'గుంటూరు కారం' లేటెస్ట్ అప్డేట్.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే!
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ధమ్ మసాలా సాంగ్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే మొదట్లో షూటింగ్ ఆలస్యమవ్వడం, ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. నిజంగా 'గుంటూరు కారం' పొంగల్ కి వస్తుందా అనే అనుమానం కొందరిలో ఉంది.