English | Telugu

నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్‌!

హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అలరించిన కార్తీక నాయర్‌ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి బిజినెస్‌ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలనాటి టాప్‌ హీరోయిన్‌ రాధ కుమార్తెగా సినిమా రంగంలో ప్రవేశించిన కార్తీక అనుకున్న స్థాయిలో సక్సెస్‌ అవ్వలేకపోయింది. తాజాగా కార్తీక వివాహం జరగబోతుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాధ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖులను కలుసుకుని ఆహ్వాన పత్రికలు అందించింది. గత నెలలోనే కార్తీక నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు అనే విషయాన్ని సీక్రెట్‌ ఉంచారు కార్తీక కుటుంబ సభ్యులు.

ఫైనల్‌గా కార్తీక తన కాబోయే జీవిత స్వామి రోహిత్‌ మీనన్‌ను అందరికీ పరిచయం చేసింది. గత నెలలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను షేర్‌చేస్తూ ‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభించా.. ’ అంటూ తన ఇంస్టాగ్రామ్‌ ఖాతాలో తన ప్రేమను వ్యక్తం చేసింది కార్తీక. రోహిత్‌ మీనన్‌ దుబాయ్‌కు చెందినవాడని తెలుస్తోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న కార్తీకకు, రోహిత్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్ళి తేదీ కోసం ఎదురుచూస్తున్నామని కొందరు కామెంట్‌ చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.