'కన్నప్ప' విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు!
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో ఎందరో స్టార్స్ నటించనున్నారని, ముఖ్యంగా శివపార్వతులుగా ప్రభాస్, నయనతార నటించనున్నారనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారిక ప్రకటన రానప్పటికీ కన్నప్పలో ప్రభాస్, నయనతార నటిస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన విష్ణు.. 'కన్నప్ప' గురించి ఆసక్తికర విషయాలని పంచుకోవడంతో పాటు, ఊహించని షాకిచ్చాడు.