తెలంగాణ మరో బెంగాల్ అవుతుందా ?
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి మొదలు సాధారణ రాజకీయ కార్యకర్త వరకు ఒకటే భాష మాట్లాడుతున్నారు. నిజానికి సాధారణ రాజకీయ కార్యకర్తల కంటే, పదవులలో ఉన్న పెద్దలే అసభ్యంగా మాట్లాడుతున్నారేమో అనే విధంగా, వారి భాష దిగజారుతోంది. అదలా ఉంటే .. ఇప్పుడు ఎన్నికల వేడి ఎక్కువయ్యే కొద్దీ, రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య విద్వేషం బుసలు కొడుతోంది.
రాజకీయ ప్రత్యర్దులపై భౌతిక దాడులకు కూడా రాజకీయ పార్టీలు సిద్డంవుతున్నాయి. అందుకే సామాన్య జనం ఎన్నికల నాటికి తెలంగాణ మరో బెంగాల్ అవుతుందా, అనే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి దాడులతో మొదలైన హింస రాజకీయం హత్యల వరకు వెళుతుందా, అన్న అనుమానం. భయం సమాన్య జనం వ్యక్త పరుస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో క్రితం సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయి. హత్యలే కాదు, మానభంగాలు, గృహదహనాలు, ఒకటని కాదు, నేరాలు, ఘోరాలు అన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల కారణంగా కొన్ని వందల కుటుంబాలు ప్రాణ భయంతో రాష్ట్రం వదిలి, అస్సాం తదితర రాష్ట్రాలకు పోయాయి. ఇప్పటికీ, అక్కడే తలదాచుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకా ఈనాటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రాజకీయ హత్యల భయం వెంటాదుతూనే వుంది.
ఈ సంవత్సరం (2022) మే నెలలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సమయంలోనే, నార్త్ కొల్కటాలో బీజేపీ కార్యకర్తను ఉరి తీసి హత్య చేశారు. కొద్ది రోజుల క్రితం కొల్కతాలో ఒకేసారి ఇద్దరు అధికార తృణమూల్ కార్యకర్తలు హుత్యకు గురయినట్లు వార్తలొచ్చాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, వ్యూహంలో హింస ఒక భాగంగా ఉంటుందనే ఆరోపణ అయితే రాజకీయ వర్గాల్లో బలగా వినిపిస్తోంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు కిరాయి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగా పెరేపించిన హింస ఇప్పుడు ఎకంగా ముఖ్యమంత్రి అధికార నివాసాని తాకింది. భద్రతా వలయాన్ని సీసీ కెమెరాలను దాటుకుని, ఇటీవల ఒక ఆగంతకుడు, ముఖ్యమంత్రి ఆధికార నివాసంలో ప్రవేశించారు.
బంగ్లాదేశ్ దేశస్థుడుగా అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో, ఎందు కోసం అంట రిస్క్ తీసుకుని, ముఖ్యమంత్రి నివాసంలో ప్రవెశించాడో, ఎన్నికల హింసకు ఈ సంఘటనకు సంబంధం ఉందొ లేదో కానీ, రాష్ట్రంలో నెలకొన్న భయంకర పరిస్థితులకు మాత్రం ఈ ఉందనటం అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అదే ఎన్నికల వ్యూహకర్తను టీఆర్ఎస్ హైర్ చేసుకుంది. ఎన్నికల సర్వేలు మొదలు తెరాస ఎన్నికల వ్యూహం మొత్తాన్నిఆయనే నిర్నయిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆ కారణంగానూ తెలంగాణలోనూ బెంగాల్ తరహా హింస రచనకు రంగం సిద్డంవుతోందా? అన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా అధికార తెరాస అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రతిపక్షాలపై పోలీసు జులం ప్రదర్శిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలేసు జులుం ప్రత్యక్షంగానూ కనిపిస్తూనే వుంది. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఏ ఆందోళనకు పిలుపు ఇచ్చినా, ఏ నిరసన కార్యక్రమం నిర్వహించినా, పోలీసు యంత్రాంగం ముందస్తు అరెస్టులు,గృహ నిర్భంధాలు రొటీన్ వ్యవహారంగా మారిపోయాయి. మరో వంక. రాష్ట్రంలో ముక్కోణ పోటీ స్పష్టమైన నేపధ్యంలో రాజకీయాలు రోజురోజుకు ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈనేపధ్యంలో తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి, రాజకీయ వర్గాల్లో, హింసా రాజకీయాలపై చర్చకు తెర తీసింది. అరవింద్ పై జరిగిన దానిని రాజకీయ దాడిగానే భావించవలసి ఉంటుందని అంటున్నారు. అలాగే, రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ హింసకు అరవింద్ పై దాడి అంకురార్పణ కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అరవింద్ పై దాడి జరగడం ఇది మొదటి సారి కాదు...అయన ముఖ్యమంత్రి కుమార్తె, కల్వకుట్ల కవితను, ఓడించి, ఎంపీ అయింది మొదలు ఇంతవరకు ఆయనపై జరిగిన ఎనిమిదవ దాడి ఇది. ఈ దాడి వెనక తెరాస హస్తం ఉందని అరవింద్ ఆరోపిస్తున్నారు.
నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ కారణంగా, తాను ఏ అసెంబ్లీ నియోక వర్గం పర్యటనకు వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు తనను అడ్డుకుంటున్నారని, ఈ మేరకు ఎమ్మెల్యేలకు కేసీఆర్, కేటీఆర్ నుంచి అదేశాలున్నాయని అంటున్నారు.
కాగ, ఎంపీ అరవింద్ పై దాడి జరిగిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి అర్వింద్తో మాట్లాారు. దీంతో దాడుల విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది. అయితే, గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర నాయకులపై దాడులు, నిర్ద్భందాలు జరిగిన సమయంలోనూ అమిత్ షా ఫోన్ చేసి, పరిస్థతి తెలుసుకున్నారే, తప్ప ఆ తర్వాత చర్చ్యలు లేవని, అలాగే, గవర్నర్ ప్రోటోకాల్ కు సంబంధించి చేసిన ఫిర్యాదులపైనా చర్యలు లేవని, బీజేపీ నాయకులే గుర్తు చేస్తున్నారు. చివరకు బెంగాల్లో తమ కళ్ళ ఎదుట బీజేపీ కార్యకర్తను ఉరితీసి హత్య చేసినా, పెద్దగా చర్యలు తీసుకొని కేంద్ర హోం మంత్రి అమిత షా, కేంద్ర ప్రభుత్వం ఇప్పడు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ... వేరే చెప్పనకక్కర్లేదని అంటున్నారు.