జై  జ‌గ‌దీప్‌..  జ‌గ‌న్ 

ఎవ‌ర‌న్నా అవ‌స‌రంలో వున్న‌పుడు మ‌ద్ద‌తుకోసం అడుగుతారు. మ‌న‌కు వీలున్నంత‌వ‌ర‌కూ ఇబ్బంది లేద‌నిపిస్తే ఓకే అంటాం. ప్ర‌స్తుత రాజకీయ‌ప‌రిస్థితుల్లో బిజెపి, వైసీపీ స్నేహం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్‌కు చాలా అవ‌స‌రం గ‌నుక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్ధిగా బిజెపి జ‌గ‌దీప్ దిన‌క‌ర్‌ను ప్ర‌క‌టించ‌గానే ఇక్క‌డ‌నుంచి జ‌గ‌న్ ఓకే అని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేశారు. అంతేకాదు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి జ‌గ‌దీప్‌గారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆదివారం ఏకంగా హిందీలో ట్వీట్  చేయ‌డ‌మూ అయిపో యింది. రైతు బిడ్డ జగదీప్‌ ధనకర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు తనకు చాలా సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. జగదీప్ ధన్‌కర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతు తెలిపింది వైఎ స్సార్సీపీ. వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కే జైకొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక‌ ల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ  ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. అయితే అంద‌రికంటే ముందుగానే జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెలియ‌జేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వాస్త వానికి జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఇంకా ఓకే అన‌క‌పోయినా, విజ‌య‌సాయి రెడ్డి మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న పార్టీప‌రంగా చెప్పిన‌ట్టేన‌ని విశ్లేష కులు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధికారిక ప్రకటనగానే భావించవచ్చు. ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు విషయంలో కొంత వివాదం జరిగిన విషయం తెలిసిందే. మేం అడగకుండానే వైసీపీ మద్దతు ఇచ్చిందని బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి వై.స‌త్య‌కుమార్‌ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై విరుచు కుపడిన వైసీపీ నేతలు  బీజేపీ హైకమాండ్ కోరితేనే తాము మద్దతు తెలిపినట్లు ఎదరుదాడికి దిగారు. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కూడా స్పందించారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైసీపీని కోరామని స్ప‌ష్టంచేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐతే ఇప్పుడు మాత్రం అడగకుండానే జగదీప్‌ ధన్‌కర్‌కి వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, తెలంగాణ అధికార ప‌క్షం టిఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే,  నరేంద్ర మోదీయే టార్గెట్‌గా కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు కాకుండా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తునిచ్చారు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటార న్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా విపక్షాల అభ్యర్థికే మద్దతు తెలుపుతారా? లేదంటే బీజేపీ రైతు బిడ్డగా చెబుతున్న జగదీప్‌కు జైకొడతారా? అన్నది తెలియాల్సి ఉంది.

భ‌గ‌త్‌సింగ్ ఎవ‌రికంటే తీవ్ర‌వాది సిమ్ర‌న్‌జిత్  జీ!

దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న స‌మ‌యంలో భ‌గ‌త్‌సింగ్ అనే కుర్రాడు త‌న జీవితాన్ని లెక్క చేయ‌కుండా బ్రిటీష్‌వారికి బుద్ధిచెప్పాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. అప్ప‌టి దేశ‌భ‌క్తి అంత‌టిది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ యువ‌త దేశాన్ని దాస్య శృంఖ లాల నుంచి విముక్తి చేయ‌డానికి రంగంలోకి ఉరికారు. త‌మ వంతు కాగ‌లిన కార్యాన్ని సాధించారు. ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణాన్ని ముద్దాడారు. అలాంటి దేశ‌భ‌క్తుడు, భ‌గ‌త్‌సింగ్ తీవ్ర‌వాదిగా పంజాబ్ ఎంపి సిమ్ర‌న్‌జిత్ సింగ్‌గారికి ఎలా అనిపించాడో మ‌రి. అయినా ఆ కాలం వేరు, ఇప్ప‌టి రాజ‌కీయ‌ప‌రిస్థితులు వేరు.  భ‌గ‌త్‌సింగ్ ఒక ఇంగ్లీషు అధికారిని కాల్చి చంపాడ‌ని, అసెంబ్లీలో స‌భ జ‌రుగుతుండ‌గా బాంబులు విసిరాడ‌ని సిమ్రాన్ జిత్ ఆరో ప‌ణ‌. కానీ అప్ప‌టి దేశ‌భ‌క్తి ఆవేశం, న‌ర‌న‌రాన స్వ‌తంత్ర కాంక్ష వున్న‌పుడు అప్ప‌టి కుర్రాళ్లు అంత‌టి ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శిం చారు. అది త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ ఆయ‌న అలా చేసి వుండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది మాన్‌సింగ్ గారి అభిప్రాయం. అస‌లు మాన్‌గారు ఈ విధంగా ఏదో ఒక‌టి చ‌ర్చ‌నీయంశంగా మార్చ‌డం ప‌రిపాటి.  గ‌తంలో 2007లో ఈయ‌నే భ‌గ‌త్‌సింగ్‌ను చిన్న‌పాటి ఉగ్ర‌వాది అన్నారు. అంతటితో ఆగ‌క 2015లో ఛండీగ‌ఢ్ విమానా శ్ర‌యానికి భ‌గ‌త్‌సింగ్ పేరు పెట్ట‌డానికి కూడా తిర‌స్క‌రించారు. ఎంపీ గారికి కామెంట్లు చేయ‌డం చాలా ఇష్టం. అలా రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో హాట్ హాట్‌గా త‌న పేరు అంద‌రినోటా విన‌డ‌మూ ఆయ‌న‌కు ఇష్టం కావ‌చ్చు. అందుకే చాలా కాలం నుంచి మొన్న ఎంపీ అయ్యేవ‌ర‌కూ కూడా ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూనే వున్నారు. అయితే పంజాబ్ ప్ర‌జ‌లు ఈ పెద్దాయ‌న మాట‌లు అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ పంజాబ్ మంత్రి గుర్మీత్‌సింగ్ మీత్ హ‌య‌ర్ మాత్రం మండిప‌డుతున్నారు. అందుకే  పెద్దాయ‌న్ను ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  గుర్మీత్ డిమాండ్ చేస్తున్నారు. 

డాల‌ర్ నోటు తీసింది.. ఆస్ప‌త్రిపాల‌యింది!

ఇంటి బ‌య‌టో, అలా రోడ్డుమీద వెళుతూంట‌నేనో ప‌ది రూపాయ‌ల నోటో, వందనోటో క‌న‌ప‌డ‌గానే ఠ‌క్కున తీసి ఎవ‌రూ గ‌మ‌నిం చ‌క ముందే జేబులో పెట్టేసుకుంటాం. ఇది చాలా స‌హ‌జం. ఎవ‌రో బొత్తిగా స్పృహ‌లేకుండా ప‌డేసుకున్నారు అనీ అనుకుంటాం. ఎవ‌ర‌న్నా గ‌మ‌నిస్తే మాత్రం మ‌ర్యాద‌గా వెళ్లి అడుగుతాం మీదా, మ‌రెవ‌రిద‌యినానా అని. ఇదుగో ఇలా కింద‌ప‌డిన‌ది, రోడ్డుమీద క‌నిపించింద‌నీ తీసిన నోటే రెనీ పార్స‌న్ కొంప ముంచింది. అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిపాల‌యింది.  అదేమిటి రోడ్డుమీద నోటు తీస్తే అంత అస్వ‌స్థ‌త‌కు గుర‌యిందా అని అనుమానం వ‌చ్చింది గ‌దూ?   నిజ‌మే. నేష్‌వ‌లీ, టెన్నిసీ కి చెందిన రెనీ పార్స‌న్ త‌న భ‌ర్త  జ‌స్టిన్‌, కుటుంబ స‌మేతంగా వారి ప్రాంతంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ కి వెళ్లింది. అక్క‌డి రెస్ట్ రూమ్‌కి వెళ్లిందామె. చంక‌లో మూడు నెల‌ల పాప కూడా వుంది. అక్క‌డ ఆమెకు కొంత దూరంలో నేల‌మీద ఒక డాల‌ర్ నోటు క‌న‌ప‌డింది. అంతే మ‌రో ఆలోచ‌న‌లేకుండా ఠ‌క్కున తీసింది. మాన‌వ స‌హ‌జం.. అమలాపుర‌మైనా, అమెరికా అయినా!  కొంత‌సేప‌టి త‌ర్వాత ఆమె త‌న బిడ్డ‌ను తీసుకుని మ‌ళ్లీ ప్ర‌యాణానికి కారులో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఏదో తెలియ‌ని ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. హ‌ఠాత్తుగా బుజాల‌నొప్పులు మొద‌లై శ‌రీర‌మంతా నొప్పులు మొద‌ల‌య్యాయి. ఒక్క‌సారిగా శ‌రీరాన్ని క‌ద‌ప‌లేని స్థితి ఏర్ప‌డిందిట‌. అది గ‌మ‌నించిన ఆమె భ‌ర్త వెంట‌నే ఆమెను ఏమ‌యింద‌ని ప‌ల‌క‌రించాడు.  ఆమె బాధ‌ప‌డుతోంది, ఒక్క మాటా మాట్లాడలేక‌పోతోంది. అంతేకాదు శ్వాస తీసుకోవ‌డ‌మూ క‌ష్ట‌మైపోయింది. క‌ళ్లు మూసుకు పోతున్నాయి. ఆమె భ‌ర్త జ‌స్టిన్ ఆమెను నిద్ర‌లోకి జార‌కుండా చేయ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఫోన్ తీసి వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆస్ప‌త్రికి ఫోన్ చేశాడు. అంత‌కుముందే ఫైర్‌వ‌ర్క్ ఉద్యోగులతో మాట్లాడాడు. వారు కారు ద‌గ్గ‌ర‌కి ప‌రుగున వ‌చ్చి ఆస్ప‌త్రికి తీసికెళ్ల‌డానికి అన్ని ఏర్పాట్లు నిమిషాల్లో చేశారు. ఆమె క్ష‌ణాల్లో స్పృహ కోల్పోయి, ప‌డిపోయింది.  అత‌నికీ ఆమె వ‌లె శ్వాస ఇబ్బంది మొద‌లైంది. కానీ మాట్లాడ‌గ‌లుగుతున్నాడు. అస‌లు దీనంత‌టికీ కార‌ణం  ఆమె తీసిన నోటు వ‌ల్ల‌నే అని తేలింది. ఆ నోటుకి ప్ర‌మాద‌క‌ర‌మైన ఫెంటానిల్ అనే మందు రాసి వుందని డాక్ట‌ర్లు తెలుసుకున్నారు. రెనీ పార్స‌న్ ఓ వారం రోజుల త‌ర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ల‌గ‌లిగింది. చూశారా నోటు ఎంత ప‌నిచేసిందో. అంటే  ఎవ‌రో ఆ నోటు మీద పూసిన ప్ర‌మాద‌క ర‌సాయ‌నం మ‌రెవ‌రి మీద‌నో ఉప‌యోగించాల‌నుకున్నారు. బ‌హుశా అంత‌కు ముందే వారికి తెలీకండా ఆ నోటు కింద‌ప‌డి వుండ‌వ‌చ్చు. పోలీసులు ఆ నోటు ర‌హ‌స్యం తెలుసుకునే ప‌నిలోనే వున్నారు.

ఉచితాలపై మోడీ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ ఫైర్..జగన్ మౌనానికి కారణమదేనా?

ప్రధాని  నరేంద్ర మోడీ ఎందుకు చేశారో, ఎవరిని టార్గెట్ చేసి  పేల్చారో తెలియదు కానీ ఓట్ల  కోసం ఉచిత  పంపిణీల(పథకాలు) పై ఆయన చేసిన వ్యాఖ్యలు  దేశ  వ్యాప్తంగా సంచలనం  సృష్టించాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున  చర్చ  జరుగుతోంది. కచ్చితంగా ఏపీ  ప్రభుత్వ తీరును  ఎండగడుతూనే  మోడీ పరోక్షంగా  ఫ్రీ బీస్  పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని  విపక్షాలు గట్టిగా నొక్కి  చెబుతున్నాయి. అయితే మోడీ వ్యాఖ్యల టార్గెట్ జగన్ అని విపక్షాలు అంటున్నా.. ఏపీ  సీఎం  జగన్ మాత్రం  ఇప్పటి  వరకూ మోడీ వ్యాఖ్యలపై  స్పందించలేదు. దేశలో ఏ రాష్ట్ర్రం చేయని విధంగా ఏపీలో సంక్షేమానికి  పెద్ద పీట వేశామనీ, దేశం  మొత్తం  తన ప్రభుత్వ విధానాలను అనుసరించడమే  మిగిలి ఉందనీ తన  భుజాలను తానే  చరిచేసుకుంటూ  సంక్షేమ  లబ్ధిదారులకు సొమ్ముల పంపిణీ  సభలలో ప్రసంగాలు చేసే  జగన్  ఇప్పుడు మోడీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని విపక్షాలు  విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మోడీ లక్ష్యం ఒకటి అయితే ఆయన విమర్శ బాణం మరొక  చోట తగిలిందా  అన్న  అనుమానాన్ని  పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు. మోడీ  వ్యాఖ్యలపై ఏపీ  సీఎం  జగన్  మౌనంగా ఉంటే...  ఢిల్లీ  సీఎం  కేజ్రీ  వాల్  మాత్రం  ఘాటుగా స్పందించారు. నేరుగా  ప్రధాని  పేరు ప్రస్తావించకుండానే.. ఉచిత విద్య, ఉచిత విద్యుత్ పథకాలు కేవలం ఉచిత పథకాలు  కావని కేజ్రీవాల్ అన్నారు. అవి భవిష్యత్  తరాల  బాగు కోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి లాంటివన్నారు. ఉచిత విద్య వల్ల  పేదలు చదువుకుని దేశ ప్రగతిలో, ఉత్పాదకతలో భాగస్వాములౌతారని  అన్నారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయనీ వివరించారు. నిజమైన ఉచితాలనేవేమైనా ఉంటి  అవి బడా వ్యాపారులకు చేసే వేల కోట్ల రూపాయల మాఫీలేనని రిటార్డ్  ఇచ్చారు. అంతే  కానీ ఢిల్లీ  ప్రభుత్వం  18 లక్షల మందికి ఉచిత విద్య, రెండు కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం ఉచిత పథకాల కిందకు రావని అన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య ద్వారా దేశ ప్రగతిని మా వంతు సహకారం అందిస్తున్నట్లేఅన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో మొహల్లా క్లినిక్  లు అద్భుత  పాత్ర్  వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ  పార్టీలకు  విరాళాలిచ్చి, బ్యాంకుల  నుంచి  వేల కోట్ల  రూపాయలు అప్పులు తీసుకున్న బడా  వ్యాపార సంస్థలు, పారిశ్రామిక  వేత్తలకు చేసే  రుణ మాఫీ  నిజమైన ఉచిత పథకమని కేజ్రీవాల్ అన్నారు. శ్రీలంక పర్యటనలో అదానీకి కోట్లాది  రూపాయల కాంట్రాక్టు  కోసం మీరు చేసిన దౌత్యం నిజమైన  ఉచిత  పథకమని మోడీని ఉద్దేశించి  కేజ్రీవాల్ విమర్శించారు.  అయితే ఉచితాలపై మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై నిజంగా భుజాలు తడుముకుని స్పందించాల్సిన జగన్ మౌనంగా ఉండటానికి  కారణమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  నోరెత్తి  మాట్లాడితే.. కేసుల దొంతర కదులుతుందన్న భయమా.. భవిష్యత్ లో అప్పుపట్టదన్న బెరుకా  అని  ప్రశ్నిస్తున్నారు.  

తిలా పాపం తలా పిడికెడు!

నిజం. దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చేసిన వ్యాఖ్యలో నిజముంది.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు, రోజు రోజుకు, రాను రాను రాజు గుర్రం ...  సామెతను గుర్తుకు తెస్తోంది.  నిజానికి, ప్రతిపక్షాల పాత్ర క్షీణించడం ఒక్కటే కాదు, భర్త ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకు మించిన సవాళ్ళనే ఎదుర్కుంటోంది. అందుకే, పతనమవుతున్న ప్రజాస్వామ్య విపువల గురించిన ఆందోళన ఆలోచనన పరులు అందరిలోనూ వుంది. అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాజకీయ వ్యవస్థ దిగజారిపోతున్న తీరు పట్ల ఇదే రీతిన ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నట్లుగా, ప్రతిపక్షాల స్పేస్ తగ్గిపోవడం ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా అనేక రుగ్మతలతో ప్రజస్వామ్య వ్యవస్థ రోజురోజుకు దిగాలవుతోంది. ప్రజాస్వామ్య విలువలు పతన మవుతున్నాయి. నిజమే గతంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య రాజకీయ వైరుధ్యం మాత్రమే ఉండేది.  అంతే గానీ, చట్ట సభల లోపల గానీ, వెలుపల గానీ రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత శతృత్వం అనేది మచ్చుకైనా కనిపించేంది కాదు. ఇదుకు చరిత్రలో చాలా ఉదహారణలు కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి  లేదు. జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, గతంలో ప్రతిపక్ష నాయకులు కీలక పాత్ర పోషించేవారు. ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకునేవి. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి అవకాశాలు క్షీణిస్తున్నాయి.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చట్ట సభలు, రాజకీయ వికృత క్రీడకు వేదికగా మారుతున్నాయి. అందుకే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. చివరకు వేల లక్షల కోట్ల ప్రజాధనంతో ముడిపడిన బడ్జెట్ కూడా చర్చ లేకుందానే ఆమోదం పొందుతోంది.  అందుకే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయ ప్రత్యర్థులను విరోధులుగా భావించరాదన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులను చూస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమంటే ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయడమన్నారు. బలమైన, శక్తిమంతమైన, చురుకైన ప్రతిపక్షం పరిపాలనను మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యకలాపాలను సరిచేయడానికి సహకరిస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య సహకారం ఒక ప్రగతి శీల ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందని చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైతే మార్పు రూపంలో ప్రజలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేయడాన్ని చరిత్ర చూసిందని గుర్తుచేశారు.  అవును. చీఫ్ జస్టిస్ చెప్పినట్లుగా, ప్రతి పక్షాలకు స్పేస్ లేక పోవడం కానీ, ఇతర ప్రజాస్వామ్య రుగ్మతలు కానీ, ప్రజస్వామ్య వ్యవస్థను, స్పూర్తిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే, ఇందుకు ఎవరు బాధ్యులు? అంటే, నిజం చెప్పాలంటే, అందరూ బాధ్యులే, తిలాపాపం తలా పిడికెడు.

ఓట్ల కోసం ఉచిత పంపిణీపై ప్రధాని మోడీ ఉచిత హెచ్చరికలు..!

మాకు ఓటేయండి చాలు... ఇంక మీరేం చేయనవసరం లేదు. మీ అవసరాలన్నీ మేమే ఉచితంగా  తీర్చేస్తాం. కాలు బయటపెట్టకుండా మీకు సకల సౌకర్యాలూ ఇంటి ముంగిటకు తీసుకువచ్చి అమరుస్తాం అన్న రీతిలో  ఎన్నికలలో  విజయమే  లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలూ  పోటీలు పడి మరీ  హామీలు గుప్పించేస్తుండటం ఇటీవలి  కాలంలో బాగా ఎక్కువ అయిపోయింది.  అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించేసి, తీరా అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు  రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా సరే  అనివార్యంగా నిబంధనలన్నిటికీ తిలోదకాలిచ్చేసి మరీ  అప్పులు  చేస్తున్నాయి. ఇంత  చేసినా ఇచ్చిన హామీల  అమలుకు సరిపోక.. రాష్ట్రాలకు రాష్ట్రాలు దివాళా ముంగిట నిలబెడుతున్నాయి. అన్నీ ఉచితమంటూనే.. రోజు గడవడానికి ఆదాయం కోసం ప్రజలపైన పన్నులు విధించి ముక్కు పిండి వసూలు చేస్తూ వారి జీవితాలనూ కుదేలు చేస్తున్నాయి. తెలుగు  రాష్ట్రాల ప్రభుత్వాల  ప్రస్తుత స్థితి ఇందుకు ఉదాహరణగా  చెప్ప వచ్చు. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్  విషయాన్నే తీసుకుంటే..  అప్పులు కూడా చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు వ్యయం చేస్తోంది.  అదే చేత్తో నిత్యావసర ధరలన్నీ విపరీతంగా  పెంచేసి ఆ ప్రజల నెత్తినే బండ పడేస్తోంది. పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి  రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది ఏపీ సర్కార్. ఏపీ  దుస్థితికి  పరోక్షంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా కారణమే. రాజకీయ ప్రయోజనం ఆశించి కేంద్రం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతకంటే అడ్డగోలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఈ  పరిస్థితుల్లో మోడీ ఉచితాలు ప్రమాదకరం అంటూ తనదైన స్టైల్ లో ఓ హెచ్చరిక జారీ చేశారు.  యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఉచిత పథకాలపై రాష్ట్రాలకు సూచన లాంటి హెచ్చరిక చేశారు. ఇది  దేశ అభివృద్ధికి విఘాతమని ఉద్ఘాటంచేశారు.   దేశ ప్రగతికి ఫ్రీ బీస్  గొడ్డలి పెట్టు వంటివన్నారు. ఉచితాలు అనర్ధదాయకమనీ, వీటిని నియంత్రించే విషయంలో  రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలని, లేదా కేంద్రం ఈ దిశగా చట్టం  చేయాలని కేంద్ర ఎన్నికల  సంఘం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చే పార్టీలను, ప్రభుత్వాలను నియంత్రించే దిశగా చట్టం రావలసిన అవసరం ఉందనడంలో సందేహం  లేదు. కేబినెట్ పరిమాణాన్ని నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చిన విధంగానే ఈ ఫ్రీ బీస్ హామీలను నియంత్రించే దిశగా కూడా చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ నిపుణులు గత కొంత కాలంగా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. అయితే అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీలు ఈ దిశగా పడే ప్రతి అడుగుకూ ప్రతిబంధకంగా మారుతున్నారు. రుణ మాఫీ హామీని విమర్శించిన నోటితోనే కేంద్రం కూడా రుణ మాఫీ హామీ ఇచ్చిన సంగతినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అసంబద్ధం కాదు. అయితే ఉచితాలు అనర్ధం అంటూ మోడీ చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినా హర్షించాల్సిందే. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు. ఏ వ్యూహంతో ఈ హెచ్చరిక చేశారు అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన అనుసరిస్తున్న విధానాలన్నీ  బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కేటాయింపులు, నియామకాలు, ప్రధాన్యతల విషయంలో దేశానికి ప్రధానిగా కాకుండా గుజరాత్ ప్రధానా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలు రాష్ట్రాలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సందర్భం ఏదైనా, అవసరం ఎలాంటిదైనా ప్రధాని నోటి వెంట ఓట్ల కోసం ఉచిత పంపిణీలు దేశ భవితకు ప్రమాదకరమన్న మాటలు మాత్రం అక్షర సత్యమని పరిశీలకులు అంటున్నారు.   మోడీ ఆశీస్సులు లేకుండానే కుప్ప తెప్పలుగా అప్పులు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తిలోదకాలిచ్చేసి మూడేళ్లలోనే రాష్ట్ర భవిష్యత్ ను అంధకార బంధురంగా మార్చేసిన ఏపీ గురించి ఆయన ఏం చెబుతారనీ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకం కాదా అని ప్రశ్నిస్తున్నారు.ఏపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఏపీలా అడ్డగోలుగా అప్పులు చేసి మరీ ఓట్ల కోసం పెట్టుబడిగా పెట్టిన రాష్ట్ర్రాల నిగ్గు తేల్చి వాటిని నియంత్రించడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తేనే మోడీ మాటలకు విశ్వసనీయత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

ఈ బాబా చెప్పిన‌వ‌న్నీ జ‌రిగాయి

జీవితంలో అన్నీ అనుకున్న‌ట్టే జ‌ర‌గ‌వు, ఊహించ‌నివే ఎక్కువ జ‌రుగుతాయి అంటూంటారు త‌త్వ‌వేత్త‌లు. అందుక‌నే ఎలాంటి త‌ట్టుకోలేని క‌ష్టం వ‌చ్చినా దేవుడి ద‌గ్గ‌ర‌కో, మ‌న‌సుకు శాంతి క‌లిగించే న‌మ్మ‌క‌మైన బాబాల ద‌గ్గ‌ర‌కో వెళ్ల‌డం మ‌న‌లో చాలా మందికి అల‌వాటు. ఇది వారి వ్య‌క్తిగ‌త ఆలోచ‌న‌, న‌మ్మ‌కాల మీద‌నే ఆధార‌ప‌డివుంటుంది. కొంద‌రికి కొన్ని అతీత‌శ‌క్తులు ఇప్ప టికీ వున్నాయ‌న్న‌ది అపుడ‌పుడు రుజువ‌వుతుంటుంది. ఇలాంటివి ఎక్కువ‌గా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే వింటాం, చూస్తాం. ఇలాంటి బాబాయే బాబా వాంగా.  ఆమె అస‌లు పేరు వంగెలియా పందెవా గుస్టరోవా ప్ర‌తీవారికి త‌మ భ‌విష్య‌త్తు తెలుసుకోవాల‌న్న కోరిక ఉంటుంది. దానికి పేద‌, ధ‌నిక అనే తేడాలుండ‌వు. కొంద‌రు కొంద‌రిని ఎంతో న‌మ్ముతారు. కొంద‌రు చెప్పిన‌వి చెప్పిన‌ట్టు జ‌రుగుతూంటాయి కూడా. కొన్నిసార్లు అంద‌రం న‌మ్మ‌వ‌ల‌సి వ‌స్తుంది.  బ‌ల్గేరియా వాసులు బాబా వాంగా వ‌ద్ద‌కు వెళుతూంటారు. ఆమె ప‌ట్ల‌ వారికి అపార న‌మ్మ‌కం. ఎందుకంటే అమెరికా ట్విన్ ట‌వ‌ర్స్ మీద ఉగ్ర వాదుల దాడుల గురించి ఆమె ముందే చెప్పారు. స‌రిగ్గా అలానే జ‌రి గింది. ఇలాంటివి ఆమె ఎన్నో చెప్పారు.   బాబా వాంగాని సిద్ధ‌గురువుగా బ‌ల్గేరియా ప్ర‌జ‌లు భావిస్తారు. అంతెందుకు ఇటీవ‌ల జ‌రిగిన‌వాటిలో దాదాపు అన్నీ ఆమె ముందే చెప్పార‌ట‌. 2022లొ జ‌రిగేవి అన్నీ చెప్పార‌ట‌. ఆమె చెప్పిన‌ట్టే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌ర‌గ‌డం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆమె ను  అంద‌రూ బాల్క‌న్ల నోస్ట్రాడామ‌స్‌గా పిలుస్తారు. ఈమె 1996లో క‌నుమూశారు. కానీ ఆమె 5079 వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగే చాలా సంఘ‌ట‌న‌లు వివ‌రించిందిట‌! 2020లో పుతిన్‌, ట్రంప్ జీవితాల్లో ప్ర‌మాదం ఉంద‌ని అలాగే కెమిక‌ల్ వార్ వ‌ల్ల యూర‌ప్లో మాన‌వాళి ఊహించ‌ని ఘోరం జ‌రిగే ప్ర‌మాదం వుంద‌ని ఆమె చెప్పార‌ట‌. బాబా వాంగా గురించి క‌థ‌లు క‌థ‌లుగా బ‌ల్గేరియా అంత‌టా చెప్పుకుంటూంటారు. ఆమెకు ఈ శ‌క్తులు రావ‌డం గురించీ ఒక క‌థ వుంది. ఒక‌సారి ఒక తుపాను గాలికి ఆమె చిక్క‌కున్నార‌ట‌. ఆ విప‌రీత గాడుపు ఆమెను ఎత్తి కింద‌ప‌డేసింది. ఆమె త‌ల‌కు దెబ్బ త‌గిలి దుమ్మంతా క‌ళ్ల‌లో ప‌డి చూపు పోయింద‌ట‌. చిత్ర‌మేమంటే, ఆ దుర్ఘ‌ట‌నే ఆమెకు ఈ అతీత‌శ‌క్తులు ఇచ్చింద‌ని ప్ర‌చారంలో వుంది.  ఏదేమ‌యినప్ప‌టికీ, బాబా వాంగా చెప్పిన‌వన్నీ జ‌రుగుతుండ‌డంతో ఆమెను దైవ‌దూత‌గా భావిస్తు్నారు బ‌ల్లేరియ‌న్లు.  2020లో ట్రంప్ బ్రెయిన్ ట్యూమ‌ర్ తో బాధ‌ప‌డ‌తార‌ని ఆమె చెప్పిన‌ట్టే జ‌రిగింది. అలాగే రష్యా పుతిన్ పై త‌న అధికారిక కార్యా ల‌యంలోనే హత్య‌కు గుర‌వుతారు, లేదా ఆయ‌న త‌ప్పించుకునే అవ‌కాశం కూడా ఎంతో వుంద‌ని చెప్పారు. అంతేకాదు యూర‌ప్ ముస్లిం ఉగ్రవాదుల దాడిలో చిత్త‌వుతుంద‌నీ చెప్పారు. ఆమె చెప్పిన‌వేవీ త‌ప్ప‌లేదు. ఐఎప్ ఐఎస్ వికృత రూపంతో ప్ర‌భావం చూపుతుం ద‌ని, అమెరికా 44వ ప్రెసిడెంట్ గా ఆఫ్రికా-అమెరిక‌న్ అవుతాడ‌ని వాంగాయే ముందుగా చెప్పారు.   ఇలాంటివారు చాలా అరుదుగా వుంటారు. భార‌త దేశంలో పూర్వం రుషులు ఇలానే చెప్పేవార‌ని మ‌న పురాణాలు పేర్కొంటు న్నాయి. కానీ ఇలాంటివారిలానే చాలామంది ఇపుడు బాబాల‌మంటూ దొంగ‌లు త‌యారవుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌ర్ని న‌మ్మాలో అర్ధంగాని సందిగ్ధ‌తా ఏర్ప‌డిన మాటా నిజ‌మే. 

ఆ అమ్మ ప్రేమకు ఫిదా కాని వారుంటారా?

అమ్మ ప్రేమకు  హద్దులుండవు. అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే.. అందుకే అంటారు అమ్మ అని. తన బిడ్డ భద్రత కోసం, క్షేమం  కోసం అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డ కోసం ఆ  అమ్మ పడిన  తపన కళ్లు చెమర్చేలా  చేస్తుంది. అయితే  ఆ అమ్మ మనిషి కాదు.. ఓ ఏనుగు. తన పిల్లను  రక్షించుకోవడం  కోసం ఆ  అమ్మ ఏనుగు పడిన తపన, తాపత్రేయం, బాధ, వేదన  మనసును కదిలించేస్తుంది. ఈ సంఘటన థాయ్ ల్యాండ్ లోని నకోన్ నాయక్ప ప్రాంతంలో  జరిగింది. గున్న ఏనుగు ప్రమాద వశాత్తూ గుంతలో పడిపోయింది. ఆ గున్న ఏనుగు తల్లి తన బిడ్డను  రక్షించుకోవడానికి పడిన తపన, తాపత్రేయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ అమ్మ ప్రేమకు  ఫిదా అవుతున్నారు.  పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.  గుంత చుట్టూ తిరుగుతూ   బిడ్డను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనై మూర్ఛిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక జూ  అధికారులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత గున్న  ఏనుగును గుంత  లోనుంచి బయటకు తీసి  రక్షించారు. స్ఫృహలోకి  వచ్చిన తరువాత తల్లి  ఏనుగు పిల్లతో కలిసి  అడవిలోకి వెళ్లిపోయింది.  

కేంద్రంతో తాడో పేడో.. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

కేంద్రంపై పోరు బాటను వీడేదేలే అంటున్నారు కేసీఆర్. కేంద్రంపై ఆయన పూరించిన శంఖారావానికి కదిలి వచ్చిన పార్టీలేవీ లేకపోయినా.. నిరాశ దరికి రానీయకుండా ముందుకే సాగుతున్నారు. ఇప్పటి వరకూ మీడియా సమావేశాలు, సభలకే పరిమితమైన టీఆర్ఎస్ పోరు ఇప్పుడు పార్లమెంటు వేదికగా మోడీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది.సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కేంద్రం విధానాలపై పోరును తారస్థాయికి తీసుకువెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు నిధులు కేటాయింపు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్  చూపుతున్నవివక్షపై గట్టిగా గళమెత్తాలని ఆదేశించారు. ప్రతీ విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటున్న కేసీఆర్ కేవలం తెలంగాణ విషయమే కాకుండా..  ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీయేతర పార్టీల సభ్యులను కూడా కలగలుపుకుని నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయాలని తెరాస ఎంపీలకు సూచించారు. కేంద్రంపై టీఆర్ఎస్ పోరు కేంద్రంలో మోడీ సర్కార్ గద్దె దిగే వరకూ కొనసాగుతూనే ఉంటుందని, ఈ విషయంలో వెనకడుగు ప్రశక్తే లేదనీ స్పష్టం చేసిన కేసీఆర్,  అందులో భాగంగానే  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో టీఆర్ఎస్ విమర్శల వాడి వేడిని  కేంద్రానికి తెలియజేయాలని సూచించారు.  పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాల్సిన పలు అంశాలపై వారికి సూచనలు చేశారు.  రాష్ట్ర పతి ఎన్నికలో  యశ్వంత్ సిన్హాకే బీజేపీయేతర పార్టీల ఎంపీల ఓట్లు పడేలా చూడాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించాు.   సమస్యలపై, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసే విషయంలో విపక్ష పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని సూచించిన కేసీఆర్ అందు కోసం ఇప్పటికే టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో కేసీఆర్ పోన్లో సంప్రదించారు. గత సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలో ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేశారు. అయితే ఆ తరువాత కేంద్రం ముడి బియ్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలోలా ఇప్పుడు సమావేశాల బహిష్కరణ కాకుండా సభలో ఉంటూనే అవసరమైతే సభా కార్యక్రమాలను స్తంభింప చేసైనా సరే తెలంగాణ వాణిని దేశ వ్యాప్తంగా వినిపించాలని కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.  

ఘటోత్సవంతో ప్రారంభమైన లష్కర్ బోనాల సందడి

తెలంగాణలో ఆషాఢం బోనాల ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సికింద్రాబాద్ లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలి బోనం సమర్పించారుతెల్లవారుజామున అమ్మవారికి తలసాని బోనం తొలి బోనం సమర్పించారు. అనంతరం మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే మహంకాళి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు.  భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులంతా క్యూలైన్లలో వెళ్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లష్కర్‌ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి. మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.    సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు కాగా కరోనా కారణంగా గత రెండేళ్లుగా బోనాల సందడి కనిపించని సంగతి విదితమే. రెండేళ్ల తరువాత బక్తులను అనుమతిస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.  ఘ‌టోత్సవంతో లష్కర్ బోనాల సందడి మొదలైంది. తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. అనంతరం సాకలు సమర్పించారు.   కాగా బోనాల సందర్భంగా పలువురు ప్రముఖులు మహంకాళి దేవాలయాన్ని సందర్శించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తదితరులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.  రెండురోజులపాటు జ‌రిగే ఉత్సవాల్లో తొలిరోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. రంగం తర్వాత  అంబారు ఊరేగింపు ఉంటుంది.

సీతక్కకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏటూరు నాగారంలో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలలో ఆమె పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఆమె పర్యటన అంతా వరద ప్రవాహంలో పడవపైనే సాగింది. బాధితులకు నిత్యావసర వస్తువులు అందించి తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న పడవలో ఇంధనం అయిపోయింది. ప్రవాహ వేగానికి కొంత దూరం ప్రయాణించిన పడవ వరద నీటిలో ఒక చెట్టును ఢీ కొంది. ఆ తరువాత ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. ఆ పడవ లోనుంచి ఆమె బయటకు వస్తున్న వీడియోను కూడా ఆ పోస్టుకు జత చేశారు. ఇంత ప్రమాదం  జరిగినా ఆమె తన పర్యటన కొనసాగించారు. బాధితులను ఆదుకొనే విషయంలో తగ్గేదే లే అని మరోసారి నిరూపించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితులను ఆదుకునే విషయంలో సీతక్క ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా పనులు లేక పస్తులుంటున్న పేదలను ఆదుకోవడానికి ఆమె నిత్యావసర వస్తువులను ఒక బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను నెత్తిన పెట్టుకుని మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి మరీ సహాయం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి  కూడా ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయకుండా వరదనీటితో పడవపై వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించి, వారికి ధైర్యం చెబుతున్నారు. సీతక్క ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

వదలని వానలు.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు వానలు విడవనంటున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశముంది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జులై 17, 18 తేదీలతో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.  ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,  వరంగల్‌, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.   శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.    ఇలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఏరియల్  సర్వే నిర్వహించనున్నారు. అలాగే ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారు. భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్  జిల్లాలలో ఆయన ఏరియల్ సర్వే  నిర్వహిస్తారు.  మరో వైపే గవర్నర్ తమిళిసై కూడా కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. శనివారం రాత్రే ఆమె రైలులో కొత్తగూడెం కు బయలు దేరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆమె బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటారు. ముంపు ప్రాంతాల పర్యటన కోసం గవర్నర్ తమిళిసై తన హస్తిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తమిళిసై ముంపు ప్రాంతాల పర్యటనపై రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడిన అనంతరం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నట్లు  సీఎం కార్యాలయం ప్రకటించింది.   దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం ఏ మాత్రం తగ్గలేదని రాజకీయ వర్గాలలో చర్చకు తెర లేచింది.

పార్లమెంటు వేదికగా విపక్షాల ఐక్య పోరాటానికి టీఆర్ఎస్ వ్యూహం

సోమవారం (జులై 18) నుంచి పార్లమంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంటు సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు మరో స్థాయిలో ఉంటాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. గతంలోలా రాష్ట్ర్ర సమస్యలపై ఒంటరిగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ నిరసనలు తెలపడం, వాకౌట్ చేయడంతో సరిపుచ్చేయకుండా.. బీజేపీయేతర సభ్యుల మద్దతుతో తమ గొంతు బలంగా వినిపించాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే వారికి దిశా నిర్దేశం చేశారు. గతంలోలా నిరసన గళం వినిపించి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే దేశ వ్యాప్తంగా తెరాస వాణి వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా దేశం దృష్టిని ఆకర్షించేలా తెరాస సభ్యుల నిరసనలు ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు  బీజేపీయేతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీయేతర పార్టీల నేతలతో ఫోన్ లో సంభాషించారు.  పార్లమెంట్‌లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా గళమెత్తాలనీ సస్పెన్షన్ వేటు వేసినా వెనుకడుగు వేయవద్దని కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.  తెలంగాణ అభివృద్థిని ఓర్వలేకే కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నదనీ, కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ పార్లమెంటు వేదికగా దేశం మొత్తం తెలిసేనా టీఆర్ఎస్ సభ్యులు గళమెత్తాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని వంటి అంశాలను గణాంకాలతో సహా పార్లమెంటులో వినిపించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.  ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని  ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలవాలని ఆయన బీజేపీయేతర పక్షాల నేతలను కోరారు. ఇందు కోసం ఆయన  విపక్ష నేతలతో శుక్రవారమే  ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.  

సోమవారం నుంచి నిర్మాతల సమ్మె.. షూటింగ్ లు బంద్

తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మాతలు సమ్మె బాట పట్టారు. సోమవారం నుంచి షూటింగ్ లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ సినీ కార్మికులు వేతనాల పెంపు డిమాండ్ తోనో.. ఇతర భాషల నుంచి టెక్నీషియన్లకు ఎక్కువ అవకాశాలిస్తున్నారనో సమ్మె చేయడం తెలుసు కానీ ఎన్నడూ నిర్మాతలే సమ్మె బాట పట్టి షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించడం మాత్రం ఇదే మొదటి సారి. శనివారం జరిగిన నిర్మాతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూతపడుతున్న సినిమాహాళ్లు, పెరిగిపోతున్న హీరోల పారితోషకాలు, ఓటీటీల వల్ల పడిపోతున్న కలక్షన్ల ఇలా పలు అంశాలపై చర్చించారు. చివరికి సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ సినిమా షూటింగ్ లు బంద్ చేయడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని సోమవారం నుంచి అమలు చేయాలని తీర్మానించారు. అదే జరిగితే సినిమా రంగంపై ఆధారపడిన కార్మికులు కష్టాల్లో పడతారనడంలో సందేహం లేదు. అయితే నిర్మాతల సమ్మె నిర్ణయం మాత్రం ఒక సంచలనంగా మారింది. 

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. శనివారం రాత్రి మోడీ అధ్యక్షతన సమవేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడిగా, ఆ తరువాత 1993 నుంచి 1998 వరకూ కిషన్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న జగదీప్ దినకర్ 2019 జులై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.  ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం (జులై 19)తో ముగియనున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ఖరారు చేశారు. ఉప రాష్ట్ర పతి ఎన్నిక పోలింగ్  ( ఒక వేళ అవసరమైతే) ఆగస్టు 6న జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడుతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు విపక్షాలను సంప్రదించే అవకాశాలున్నాయని జేపీ నడ్డా తెలిపారు.  అయితే విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు ఆదివారం (జులై 17) సమావేశం కానున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విపక్ష నేతలంతా హాజరౌతారని భావిస్తున్నారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో జగదీప్ ధన్ కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది. ప్రస్తుత ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.

మండపేట సభలో పవన్ వ్యాఖ్యలతో పొత్తులపై ఊహాగానాలు

మండపేటలో జనసేన రైతు భరోసా యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ఏపీకి హానికరంగా మారిందన్నారు. మరో సారి జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే ఏపీకి అంధకారమేనన్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ మహాత్మాగాంధీ అయిపోరని, ఆయన అధికారం కోసమే నడిచారన్నారు. ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసిన జగన్ ఇప్పుడు  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ చైతన్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచే  మార్పు రావాలన్నారు. కోనసీమ విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీయే అని ఆరోపించారు. నిజంగా అంబేడ్కర్ మీద ప్రేమతో కాకుండా రాజకీయ దురుద్దేశంతో కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టారని విమర్శించారు. అంబేడ్కర్ ను రాజకీయాలకు వాడు కోవడం సరికాదన్నారు. ఈ  సభ వేదికగా ఆయన పొత్తులపై మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆయన పొత్తుల గురించి నేరుగా  ప్రస్తావించలేదు. ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో రాష్ట్ర్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే అంధకారమే అని హెచ్చరించారు. అభ్యర్థిని చూసి  కాకుండా  తనను చూసి ఓట్లేయాలని జనసేనాని అన్నారు. ఓడినా ప్రజలకు అండగా ఉంటానని అనడం, అదే సమయంలో 2024 ఎన్నికలలో జనసేన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేయడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. తనను చూసి ఓటేయండి అభ్యర్థిని చూసి కాదు అనడం వెనుక పొత్తులకు సంబంధించిన సంకేతమేమన్నా ఉందా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   మొత్తం మీద పవన్ కల్యాణ్ జనసేన రైతు భరోసా యాత్రలో ఎన్నికల శంఖారావం మోగించేశారనీ, వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యంగా ప్రకటించేశారనీ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడం, తెలుగుదేశంపై  ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో రాష్ట్ర్రంలో మళ్లీ 2014 ఎన్నికల నాటి పొత్తులకు ఏమైనా అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  

వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తే ఏపీ అంధకారమే!

పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం మోగించేశారు. జనసేన ఎన్నికలకు సిద్ధంగా ఉందని ప్రకటించేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆయన శనివారం ఆయన లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా  కోనసీమ జిల్లా మండపేటలో  ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఏపీ భవిష్యత్‌కు  హానికరంగా మారిన వైసీపీ మరో సారి అధికారంలోకి రాకూడదన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజల్ని తాను కోరడం లేదనీ,  ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తనకు జగన్‌ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు  కోట్ల రూపాయలు  సాయం అంద జేశానని చెప్పిన పవన్ కల్యాణ్.  ప్రభుత్వం   ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల  కుటుంబాలకు  రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకే   ఎన్నికల సమయంలో జనసేన  ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదన్నారు. గతంలోలాగే ఆయన ప్రసంగంలో కొంత అస్పష్టత కనిపించింది.  జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని తాను కోరడం లేదని అంటూనే తమ పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. అభ్యర్థి ఎవరన్నది చూడకుండా తనను చూసి ఓటేయమన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. ఎన్నికలలో విజయంపై భిన్న వ్యాఖ్యలు చేసినా వైసీపీ అధికారంలోకి రాకూడదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు.   కులాలను గౌరవిస్తూనే కుల రహిత సమాజం కోసం ఆలోచించాలన్నారు. యువత తిరగబడితేనే మార్పు వస్తుందన్నారు. 

తెలంగాణాను ఆదుకోండి..ప్ర‌ధానికి రేవంత్ లేఖ

గ‌త‌ పది రోజులుగా  కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్త వ్యస్తంగా మారింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుండి వస్తున్న వరదతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామా లు నీట మునిగి,  ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది.  తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీకి  టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాసిన లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు.  తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి  తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోడీ కి రాసిన లేఖలో లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేగాక  పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరా రు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనా లు , ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించా లని లేఖలో కోరారు. రోడ్లను మరమ్మతు చేయడానికి పునర్నిర్మించడానికి, నిత్యావసర వస్తువుల సరఫరా ను పునరుద్ధరించటానికి కేంద్రం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో కుండ పోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారితే, గ్రామాలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటే కెసిఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి వర్షం కురిసి ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమై పోతే  ఒక ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విట్టర్ పిట్ట కూతలు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి నట్టు సమాచారం లేదని తెలిసి తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించ‌డం అవివేకమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  కమీషన్ల కోసం  ఒక లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారని,  కానీ వాటి నిర్వ హణకు నయాపైసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, కమిషన్ ఇచ్చేవారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి  కానీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వడానికి మాత్రం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ  ఇంట్లోనే  104 ఏళ్ల గా ఉంటున్నా..ఆల్కాక్‌

గ్రామాల్లో అమ్మ‌మ్మ‌లు, తాత‌య్య‌ల ఇళ్లు ఇపుడు లేవు. ఇపుడంతా అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ వ‌చ్చేసింది. ప‌ట్ట‌ణానికి, గ్రామానికి పెద్ద‌గా తేడా తెలియ‌డం లేదు. కానీ ఇప్ప‌టికీ చాలా పాత ఇంట్లో నివాసం వుంటోంది ఎలిసీ ఆల్కాక్‌. బ్రిట‌న్ నుంచి అమెరికా వ‌చ్చి వుంటున్న ఆల్కాక్ 1918లో జ‌న్మించింది. హ‌త్‌వైట్ లోని బార్క‌ర్ స్ట్రీట్‌లో ఆమె తండ్రి 1902లో ఒక ఇల్లు ఏడు షిల్లింగుల‌,ఆరు పెన్స్‌కి కొన్నాడ‌ట‌. అంటే ఇప్ప‌టి లెక్క‌ల్లో ఆ యిల్లు సుమారు 2,800 డాల‌ర్ల‌ట‌! ఆల్కాక్ రెండు ప్ర‌పంచ‌యుద్ధాలు, న‌లుగు రాజులు, రాణు లు, 25 మంది ప్ర‌ధానుల కాలం గ‌డ‌చిపోవడానికి సాక్షిగా వున్న‌ది.  ఆల్కాక్ ఐదుగురు సంతానంలో చివ‌రిది. 1941లో అంటే రెండ‌వ ప్ర‌పంచ‌యుద్ధం కాలంలో  బిల్ అనే వ్య‌క్తిని వివాహంచేసుకుని ఇక్క‌డే వుంటోంది. ఆల్కాక్  14వ ఏట ఆమె త‌ల్లి న్యుమోనియాతో మ‌ర‌ణిం చారు. అప్ప‌టి నుంచి  తండ్రితోనే  వుంటున్నారు. 1949లో ఆమె తండ్రి కూడా మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ ఇంటిని  తాను తండ్రి ఇచ్చిన ఆస్తిగా తీసుకున్నారు. ఆ త‌ర్వాత క్ర‌మేపీ ఇంటిని కొద్దిపాటి మార్పులు చేస్తూ బాల్య జ్క్షాప‌కాల‌తో ఇంకా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఆల్కాక్‌. ఇంటితో వుండే అనుబుంధం అలానే వుంటుంది. అందుకే అంటారు.. పుట్టినింటి నుంచి దూరంగా వెళ్ల‌వ‌చ్చునేమోగాని.. ఆ ఇంటిని మ‌న‌సు లోంచి దూరం చేసుకోలేమ‌ని.  నిజ‌మే క‌దూ!