డెంగీ, చికెన్‌గున్యాలను తరిమికొడదాం!

  డెంగీ- ఒకప్పుడు దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడో! ఈ పేరు వినని వారు ఉండరు. ఓ నాలుగు చినుకుల వర్షం కురిస్తే ఈ మహమ్మారి ఎక్కడ బయటకి వస్తుందో అని అనుమానం! ఓ రెండు డిగ్రీల జ్వరం పెరిగితే అది డెంగీ ఏమో అన్న భయం! వెరిసి డెంగీ ఇప్పుడు ఇంటింటి పేరు. ఇంతకీ ఈ డెంగీ ఏమిటి? దాన్నుంచి తప్పుకునే మార్గమే లేదా అంటే లేకేం....   డెంగీ వ్యాధి ఏడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. మిగతా దోమలకంటే ఈ ఏడిస్‌ దోమ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ దోమ మన ఇంట్లో నిలువ ఉండే మంచినీటిలో సులభంగా బతికేస్తుంది. పాత టైర్లు, కుండీలు, కూలర్లు, ఫ్లవర్‌వాజులు, ఈతకొలను, నీటిడ్రమ్ములు... ఇలా ఎక్కడ మంచినీరు కాస్త నిలువ ఉంటే, అక్కడ వందలకొద్దీ గుడ్లను పొదిగేస్తుంది. పైగా ఇది పగటివేళల్లోనే కుడుతుంది. మన ఇళ్లలోని కర్టెన్ల వెనకాల, మంచాల కింద, బీరువాల చాటునా బతికేస్తూ అదను చూసి మన మీద దాడి చేస్తుంది. ఈ వైరస్‌ ఉన్న దోమ కుట్టినప్పటి నుంచి వారం రోజుల లోపు డెంగీ సూచనలు కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా తలనొప్పి, కళ్ల వెనుక పోట్లు, కీళ్లు కండరాల నొప్పులు, దద్దుర్ల వంటి లక్షణాలు ఉండవచ్చు. అరుదుగా చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు.   మన శరీరంలోని రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, రక్తం పలచబడటం వంటి సూచనల ద్వారా రోగికి డెంగీ సోకిందని నిర్ధారిస్తారు. డెంగీ సోకిన వ్యక్తి ఒకటి రెండు వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటివరకూ తగినంత విశ్రాంతిగా ఉండటం, పోషకాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇక డెంగీతో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి... నీరు, పండ్లరసాలు, ORS వంటి ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.   డెంగీ ప్రాణాంతకం కాదు. అలాగని వైద్యుని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాత్రలు వేసుకుంటే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. ఇక కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం, ఆయాసం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు, రక్తస్రావం... వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. సకాలంలో అందే వైద్యంతో డెంగీ రోగలక్షణాలు తగ్గడమే కాకుండా, ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డెంగీ వచ్చాక తీసుకోవల్సిన జాగ్రత్తల కంటే అది రాకుండా చూసుకోవల్సిన అవసరమే ఎక్కువ. ఇందుకోసం...   - ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - తేమ లేదా చీకటిగా ఉండి దోమలు వృద్ధి చెందే పరిస్థితులు ఉన్నచోట బజార్లో దొరికే దోమల మందుని చల్లాలి. - ఉదయం వేళ్లలో కూడా మస్కిటో రిపెల్లంట్స్‌ని వాడుతూ ఉండాలి. - రోజంతా పడుకుని ఉండే పసిపిల్లలకి ఉదయం వేళల్లో కూడా దోమతెరని కట్టాలి. - శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.   చికెన్‌గున్యా డెంగీలాగానే చికెన్‌గున్యా కూడా ఏడిస్‌ దోమ ద్వారానే వస్తుంది. అయితే జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి, కీళ్లనొప్పులను ఈ వ్యాధిలో గమనించవచ్చు. వ్యాధి తగ్గిన తరువాత కూడా వారాలు, నెలల తరబడి కీళ్లనొప్పులతో రోగి బాధపడటం చికెన్‌గున్యాలో సాధారణం. అందుకే చికెన్‌గున్యా వచ్చిన రోగులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటుగా కీళ్లనొప్పులకు మందులను కూడా వాడవలసి ఉంటుంది. డెంగీ దోమలు వ్యాపించకుండా, అవి కుట్టకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, అవన్నీ చికెన్‌గున్యాకు కూడా వర్తిస్తాయి.   డెంగీ, చికెన్‌గున్యాలు రెండూ ప్రాణాంతకం కాకపోయినా, రోగిని నిస్సహాయంగా మంచాన పడవేసే వ్యాధులు. వీటి బారిన పడినవారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి అవి వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. వాటిని మన జీవితాల్లోంచి తరిమికొడదాం!    ..Nirjara

జ్వరం ఇక దూరం

  జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదంటారు పెద్దలు. కానీ ఎంత జరుగుబాటు ఉంటే మాత్రం మంచంలో అలా నిస్సహాయంగా పడి ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. జ్వరంతో పాటుగా వచ్చే సలపరింత, ఒళ్లునొప్పులు వంటి నానారకాల చిరాకులని ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకనే జ్వరమొస్తే దాన్ని ఎలా తగ్గించుకోవలన్న తపనే అందరిదీనూ. అందుకోసమే ఈ వివరణ!   వైరల్‌ ఫీవర్లు! మనకు వచ్చే జ్వరాలలో రెండు మూడు రోజుల పాటు సతాయించి విడిచిపెట్టే వైరల్‌ ఫీవర్లే ఎక్కువ. అందుకని ఆరోగ్యంగా ఉండే పెద్దలు ఒకటి రెండు రోజుల పాటు ఉండే జ్వరాల గురించి అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ కింది సందర్భాలలో మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది...   - శరీర ఉష్ణోగ్రత 103ని తాకుతున్నప్పుడు. పసిపిల్లలలో అయితే ఈ ఉష్ణోగ్రత 100.4 దాటినా కూడా వైద్యుని సంప్రదించడం మేలు.   - రెండు రోజులకి మించి జ్వరం కనిపిస్తున్నప్పుడు.   - దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, నీరసం, కళ్లుతిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అతిగా దాహం వేయడం... వంటి ఇతర లక్షణాలు కనిపించినప్పుడు.   - బ్రాంకైటిస్, బీపీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉన్నప్పుడు.   చిట్కాలు చిన్నపాటి వైరల్‌ జ్వరాలలో ఉపశమనానికి ఈ కింద చిట్కాలను పాటించి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు   - జ్వరంతో శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మూత్రం కూడా పచ్చగా మారడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఒళ్లు వేడిగా ఉన్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం మంచిది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, జ్వరంగా ఉన్న రోజుల్లో కనీసం 8- 12 గ్లాసుల నీటిని తీసుకోమని చెబుతున్నారు. వైద్యులు. దీనివల్ల ఒంట్లో నీటి శాతం పెరగడమే కాకుండా, ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది.   - గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత నిదానంగా తగ్గడమే కాకుండా, శరీరంలో ఉన్న అలసట కూడా తీరుతుంది. అలాగని చన్నీటి స్నానం చేస్తే మాత్రం, శరీరంలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   - చల్లని నీటిలో తడిపిన గుడ్డతో నుదురు, మణికట్టు, మెడ, పాదాలని తుడుస్తూ ఉంచడాన్ని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఒకేసారి అన్ని ప్రాంతాలలోనూ తుడిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో తుడిస్తే సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే సాక్సుని తడిపి రాత్రంతా ఉంచుకునే చిట్కాని వాడతారు, కానీ మన వాతావరణానికి అది సరిపోకపోవచ్చు.   - ఒకప్పుడు జ్వరం వస్తే లంఖణాన్నే (ఉపవాసం) మందుగా భావించేవారు. జ్వరాన్ని నయం చేసుకునేందుకు శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడమే ఉపవాసంలో ఉన్న లక్షణం. ఇప్పుటి ఉరుకులపరుగుల జీవితంలో ఉపవాసాలు కుదరకపోయినప్పటికీ.... తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీటికి తోడుగా సీ విటమిన్‌, నీటి శాతం ఎక్కువగా ఉండే నారింజ వంటి పండ్లని కూడా తీసుకోవాలి.   - మన ఇంట్లోనే దొరికే తులసి, అల్లం వంటి ఔషధులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం దక్కుతుంది.     - నిర్జర.

శ్రీలంకలో మలేరియా మాయం... మరి మనమో!

  మన పక్కనే ఒక బిందువులా కనిపించే ఓ చిన్న దేశం శ్రీలంక. నిన్నమొన్నటి వరకూ నిరంతర అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోయిన దేశం. ఇప్పుడిప్పుడే ఆక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి ఓ దేశం ఊహించని అద్భుతాన్ని సాధించింది. మలేరియా రహిత దేశంగా సగర్వంగా నిలిచింది. పెద్దన్నలాంటి మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ విజయగాధ...   అనుకూలమైన పరిస్థితులు శ్రీలంకలో అడవుల శాతం ఎక్కువ. నీటి లభ్యతకీ కొదవేమీ లేదు. పైగా చుట్టూ సముద్రమే! దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది. ఇక శ్రీలంకలో గ్రామీణ ప్రాంతాలే అధికం కాబట్టి, ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స తీసుకోవాలన్న అవగాహన కూడా తక్కవే! దాంతో ఒకప్పుడు లక్షలాది మలేరియా కేసులు నమోదయ్యేవి. వేలాదిమంది జనం పిట్టల్లా రాలిపోయేవారు.   యుద్ధం మొదలు శ్రీలంక ప్రభుత్వం ఆది నుంచీ కూడా మలేరియా మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంది. మలేరియా పరీక్ష కోసం చేసిన రక్తపరీక్షల ఫలితాలను 24 గంటలలోనే అందించడం, డీడీటీ వంటి రసాయనాలతో దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి జాగ్రత్తలను పాటించేది. ఇక 1958 నాటికి మలేరియా మీద పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించింది. ఇందుకోసం కొలంబియాలో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. మలేరియాని అదుపుచేసేందుకు ఉపయోగించే డీడీటీ ప్రమాదకరం అని తేలిపోవడంతో సరికొత్త ప్రణాళికలతో తన యుద్ధాన్ని కొనసాగించింది.   ఇవీ చర్యలు - మలేరియా గురించి, దాని నివారణ చికిత్సల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహనను కలిగించడం. - మలేరియా బారిన పడిన రోగులకు సత్వర చికిత్స అందించడం ద్వారా, వారి నుంచి ఆ రోగకారకాలు ఇతరులకు చేరకుండా చూసుకోవడం. - వర్షపాతం, నీటిప్రవాహం వంటి సూచనల ఆధారంగా మలేరియా ప్రబలే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అక్కడకు తగిన వైద్య సిబ్బందిని పంపించడం. - దేశంలో నమోదవుతున్న మలేరియా కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడ ఆ వ్యాధి ప్రబలుతోందో గమనించడం. భవిష్యత్తులో ఆ ప్రాంతాల మీద మరింత దృష్టిని సారించడం. - ఒకపక్క మలేరియాని నివారించడం కోసం తగినన్ని నిధులను కేటాయిస్తూనే, మరో పక్క ఆ వ్యాధి మీద మరింత పట్టుని సాధించేందుకు పరిశోధనలు సాగించడం. ... ఇలా రకరకాలా చర్యలతో గత మూడు సంవత్సరాలుగా దేశీయంగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రకటించింది.   మరి మనమో! మన దేశంలో మలేరియా అంటే సర్వసాధారణమైన విషయం. ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా జనం ఇక్కడ మలేరియా బారిన పడుతూ ఉంటారు. ఇక ఓ వెయ్యమంది వరకూ ఈ వ్యాధితో మృత్యుఒడిని చేరుతూ ఉంటారు. శ్రీలంకంతో పోల్చుకుంటే ఇక్కడ జీవనవిధానాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల దగ్గర నిధులకి కానీ, జనాల దగ్గర చదువుకి కానీ కొరత లేదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధి మాత్రమే! ఈ ఏడాది మన దేశం కూడా మలేరియాను 2030నాటికి సమూలంగా నాశనం చేస్తామని ప్రతిన పూనింది. అంటే మరో పదిహేను సంవత్సరాలకు కానీ మనం మలేరియా రహిత భారతదేశాన్ని చూడకపోవచ్చునన్నమాట! మన ఆరోగ్యశాఖల తీరుని గమనిస్తే అప్పటికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానమూ కలగక మానదు.   - నిర్జర.

మీ పిల్లి ప్రాణాంతకం కావచ్చు!

  పిల్లులతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొందరిలో ఆ ఇష్టం కాస్త శృతి మించి వాటితో మోటుగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పిల్లి గోళ్లు కనుక మన శరీరానికి గీరుకుంటే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు అని సూచిస్తున్నారు వైద్యులు.   cat-scratch fever: పిల్లులలో ‘బార్టొనెలా హెర్న్‌సెలే’ అనే ఒక బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందట. ఈ బ్యాక్టీరియా పిల్లుల శరీరం మీద ఉండే రకరకాల పరాన్న జీవుల ద్వారా ఒక పిల్లి నుంచి మరో పిల్లికి వ్యాపిస్తాయి. వీటివల్ల పిల్లులకి పెద్దగా హాని కలుగకపోయినా... ఆ బ్యాక్టీరియా కనుక మనిషి ఒంట్లోకి చేరితే cat-scratch fever అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లులతో ఆడేటప్పుడు వాటి గోళ్లు మనకు రక్తం వచ్చేలా గీరుకున్నా, మన కంటికి తగిలినా... సదరు బ్యాక్టీరియా మనలోకి చేరే అవకాశాలు ఏర్పడినట్లే.   లక్షణాలు - గాయం ఏర్పడిన చోట వాపు లేదా దద్దుర్లు, - శరీరంలోని లింఫ్‌ గ్రంథులు వాయడం, - నీరసం, జ్వరం, తలనొప్పులు, గొంతు నొప్పి, - వెన్నునొప్పి. కీళ్లు, కండరాల నొప్పులు, - బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం...   .... ఇలా రకరకాల లక్షణాల ఈ రోగం ద్వారా ఏర్పడవచ్చు. గాయం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలల వరకు ఎప్పుడైనా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. పైగా పరీక్షల ద్వారా ఈ జబ్బుని గుర్తించడం కూడా కష్టం. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఏవో సాధారణ జ్వరం వల్ల ఏర్పడ్డాయని రోగులు భావించే ప్రమాదమే ఎక్కువ. ముఖ్యంగా HIV వంటి రోగంతో బాధపడుతున్నవారు కానీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ ఈ వ్యాధి బారిన పడితే మరింత అనారోగ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది.   ఉపద్రవం: సాధారణంగా ఈ రోగ లక్షణాలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. మరీ అవసరమైతే తప్ప వైద్యులు కూడా ఈ రోగానికి పెద్దగా మందులను సూచించరు. కానీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం ఈ బ్యాక్టీరియా శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. తాత్కాలికంగా కంటిచూపు మసకబారడం దగ్గర్నుంచీ మెదడు శాశ్వతంగా దెబ్బతినడం వరకూ ఈ బ్యాక్టీరియా ఒకోసారి ఉపద్రవాన్నే సృష్టిస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది ఎముకలు, గుండెను సైతం ప్రభావితం చేస్తుంది.   నివారణ: దాదాపు 40 శాతం పిల్లుల్లో ఏదో ఒక సందర్భంలో ఈ రోగాన్ని కలిగించే బ్యాక్టీరియా పొంచి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పిల్లులతో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏవన్నా గాట్లు తగిలిన తరువాత రోగలక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లిపిల్లల్లో ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటికి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండే పెంపుడు పిల్లులకు కూడా తరచూ వైద్య పరీక్షలను నిర్వహించమని చెబుతున్నారు.   - నిర్జర.

మధుమేహానికి వేపుళ్లంటే ఇష్టమట!

  కాలం మారిపోతోంది. కాలంతో పాటుగా మన ఆహారంలోని రుచులూ, అభిరుచులూ మారిపోతున్నాయి. దురదృష్టవశాత్తూ ఇలాంటి మార్పులన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జిహ్వచాపల్యం ఆధారంగానే ఉంటున్నాయి. పండ్లూ కూరగాయలకు బదులుగా వేపుళ్లూ, బేకరీ పదార్థాలూ తీసుకోవడం ఎక్కువైంది. ఇక మాంసం తినేవారైతే గ్రిల్డ్‌ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మార్పులు ఖచ్చితంగా మన అనారోగ్యానికి కారణం అవుతున్నాయంటూ ఇప్పుడు ఒక పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ పలకరించేందుకు సిద్ధంగా ఉన్న మధుమేహపు మహమ్మారికి వేపుళ్లంటే ఇష్టమని తెలియచేస్తోంది.   నీరు- నిప్పు మన వంటలో నీటికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి నిప్పుకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంటే ఆహారాన్ని ఉడికించకుండా వేయించడమో, కాల్చడమో ఎక్కువయ్యింది. ఇలాంటి ఆహారంలో Advanced Glycation End Products (AGEP) అనే పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పదార్థాలు మన శరీరంలోని ఇన్సులిన్‌ వాడకాన్ని దెబ్బతీస్తాయట. ఇన్సులిన్‌ వాడకం సరిగా లేకపోవడంతో, మన శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అధికంగా పేరుకుపోయిన చక్కెర నిల్వల వల్ల గుండె, కిడ్నీలు, కళ్లు వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతాయి. పైగా AGEPల కారణంగా శరీరంలోని కణాలు కూడా వాపుకి (inflammation) లోనై గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   పరిశోధనతో తేలిపోయింది AGEPల కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ వాడకంలో లోపాలు, కణాల వాపు ఏర్పడతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు న్యూయార్కుకి చెందిన కొందరు వైద్యులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఒక వందమంది అభ్యర్థలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారే. అందరూ 50 ఏళ్లు పైబడినవారే. ఈ వంద మందిలో 49 మందిని ఎప్పటిలాగే ఆహారాన్ని తీసుకోమంటూ సూచించారు. మరో 51 మందిని మాత్రం తమ ఆహారాన్ని వండుకునే విధానంలో మార్పులు చేయమని చెప్పారు. వేయించడం, కాల్చడం కాకుండా ఉడికించడం, నానబెట్టడం వంటి పద్ధతుల ద్వారా ఆహారాన్ని వండుకోమని సలహా ఇచ్చారు.   ఫలితం ఊహించినదే! ఒక ఏడాదిపాటు జరిగిన పరిశోధన తరువాత తేలిందేమిటంటే వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తిన్నవారిలో ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపడింది. పైగా కణాల వాపు కూడా తగ్గిపోయింది. దీంతో మధుమేహం ఉన్నవారూ, ఆ వ్యాధి ఎప్పటికీ రాకూడని కోరుకునేవారూ వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలన్న విషయం స్పష్టమైంది. అంతేకాదు! శాకాహారంలో AGEPలు స్వతహాగానే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయనీ, కాబట్టి మధుమేహానికి దూరంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్నే తీసుకోవాలని చెబుతున్నారు.   - నిర్జర.

9/11 దాడి ఇంకా పూర్తవ్వలేదు

  2001, సెప్టెంబరు 11. అల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు బోయింగ్‌ విమానాల సాయంతో అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులతో సహా 2,700కి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి నిన్నటికి 15 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ వేల మంది ఆరోగ్యాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే...     విష వాతావరణం రెండు భారీ విమానాలు అంతకంటే భారీగా ఉన్న భవనాలను కూల్చివేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విస్ఫోటనంలో విమానంలోని ఇంధనం మొదలుకొని, భవన నిర్మాణంలో ఉపయోగించిన యాస్బెట్సాస్ వంటి హానికారక పదార్థాలు ఎన్నో ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. భవనంలో ప్లాస్టిక్‌ మొదలుకొని మానవ విసర్జితాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడ ఉన్న యంత్రాలు, పరికరాలు తగలబడిపోవడంతో మెర్క్యురీ, లెడ్ వంటి విషపదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.     తప్పుడు నిర్ణయం ట్విన్‌ టవర్స్‌ని కూల్చివేడం ద్వారా అల్‌ఖైదా అమెరికాను దారుణంగా దెబ్బతీసినట్లు అయ్యింది. కానీ తమ పౌరుల స్థైర్యం ఇంకా చెక్కుచెదరలేదన్న సంకేతాలను అమెరికా పెద్దలు చెప్పాలనుకున్నారు. అందుకనే ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ప్రదేశంలోని గాలి, నీరు ఇంకా సురక్షితంగానే ఉన్నాయనీ... పౌరులంతా అక్కడే ఉండి తమ రోజువారీ జీవితాన్ని కొనసాగించవచ్చనీ ఊదరగొట్టారు. దాంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు కూడా అక్కడే ఉండిపోయారు. ఆ కాలుష్యంలోనే తమ జీవితాలను గడపసాగారు.     అనారోగ్యాలు మొదలు ఏళ్లు గడిచేకొద్దీ అక్కడి ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విస్ఫోటనం తరువాత ట్విన్‌ టవర్స్ చుట్టుపక్కల నివసించిన ప్రజలు, అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులలో ఒకొక్కటిగా రోగాలు బయటపడసాగాయి. ఆస్తమా, ఊపిరితిత్తులు పాడైపోవడం, డిప్రెషన్‌, నిద్రలేమి మొదలుకొని క్యాన్సర్‌ వరకూ రకరకాల జబ్బులు పీడించసాగాయి.   ఉచిత వైద్యం 9/11 కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్సను అందించేందుకు 2012లో World Trade Center Health Program పేర ప్రభుత్వం ఒక ఆరోగ్య పథాకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ కాలుష్యానికి బాధితులుగా ఉన్నవారంతా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం కింద ఏకంగా 75 వేల మంది ప్రజలు చేరారంటే, 9/11 కాలుష్యం ఎంతమందిని ప్రభావితం చేసిందో ఊహించుకోవచ్చు. అయితే ఈ లెక్క చాలా తక్కువని వాదించేవారూ లేకపోలేదు. 9/11 ఘటన జరిగిన తరువాత కొంతమంది అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారనీ, మరికొందరికి అసలు ఈ పథకం గురించే తెలియదనీ చెబుతున్నారు. పైగా క్యాన్సర్‌ వంటి రోగాలు బయటపడటానికి ఒకోసారి 20 సంవత్సరాల వరకూ సమయం పడుతుంది. కాబట్టి మున్ముందు కాలంలో 9/11 బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. అలా ఉగ్రవాదుల పైశాచికత్వానికి, ప్రభుత్వాల తప్పిదాలు కూడా తోడవ్వడంతో 9/11 భూతం ఇంకా న్యూయార్కు వాసులను వెన్నాడుతూనే ఉంది.   - నిర్జర.

Worried of Platelet count?

  A few days back, very few people are aware of the word Platelet. But thanks to the growing awareness, people are now often worried about their platelet counts and the ways in keeping them steady.   What are Platelets? Platelets are the tiniest cells in our blood that stop bleeding. In other words, they plug the injury and don’t let the blood to drain away. A healthy person might have 150,000 to 450,000 platelets per micro litre of blood. But there might be occasions where the count of Platelets might start falling rapidly.     Reasons In medical terms, low platelet count is called as `Thrombocytopenia’. This might be caused due to... - Anaemia. - Deficiency of B12, Iron and folate. - Viral infections such as HIV, Dengue, Chickenpox. - Drugs ranging from Aspirin to chemotherapy drugs. - Severe illness such as cancer, liver cirrhosis and leukaemia. - Heavy alcohol consumption. - Exposure to radiation, toxic chemicals and chemotherapy.   Symptoms Unusual fall of Platelet count can cause a wide range of symptoms from normal bleeding to brain haemorrhage. Some of them are mentioned here... - Dark coloured skin rashes due to bleeding within the layers of the skin. - Abnormal blood flow in menstruation. - Prolonged bleeding from the wounds. - Continuous bleeding from nose and gums. - Unusual bleeding in stools and urine. - Discomfort, weakness and fatigue.   Treatment Often, a drop in platelet count can be a temporary phenomenon. The advice and diagnosis of a medical expert is needed if the Platelet count drops below 150,000 in our blood. But there is no need to worry unless such dip is the result of a severe illness such as leukaemia. - Earlier, Platelet transfusion is thought to be an immediate remedy to increase the count. But now experts are suggesting platelet transfusion to be a last resort as it is expensive and has some   side effects. - Various drugs such as Romiplostim (Nplate), Eltrombopag (Promacta) are widely available to induce Platelet count. - Foods such as Papaya, Pumpkin, Pomegranate, Milk, Carrots, Wheatgrass, Spinach, Oranges are thought to be highly useful in encouraging the Platelet count. - Pills made out of Carica papaya leaf extracts (ex: Carpill) have proved to induce the Platelet count without any side effects.    - Nirjara.  

రాత్రి తిండి ఆరోగ్యానికి చేటు

  పగటి నిద్ర ఆరోగ్యానికి చేటు అని కొందరు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ, రాత్రి పొద్దుపోయాక తినే తిండి తప్పకుండా మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు చెబుతున్న కారణాలు కూడా ఏమంత ఆషామాషీగా కనిపించడం లేదు.   - సూర్యోదయ సూర్యాస్తమాలకు అనుగుణంగా మనలో ఒక జీవగడియారం పనిచేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ జీవగడియారాన్ని అనుసరించి పగటివేళ మన శరీరం పనిచేయడానికీ, ఆహారం తీసుకోవడానికీ సిద్ధపడితే, రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.   - ఈ జీవగడియారాన్ని అనుసరించి మన జీర్ణవ్యవస్థకు రాత్రివేళల్లో కనీసం 12 గంటల విశ్రాంతి అవసరం. అయితే ఇలా జీర్ణవ్యవస్థ విశ్రాంతిగా ఉండాల్సిన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి రుజువుచేసేందుకు రాత్రివేళల్లో పని చేసే కార్మికులను గమనించినప్పుడు, వారు ఏడాదికి 10-15 కిలోలు అదనపు బరువుని పొందినట్లు తేలింది.   - ఇలా వేళాపాళా లేకుండా జీవగడియారాన్ని ఉపేక్షిస్తూ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధం వంటి జీర్ణక్రియ సంబంధ వ్యాధులే కాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నట్లు రుజువైంది.   - సాధారణంగా రాత్రివేళల్లో మన రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. కానీ రాత్రిళ్లు మరీ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించక, రక్తపోటు యథావిధిగానే ఉంటున్నట్లు తేలింది. టర్కీలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇందుకోసం దాదాపు 700 మంది ఆహారపు అలవాట్లను, వారి రక్తపోటులోని హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నవారిలో రక్తపోటు తగ్గకపోవడం అనే సమస్య, మూడు రెట్లు ఎక్కువగా ఉందని గమనించారు. ఈ రక్తపోటుతో పాటుగా ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతున్నట్లు వెల్లడయ్యింది. రాత్రివేళల్లో రక్తపోటు తగ్గకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే!   - ఏతావాతా నిపుణులంతా చెప్పేదేమిటంటే... నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందరగానే భోజనం ముగించాలి. ఇంకా వీలైతే రాత్రి ఏడుగంటలకల్లా భోజనాన్ని ముగించేస్తే మరీ మంచిది. ఆ భోజనం కూడా భారీగా కాకుండా అధిక కొవ్వు, తీపిపదార్థాలు, వేపుళ్లు అధికంగా లేకుండా సాదాసీదాగా అరిగిపోయే మితాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన ఆహారపు అలవాట్లు నిపుణులు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పగలంతా కష్టపడుతున్నాం కదా అని రాత్రివేళ పొద్దుపోయాక నిదానంగా రకరకాల ఆహారపదార్థాలతో విందుభోజనాన్ని లాగించేస్తున్నాం. ఇక వారానికి ఓసారన్నా బయటకి వెళ్లి విందు చేసుకునే అలవాటూ పెరిగిపోతోంది. అలాంటి అలవాట్లను ఇప్పటికైనా మార్చుకోమన్నదే నిపుణుల ఘోష!                        - నిర్జర.  

Refreshing Epsom Salt Bath

  Have you ever heard of Epsom Salt? Sure you might have certainly heard about it, but didn’t care much of its use! Epsom salt has nothing do with our common salt. It is a pure combination of magnesium and sulphate. There used to be a water spring in England called Epsom which contained these two chemicals. People who took bath in that spring felt relieved from numerous ailments. And this led to the origin of commercial product with such combination.   People use this Epsom salt for various uses, but mixing a cup of Epsom salt in the bathtub is the most popular ploy. Here are a few benefits of Epsom Salt Bath.   Enters the body! Epsom salt when mixed in water breaks down into magnesium and sulphate. There is a populous belief that these chemicals then enter into our body. Even if they don’t enter the body, there is enough scientific evidence to prove that they could affect our skin, muscles and joints.     Relieves from stress There is direct relation between decreased levels of magnesium in our body and increased levels of adrenaline that causes stress. Magnesium enters our skin through the Epsom salt bath and would balance this equation. Further it helps the production of a chemical called serotonin that’s known to keep our mind calm and peaceful.   Extracts the toxins Thanks to our complex living style, our body has now become a hub for numerous toxins. The sulphates in the Epsom salt are known to pull out the toxins from our body. So Epsom salt bath could be regarded as a best way to detoxify ourselves. Soaking in the bath tub filled with Epsom salt for at least 10 minutes a week can certainly serve the purpose.   Relief from pain and swelling Epsom Salt has the soothing effect of relaxing the muscles. It not only relieves the muscles from sprains and inflammation but is also effective in treating pains and ailments related to inflammation such as arthritis, bronchial asthma and migraine. Further magnesium helps the proper functioning of muscles by letting them to absorb the needed calcium.   Skin - Epsom Salt bath has a direct and perfect effect on the skin. - It removes the dead cells from the skin making it look healthier and younger. - Gets rid of fungal infections present on the body such as athlete’s foot. - Smoothes the skin and dislodges blackheads. - provides relief in hard core diseases such as psoriasis. - Fights body odour. - Restores skin health in cases such as sunburns and bruises.   Contradiction: There is no harm in trying Epsom salt bath once in a while, but experts caution against its use in cases of pregnancy, dehydration, open wounds and fresh burns.   - Nirjara. 

చదవండి.. నిద్రపోండి!

  ఈ పోటీ ప్రపంచంలో మిగతా విద్యార్థులకి దీటుగా ఉండాలంటే పాఠ్యపుస్తకాలను బట్టీపడితే సరిపోదు. చదివిన చదువు చక్కగా ఒంటబట్టాలి. ఎప్పుడు పడితే అప్పుడు తిరిగి వాటిని గుర్తుకుతెచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఒక చిత్రమైన పరిశోధన ఫ్రాన్స్‌లో జరిగింది. సైకలాజికల్‌ సైన్స్‌ అనే పత్రికలో ప్రచురించిన ఈ కథనం చదువుకి సంబంధించి ఒక కొత్త చిట్కాను అందిస్తోంది.   చదువు తరువాత నిద్ర తమ పరిశోధనలో భాగంగా లియాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఓ 40 మందిని ఎన్నుకొన్నారు. ఆ నలభైమందిని రెండు జట్లుగా విడదీసి... వాళ్లు అంతకు ముందు ఎప్పుడూ వినని కొన్ని పదాలనూ, వాటికి అర్థాలనూ నేర్పారు. ఉదయం పూట ఒక జట్టుకీ, సాయంత్రం వేళ ఒక జట్టుకీ ఈ శిక్షణ సాగింది. కొన్నాళ్ల తరువాత పరిశీలించి చూద్దురు కదా! సాయంత్రం వేళ నేర్చుకున్న విద్యార్థులు ఉదయంపూట అభ్యసించిన విద్యార్థులకంటే త్వరగా, సమర్థవంతంగా పదాలను నేర్చుకోవడాన్ని గమనించారు.    కారణం! ‘మన మెదడుకి కాస్త విశ్రాంతిని ఇస్తే, అది అప్పటివరకూ నేర్చుకున్న విషయాలను జ్ఞాపకాల రూపంలోకి మలుచుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అంటున్నారు- ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీఫెన్‌ మజ్జా అనే పరిశోధకులు. అందుకనే చదువు తరువాత నిద్రపోయినవారిని కొంతకాలం తరువాత ప్రశ్నించినా కూడా, తాము నేర్చుకున్న విషయాలను చక్కగా గుర్తుచేసుకోగలిగారట. అంటే వారి మెదడులో ఆ విషయం జ్ఞాపకాల రూపంలో శాశ్వతంగా, పదిలంగా ఉండిపోయిందన్నమాట!   ఉపయోగం బాగా చదువుకోవాలనే తపనతో చాలామంది విద్యార్థులు సరిగా నిద్రపోరు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలాగూ వస్తాయని తెలుసు. కానీ నిద్ర మానేసి చదవడం వల్ల అసలుకే మోసం వస్తుందని ఈ పరిశోధనతో రుజువైపోతోంది. ఇక ఉదయాన్నంతా చదువుకున్న విషయాలను సాయంత్రం వేళల్లో ఒకసారి అలా పునశ్చరణ చేసుకుంటే మరింత ఉపయోగంగా ఉంటుందన్న చిట్కాని ఈ పరిశోధన అందిస్తోంది. ఏదన్నా క్లిష్టమైన పాఠాన్ని చదువుకున్న తరువాత ఓ చిన్న కునుకు తీసినా కూడా ఉపయోగంగా ఉండవచ్చునేమో! అటు శరీరానికి విశ్రాంతిని ఇచ్చినట్లూ అవుతుంది. మనం నేర్చుకున్న విషయాలు మెదడులో ఇంకిపోయేందుకు తగిన సమయమూ లభిస్తుంది! ఓసారి పాటించి చూస్తే పోలా!     - నిర్జర.

Ways to change your workout for fall

  As we move from summer to fall, days become colder as well as shorter and the workout routine becomes difficult to follow. Three sports will help you go through this season and will make your workout plan easy to follow. The following are the sports that are to be included in your workout plan this season.   HOT YOGA If you had hit the park in the summer season for yoga classes, then continue your yoga by staying indoors so as to keep yourself warm during the fall. Hot yoga class enables you to work out inside and the heated room can keep you away from cold. The key to make your workout effective is to stay hydrated during the session. According to Mandy Ingber who is Jennifier Anitson’s yoga instructor, hot yoga gives rise to a great cardiovascular workout which helps in increasing the rate of the heart.   SPINNING Outdoor cycling is fun during the summer season, but it is not great for fall as you might get caught in rain during this season. If you love to include cycling in your workout plan during fall, opt for an indoor spinning class. You will not be able to explore outdoors but you can make new friends and stay motivated with the help of indoor spinning. Also sprint cycling techniques can burn up to 675 calories in half an hour. Spinning allows you to challenge your muscles in the legs as well as the bum and it helps in boosting the cardiovascular activities for fast results.   TRAIL RUNNING Trail running is great for this season and is worth getting wet in the rain for, because summer is too hot to run. Train running is advantageous to health and is more challenging when compared to running on tread mill. For this workout you need to run outdoors without using any equipment. You can alternate between running and walking for one or two minutes before running continuously without stopping. Once you get used to it, you can increase the time limit based on your strength and fitness.

పుట్టిన నెలని బట్టి అనారోగ్యాలు

  ఒకో సమయంలో పుట్టిన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి అని ఊహించేదుకు, ప్రపంచమంతా రకరకాల జాతకాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వైద్యులు కూడా పిల్లలు పుట్టే నెలని బట్టి, వాళ్ల ఆరోగ్యం ఉంటుందని చెప్పడమే కాస్త విచిత్రంగా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి నాటు వైద్యులు కాదు... కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు తేల్చిన మాట ఇది.   55 రోగాలు! పుట్టిన నెలకీ, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానంతో ‘కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌’లో నమోదైన 17 లక్షల మంది రోగుల వివరాలను పరిశీలించారు. తాము ఎన్నుకొన్న 1,688 రోగాల జాబితాలో 55 రోగాలకీ, పుట్టిన నెలలకీ మధ్య సంబంధం ఉండటాన్ని గమనించారు. ఇలా సంబంధం ఉన్న రోగాలలో ఆస్త్మా, ADHD, సంతానలేమి, గుండెజబ్బులు... వంటి తీవ్రమైన జబ్బులు ఉండటం గమనార్హం.   ఏఏ నెలలలో! మార్చి, ఏప్రిల్ నెలల్లో పుట్టినవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జన్మించినవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం బయటపడింది. నవంబరులో పుట్టినవారిలో మానసిక సమస్యలు బయటపడే ప్రమాదం కనిపించింది. మొత్తంగా చూస్తే మే, జులై నెలల్లో పుట్టినవారికంటే అక్టోబరు, నవంబరు మాసాల్లో పుట్టినవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ గణాంకాలు సూచించాయి.   కారణం! పుట్టిన నెలని బట్టి ఆరోగ్యం అన్న మాట విచిత్రంగా ఉన్నా... దానికి హేతుబద్ధమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి తల్లి తీసుకునే ఆహారంలోని మార్పులు, పిల్లలు పుట్టిన వెంటనే వాతావరణంలో ఉండే వివిధ క్రిముల ప్రభావం వంటి కారణాలు చూపిస్తున్నారు పరిశోధకులు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ‘డి- విటమిన్‌’ వల్లే ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. డి విటమిన్‌ మనలోని ఎముకలు, పళ్లు గట్టి పడేందుకు తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే! కానీ మెదడు ఎదుగుదల దగ్గర్నుంచీ, రోగనిరోధక శక్తి వరకూ శరీరంలోని ఎన్నో అంశాలు డి విటమిన్ మీదే ఆధారపడి ఉంటాయని ఇప్పుడిప్పుడే పరిశోధనలు తేలుస్తున్నాయి.   శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇటు తల్లికీ, పుట్టిన తరువాత అటు బిడ్డకూ తగినంత డి విటమిన్‌ అందకపోతే... అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తత్ఫలితంగానే వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పేర్కొంటున్నారు. డి విటమిన్ సూర్యరశ్మి నుంచే లభిస్తుంది కాబట్టి, ఆ సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా లేని నెలలలో పుట్టిన పిల్లలని డి విటమిన్‌ లోపం ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు.   ఏతావాతా డి విటమిన్‌ లోపమే అసలు దోషమని తేల్చారు పరిశోధకులు. అయితే ఒక నెలలో పుట్టినంత మాత్రాన తప్పకుండా ఆయా రోగాల బారినపడి తీరతారన్న భయమేమీ వద్దనీ.... పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి వంటి ఎన్నో విషయాలను కనుక మన నియంత్రణలో ఉంచుకుంటే  ఏ రోగమూ మన దరి చేరదని అభయమిస్తున్నారు. పైగా సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణదేశాలలో, నెలని బట్టి ఆరోగ్యం అనే తమ పరిశోధన చెల్లకపోవచ్చునని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త నీరెండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేమో!     - నిర్జర.

ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్‌

  ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదరుచూడటం అంటే ఎవరికి మాత్రం అసౌకర్యంగా ఉండదు. ఇలా ట్రాఫిక్‌లో సమయాన్ని గడపడం వల్ల సమయం ఎలాగూ వృథా అవుతుంది. దానికి తోడు అది మన ఆయుష్షుని కూడా హరించివేస్తుందన్న హెచ్చరిక ఇప్పుడు వినిపిస్తోంది. ఇంగ్లండుకి చెందిన ఒక భారతీయ పరిశోధకుడు అందిస్తున్న నివేదిక, ట్రాఫిక్‌లో చిక్కుబడిపోవడం ఎంతటి ప్రాణాంతకమో సూచిస్తోంది.   లక్షల ప్రాణాలు గాలిలోని కాలుష్యం వల్ల ఏటా లక్షలమంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల ఆస్తమా, గుండెజబ్బు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతకమైన జబ్బులెన్నో వ్యాపిస్తాయని తేల్చింది. ఇక ఇంగ్లండులో అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయేవారికన్నా, రోడ్ల మీద ఉన్న గాలిలోని కాలుష్యాన్ని పీల్చి చనిపోయేవారి సంఖ్య పదిరెట్లు ఎక్కువ అన్న గణాంకాలు వినిపిస్తున్నాయి. ఈ మాటల్లో నిజమెంతో తేల్చుకునేందుకు ప్రశాంత్‌ కుమార్‌ అనే నిపుణుడు ఒక పరిశోధనను నిర్వహించారు.   40 శాతం ఎక్కువ సాధారణంగా ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్ ఉన్న చోట వాహనాల నుంచి వెలువడే వ్యర్థాల పేరుకుంటూ ఉంటాయి. అక్కడి ట్రాఫిక్‌ నిరంతరాయంగా సాగుతూ ఉండటంతో, విష పదార్థాలు అక్కడి గాలిలోనే స్థిరంగా ఉంటాయి. పరిశోధకులు సేకరించిన వివరాల ప్రకారం, మామూలు రోడ్ల మీదకంటే... కూడలి వద్ద ఉన్న ట్రాఫిక్‌లో 29 రెట్లు అధికంగా ప్రాణాంతక వాయువులు కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల వాహనం కనుక నిలిచిపోతే, అక్కడి కాలుష్యం బారిన పడే అవకాశాలు 40 శాతం ఎక్కువగా ఉన్నాయి.     ఇదీ ఉపాయం! వీలైనంతవరకూ ట్రాఫిక్‌ లేని దిశగా ప్రయాణం చేయమని చెప్పడం సులువే. కానీ ఇది ఏమంత ఆచరణసాధ్యం కాదు కదా! పైగా కారుల్లో ప్రయాణం చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కారు అద్దాలను మూసేసుకొని లోపల ఫ్యాన్‌ వేసుకుని కూర్చోవడం మినహా, వారికి మరో ఉపాయం తోచదు. అయితే దీనివల్ల పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. బయటనుంచి గాలిని తీసుకునే ఫ్యాన్లు లోపల ఉండే ప్రయాణికులకు మరింత విషపదార్థాలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్‌లో కనుక ఇరుక్కుపోయి ఉంటే కిటికీ తలుపులను మూసివేసుకుని, ఫ్యాన్లను ఆపివేయమని సూచిస్తున్నారు. ముందు ఉన్న వాహనానికి కాస్త దూరంగా ఉండమంటూ సూచిస్తున్నారు. దీని వల్ల వాహనం చుట్టూ ఉన్న వాయువులను పీల్చే ప్రమాదం 76% తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ సలహాని పాటించడం సాధ్యమేనా అన్నదే ప్రశ్న!   - నిర్జర.

చైనా ఏడుపు- జర్మనీ ఏడుపు

పిల్లల ఏడుపుని ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా! ‘ఆ... అందులో గమనించేటందుకు ఏముటుంది? అన్ని ఏడుపులూ ఒకే రకంగా ఏడుస్తాయి కదా!’ అంటారా. పిల్లల మాతృభాషను బట్టి వారి ఏడుపు కూడా మారుతూ ఉంటుందని జర్మనీకి చెందిన ఒక పరిశోధకురాలు తేల్చిచెప్పేశారు. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటో, అందులో తేలిన విషయం ఏమిటో, దాని వల్ల మనకి ఉపయోగం ఏమిటో మీరే చూడండి...   టోనల్‌ లాంగ్వేజ్ అన్ని భాషలూ ఉచ్ఛారణ మీదే ఆధారపడి ఉంటాయన్న విషయం మనకు తెలిసందే! అయితే కొన్ని భాషలలో, ఆ ఉచ్ఛారణలోని చిన్న చిన్న మార్పులను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు చైనీయులు పలికే మాండరిన్‌ భాషలో ఒకే పదాన్ని నాలుగు రకాలుగా పలికితే, నాలుగు అర్థాలు వస్తాయి. ఇక ఆఫ్రికాలో వినిపించే లామ్‌సో అనే భాషలో అయితే ఒక పదాన్ని ఎనిమిదిరకాలుగా పలికి ఎనిమిది అర్థాలను తీయవచ్చు. ఇలా స్వరంలో మార్పుని బట్టి వేర్వేరు అర్థాలను కలిగించే భాషను ‘టోనల్‌ లాంగ్వేజ్’ అంటారు. మన దేశంలో పంజాబీ భాష మాత్రమే ఈ విభాగం కిందకు వస్తుంది.   భాషని బట్టి ఏడుపు! ఇంతకీ ఈ భాషకూ, పిల్లల ఏడుపుకూ మధ్య సంబంధ ఏమన్నా ఉంటుందా? అని జర్మనీలోని ఉర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కేథ్‌లీన్‌ అనే ప్రొఫెసరుగారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా చైనాకు చెందిన ఓ 55 మంది పిల్లలనీ, లామ్‌సోని మాట్లాడే ప్రాంతంలో ఓ 21 మంది పిల్లలనీ ఆమె పరిశీలించారు. ఆశ్చర్యంగా మాండరిన్‌ వంటి టోనల్‌ లాంగ్వేజ్ మాతృభాషగా కలిగిన పిల్లల ఏడుపు కూడా అలాగే రాగయుక్తంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అలాకాకుండా సాఫీగా సాగిపోయే జర్మనీ వంటి మాతృభాషలు కలిగిన పిల్లలు సౌమ్యంగా ఏడుస్తున్నారట   ఎందుకలా! పిల్లలు తమ తల్లి కడుపులో ఉన్న ఆరో నెల నుంచే, ఆమె మాట్లాడుతున్న భాషను గుర్తిస్తారని చెబుతున్నారు కేథ్‌లీన్‌. ఆమె మాట్లాడే భాషకు అనుగుణంగానే తాము కూడా శబ్దాలు చేసేందుకు ప్రయత్నిస్తారనీ... అందువల్ల, తల్లి మాతృభాష పిల్లల ఏడుపులో ప్రతిధ్వనిస్తుందనీ అంటున్నారు. అత్యాధునిక వసతులు ఉన్న చైనాలో అయినా, ఆధునికతకు అల్లంత దూరాన ఉండే ఆఫ్రికాలో అయినా... ఈ నియమం వర్తిస్తుందని రుజువు చేస్తున్నారు.   ఉపయోగం ఇంకా ఈ ప్రపంచంలోకి రాకుండానే పిల్లల మెద,డు తమ మాతృభాషను నేర్చుకునేలా రూపుదిద్దుకుంటోందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. దీనిని బట్టి పిల్లలకు మొదట మాతృభాష నేర్పించిన తరువాతే ఇతర భాషల జోలికి పోవాలని స్పష్టమవుతోంది. పైగా ఇలా పిల్ల ఏడుపుని, భాషకు అనుగుణంగా పరిశీలించండం వల్ల... వారి మానసిక ఎదుగుదల సవ్యంగా ఉందా లేదా అన్నది గమనించవచ్చన్నది పరిశోధకులు అభిప్రాయం. మరీ ముఖ్యంగా మున్ముందు సదరు పిల్లల్లో భాషని నేర్చుకోవడంలో ఏవన్నా సమస్యలు ఏర్పడతాయేమో అన్నది ముందుగానే పసిగట్టవచ్చునన్నది కేథ్‌లీన్‌ ఆలోచన. మంచిదే! (తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా)   - నిర్జర.

Clove - The Miracle Spice

  From centuries together, clove has been a part of Indian culinary as well as traditional medicine. Times have changed and science has moved on, but clove still retains its prominence in our food as well as our health. Scientifically known as Syzygium aromaticum, clove has been a part of Asian exports and cuisine. Here are some of the health benefits of clove that can’t be ignored...   Toothache No other herb seems to be as effective as clove when it comes to toothache. Clove relives the pain, works as anti-inflammatory by reducing the swelling around the teeth and prevents the infection from spreading to other teeth. Dab some clove oil on and around the affected teeth and watch the results. The effectiveness of clove on teeth is the reason why we could find it as an active ingredient in most of the toothpastes!   Cough When it comes to respiratory problems, clove could be miraculous. Besides being anti-inflammatory and anti-bacterial... clove acts as expectorant for coughs caused by phlegm. Further it can provide a soothing relief in many respiratory ailments such as sore throat, cold, bronchitis, asthma, sinusitis etc. Chew a clove regularly or drink some tea brewed along with clove to get relived from such problems.   Digestion Cloves are used as `Carminatives’ in traditional medicine, which means that they are either intended to prevent formation of gas or facilitate its expulsion. Cloves are also known to improve the digestion. Further, cloves are considered as a sort of ` Anthelmintics’, which means that they are believed to get rid of worms and other parasites that are present in our digestive system.   Diabetes Diabetes is a problem where the sugar levels in the body gets out of control, due to problems in insulin production and absorption. Recent studies were proving that clove can initiate the insulin production and thus control the sugar levels. According to a research done by Dr. Alam Khan, cloves have the capability of lowering the serum glucose from 225 mg to 150 mg, when clove is consumed for 30 days.   Joint Pains There is no doubt that clove works as a reliever of pain and reducer of swelling. Further, it contains a chemical called `Eugenol’, which is proved to be an effective antiseptic and antioxidant. Eugenol is even known to have anaesthetic properties. It is even believed that Eugenol could help in maintaining bone density. So rub a bit of clove oil on the joints and add a piece of clove in your food, and you won’t complain about painful joints. Clove is also suggested in treating a lot of problems such as nausea, bad breath, vomiting, acne, earache and stress. Use it and you would know why!   - Nirjara.

ఉద్యోగం నచ్చట్లేదా? ఆరోగ్యం గోవిందా!

  మీరు చేస్తున్న ఉద్యోగం సంతోషంగానే ఉందా? అని ఎవరినన్నా అడిగామనుకోండి- ‘ఆ! ఏదో అలా నడిచిపోతోంది,’ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకొందరైతే ఆ ప్రశ్న వినిపించడమే ఆలస్యం... తమ ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టేందుకు సిద్ధపడిపోతుంటారు. చేసే ఉద్యోగంలో మనం ఎంత తృప్తిగా ఉన్నామన్నది మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే! కానీ ఇప్పుడు అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతుందన్న విషయం ఓ పరిశోధనలో రుజువైంది.   వేలమంది మీద! అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన జొనాధన్‌ దిల్రాం, హ్యూ జెంగ్‌ అనే పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 1979లో 6,432 మంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. వీరంతా కూడా అప్పుడు యుక్తవయస్కులే! వారందరినీ కూడా తమ ఉద్యోగానికి 1-4 పాయింట్ల లోపు ఎన్ని పాయింట్లని కేటాయించగలరో చెప్పమన్నారు. ఉద్యోగం ఏమాత్రం నచ్చకపోతే 1 పాయింటు, బాగా నచ్చితే 4 పాయింట్లు కేటాయించారు అభ్యర్థులు.   పరిశోధన మొదలు అభ్యర్థులందరి నుంచీ తరచూ సేకరిస్తూ వచ్చిన సమాచారం ఆధారంగా, పరిశోధకులు వారిని నాలుగు భాగాలుగా విభజించారు. ప్రతిసారీ తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు 45 శాతం ఉంటే, తమ ఉద్యోగం చాలా బాగుంది అని తరచూ చెప్పేవారి సంఖ్య 15 శాతంగా తేలింది. ఇక మొదట్లో ఉద్యోగం నచ్చినా రాన్రానూ విరక్తి చెందినవారు 23 శాతంగా ఉంటే, మొదట్లో తమ ఉద్యోగం ఏమాత్రం బాగోలేదని చెప్పి తరువాత తృప్తిపడిపోయినవారు 17 శాతం మంది. పరిశోధకులు ఇలా వేర్వేరు విభాగాలలో ఉన్నవారి ఆరోగ్యాలను కూడా నిశితంగా పరిశీలించారు. 40 ఏళ్లు దాటిన తరువాత వారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలకీ, ఉద్యోగంలో వారు పొందుతున్న తృప్తికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అని గమనించారు.   సంబంధం ఉంది! మొదటి నుంచీ కూడా తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు, 40 ఏళ్లు దాటిన తరువాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. నిద్ర సరిగా పట్టకపోవడం, క్రుంగుబాటుకి లోనవ్వడం, తరచూ ఆందోళనకు గురవ్వడం.... లాంటి మానసిక సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొన్నట్లు బయటపడింది. మొదట్లో ఉద్యోగం బాగోలేదని చెప్పి తరువాత కాలంలో కొంచెం తృప్తిపడిన వారి పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంది. ఇక ఉద్యోగంలో ఏ రోజూ తృప్తి లభించలేదు అని భావించినవారిలో పైన పేర్కొన్న సమస్యలతో పాటుగా వెన్నునొప్పి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు సైతం కనిపించాయి.   మరి నివారణ! సాధారణంగా ఒక మనిషి తన రోజులో మూడో వంతు (8 గంటలు) ఉద్యోగం చేయడంలోనే గడిపేస్తాడు. అంతంతసేపు జీవితాన్ని గడిపే సమయంలో విపరీతమైన ఒత్తిడి, అసంతృప్తి తప్పకుండా అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవన్నీ కూడా 40 ఏళ్లు దాటిన తరువాత బయటపడటం మొదలుపెడటాయి. స్థిరంగా ఉండే ఉద్యోగం అయితే అంతగా అసంతృప్తి, ఆందోళన ఉండకపోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం జీతం కాస్త తక్కువైనా, ప్రశాంతంగా సాగిపోయే ఉద్యోగాన్నే ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.   - నిర్జర.

Low fat diets result in disastrous health problems

  Many think that the full fat food blocks the arteries and would result in gaining the weight. According to the latest nutrition research from the National Obesity Forum, UK, it could be said that low fat diets result in disastrous health problems.    Dr. Trudi Deakin, a leading dietitian said that, the flawed from the 1950s convinced people that fat is bad for us, but it was never proven that saturated fat caused heart disease and the problem with low fat food is that when the manufacturers of the food strip out fat, they replace it with sugar as well as starch. Replacement of fat with sugar as well as starch results in increasing the insulin which damages the appetite and makes it difficult to digest the nutrients. He also added that the natural fat that is found in dairy products is extremely nourishing and eating it can actually prevents weight gain and cuts the risk of heart diseases because dietary fat helps in improvising the functions of the brain.   Many choose low fat readymade packaged food over normal fat food because they think that it is a healthy choice and it wouldn’t increase the weight. Whereas Dr Supreet Grover who is a clinical nutritionist and a weight loss consultant explains that, all are ready to eat food that is labeled as low fat and they don’t know that the food is high on sugar as well as preservatives. The calories in low fat digestives and in digestives are almost same and if one really goes through it, he/she would find number of such comparisons in various products. As the products may be high on sugar, salt are preservatives it is not going to make them all healthy. Also a food product that is low in fat as well as in sugar may not be palatable according to him.   As all sorts of fats are harmful for the human body, we have been asked to cut it down since ages. The fact is that all the fats are not bad and they in fact provide energy, helps in soaking the vitamins A, D, E and K into our body. Since our body cannot produce certain essential fatty acids, the acids would be taken from the natural fat that has been consumed in the form of food.   Fitness nutritionist as well as the proprietor of Q Slim Fitness studio, Pallavi Srivasta says that the news research indicates that saturated fats coming from the diet might not increase the cholesterol in the body directly but the process foods might result in health problems. Proportionate consumption of high food fats helps in reducing the weight for obese people.   Consultant Nutritionist, Pooja Makhija states that many people equate food fat for body fat. For the body to function optimally, fat is necessary. Elimination of normal fat food from the diet results in severe health issues. Invisible fat and visible fat are two kinds of fats. Invisible fat that is present in the food naturally should be embraced and the visible fat that is added to the food to make it taste better should be avoided. According to Pooja, Invisible fat contains many other nutrients like vitamins, minerals and anti-oxidants which are highly beneficial for the health.   While picking the food, the natural form of it is better than the processed one. Therefore it could be concluded that, the lesser the food is processed the lesser it is harmful for the human bodies.

పిల్లల్లో ఊబకాయం ఉంటే!

  ఇంట్లో పిల్లలు మితిమీరిన బరువుతో ఉంటే కంగారు పడటం సహజం. వారు ఊబకాయులుగా మారిపోతారన్న భయమూ సహజమే! ఎందుకంటే ఊబకాయం కేవలం ఒక లక్షణం మాత్రమే కాదనీ, సవాలక్ష రోగాలకు సింహద్వారం అని ఈపాటికే తేలిపోయింది. కానీ ఇలాంటప్పుడు తల్లిదండ్రుల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం American Academy of Pediatrics అనే సంస్థ ఓ ఆరు సూచనలను అందిస్తోంది. అవేమిటంటే...   డైటింగ్‌ను ప్రోత్సహించవద్దు! పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజీ పిల్లల్లో ఊబకాయం ఉందన్న స్పృహ కలగగానే, దాన్ని ఎలాగైనా తగ్గించుకునేందుకు డైటింగ్‌లోకి దూకేస్తారు. నిజానికి డైటింగ్‌ అనేది ఊబకాయానికి ఓ పరిష్కారం కాకపోగా, అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. పైగా డైటింగ్ వల్ల ఊబకాయం తగ్గకపోగా, పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.   బరువు గురించి మాట్లాడవద్దు అధికబరువు, ఊబకాయం వంటి విషయాల గురించి పిల్లల వద్ద మాట్లాడకపోవడమే మంచిదంటున్నారు. ఇలాంటి మాటల వల్ల పిల్లల్లో తాము ఎలాగైనా లావు తగ్గాలనే తపన కలుగుతుంది. ఆ తపనలో డైటింగ్, ఉపవాసాలు వంటి పద్ధతులను ఎడాపెడా అనుసరించేయడం మొదలుపెట్టేస్తారు.   అవహేళన కూడదు కళ్ల ముందు ఎవరన్నా పిల్లలు కాస్త బొద్దుగా కనిపిస్తే, వారిని ఏడిపించేవారికి కొదవ ఉండదు. ఇలాంటి అవహేళనలు సదరు పిల్లల్లో ఆత్మన్యూనతకి దారితీస్తాయి. వాళ్లు తమ శరీరాన్ని తాము ద్వేషించే స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా కౌమార వయసులో ఉన్న పిల్లల మనసు మీద, ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ, సరదాగానైనా సరే... ఊబకాయం గురించిన హేళన కూడదు.   కలిసి తినండి వీలైనంతవరకూ, కుటుంబం అంతా కలసి కూర్చుని భోజనం చేయడం మంచిదట! దీనివల్ల వారి మధ్య అనుబంధాలు దృఢం కావడం మాట అటుంచి ఆకలికి తగినంత ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా టీవీ చూస్తూనో, వేళాపాళా లేకుండానో తినే అలవాటు ఉంటేనో... ఆహారం ఎక్కువ తక్కువలుగా తీసుకునే ప్రమాదం ఉంది. పైగా ఒకేచోట కలిసి భోజనం చేయడం వల్ల, ఒకరిని చూసి మరొకరు పోషకాహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   వ్యాయామాన్ని ప్రోత్సహించండి ‘వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా, బలంగా ఉంటావు!’ అన్న సాకుతో పిల్లల్లో వ్యాయామాన్ని ప్రోత్సహించండి. అంతేకానీ ‘వ్యాయామం చేస్తే బరువు తగ్గుతావు, సన్నబడతావు!’ అని చెప్పవద్దు. ఆరోగ్యం పేరుతో పిల్లల్ని వ్యాయామానికి ప్రోత్సహిస్తే, బరువు దానంతట అదే తగ్గుతుంది.   ఆరోగ్యకరమైన వాతావరణం! ఇంట్లో ఆరోగ్యకరమైన అలవాట్లకు అవకాశం ఇవ్వండి. పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు.... వంటి పోషకాలు పిల్లల ఆహారంలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి. కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలు, చాక్లెట్లు... వంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు ఇంట్లో చోటు పెట్టవద్దు. దీంతో పిల్లలు బయట ఏం చేసినా కానీ, కనీసం ఇంట్లో అన్నా ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.   పై సూచనలన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లల ఆహారపు అలవాట్లనీ, జీవనశైలినీ కాస్త మార్చగలిగితే... వారి ఊబకాయపు సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుందని తేల్తోంది. అందుకే పిల్లల బరువు గురించి కాదు, వారి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు నిపుణులు.   - నిర్జర.