంగా వివరించాడు. ఎన్‌టిటి కి వ్యతిరేకంగా యూనివర్శిటీ  ఆఫ్ టెక్సాస్ దాఖలు చేసిన సుదీర్ఘమైన 500-మిలియన్ డాల‌ర్ల‌ దావా ఫలితంగా ఏర్పడింది. ఎపిసోడ్‌కి చిన్న భారతీయ సంబంధం ఉంది. గూడెనఫ్ ఒకాడాను  అక్షయ పాధి అనే భార‌తీయునితో కలిసి పని చేసేలా చేసింది. గూడెనఫ్ ఒకాడా ఈ సాంకేతిక దొంగ‌త‌నాన్ని  కనుగొన్నప్పుడు, అతను కోర్టు లో సాక్ష్యంగా ఉపయోగించేందుకు తన నోట్‌బుక్‌లో వివరాలను నమోదు చేయమని పాధిని అడిగాడు, కానీ పాధి క్షమించండి, అతను నా స్నేహితుడు అని చెప్పి నిరాకరించాడట‌. లీవిన్  ఖాతా ప్రకారం, గుడెన‌ఫ్  అతని సాంకేతికత నుండి ఎంతో  లాభపడిన వ్యక్తులచే క్ర‌మేపీ ఆ సాంకే తిక‌త  స్వల్పంగా మార్చబడినట్లు కనిపిస్తుంది, అయినప్పటికీ అతను దీని ద్వారా ప్రభావితం కాలేదని అనిపించింది. గుడ్‌ఎనఫ్, బదులుగా, అతని జీవితమంతా జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తిగా మిగిలి పోయారు. మురుగన్  90 ఏళ్ల వయస్సులో కూడా, ఆయ‌న‌ ప్రయోగశాలను సందర్శించి, ప్రతి పండితులను కలుసు కునేవారు. పని, సాంకేతిక సమస్యలు, వాటిని పరిష్కరించడానికి సాధ్యమయ్యే దిశ లను చర్చించేవార‌ని గుర్తుచేసుకున్నాడు. గూడెనఫ్ "భారతదేశం  భారతీయ పండితులను ఇష్టపడుతుందని ,  మేము భారతీ య సంస్కృతి గురించి చాలా చర్చించుకునేవాళ్ళమ‌ని కూడా అతను చెప్పాడు. తాను మొదటిసారిగా గూడెనఫ్ గదిలోకి వెళ్లినప్పుడు, మీ తలపాగా ఎక్కడ ఉంది? అని శాస్త్రవేత్త అడిగారని ప్రీతం సింగ్ గుర్తు చేసుకున్నారు. సింగ్‌లందరూ సిక్కులు కాదని తనకు చెప్పాలని ఆయన వివరించారు. మురుగన్ , సింగ్ (అలాగే లెవిన్) గుడ్‌నఫ్  హాస్యం,  అతని ప్రత్యేకమైన నవ్వు  గురించి ప్రస్తావించారు, దీని రికార్డింగ్ కొన్నిసార్లు మనిషి గురించిన కథనాలలో పొందుపరచబడింది. మీరు అతనితో అత్యంత తెలివితక్కువ ఆలోచన గురించి చర్చించవచ్చు అని గూడెనఫ్ ప్రజలను చాలా సౌకర్యంగా చేస్తుందని సింగ్ గమనించాడు. ......

బీజేపీ సర్ప యాగాన్ని కేసీఆర్ అడ్డుకుంటారా?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అందుకే రాజకీయ శతృ మిత్ర సంబంధాలు, ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారి పోతుంటాయి. బీజేపీ విషయాన్నే తీసుకుంటే, ఒకప్పడు కమల దళం సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఎ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న,మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. అవి ఇప్పడు బీజేపీ మిత్ర పక్షాలు కాదు. ఒకప్పుడు అటల్ బిహరీ వాజ్ పేయి 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. పోరాపచాలు వచ్చిన అయిదేళ్ళు సర్కార్’ను నడిపించారు. అలాగే, 2014లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సాధించినా, మోడీ ఫస్ట్ కాబినెట్’లో మిత్ర పక్షాలకు స్థానం కల్పించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. నిజమే, ఇప్పటికీ, మోడీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే, కానీ, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీయేతర పార్టీలకు చెందిన మంత్రులు, ఇద్దరు ముగ్గరు కంటే లేరు.  కేంద్ర మంత్రివర్గంలోనే కాదు, ఎన్డీఎలో మిగిలిన పార్టీలను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును.ఒకప్పుడు, బీజేపీకి అత్యంత విశ్వసనీయ మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం మొదలు భావసారుప్యత ఉన్న శివసేన, అకాలీ దళ్ సహా అనేక పార్టీలు మిత్ర బంధాన్ని తెంచుకుని బయటకు వెళ్లి పోయాయి, కాదు, చాలా వరకు పార్టీలకు మోడ్ షా జోడీ, పొమ్మన కుండ పొగబెట్టి బయటకు పంపారని అంటారు.2014ఎన్నికల తర్వాత రెండేళ్ళకో ఏమో, మొదలైన కమల దళం మిత్ర పక్షాలను సమిధలుగా చేసే సర్ప యాగం 2019 ఎన్నికల నాటికే చాలావరకు పూర్తయింది.  ఇక 2019 ఎన్నికల్లో, బీజేపీ సొంత బలం మరింతగా పెరిగి 303 కు చేరిన నేపధ్యంలో, మోడీ షా జోడీ మిత్ర పక్షాలను మెల్ల మెల్లగ సాగనంపే వ్యూహానికి మరింతగా పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన శక్తి, అకాలీ దళ్, అన్న డీఎంకే, జేడీ(యు)తో పాటుగా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి చిన్నాచితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు ఎండీఎ కూటమిలో ఉన్నాయి. ఎన్నికలో పోటీ చేసి, గెలిచాయి. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకే ప్రధాన మిత్ర పక్షాలు. శివసేన, అకాలీ దళ్, ఎల్జీపీ  ఇలా ఒకొక్క పార్టీ  బయటకు వెళ్లి పోయాయి.  అలా వెళ్ళిపోయిన పార్టీలను అయినా, బీజేపీ వదిలేసిందా అంటే లేదు. ఎల్జీపీని రెండు ముక్కలు చేసింది. ఒక వర్గాన్ని చేరదీసి రెండవ వర్గాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎల్జీపీ అస్తిత్వం కోల్పోయింది. రేపో మాపో బీజ్పీలో విలీనం అయ్యేదుకు సిద్ధంగా ఉంది.మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉన్నాం.బీజేపీ ప్లాన్ సంపూర్ణం అయితే, శివసేన సైతం త్వరలోనే  చరిత్రగా మిగిలిపోతుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. మెల్టింగ్’ మొదలైంది. మరో రెండు మూడు నెలల్లో జరిగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత శివసేన చరిత్ర ముగింపుకు చేరుతుందని, అందులో సందేహం లేదని అంటున్నారు.  అలాగే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు నేత నితీష్ కుమార్’ ను సొంత పార్టీలోనే వంత్రిని చేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయిందనే అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుని, నితీష్ కుమార్’ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి వర్ఫ్గంలో ఉన్న జేడీయు  ఆర్సీపీ సింగ్’ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దమైన నేపధ్యంలో, నితీష్ కుమార్, ఆయనకు రెండవసారి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీష్, సింగ్ మధ్య దూరం మరింత పెరిగింది. త్వరలో సింగ్’ బీహార్ షిండే కాబోతున్నారని తెలుస్తోంది.  అయితే,  బీజేపీ టార్గెట్ మిత్రపక్షాలేనా అంటే కాదు ... అదివేరే కథ. కమల దళం అన్ని పార్టీలను సమదృష్టితోనే చూస్తోంది. అందుకే .. ఇప్పడు తెలంగాణలో కలకలం మొదలైంది. అందుకే రెండున్నర గంటల ప్రెస్ మీట్’లో ముఖ్యమంత్రి కేసేఆర్’ రెండు వందల సార్లు, షిండే పేరు తలచుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. కానీ, ప్రస్తుతం హ్యాండ్, మాంచి రైజింగ్’ లో ఉన్నా మోడీ, షా జోడీని కేసీఆర్ తట్టుకోగలరా? కమల దళం సర్పయాగాన్ని అపగలరా? అంటే, అది ఇప్పుడే చెప్పలేమని, పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయితేనే కానీ, క్లారిటీ రాదని అంటున్నారు.

ప్ర‌తిష్ట కోస‌మే .. ప్ర‌జారోగ్యం పై దృష్టి

ఏ ప్ర‌భుత్వానికయినా ప్ర‌జారోగ్యం కీల‌కం. కానీ ఆంధ్రప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగానే వుంది. ఏ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోనూ ఆరోగ్య శ్రీ కార్డుకు విలువ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పాల‌న‌లో ఆస్ప‌త్రుల్లో రోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లూ వుండ‌బోవ‌ని ప్ర‌చారం చేయించుకున్నారు. కానీ వాస్త‌వానికి ప‌రిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి.  ప్ర‌భుత్వ ఆరోగ్య‌ప‌థ‌కాలు, కార్డులు వ‌ల్ల ప్ర‌జ‌లు ఏమాత్రం త‌మ‌కు ఆస్ప‌త్రుల‌ప‌ట్ల ధీమా ఇవ్వ‌లేక‌పోయాయి. ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లకే ప‌రిమితం అయింది కానీ ఆస్ప‌త్రులు, మందుల ల‌భ్య‌త‌, మందుల్లో నాణ్య‌త అనే అనేకానేక అంశాల్లో లోపాల గురించీ నిరం త‌రం విప‌క్షాలు, ప్ర‌జ‌లు గోడు పెడుతూనే వున్నారు. కానీ అవ‌న్నీ ప‌ట్ట‌నట్టే వ్య‌వ‌హ‌రిస్తూ, సంబంధిత మంత్రి, అధికారులు మాత్రం ప్ర‌జ‌ల ఆవేశాన్ని త‌గ్గించే తీపి మాట‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. స‌మ‌స్య ను ప‌రిష్క‌రించాల్సిన వారు కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డంతోనే స‌రిపెట్టుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌డానికే ఇపుడు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న లక్ష్యం తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  రాష్ట్రంలో ఆరోగ్య‌శ్రీ ద్వారా అందించే చికిత్స‌ల సంఖ్య‌ను మ‌రింత పెంచాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. పెంచ‌ద‌ల‌చిన చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చేందుకు ఏర్పా ట్లు చేయాల‌న్నారు.  కానీ ఆస్ప‌త్రుల‌కు వెళుతున్న రోగులు వారి రోగాలు ఆ ప‌థ‌కంలో పేర్కొన్నజాబితాలో లేవ‌ని డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్ప‌డంతో రోగులు హ‌తాశుల‌వుతున్నారు. ఆరోగ్య శ్రీ అంటూ  ధైర్యాన్నిస్టున్న‌ట్టు  భ్ర‌మ క‌ల్పించ డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వం చెప్పాలి. కాగా ఇప్పుడు రాజ‌కీయ అవ‌స‌రాల‌కు  ప్ర‌జారోగ్యం జ‌గ‌న్ టీమ్‌కు గుర్తొచ్చింది అన్న ఆరోప‌ణ‌లు విన‌ప‌డుతున్నాయి.    చికిత్స‌ల జాబితాను త్వ‌ర‌లోనే ఖ‌రారు చేస్తామ న్నారు. తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల యంలో సీ.ఎం  బుధ‌వారం వైద్య ఆరోగ్య శాఖ‌ స‌మీక్ష నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి ఆగ‌స్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్‌ను అమ‌లు చేయ‌డానికి పూనుకున్నారు. ఆరోగ్య‌శాఖ రివ్యూ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకు న్నారు.  గ్రామీణ ప్రాంతాల్లోని క్లినిక్‌లు,  పీహెచ్‌సీల‌కు డిజిట‌ల్ వీడియో  అనుసంధాన‌త  ఉండాల‌ని  ముఖ్య మంత్రి  జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఆరోగ్య‌శ్రీ కింద‌చ‌డ‌బ్బు నేరుగా రోగి బ్యాంకు ఖాతాలోకి, అక్క‌డి నుంచి ఆస్ప‌త్రికి చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆస్ప‌త్రిలో చేరిన రోగి నుంచి ముందుగా అగీకార ప‌త్రం, చికిత్స పూర్త‌యిన త‌ర్వాత ధృవీక‌ర‌ణ ప‌త్రం, అందులో ప్ర‌భుత్వం నుంచి అందిన స‌హా యం వివ‌రాలు స్ప‌ష్టం గా వుండాల‌ని సీఎం ఆదేశించారు.  అంతేగాక‌, రోగుల‌కు ఆరోగ్య ఆస‌రా స‌హాయం వివ‌రాలు సేక‌రించా ల‌ని జ‌గ‌న్ సూచించారు. రోగి నుంచి అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేశారా, ఉచి తంగా వైద్యం చేశారా మొద‌లైన వివ‌రాలు కూడా వీలు క‌ల్పించాల‌న్నారు. ఎవ‌రైనా లంచం అడిగినా,  అధికంగా ఫీజులు వ‌సూ లు చేసినా, టోల్ ఫ్రీ నంబ‌ర్ ద్వారా ఏసీబీకీ ఫిర్యాదు చేసేలా అవ‌గాహ‌న క‌ల్పిం చాల‌ని స్ప‌ష్టం చేశా రు. 108, 104 లాంటి సర్వీసుల్లోనూ లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసు కోవాలని, ఆ వాహనా లపై కూడా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని ముఖ్య మంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈనెల చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని ఆదేశిం చారు. పీహెచ్ సీ మొదలు, బోధనాసుపత్రి వరకూ సరి పడా వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. నాణ్య మైన వైద్యం అందించాలన్న ఉద్దేంతోనే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులకు వివరిం చారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కొత్త జాతీయ చిహ్నంపై రాజ‌కీయ ర‌గ‌డ‌

కొత్త ఇల్లు కట్టుకున్న‌వారికి పాత ఇల్లు న‌చ్చ‌దు, కొత్త సొబ‌గుల‌తో ఇంటి రూపు మార్చిన‌వారికి పాత ఇంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో పోల్చు కోవ‌డం స‌సెమీరా న‌చ్చ‌దు.  కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన  కొత్త జాతీయ‌చిహ్నం పై ఇపుడు రాజ‌కీయ ర‌చ్చ పెచ్చు మీరుతోంది. బిజెపికి త‌మకున్నంత‌ దేశ‌భ‌క్తి దేశంలో మ‌రెవ్వ‌రికీ ఉండ‌ద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కం. విప‌క్షాల‌కు మాత్రం క‌మ‌ల‌నాధుల దేశ‌భ‌క్తి కేవ‌లం కాషాయ‌ప‌ర మైన‌ది. తాము చేసిన ప్ర‌తీ ప‌ని దేశ‌భ‌క్తితో చేస్తున్న‌ట్టు మోదీ ప్ర‌భుత్వం భ‌జ‌న చేయించుకోవ‌డం  బాగా అల‌వాట‌యింది.   అందువ‌ల్ల విప‌క్షాలు చిన్న విమ‌ర్శచేసినా తిట్టిపోయ‌డానికి వేయి గొంతుక‌లు సిద్ధంగా వుంటాయి. సార‌నాధ స్తూపం కంటే మేం నిర్మించిన‌దే మ‌హా గొప్ప అని బాకా బ‌జాయించుకుంటున్న త‌రుణంలో విప క్షాల చిన్న‌పాటి పోలిక‌ను మోదీ స‌ర్కార్ బొత్తిగా సహించ‌లేక‌పోతోంది.  శాంతికి చిహ్నంగా వుండాల్సిన‌వి ప్ర‌జ‌ల్ని ఆగ్ర‌హోరుద్రులుగా మార్చేందుకు స్పూర్తినిచ్చేవిగా సింహాలు వున్నాయ‌ని దేశం లోని విప‌క్షాలు,    సార‌నాధ్ స్తూపం ప్ర‌త్యేక‌త తెలిసిన‌వారూ మండిప‌డుతున్నారు. జాతీయ చిహ్నం బిజెపి ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబంలా వుందిగాని అందులో జాతీయ‌త వీస‌మెత్త‌యినా  లేద‌న్న ఆరోప‌ణ‌లే బ‌లంగా విన‌ప‌డుతు న్నాయి. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం మీద కొత్త‌గా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్రభుత్వం  అర్ధం లేనివ‌ని కొట్టిపారేస్తోంది. కానీ ఆలోచించి ఆ ఆరోప‌ణ‌ల వెన‌క సార‌మేమిట‌న్న‌ది కేంద్రం ప్ర‌భుత్వం ర‌వ్వంతయినా గ్ర‌హించ‌డం లేదు.  అది అచ్చం సార‌నాథ్‌లోని సింహాల చిహ్నంలానే వుంద ని  భావించడ‌మే  బిజెపి నేత‌ల పొర‌పాటు కానీ దాన్ని తెలుసుకోలేక‌పోతున్నార‌ని  విప‌క్షాలు గోల చేస్తున్నా యి. కాగా రెండు నిర్మాణాల‌ను స‌రి పోలుస్తున్న‌పుడు వాటి సైజు, ఎత్తుని కూడా లెక్క‌లోకి తీసుకోవాల‌ని కేంద్ర గృహ‌,  ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర‌దీప్ సింగ్ పురి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం పైన ఉన్న కాంస్య జాతీయ చిహ్నం పరిపూర్ణ ప్రతిరూపం అని ఆయన  అన్నా రు. ఎత్తు, రంగు కాదు.. అస‌లు ఆ చిహ్నం తెలియ‌జేసే జాతీయ‌తను తారుమారు చేస్తున్నార‌ని చ‌రిత్ర కారులూ ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. తాము చేప‌ట్టిన‌వ‌న్నీ శాస్త్ర‌ప్ర‌కార‌మే చేస్తున్నామ‌ని భ‌జ‌న చేయించు కోవ‌డం బిజెపి నేత‌లు  కాస్తంత త‌గ్గించుకోవాలని విశ్లేష‌కులు అంటున్నారు. ఎవ‌రు ఎన్ని చెప్పినా, సూచించినా త‌మ పంథాను మార్చు కోకుండా ఈ విధంగా జాతీయ‌త‌ను అప‌హాస్యం చేయ‌డానికే బిజెపి కంక‌ణం క‌ట్టుకున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  కొత్త చిహ్నం  33 మీటర్ల ఎత్తులో వుంద‌ని , అసలు సారనాథ్ చిహ్నం 1.6 మీటర్ల  ఎత్తు ఉండగా, కొత్త పార్లమెంట్ భవనం పైభాగంలో ఉన్న కాంస్య చిహ్నం 6.5 మీటర్ల ఎత్తులో భారీగా ఉందని కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ అన్నారు.  అసలు సారనాథ్ చిహ్నం కేవ‌లం 1.6 మీటర్ల ఎత్తు ఉంటుం దని,  కొత్త  పార్ల మెంటు భవనం పైభాగంలో ఉన్న చిహ్నం భారీగా . 6.5 మీటర్ల ఎత్తులో ఉంద‌ని  అని మంత్రి చెప్పారు. ఒక శిల్పా న్ని,  బొమ్మ‌ని చూసిన‌పుడు దాని అందం, గాంభీర్యం అనేది చూసేవారి దృష్టిమీద ఆధార‌ప‌డి వుంటుం ద‌ని, ఈ కొత్త భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన కాంస్య చిహ్నాన్ని విప‌క్షాలు విమ‌ర్శించ‌డంలోనే వారి దృష్టి తెలు స్తోంద‌ని మంత్రి ఎద్దేవా చేశారు.  ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విమర్శలు, ప్ర‌భుత్వ వివ‌ర‌ణ‌లో వ‌క్రీక‌రిం చింద‌న్న విమ‌ర్శ‌ల‌కు మంత్రి  ప్రతిస్పందించారు. కానీ హిందూత్వ‌భావ‌న‌లో  కొట్టుకుపోతున్న పార్టీవారు క‌నీసం సార‌నాధ్ స్తూపానికి ఇవ్వాల్సిన గౌర‌వం కూడా ఇవ్వ‌డంలేద‌న్న‌ది వారి అత్యాధునిక ఆలోచ‌న స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  అస‌లు వివాదమేమంటే, కొత్త పార్ల‌మెంటు భ‌వనం పై ఏర్పాటుచేసిన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాల కోర‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ని, సింహాలు రౌద్రంగా వున్నాయ‌ని, అస‌లు ఈ చిహ్నం అశోకుని రాజ‌ధాని సార‌నాధ్‌లోని చిహ్నం వ‌లెనే వుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయ‌డంతో విప‌క్షాలు మండిప‌డు తున్నాయి. అయితే భార‌త పురావ‌స్తుశాఖ మాజీ అధికారి బి.ఆర్ మ‌ణి మాత్రం సార నాధ్‌లోని అస‌లు స్తంభం  7 నుంచి  8 అడుగుల ఎత్తు వుండ‌గా, ఈ  కొత్త జాతీయ చిహ్నం అంతకంటే మూడు రెట్లు ఎత్తు వుందన్నారు. అయితే దీన్ని మ‌రీ రాజ‌కీయ‌ప‌రంగా వివాదం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని  ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.