English | Telugu

'కన్నప్ప' విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు!

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో ఎందరో స్టార్స్ నటించనున్నారని, ముఖ్యంగా శివపార్వతులుగా ప్రభాస్, నయనతార నటించనున్నారనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారిక ప్రకటన రానప్పటికీ కన్నప్పలో ప్రభాస్, నయనతార నటిస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన విష్ణు.. 'కన్నప్ప' గురించి ఆసక్తికర విషయాలని పంచుకోవడంతో పాటు, ఊహించని షాకిచ్చాడు.

"న్యూజిలాండ్‌ లో కన్నప్ప షూటింగ్ ప్రారంభించనుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆ శివపార్వతుల దీవెనలతోనే నా ఏడేళ్ల కల సాకారమవుతోంది. మొదట తనికెళ్ళ భరణి గారు ఈ కాన్సెప్ట్ ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ తరువాత పలువురి సహకారంతో కథ మెరుగులు దిద్దుకుంది. 'కన్నప్ప'కి ప్రాణం పోసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు న్యూజిలాండ్‌ కి రాబోతున్నారు.

'కన్నప్ప'లో ఎందరో సూపర్ స్టార్ లు భాగం కానున్నారు. ఆ వివరాలను స్వయంగా ప్రకటించడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. కానీ ఆ వివరాలను కొందరు ముందే లీక్ చేస్తున్నారు. నటీనటులకు సంబంధించి ప్రొడక్షన్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని మా సినీ అభిమానులందరినీ నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను." అని విష్ణు రాసుకొచ్చాడు.

ఇప్పటిదాకా 'కన్నప్ప'లో ప్రభాస్, నయనతార నటించడం ఖాయమని భావించారంతా. కానీ ఇప్పుడు విష్ణు, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ట్వీట్ చేయడంతో.. ప్రభాస్, నయనతార వార్తలపై సందేహం వ్యక్తమవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.