English | Telugu

దర్శకుడి వెంట పడ్డాను.. అమ్మ నా చేతి మీద గాట్లు చూసి?...

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక పాయల్రాజ్‌పుత్. ఆ సినిమాతో తననుతెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా 'మంగళవారం'. ఆమెకు జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించాడు. ఏ'క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా మీడియాతోముచ్చటించిన పాయల్ చిత్ర విశేషాలను పంచుకుంది.

'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మీరు నటించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా మొదలైంది?
'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డాను. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అనిచెప్పారు. చిన్న చిన్న పాత్రలకునిన్ను తీసుకోలేనని స్పష్టం చేశారు. ఆయనకు నా పొటెన్షియల్,నా ట్యాలెంట్ తెలుసు. ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశా. తెలుగు ఇండస్ట్రీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. 'మంగళవారం' విడుదలకు ఎంత ఎగ్జైట్ ఫీలవుతున్నానో... అంతే నెర్వస్ కూడా ఉంది. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం. ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు.

మీ క్యారెక్టర్ నెగిటివిటీతోఉంటుందా?
అసలు కాదు. 'మంగళవారం'లో నేను శైలుపాత్రలో నటించా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది. సినిమాలో చాలా ఎమోషన్స్ఉన్నాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం.

మీకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు ఏమనిపించింది?
అజయ్ భూపతి గారినిఈ క్యారెక్టర్ నిజమేనా? అని అడిగా. నేను ఇంటెన్స్, డార్క్ రోల్స్చేశాను కానీ ఇటువంటిసినిమా, క్యారెక్టర్ చేయలేదు. కథ విన్నాక'అజయ్ భూపతి గారితో మళ్ళీ పని చేస్తున్నా' అని అమ్మకి ఫోన్ చేసి చెప్పా. 'ఆర్ఎక్స్ 100'తోనన్ను పరిచయం చేశారనో మరొకటో అమ్మకిఆయన అంటే చాలా గౌరవం. ఆయన డైరెక్షన్ కూడా ఇష్టం.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
చాలా చాలెంజింగ్ రోల్. అందులో నటించడం చాలా కష్టమైంది. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు పది శాతం కూడా సంబంధం లేదు. ఏం ఆలోచించకుండా ఫ్రీగా షూటింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఆయనపైనాకు పూర్తి విశ్వాసం ఉంది. చెప్పినట్లు చేశా. సరెండర్ అయిపోయా. క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ కోసం నేను కూడా కొంత రీసెర్చ్ చేశా.

మీ కంటే ముందు 40 మందిని ఆడిషన్ చేశారట?
ఆల్మోస్ట్ 35 మందిని ఆడిషన్ చేసినట్లు ఉన్నారు. అజయ్ భూపతి వెంట పడ్డానని చెప్పాను కదా! మధ్యలో ఫోన్స్ చేసినప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేవారు. 'నన్ను ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు' ఛాన్స్ ఇవ్వడం లేదు' అని కూడా అడిగా. మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే నా కెరీర్ కి హెల్ప్ అవుతుందని కూడా చెప్పా. చివరకు, ఆడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు.

మీరు మోడ్రన్ గా కనిపిస్తారు. సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. ఆ లుక్, క్యారెక్టర్ గురించి?...
శైలు క్యారెక్టర్ హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజు రెండు గంటలు పట్టింది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేశాక15 రోజులు దాన్నుంచి బయటకు రాలేదు. మా అమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాను. చేతి మీద గాట్లు, నా లుక్ చూసి 'నీకుఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది.

మీ క్యారెక్టర్, నందితా శ్వేతా పాత్రకు సంబంధం ఏంటి?
నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ట్విస్టులలోఆమెదికీలక పాత్ర ఉంటుంది.

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమానులేడీ ప్రొడ్యూసర్ చేశారు. మీకు ఎంత కంఫర్ట్ అనిపించింది?
చాలా కంఫర్టబుల్ అండి. షూటింగ్ టైములోస్వాతి రెడ్డిని కలవలేదు. కానీ, ఫోనులోమాట్లాడాను. స్వాతి గారు, సురేష్ వర్మ గారు... ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు చూడని కథ, క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయి.

కార్తికేయతోమళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు?
కార్తికేయతోచెప్పా. మళ్ళీ మనం కలిసి సినిమా చేద్దామని! మంచి కథ వస్తే చెబుతాననిఅన్నారు. అన్నీ కుదరాలి!

'ఆర్ఎక్స్ 100'కి, ఇప్పటికి అజయ్ భూపతిలోఏమైనా మార్పు గమనించారా?
లేదు. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యారు. అంతే తప్ప మార్పులు ఏమీ లేవు. నేను టెన్షన్ పడితే ఆయన కూల్ గా ఉన్నారు.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద అల్లు అర్జున్ తో సెల్ఫీలుదిగారు. ఆయనతో ఏం మాట్లాడారు?
అల్లు అర్జున్ గారినికలిసినప్పుడు బ్లష్ అవుతూ ఉన్నాను. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.