ఢాకా ఉగ్రదాడి: భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ.. అధికారులను ఆదేశించింది. దీంతో పశ్చిమబంగా, అసోం, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో నుంచి భారత్లోకి ప్రవేశించి మార్గాల వద్ద సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ సైన్యానికి సూచించింది. అటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బంగ్లాదేశ్లోని దౌత్య అధికారులతో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఢాకాలో ఉన్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారని బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.