రెహమాన్ ని కాదని డీఎస్పీకి ఓటేసిన శేఖర్ కమ్ముల!
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రష్మికా మందన్న హీరోయిన్ కాగా, కీలక పాత్రలో కింగ్ నాగార్జున సందడి చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల మొదటిసారి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.