English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో బిగ్ షాక్.. 'సలార్' రీ షూట్!

'సలార్'పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కావడంతో.. ఈ సినిమా 'బాహుబలి', 'కేజీఎఫ్' స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే మూవీ టీమ్ మాత్రం వారికి వరుస షాక్ లు ఇస్తోంది.

సలార్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, సీజీ వర్క్ పట్ల దర్శకుడు సంతృప్తిగా లేకపోవడంతో వాయిదా పడింది. పోనీ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే జనవరిలో విడుదలవుతుంది అనుకుంటే.. ఏకంగా వచ్చే వేసవికి వాయిదా పడింది అంటున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు క్లైమాక్స్ రీ షూట్ చేయనున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. సలార్-1 క్లైమాక్స్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరట. పార్ట్-2 పై అంచనాలను పెంచేలా, కంటెంట్ రేంజ్ కి తగ్గట్టుగా.. ఇప్పుడున్న క్లైమాక్స్ సరిపోదని ఆయన భావిస్తున్నారట. అందుకే క్లైమాక్స్ ని మరింత బలంగా రాసే పనిలో ఉన్నారట. త్వరలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ ని రీషూట్ చేయొచ్చు అంటున్నారు. అసలే సలార్ సినిమా ఆలస్యమవుతుంది అంటే, ఈ రీషూట్ ల వల్ల ఇంకెంత ఆలస్యమవుతుందనే ఆందోళన అభిమానుల్లో ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.