English | Telugu

సుధీర్ ని చిన్న పిల్లల చేత కూడా తిట్టిస్తున్నారు..హర్ట్ అవుతున్న ఫ్యాన్స్

సుధీర్ హోస్ట్ గా ఏ షో ఐనా కూడా ఫుల్ రేటింగ్ ఉంటుంది అని మేకర్స్ కూడా సుధీర్ తో కొన్ని షోస్ చేయిస్తున్నారు. రీసెంట్ డ్రామా జూనియర్స్ సీజన్ 8 కి హోస్ట్ గా చేస్తున్నాడు సుధీర్. ఐటీ ఈ షో మొదలైన దగ్గర నుంచి సుధీర్ మీద చిన్న పిల్లలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ షో ప్రోమోలో కూడా అదే జరిగింది. శ్రీమనో అనే చిన్నారి వచ్చి సుధీర్ ని పిచ్చపిచ్చగా తిడుతూ జోక్స్ వేసింది. "నా కూతురుని ఎవరో ఒకరికి కట్టబెట్టాలి కదా" అని ఆ పిల్ల అనేసరికి " నేను ఉన్నాగా అత్తా " అన్నాడు సుధీర్. 'ఏడ్చావులే వెర్రి సచ్చినోడా. ఎం మాట్లాడుతున్నావురా బడుద్దాయి...ఓలమ్మో ఓలమ్మో ఈ ముదనష్టపోడు ఎన్ని మాటలు అంటున్నాడో" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇక జడ్జ్ అనిల్ రావిపూడి ఐతే తధాస్తు దేవతలు నీకు ఇలాంటి అత్తను ప్రసాదిస్తారేమో అనుకుంటున్నా అన్నాడు. ఇక పిల్లలు ఇలాంటి తిట్లు తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు.

రాంప్రసాద్ పచ్చళ్ళల్లో ఆ రకమైన పచ్చళ్ళు కూడా లభ్యం

జబర్దస్త్ ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఐతే పికిల్స్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో మనకు తెలుసు. ఇప్పుడు రాంప్రసాద్ కూడా అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు. రాంప్రసాద్ పికిల్స్ పేరుతో ఒక స్కిట్ చేసాడు. ఇందులో పికిల్స్ అమ్మడమే కాదు పికిల్స్ పెట్టడంలో ట్రైనింగ్ కూడా ఇస్తాం అని చెప్పాడు. ఐతే ఇందులో ఆ టైపు పచ్చాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ ఐన పికిల్స్ ట్రోలింగ్ చూస్తే ఒక వెరైటీ కామెంట్ ని కూడా చూసాం. ఒక సంస్థ వాళ్ళు పెట్టిన పచ్చడి తినడం వలన ప్రెగ్నెంట్ అయ్యారంటూ ఒక కస్టమర్ పెట్టిన ఒక మెసేజ్ కూడా  పాయింట్ బాగా వైరల్ అయ్యింది. ఇక్కడ రాంప్రసాద్ కూడా అలాంటి ఒక పాయింట్ ని యాడ్ చేసాడు. దొరబాబు పచ్చళ్ళు కొనుక్కోవడానికి వచ్చాడు. ఏ రకమైన పచ్చళ్లయినా మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు.

దేవుడు ఉన్నాడో లేడో తెలీదు కానీ సుకుమార్ నా దేవుడు

ఫ్యామిలీ స్టార్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఈ షోకి "పెళ్లి కాని ప్రసాదు" మూవీ టీమ్ వచ్చింది. సప్తగిరి, కిట్టయ్య వంటి సీనియర్ నటులు వచ్చారు. అందులో కిట్టయ్య మూవీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "నా లైఫ్ గురించి నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక ఆర్టిస్ట్ ని అవుతానని..ఆర్టిస్ట్ అయ్యే అర్హత నాకు లేదు. సుకుమార్ వలన ఇండస్ట్రీకి రాగలిగాను. అతను నా ఫ్రెండ్ అవడం వలన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. నాలోని ఆర్టిస్ట్ ని బయటకు తీసుకొచ్చాడు. కళామతల్లిని దగ్గర చేసాడు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసే పని లేకుండా పోయింది. ఆ తర్వాత రాజావారు రాణివారు అనే సినిమాలో రవి కిరణ్ నాకు మంచి రోల్ ఇచ్చి నా స్థాయిని ఇంకొంచెం పెంచారు.

త్వరలో మినిస్టర్ కాబోతున్న రోజా ? 

డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఆడియన్స్ ని బాగా అలరిస్తోంది. ఈ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హార్విన్ అనే చిన్నారి చారీ గెటప్ లో వచ్చి రోజాకు జాతకం చెప్తాడు. ఇక ఆ కుర్రాడి మాటలు మాములుగా లేవు చాలా క్యూట్ గా ఉన్నాయి. "అందరూ జాబిలిని చూస్తారు కానీ నేను జాబిలికే జాతకం చూస్తున్నా" అని చెప్పాడు ఆ చిన్నారి. దాంతో రోజా ఐతే ఆ పిల్లాడి మాటలకు ఫిదా ఐపోయింది. ఆ చిన్నారినే చూస్తూ కూర్చుంది. దాంతో ఆ పిల్లాడు రోజా జాతకం చెప్పాడు. "త్వరలోనే మినిస్టర్ గా" అన్నాడు. దానికి రోజా వెంటనే "ప్రమాణ స్వీకారం చేస్తానా" అని అన్నది. కాదు త్వరలోనే మినిస్టర్ గా సినిమా చేయబోతున్నారు అని చెప్పాడు.

Illu illalu pillalu: బెల్లం కాఫీతో అందరిని ఇంప్రెస్ చేసిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదుర్స్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-141లో.. రామరాజు మార్నింగ్ వాక్‌కి వెళ్తుంటాడు. ఇంతలో శ్రీవల్లి.. అందరికీ కాఫీ ఇచ్చి.. మాయ గారు గుడ్ మార్నింగ్ అండి అని పలకరించి కాఫీ ఇవ్వబోతుంది. నేను వాకింగ్ చేసొచ్చాక తాగుతానమ్మా అని రామరాజు అంటాడు. అయ్ బాబోయ్.. ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే నీరసం వచ్చేయదూ.. అట్టా ఎప్పుడూ చేయొద్దు.. మంచిది కాదు.. ఒక్క కాఫీ కడుపులో పడితే పడి ఉంటుంది కదా అని శ్రీవల్లి అంటుంది. దాంతో రామరాజు సరేనని కాఫీ తీసుకుంటాడు. ఏంటి బుజ్జమ్మా.. కొత్త కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావా అని రామరాజు అంటాడు. శ్రీరామా.. శ్రీరామా.. నేను పనులు చెప్పడం ఏంటండీ.. మీ కొత్త కోడలే మాకు ఉదయాన్నే షాకిచ్చింది. నాలుగింటికే లేచి.. మేం ముగ్గురం చేసే పనులన్నీ తను ఒక్కతే చేసేసింది.. మేం లేచేసరికి వేదవతి అంటుంది. 

Brahmamudi: సంతకం ఫోర్జరీ చేసిందని ఆరోపించిన రుద్రాణి.. కావ్యకి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-704లో.. అపర్ణ, కావ్య మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావే నువ్వు.. అంత నమ్మకంగా రుద్రాణీకి మాట ఇచ్చేసి వచ్చావని అపర్ణ అంటుంది. లేకపోతే ఆయన డెత్ సర్టిఫికెట్ కావాలని అడుగుతుందా? వయసులో పెద్దదని ఊరుకున్నా అత్తయ్యా.. లేదంటే చెంపలు పగలగొట్టేదాన్ని అని కావ్య అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటానులే కానీ.. ముందు ఇప్పుడొచ్చిన సమస్య గురించి ఏం ఆలోచించావ్.. రాజ్ వచ్చి కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి వాడికి గతమే గుర్తు లేదు కదా.. ఎలా ఇప్పుడని అపర్ణ అంటుంది.

75 వేలతో మ్యూజిక్ వీడియో సాంగ్ థీమ్ తో డాన్స్ ఐకాన్

డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఐతే ఈ రాబోయే కాన్సెప్ట్ ఏంటంటే మ్యూజిక్ వీడియోస్ థీమ్ అన్నమాట. ఒక్కో కంటెస్టెంట్ కి 75 వేలు ఇచ్చామని ఆ డబ్బులతోనే ఫస్ట్ వీడియో సాంగ్ ని షూట్ చేయాలి అంటూ యాంకర్ ఓంకార్ టాస్క్ ఇచ్చాడు. దాంతో మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ సాగరిక ఐతే "ధీవర" అనే సాంగ్ కి డాన్స్ వీడియో చేసి చూపించింది. ఈ డాన్స్ కి ఫారియా కాంప్లిమెంట్ ఇచ్చింది. "మూవ్మెంట్స్ సాండ్ లాగా చాలా స్మూత్ గా ఉన్నాయి. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది"అని చెప్పింది. ఇక బెనీత ఐతే "జేజమ్మ" సాంగ్ కి వీడియో సాంగ్ చేసింది. ఇక ఈ సాంగ్ షాట్స్ అన్నీ కూడా రెండు గంటల్లో చేసేశాం అని మెంటార్ యష్ మాష్టర్ చెప్పేసరికి శేఖర్ మాష్టర్ కూడా షాకయ్యాడు. ఇక విపుల్ రాకీ భాయ్ సాంగ్ కి డాన్స్ వీడియో చేసేసరికి దీపికా ఫుల్ ఫిదా ఐపోయింది.

అప్పుడే తాగి పడిపోయావా...సెన్స్ లెస్ గా మాట్లాడితే వినను..హమీద మీద ఫుల్ ఫైర్

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఇమ్మానుయేల్ టిల్లు గెటప్ లో వచ్చాడు. ఇక హమీద ఐతే మిత్రవింద గెటప్ లో వచ్చింది. టిల్లు అనుకుంటూ వచ్చి కింద పడిపోయేసరికి ఇమ్ము ఒక ఘాటైన డైలాగ్ వేసేశాడు. "వేసిందే  రెండు రౌండ్లు అప్పుడే తాగి పడిపోయావా" అనేసరికి హమీద నవ్వుకుంది. ఇక మానస్ ఐతే పవన్ కళ్యాణ్ గెటప్ లో వచ్చి "మనం డైలాగ్స్ చెప్పం పాట పాడతాం" అంటూ పాట పాడి వినిపించాడు. ఈ షోలో జడ్జెస్ శేఖర్ మాష్టర్ - అనసూయ హీరోహీరోయిన్స్ గా వచ్చారు. ఈ నెక్స్ట్ వీక్ సినిమా సినిమా అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీముఖి టాకీస్ కి హీరో శేఖర్ మాష్టర్ హీరోయిన్ అనసూయ వచ్చారు అంటూ చెప్పింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు హీరో గారు" అని శ్రీముఖి అడిగేసరికి "నువ్వు హీరోగారు అనేసరికి నాకేం అర్ధం కావడం లేదు" అన్నాడు శేఖర్ మాష్టర్. హీరోయిన్ ఎవరు అనేసరికి ఇంకెవరు ఇదిగో అంటూ అనసూయని చూపించింది శ్రీముఖి. ఆమె కూడా సీరియస్ గా చూసేసరికి "ఇదంతా సినిమాలో యాక్ట్ చెయ్యి ఇక్కడ కాదు" అని సెటైర్ వేసాడు శేఖర్ మాష్టర్. ఇక ఈ ప్రోమోలో మానస్ వెర్సెస్ హమీద అన్నట్టుగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

Karthika Deepam2:  కోర్టులో దీపని నిలదీసిన లాయర్.. ఇంట్రస్టింగ్ గా మారిన కేస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-339లో.. దీపని పోలీసులు కోర్ట్ లోపలకి తీసుకొని వెళ్తారు. జ్యోత్స్నని తిట్టేస్తాడు కార్తీక్. అందరు లోపలికి వెళ్తారు. ఇక కోర్టులో వాదన మొదలవుతుంది. ఇటు దీప తరపున కళ్యాణ్ ప్రసాద్, అటు జ్యోత్స్న వాళ్ల తరపున భగవాన్ aదాసు ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు. సుమిత్రను విచారించడానికి దీప తరుపు లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అనుమతి కోరతాడు. ఆమె వస్తుంది. మీపేరు అని కళ్యాణ్ అనగానే.. సుమిత్ర అంటుంది. దీపను చూపిస్తూ.. తను ఎవరో తెలుసా అంటాడు. తెలుసు.. మా ఇంట్లో ఉండేది. మేమే ఉండమన్నామని సుమిత్ర అంటుంది. ఆమె మీ బంధువా అని కళ్యాణ్ అంటాడు. కాదని సుమిత్ర అనగానే.. మరి ఏ బంధుత్వం లేకుండా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని లాయర్ అంటాడు. నా ప్రాణాలు కాపాడిందన్న కృత‌జ్ఞ‌తతో అని సుమిత్ర అనగానే.. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో ఉన్న దీప..

Illu illalu pillalu: కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయిన రామరాజు.. ధీరజ్ ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-140 లో.. శ్రీవల్లిని ప్రేమ అవమానించిన తన భర్త ధీరజ్ సపోర్ట్ చేయకపోవడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది.‌ ఇక ఇల్లు దాటి గీత దాటుతుండగా ప్రేమ ఆగిపోతుంది. ఇక అప్పుడే తన పక్కకి ధీరజ్ వస్తాడు. నీ అడుగు ఈ గీతను దాటదు ప్రేమా అని అంటాడు. అడుగుదాటకపోవడం కాదు.. నువ్వే అడుగుముందుకు వేయలేవు. ఎందుకంటే.. ఏదో తెలియని బంధం నీ మనసుని కాళ్లని కట్టిపడేస్తుంది. మనకి తెలియకుండానే ఇష్టంలేని బంధంలో ఇరుక్కునిపోయాం. మన జీవితాల గురించి మనం నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మనం లేము ప్రేమా.. ఎందుకంటే మనది ఇష్టం లేని ప్రయాణం. కానీ కలిసి నడవాల్సిన పరిస్థితి. అలాగని నిన్న ఆగమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. నచ్చినా నచ్చకపోయినా.. ఏం జరిగినా ఎవరేమన్నా.. మనం భరించాల్సిందే.. కలిసి అడుగులు వేయాల్సిందేనని ధీరజ్ అంటాడు. ఆ మాటతో ప్రేమ అవుతుంది. నీ బాధకి కారణం మా వదిన ఏదో మాట్లాడిందనే కదా.. ఒక్కసారి మా వదిన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. ఇంకో గంటలో తన మెడలో తాళి పడబోతుందనగా.. తన భర్తని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఆ క్షణంలో ఓ ఆడపిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ప్రేమా అని ధీరజ్ అంటాడు.

Brahmamudi: రాజ్ సంతకమా? డెత్ సర్టిఫికేటా.. కావ్యని ఇరికించిన రుద్రాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-703లో.. రుద్రాణి ఒకతనికి కాల్ చేస్తుంది. నవ్య జ్యూయెలరీ మేనేజర్ శ్రీధర్ గారేనా మాట్లాడేదని అంటుంది. నేనే మేడమ్.. బాగున్నారా.. మీ నంబర్ నా దగ్గర ఉందని శ్రీధర్ అంటాడు. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను.. మీరు నాలుగు కోట్ల వరకు మా కంపెనీకి చెల్లించాలని విన్నాను నిజమేనా అని రుద్రాణి అనగానే.. నిజమే మేడమ్.. మాకు రావాల్సిన పేమెంట్స్ రాక మేము 2 డేస్ టైమ్ అడుగుతున్నాం కానీ ఆ మేడమ్ అందుకు ఒప్పుకోవడం లేదు.. మాకు 2 డేస్ టైమ్ ఇప్పించగలరా అని అంటాడు. నేను చెప్పినట్లు చేస్తే రెండు రోజులు కాదు రెండు వారాలు టైమ్ దొరుకుతుంది.. మీతో డీల్ మొదలుపెట్టింది రాజ్ కాబట్టి తను లేనప్పుడు పవర్ ఆఫ్ పటార్నీ ఉన్న వాళ్లే డీల్ క్లోజ్ చేయాలి కదా.. రాజ్ లేడన్న డెత్ సర్టిఫికెట్‌ని కావాలని లేదంటే రాజే సంతకం చేసి డీల్ క్లోజ్ చేయాలని కండీషన్ పెట్టండి సరిపోతుందని రుద్రాణి అంటుంది. అదేంటి మేడమ్.. రాజ్ సర్ చనిపోయారు కదా పాపం.. మరి పవర్ ఆఫ్ పటార్నీ కావ్య మేడమ్ గారికి లేదా అని శ్రీధర్ అంటాడు. కావ్యకు పవర్ ఆఫ్ పటార్నీ లేదు.. అందుకే చెబుతున్నా.. ఈ కండీషన్ పెడితే మీకు టైమ్ దొరుకుతుంది. వస్తే రాజ్ వచ్చి సంతకం చెయ్యాలి. అది జరగదు కాబట్టి డెత్ సర్టిఫికెట్ తెప్పించాలి.. దానికి ఎలాగో టైమ్ పడుతుందని రుద్రాణి చెప్తుంది. సరే, థాంక్యూ మేడమ్.. మంచి సలహా ఇచ్చారని శ్రూధర్ అంటాడు అవతల వ్యక్తి. మామ్ కంపెనీకి డబ్బులు రాకుండా ఆపావు ఓకే.. కానీ ఇప్పుడు మన కంపెనీ నుంచి డబ్బు ఇవ్వాల్సిన వారికి సమాచారం ఇవ్వాలి కదా అని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఇప్పుడు అదే చేయబోతున్నా అని రుద్రాణి అంటూ.. స్వరాజ్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వారికి కాల్ చేస్తుంది.

అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ? నువ్వు సేఫ్ గానే ఉంటావులే  

పహల్గాంలో పరిస్థితి అద్వానంగా ఉంటే ఆర్జే కాజల్ మాత్రం అక్కడంతా ప్రశాంతంగా ఉందని, రోడ్స్ అంతా క్లియర్ గా ఉన్నాయని..వాళ్లంతా సేఫ్ గా ఉన్నామంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కాశ్మీర్ ట్రిప్ లో ఉన్నామని లేటెస్ట్ అప్ డేట్ ఇస్తున్నాను అంటూ  పెహెల్గాం నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నామని చెప్పింది. అంతా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంది అని చెప్పింది. తన గురించి ఆలోచన వెల్ విషర్స్ , ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఐతే అక్కడ తాను సేఫ్ గా ఉన్నాను అని చెప్పింది. అలాగే లోకల్ పోలీసులు కూడా అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పింది. కాశ్మీర్ ఎప్పటిలానే సేఫ్ గా ఉంది.

Illu illalu pillalu: భార్యకి ధీరజ్ భరోసా లేనట్టేనా.. ప్రేమ ఆ గీత దాటనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-139 లో..  తోడికోడలు ప్రేమపై నోరు పారేసుకుంటుంది శ్రీవల్లి. ఆమె కుటుంబం గురించి చాలా నీఛంగా మాట్లాడింది. బుద్ది లేకుండా ధీరజ్‌ని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ ప్రేమని తక్కువ చేసి మాట్లాడింది శ్రీవల్లి.  అయితే శ్రీవల్లి అన్న మాటలకు ఏడ్చుకుంటూ.. భర్త ధీరజ్ దగ్గరకు వెళ్తుంది ప్రేమ. ప్రపంచం మొత్తం నిందించినా కూడా.. నీకు నేనున్నననే భర్త భరోసా, ఓదార్పు కోసం ఎదురుచూస్తుంది భార్య. అలాంటి ఓదార్పు ధీరజ్ నుంచి లభిస్తుందని ఆశపడింది ప్రేమ. కానీ భరోసా ఇవ్వాల్సిన భర్తే.. వంత పాడాడు. కనీసం సొంత అక్క కాకపోయినా కూడా.. ఎందుకు ప్రేమను అంతంత మాటలు అంటున్నావ్ అని నర్మద తిరగబడింది కానీ.. కట్టుకున్న వాడు మాత్రం భుజం తట్టలేకపోయాడు.