తన ప్రేయసిని రేప్ చేశాడని..స్నేహితుడని కూడా చూడకుండా

తన ప్రేయసిని రేప్ చేశాడని స్నేహితుడని కూడా చూడకుండా అతని తల నరికాడు ఒక వ్యక్తి. అమెరికాకు చెందిన థార్సెన్ అనే వ్యక్తికి హైమన్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్వల్పకాలంలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై అత్యాచారం చేశాడు.   తనపై జరిగిన దారుణాన్ని ఆమె థార్సెన్‌కు చెప్పింది. వీరు ముగ్గురు డ్రగ్స్‌కు కట్టుబానిసలు. అలా ఒకరోజు ఫుల్లుగా డ్రగ్స్ సేవించి కారులో వెళుతున్నారు. కారు చెకింగ్ కోసమని హైమన్ కిందకు దిగడంతో వెనుక నుంచి థార్సెన్ బేస్ బాల్ బ్యాట్ తో బలంగా కొట్టాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి తల నరికేసి అడవిలో విసిరేశాడు. తర్వాత ఏం తెలియనట్టు తన పని చూసుకున్నాడు. అడవుల్లో తల.. ఒక కారులో తల లేని మొండి లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను సినిమా స్టైల్లో వెంటాడి థార్సెన్‌ను అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాలో హిందూవులపై ఆగని దాడులు..మరో పూజారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఏ మాత్రం ఆగకపోగా..మరింత ఎక్కువవుతున్నాయి. హిందూవులతో పాటు క్రిస్టియన్ పౌరులు, మైనార్టీకి చెందిన ప్రోఫెసర్లను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా ఓ హిందూ పూజారిని దారుణంగా హత్య చేశారు. జెనైదా ప్రాంతంలో శ్యామనందో దాస్ అనే హిందూ పూజారి దేవతార్ఛన కోసం పూలు కోస్తుండగా..ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి..కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దాస్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. జెనైదా జిల్లాలో గత జూన్ 7న కూడా ఓ హిందూ పూజారి హత్యకు గురయ్యాడు. 

ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంపై దాడికి ఐఎస్ స్కెచ్

హైదరాబాద్ పాతబస్తీలోని హిందూ-ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంపై ఇస్లామిక్ స్టేట్ లక్ష్యంగ చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. పాతబస్తీలో నిన్న అదుపులోకి తీసుకున్న 11 మంది ఐసిస్ సానుభూతిపరులను విచారించిన ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని పేల్చేయాలని ఐసిస్ లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిత ఉగ్రవాదులు వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. దాంతో పాటు శక్తివంతమైన బాంబులతో పోలీస్ స్టేషన్‌ పైకి దాడికి కుట్ర పన్నినట్లు వారు తెలిపారు. నిన్న అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురిని విడిచిపెట్టిన ఎన్‌ఐఏ..మిగిలిన ఐదుగురి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. దర్యాప్తు నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్ఐఏ సన్నాహలు చేస్తోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్

టర్కీలోని అటాటర్క్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌పై దాడి..అనంతరం హైదరాబాద్‌లో ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడటంతో జంట నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ, ఐబీ, ఎన్ఐఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. విజిటర్ల ప్రవేశంపై అంక్షలు విధించారు. డొమెస్టిక్, ఇంటర్నేషన్ ప్రయాణికులు ప్రయాణ సమయానికి ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని తనిఖీల, ఇతర భద్రతాపరమైన అంశాలలో సహకరించాలని ఎయిర్‌పోర్ట్ భద్రతా విభాగం ప్రకటించింది. త్వరలో రంజాన్, బోనాలు ఇతర పండుగలు ఉన్నందున ఎయిర్‌పోర్ట్‌తో పాటు పరిసరాలలో భద్రతను పటిష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, బెంగుళూరుల్లో బ్రస్సెల్స్ తరహా దాడులు..

హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముష్కరులను నిన్న ఎన్‌ఐఏ అరెస్ట్ చేయడంతో దేశం ఉలిక్కిపడింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ అధికారులు దిగ్భ్రాంతికరమైన విషయాలు సేకరించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ "అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్" కు చెందిన ఉగ్రవాదులు హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరాల్లో విధ్వంసం చేసేందుకు కుట్రపన్నినట్లు తెలిసింది. వీరికి విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. క్రూడ్ బాంబులను తయారు చేయడంలో వీళ్లు సిద్ధహస్తులని తెలిపింది. గత నెలలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ తరహా దాడులు చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యమని ఎన్ఐఏ వెల్లడించింది. అంతేకాకుండా వీరు తయారు చేసే బాంబులను బ్యాగేజి స్కానర్ల సాయంతో సైతం గుర్తించలేమని నిపుణులు చెబుతున్నారు.

విశాఖ మహిళా టెక్కీ..హైదరాబాద్‌లో ఆత్మహత్య,వరకట్న వేధింపులే కారణమా..?

విశాఖపట్నానికి చెందిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. సనత్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుతేజతో విశాఖకు చెందిన హరికీర్తనకు మూడు నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి సనత్‌నగర్‌లోని అత్తవారింట్లో ఉంటోన్న కీర్తన నిన్న రాత్రి ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హరికీర్తన మరణవార్తను తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసేవారని అందువల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు భానుతేజ, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఒడిశా తీరంలో క్షిపణి పరీక్ష..

భూ ఉపరితలం నుంచి గగనతంలోని లక్ష్యాలను చేధించగల క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ సహకారంలో భాగంగా భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. ఈ మిస్సైల్‌ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగా కేంద్రం నుంచి పరీక్షించారు. ఉదయం 8.15 నిమిషాలకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్టు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.  మిగిలిన సాంకేతిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో సైన్యం అమ్ములపోదిలోకి  చేరుస్తామని వారు వెల్లడించారు. మిస్సైల్ ప్రయోగ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యాకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

టర్కీ నరమేధంలో 41 మంది బలి

టర్కీలోనే కాక యూరప్‌లోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయమైన ఇస్తాంబుల్ అటాటర్క్ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ముష్కరులు సృష్టించిన నరమేధంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఆత్మహుతి దళ సభ్యులు రాత్రి పదిగంటల సమయంలో ట్యాక్సీలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఒక ఉగ్రవాది టెర్మినల్ వెలుపల పేల్చేసుకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. వారితో పాటుగా పరిగెత్తిన మరో ఉగ్రవాది జనంలో తనను తాను పేల్చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మూడో ఉగ్రవాది ఇంటర్నేషనల్ ఎరైవల్ ప్రాంతంలో పేల్చేసుకున్నట్లు తెలిపింది. ముష్కరుల దాడులతో పరుగులు తీసిన ప్రయాణికులు విమానాశ్రయం వెలుపల భయం భయంగా కాలం గడిపారు. దాడి జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేసి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈ దాడికి పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాదులేనని ప్రధాని బినాలి యిల్దిరిమ్ పేర్కొన్నారు. అటు ప్రపంచ దేశాధినేతలు ఈ దాడిని ఖండించారు.

వెంకయ్యకి సారీ చెప్పిన ఎయిరిండియా..

కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి వెంకయ్య నాయుడికి ఎయిరిండియా సారీ చెప్పింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ లేటయ్యింది. ఇక చేసేది లేక ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మీ వల్ల తాను అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయానని ట్వీట్టర్ ద్వారా ఎయిరిండియాకు చురకలు వేశారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు విమానం ఆలస్యమైన ఘటనపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎయిరిండియా ఉన్నతాధికారులు పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాడని తెలిపింది. గుర్గావ్‌లో నివసించే పైలట్ కోసం ఉదయాన్నే కారు పంపామని అయితే తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వేరే కారు చూసుకోవాలని పైలట్‌కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో కారులో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు. జరిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని..ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని ఎయిరిండియా వెంకయ్యకు తెలిపింది.

వివక్ష: హిందువుని సొంత ప్లేటు..గ్లాసు తెచ్చుకోమన్న ముస్లింలు

పాకిస్థాన్‌లో మతపరమైన వివక్ష ఎంతగా కొనసాగుతోందో తెలిపే ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా హిందూ మతానికి చెందిన ఓ పత్రికా విలేకరి పట్ల సహచర ఉద్యోగులే వివక్ష చూపించారు. ఎన్నాళ్లుగానో తమతో పాటే కలిసి పనిచేస్తున్న వ్యక్తి, హిందువని తెలియడంతో అతడిని తమతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదంటూ దూరం పెట్టారు. అంతటితో ఆగకుండా ఇకపై తమతో భోజనం చేయాలంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించారు.   పాకిస్థాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్‌కు చెందిన విలేకరి సాహిబ్ ఖాన్ ఓద్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఉద్యోగ జీవితం తొలుత ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది..అనంతరం హైదరాబాద్‌కు, ఈ ఏడాది ఏప్రిల్‌లో కరాచీకి బదిలీ అయ్యారు. అయితే సాహిబ్ ఖాన్ హిందువనే విషయం తెలిసిన తరువాత సహోద్యోగులు అతనిని దూరం పెట్టారు. అంతేకాదు..ఆఫీసులో భోజనం చేయాలనుకుంటే సొంతగ్లాసు, ప్లేటు తెచ్చుకోవాల్సిందిగా ఏఏపీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం ఆదేశించాడు. దీనిపై పెద్ద దుమారం రేగడంతో అస్లాం స్పందించాడు. ఓద్ జ్వరంతో బాధపడుతున్నందునే సొంత గ్లాసు, ప్లేటు తెచ్చుకోవాలని చెప్పామని వివరించారు.

ఎవరెస్ట్ ఎక్కకుండానే ఫొటోలు మార్ఫింగ్.. మహారాష్ట్ర దంపతుల ఘనకార్యం..

  తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఏకంగా తాము ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామని చెప్పుకున్నారు ఓ జంట. దినేష్, తారకేశ్వరీ రాథోడ్ గుర్తుండే ఉంటారు.ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి జంటగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వీరిద్దరి ఆకాశానికి ఎత్తేస్త్తూ పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది వీరిద్దరూ అసలు పర్వతం ఎక్కకుండానే మార్ఫింగ్ ద్వారా ఎవరెస్ట్ ఎక్కామని చెప్పుకున్నట్టు నిజం బయటపడింది. అసలు సంగతేంటో చూద్దాం.. మహారాష్ట్రకు చెందిన దినేష్, తారకేశ్వరీ రాథోడ్  'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా... దాని ద్వారా ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి వెళ్లారు. అయితే వారు మాత్రం వెళ్లలేదు. కానీ ఫొటో మార్ఫింగ్ చేసి వెళ్లామని చెప్పుకున్నారు. దీనికి గమనించి.. అంజలీ కులకర్ణి, శరద్ కులకర్ణి, సురేంద్ర షల్కే, ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో దినేష్ దంపతులను కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు.

ఎవరి ఏడుపు వారిది..

  హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు.    ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ ఉద్యోగ సంఘాలు దర్నా చేపడుతున్నాయి. ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సెక్రటేరియట్ కు పంపాలని ఏపీ సచివాలయం భవనం ముందు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఏపీ సచివాలయంలో 234 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలంగాణ నేటివ్ గా ఉన్న వారున్నారని, వారందరినీ రిలీవ్ చేసి తమ సచివాలయానికి పంపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక పక్క తెలంగాణ నుండి ఉద్యోగులు హ్యాపీగా రాజధాని వెళ్లగా.. ఇక్కడ మాత్రం తెలంగాణ ఉద్యోగులు దర్నా చేస్తూ కూర్చున్నారు. ఒకపక్క ఉద్యోగుల రాకతో ఏపీ రాజధాని కళకళలాడిపోతుంటే తెలంగాణ ఉద్యోగుల మాత్రం దర్నా చేస్తూ తమ కడుపు మంటను చూపిస్తున్నట్టున్నారు.

కళకళలాడుతన్న రాజధాని... తాత్కాలిక సచివాలయం ప్రారంభం

  హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయకొట్టి బ్లాకు ప్రారంభించారు. దీంతో ఉద్యోగుల రాకతో రాజధాని కళకళలాడిపోతుంది

స్వామి కౌంటర్లు మోడీకేనా..?

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించి ఆయనకు చురకలు అంటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా వ్యవస్థ కంటే తాము గొప్పవారమని అనుకుంటే అది తప్పు అని... పబ్లిసిటీ మోజుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని స్వామిపై పరోక్షంగా మండిపడ్డారు. అయితే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వామి కాస్త వెనక్కి తగ్గుతాడులే అనుకుంటే.. మోడీకి పరోక్షంగా కౌంటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శల బాణాలు వదిలారు.   "రాజకీయ నాయకులారా... కొత్త సమస్య: ఓ రాజకీయ నాయకుడు పబ్లిసిటీ కావాలని అనుకుంటే, 30 ఓబీ వ్యాన్లు ఇంటి బయట ఉంటాయి. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి 200 మిస్డ్ కాల్స్ వస్తాయి"  అంటూ పరోక్షంగా మోడీకి కౌంటర్ ఇచ్చారు. మరి స్వామి వ్యాఖ్యలపై బేజీపీ నేతలు ఎలా స్పందిస్తోరో.. ముఖ్యంగా మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.     కాగా ఈమధ్యకాలంలో స్వామి వరుసపెట్టి అందరిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు  పెట్టి ఆఖరకి ఇప్పుడు పరోక్షంగా మోడీపై కూడా పరోక్షంగా కామెంట్లు వేసే స్థాయికి వెళ్లారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

బురిడి బాబా బుట్టలో ఐఏఎస్ అధికారి కూడా....

  లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించి దాదాపు 1.33 కోట్లు టోకరా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న బురిడి బాబా చెబుతున్న విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే ఎంతో మందిని బురిడి కొట్టించిన బాబా వలలో ఏపీ కేడర్ కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నాడట. శివానంద మాయమాటలు నమ్మిన ఆ ఐఏఎస్ అధికారి బాబాకు రూ.50 లక్షలు సమర్పించుకున్నాడట. చేతిలో డబ్బులు పడగానే మాయమైన బురిడీ బాబా తనను నిలువునా ముంచాడని గుర్తించినా... ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఆ ఐఏఎస్ అధికారి నోరు విప్పేందుకు భయపడుతున్నారట.