English | Telugu

అమ్మ బాబోయ్.. ఇది ప్రభాస్ బొమ్మనా!

మన దేశంలో సినిమా హీరో లని ఆరాధించినంత రేంజ్ లో దేవుళ్ళని కూడా ఆరాధించరేమో. అభిమానులు తమ అభిమాన కథానాయకుడు మీద ఉన్న అభిమానాన్ని రక రక రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒక్కో హీరోకి లక్షల్లో అభిమానులు ఉంటారు. అలా లక్షల్లో అభిమానులని సంపాదించుకున్న ఒక హీరో ప్రభాస్. తెలుగు సినిమా హీరో రేంజ్ నుంచి పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగిన నటుడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మైనపు బొమ్మ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఆ బొమ్మ చూసిన డార్లింగ్ అభిమానులు మా ప్రభాస్ ని అవమానించాలనే మైనపు బొమ్మ నెపంతో ట్రోల్ చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

అదేంటి ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు చేస్తే అభిమానులు గర్వపడాలి గాని కోపంగా ఉండటం ఎందుకని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే కర్ణాటకలోని మైసూర్ లో ప్రభాస్ ఆకారంతో ఉన్న మైనపు బొమ్మ ఒక దాన్ని ఏర్పాటు చేసారు. కానీ బొమ్మని ఏర్పాటు చేసిన వాళ్ళు అభిమానంతో ఏర్పాటు చేసారా లేక ప్రభాస్ ని ట్రోల్ చేయ్యడానికి ఏర్పాటు చేసారా అని అర్ధం కావటం లేదు. ఎందుకంటే ఆ మైనపు బొమ్మ ప్రభాస్ లాగ లేదు. లాంగ్ లాంగ్ ఎగో లో వచ్చిన దుబాయి శ్రీను మూవీలోని విలన్ క్యారెక్టర్ పోషించిన నటుడి రూపం లో ఉంది. సోషల్ మీడియాలో డార్లింగ్ మైనపు బొమ్మని చూస్తున్న ఫాన్స్ అయితే మాత్రం, కావాలని మా రెబల్ స్టార్ ని ట్రోల్ చేస్తున్నారని ఒక రేంజ్ లో తిట్టి పడేస్తున్నారు. కొంత మంది ఫాన్స్ అయితే మాత్రం అసలు మా ప్రభాస్ అలా ఉంటాడా అని ఆశ్చర్యపోతోన్నారు. సోషల్ మీడియా లో ప్రభాస్ దిగా చెప్పబడుతున్న మైనపు బొమ్మ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని యుద్ధవీరుడి గెటప్ లో ఉండటం గమనార్హం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.