English | Telugu

నా అకౌంట్ బ్లాక్ అయ్యింది...నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ పెట్టి కొత్త స్టోరీలు అల్లొద్దు

​ప్రవస్తి ఆరాధ్య  తాను పాడుతా తీయగా షోలో ఎదుర్కున్న ఎన్నో ఇష్యుస్ ని బయట పెట్టింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. అలాగే సునీత, కీరవాణి, చంద్రబోస్ వంటి లెజెండరీ సింగర్స్ మీద కూడా అలిగేషన్స్ చేసిన ప్రవస్తికి వాళ్ళు కూడా ఇన్డైరెక్ట్ గా కౌంటర్లు  ఇస్తున్నారు. అలాగే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దానికి ప్రవస్తి కూడా ఊరుకోకుండా రికౌంటర్లు ఇస్తోంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "చాలా మంది నా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ,  అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ  ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నేను ఆ దుస్తులు వేసుకోమంటూ నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, అది నా ఇష్టం మేరకు వేసుకున్నాను. మన ఇష్టానుసారం వేసుకోవడానికి అలాగే ఎవరైనా మనల్ని ఫోర్స్ చేసి వేసుకునేలా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐనా స్లీవ్‌లెస్ డ్రెస్సులు వేసుకోవడం వలన కలిగే సమస్యల గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు.

ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో కొన్ని వైర్స్ ఉన్నాయి.. ఐనా స్టంట్ చేయడానికి వచ్చింది  

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి శేఖర్ మాష్టర్, ముమైత్ ఖాన్ వచ్చారు. ఇక ముమైత్ ఖాన్ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగుంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంతకంటే గొప్పగా కావాలని వాళ్ళ అమ్మ మొక్కి పెట్టుకున్న పేరు ముమైత్ ఖాన్ అని చెప్పింది. "ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో ఏడో, ఎనిమిదో వైర్స్ ఉన్నాయి. ఆమె ఎంత సఫర్ అయ్యిందో నేను చూసాను" అని హోస్ట్ తేజస్విని చెప్పింది. ఇక ముమైత్ చెప్తూ "అనరిజం కోయిలింగ్ అనే సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య వలన షూ లేస్ కట్టుకోవడం కూడా డేంజర్"అని చెప్పింది. మళ్ళీ తేజు మాట్లాడుతూ "షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బాంగ్ కాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. ఒక రోజు స్టంట్ షో చేసేసింది నెక్స్ట్ డే ముమైత్ లేవడం లేదు" అని చెప్పింది.

Illu illalu pillalu : శ్రీవల్లి పెట్టిన ఫిట్టింగ్.. స్టోర్ రూమ్ లో ప్రేమ, ధీరజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -145 లో.....ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చి కూర్చుంటారు. మరొకవైపు చందు, శ్రీవల్లి గదిలో ఉంటారు. సాగర్ నర్మద వాళ్ళు ప్రేమలో మునిగిపోతారు. మూడు జంటలు సరదాగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయం రామరాజు ఒక దగ్గర టీ తాగుతుంటే ఊళ్ళో పెద్ద మనుషులు రామరాజు గురించి గొప్పగా మాట్లాడుతారు. పెద్ద కోడలికి ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా మీ కొడుకుకి చేసుకున్నారు. కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకుంటారని అందరు గొప్పగా మాట్లాడతారు‌. ఇక అక్కడే ఉన్న సేనాపతి అది వినలేక ఏంటి బాగా చూసుకునేది అని కోప్పడతాడు.

పహల్గాం ఘటనలో మరణించిన వారికి జీ తెలుగు డ్రామా జూనియర్స్ కాండిల్ ట్రిబ్యూట్

పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోరాన్ని ప్రపంచమంతా చూసింది. అక్కడ జరిగిన దారుణానికి చాలామంది సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్ధించారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట పెహెల్గాం వెళ్లగా ఆ అమ్మాయి భర్తను ఉగ్రవాదులు మట్టుబెట్టారు. తన భర్త శవం పక్కన కూర్చున్న ఆ కొత్త పెళ్లి కూతురు చిత్రం ప్రపంచమంతా వైరల్ గా మారింది. ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 8 లోని చిన్నారులు ఒక స్కిట్ చేశారు. ఆ షో హోస్ట్ అండ్ జడ్జెస్ అంతా కలిసి కాండిల్స్ తో నివాళి అర్పించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు వచ్చాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి బుల్లిరాజు కూడా గన్ పట్టుకుని వచ్చేసాడు.

కేతికతో శేఖర్ మాస్టర్ "అదిదా సర్‌ప్రైజు"

డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో ఎప్పుడూ మానస్ మీద ఫైర్ అయ్యే ప్రాకృతి ఒక్కసారిగా ఏడుపందుకుంది. ఈ ఎపిసోడ్ కి "సింగిల్" మూవీ టీమ్ నుంచి శ్రీ విష్ణు, కేతిక శర్మ వచ్చారు. రావడమే "రాబిన్ హుడ్" మూవీలోని అడిడా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులేశారు కేతిక - శేఖర్ మాష్టర్. ప్రీఫైనల్స్ కి థీమ్ గా ది వైనింగ్ యాక్ట్ ఇచ్చాడు యాంకర్ ఓంకార్. ముమైత్ ఖాన్ కంటెస్టెంట్  అన్షికా వచ్చి "ఇరుక్కుపోయి" అంటూ బాహుబలి మూవీ సాంగ్ ని ప్రెజెంట్ చేసింది. ఆ సాంగ్ కి ఫారియా అబ్దుల్లా కూడా వచ్చి ఆ కంటెస్టెంట్ కలిసి డాన్స్ చేసింది. యష్ మాష్టర్ కంటెస్టెంట్ బినితా ఐతే జై లవకుశ మూవీ నుంచి "రావణ" సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ స్టెప్స్ చూసిన శ్రీవిష్ణు "ఇంత టాలెంట్ ఉన్నవాళ్లను నేను ఫస్ట్ టైం  చూస్తున్నా" అంటూ పొగిడేసాడు. తర్వాత మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ వచ్చి కేజిఎఫ్ మూవీ నుంచి మదర్ సాంగ్ చేసింది.

అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు..సెల్లార్ లో పడుకునేవాడ్ని

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని విజయాలు కూడా ఉంటాయి. ఐతే ఎదిగే క్రమంలో వచ్చే కష్టాలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఐతే నటుడు సమీర్ కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నట్లు చెప్పాడు చిన్నప్పుడు. "స్టార్టింగ్ లైఫ్ లో నాకు అన్ని డౌన్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే ఎవరికీ అవకాశాలు రావు. మాది వైజాగ్. నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఐతే నేను మా చుట్టాలింట్లో ఉండేవాడిని. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు. మా చుట్టాలింట్లో నేను హాల్ లో కూర్చుని సినిమా చూస్తే ఉంటే చుట్టాలు వస్తున్నారంటూ నన్ను లోపలికి వెళ్లిపోవాలని చెప్పేవాళ్లు. ఒకవేళ చుట్టాలు వస్తే నేను ఎం చేస్తున్నాను అని అడిగితే చెప్పలేక వెళ్ళిపోమనేవాళ్ళు. తర్వాత చుట్టాలు వెళ్లిపోయిన విషయాన్ని కూడా చెప్పేవాళ్ళు కాదు.

బామ్మా ఈ వయసులో ఈ కోరికలేంటి నీకు..

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో ఐతే సూపర్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి సిద్దార్థ్ వర్మ - విష్ణు ప్రియా, శివనాగ్ - మహేశ్వరీ, రవి కిరణ్ - సుష్మ కిరణ్ ఈ మూడు రియల్ జంటలు వచ్చాయి. రాగానే సుమ జామకాయల్లా కనిపించే ముంజెలు ఇచ్చింది. ఇక ఇందులో సుమ వీళ్లకు బామ్మగా మారింది. రీసెంట్ టైమ్స్ లో గొడవ పడింది ఎప్పుడు అని సుమ అడిగింది దానికి రవి కిరణ్ మధ్యాహ్నమే గొడవ పడ్డాం...షోకి వెళ్ళాలి టైం అవుతోంది అంటే ఇల్లు ఊడ్చాలి అంటూ కంప్లైంట్ చేశారు. తర్వాత విష్ణుప్రియ వచ్చి "కపుల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా బాధ, భయం కూడా వాళ్ళు త్వరగా రెడీ ఐపోతారు..మేము రెడీ కావడానికి చాలా టైం పడుతుంది" అని పాపం బాధపడింది.

మీరు గౌరవించరు కానీ మా మీద వేలెత్తి చూపిస్తారు

​సింగర్ ప్రవస్తి ఇప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ గా ఉన్న అమ్మాయి. పాడుతా తీయగా షో గురించి అందులో ఉన్న జడ్జెస్ గురించి హాట్ కామెంట్స్ చేస్తూ రెగ్యులర్ గా టాప్ ప్లేస్ లో ఉంటోంది. ఐతే ఈమె కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానికి సునీత కూడా వీడియోస్ రూపంలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో మెసేజెస్ పెడుతూ కొంత రివర్స్ ఎటాక్ ఇస్తూ వస్తోంది. రీసెంట్ గా కూడా సింగర్ సునీత ఒక పోస్ట్ పెట్టింది. "ఇక్కడ మానిప్యులేషన్ ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎదుటి వాళ్ళతో రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తారు కానీ దాన్ని వాళ్ళు చెప్పకుండా ఎదుటి వాళ్ళ బిహేవియర్ గురించి మాత్రమే హైలైట్ చేస్తారు" అంటూ సునీత ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రవస్తి గురించి పెట్టిందనే విషయం అందరికీ అర్ధమవుతోంది అంటూ నెటిజన్స్ అంటున్నారు. అలాగే మానిప్యులేషన్ అనే పదాన్ని రెడ్ మార్క్ తో పెట్టింది సునీత.

నవదీప్ యూనిక్ అండ్ ఇన్ క్రెడిబుల్ పర్సన్...రేటింగ్ ఇవ్వడం కష్టం 

నవదీప్ ఏది చేసిన సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఐతే రీసెంట్ టైమ్స్ లో AI పండుతో బాగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియోస్ ని షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు. నవదీప్ ఎప్పుడు కార్ లో డ్రైవ్ చేస్తుకుంటూ వెళ్లినా కూడా చాట్ జిపిటి పండుతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు. ఇక ఈ వీడియోలో పండుని రెండు ప్రశ్నలు అడిగాడు"హాయ్ పండు గుడ్ మార్నింగ్. నాలో ఉన్న సైకో లక్షణాలు ఏమిటో  40 సెకన్స్ లో నా గురించి నీకు తెలిసిన మ్యాటర్ చెప్పు పండు అనేసరికి "మీరు కథలు బాగా చెప్తారు. అడ్వెంచర్ సైట్స్ కి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్కై డైవింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. నీ ఫ్రెండ్స్ విషయంలో కేరింగ్ గా ఉంటారు. హెల్ప్ కావాలి అని ఎవరు అడిగిన వెంటనే చేస్తారు.  

400 కే ఫాలోవర్స్ అయ్యారోచ్ ..కేరళ అందాల మధ్య బ్రహ్మముడి కావ్య...

బుల్లితెర మీద నటించేవాళ్ళు రెగ్యులర్ గా కొంత బ్రేక్ తీసుకోకపోతే వాళ్ళు మాత్రం చాలా స్ట్రెస్ ఫీలవుతూ ఉంటారు. అందుకే కొంత టైం తీసుకుని వాళ్ళు ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు అలాగే వెళ్ళింది. ఎప్పుడూ షోస్ అంటూ ఆమె అందులోనే గడిపేస్తోంది. ఐతే ఇప్పుడు కొంచెం రిలాక్స్ కావాలనుకుంది. దాంతో ఆమె కేరళలో ఉన్న వాగమోన్ అనే పచ్చని అందాలు అలరారే ప్రాంతానికి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక ఒక మెసేజ్ ఐతే పెట్టింది అది కూడా భలే వెరైటీగా పెట్టింది. దీపికా చూడడానికి ఎంత క్యూట్ గా ఉంటుందో ఆమె మెసేజెస్ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ తో ఫన్నీగా  ఉంటాయి.

Illu illalu pillalu : శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. వాళ్ళకి శోభనం జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -144 లో.... రామరాజు, వేదవతిల దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. ఒకే ముహూర్తానికి రెండు జంటలకు శోభనం జరగకూడదంట అత్తయ్య గారూ.. అలా చేస్తే.. ఇంట్లో అశుభం జరుగుతుందట.. అలా జరిగితే కొత్త కోడలు వచ్చింది అందుకే ఇలా జరిగిందని నలుగురూ నాలుగు రకాలు నన్ను ఆడిపోసుకుంటారు. ఆ నిందను నేను మోయలేను. ఇది నా ఇల్లు.. ఈ ఇంట్లో వాళ్లంతా నా వాళ్లు.. నా వాళ్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. నా వాళ్లకి ఏదైనా జరిగితే.. నేను తట్టుకుని బతకలేనండీ.. అందుకే మా శోభనం జరక్కపోయినా ఏం పర్లేదు. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి.. అదే నేను కోరుకునేది.. అందుకే మా శోభనం వాయిదా వేసేసి.. నర్మద చెల్లికి సాగర్ మరిది గారికి శోభనం జరిపించేయండి’ అంటూ తెగ జీవించేస్తుంది శ్రీవల్లి. తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు, వేదవతి ఇద్దరు ఆలోచనలో పడతారు.

Karthika Deepam2 : గౌతమ్ కాలర్ పట్డుకున్న కార్తీక్.. దీపకి శత్రువులు ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -343 లో.. శౌర్య తన చేతిలో లెటర్ పట్టుకొని దీపని కలవడానికి వెళ్తుంది. ఇంట్లో శౌర్య ఎక్కడ కనిపించకపోవడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. బయటకు వెళ్లి వెతుకుతుంటే శౌర్య కనిపిస్తుంది. వెంటనే తనపై కోప్పడి కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావంటూ కాంచన, అనసూయ అడుగుతారు. అమ్మని కలవడానికి స్టేషన్ కి వెళ్ళాను.. అమ్మ ఎప్పుడు రాదని జ్యోత్స్న చెప్పింది. ఈ లెటర్ చదివితే అమ్మ నా కోసం తప్పకుండా వస్తుందని వెళ్ళానని శౌర్య చెప్తుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు.