English | Telugu

Karthika Deepam2: శౌర్యని ఆయుధంగా మార్చుకున్న జ్యోత్స్న.. కార్తీక్ కి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 338లో..  దశరథ్‌కి తెలియకుండా కోర్టు వ్యవహారాలు సాగాలని శివన్నారాయణ నిర్ణయం తీసుకుంటాడు. బావా.. తప్పు జరిగింది.. అది నిజం.. దయచేసి దీపను కాపాడే ప్రయత్నం చేసి.. నువ్వు ఇంకా విలన్ కాకు అని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఆ మాటలు చాటుగా విన్న శౌర్యకు అనుమానం వస్తుంది. అమ్మను నాన్న కాపాడటం ఏంటీ? ఈ విషయం వెంటనే కాశీ మావయ్యను అడగాలని శౌర్య ఫిక్స్ అయ్యి ఇంట్లోంచి దొంగచాటుగా పరుగుతీస్తుంది. ఇక జ్యోత్స్నని కార్తీక్ కోప్పడి పంపేసి సైకిల్ మీద కోర్టుకి బయల్దేర్తాడు. మరోవైపు దశరథ్ నిద్రపోతుంటే సుమిత్ర అక్కడే ఉండి అతడ్ని చూస్తుంటుంది. పక్కనే ఉన్న పారిజాతం.. సుమిత్రా నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోమని అంటుంది.

సుధీర్ కు  ప్రపోజ్ చేసిన గీతూ...ఆ టైములో సూసైడ్ చేసుకోబోయా అన్న జ్యోతి

రష్మీ సుధీర్ విడివిడిగా షోస్ చేస్తుండడంతో ఇక్కడ సుధీర్ ని పటాయించడానికి చాలామంది అమ్మాయిలు క్యూలు కడుతున్నారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే  ఫామిలీ స్టార్స్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో సుధీర్ ని ఇద్దరు అమ్మాయిలు గులాబీలతో వెంటపడ్డారు. వాళ్ళే నటి జ్యోతి, గీతూ రాయల్. ఇద్దరూ కూడా ఎర్ర గులాబీలు తీసుకొచ్చి పోటీ పడి మరీ ఇవ్వడానికి ట్రై చేశారు. "చిన్నప్పటి నుంచి నీ మీద ఒక టైపాఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం." అంటూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసాడు జ్యోతి.  "నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేటంత ప్రేమ ఉంది నాకు. మనకు పెళ్ళైతే నువ్వు లేచే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకు ఎం కావాలో అది వండి ఎత్తుకుని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి రాత్రి పడుకునే ముందు నీ కాళ్ళు నొక్కుతా బావా" అని గీతూ అనేసరికి "తర్వాత తర్వాత" అన్నాడు సుధీర్...ఆ మాటకు గీతూ తెగ సిగ్గు పడిపోతూ గులాబీ పువ్వు ఇవ్వడానికి కూడా చేతులు వణుకుతున్నాయి" అంది.

మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అంబటి అర్జున్, సుహాసిని, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వచ్చారు. ఇక ఈ ప్రోమో మొత్తం జోక్స్ తో నిండిపోయింది. రాగానే అందరికీ కొబ్బరి మామిడి ముక్కలు ఇచ్చింది సుమ. ఆ తర్వాత  ఇందులో సుహాసినిని హైలైట్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకోమని అడిగింది సుమా. "నాకు మామిడి కాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు..ఇది తగిలించి పులుసు వేసుకుని తింటే ఉంటాది నా సామి" అంది. దాంతో సుమ అంది చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడూ అని అంది. అదేంటో అర్ధం కాక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది సుహాసిని. "చేపలు పొట్టలోపలికి వెళ్లి గలుగులు చేస్తాయి" అంది. దాంతో నవ్వేసింది సుహాసిని. ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది "చంటిగాడు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవకపోవడానికి కారణం ఏంటి" అని అడిగింది. "సక్సెస్ వచ్చింది. అది హ్యాపీ థింగ్.

రామ్ ప్రసాద్ పచ్చళ్ళ ట్రైనింగ్ సెంటర్...రాఘవ నిల్వ ఆవకాయలాంటోడు

సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం వరకు పచ్చళ్ళ హడావిడి బాగా నడిచింది. ఎటు చూసిన పచ్చళ్ళు, బూతులు ఇవి తప్ప వేరే న్యూస్ లేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని తీసుకుని జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రామ్ ప్రసాద్ టీమ్ ఈ పచ్చళ్ళు  పట్టే కార్యక్రమంతో పాటు ఏఏ ఆర్టిస్ట్ ఏ టైపాఫ్ పచ్చడో చెప్పుకొచ్చాడు. ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్నీ ఒకటేరా అన్నాడు రామ్ ప్రసాద్. ఇంతలో సన్నీ వచ్చి ఎలా అని అడిగేసరికి "భాస్కర్ గోంగూర పచ్చడిలా ఉంటారు. పులుపు కాదు బలుపు" అన్నాడు. "మరి రాఘవ ఏంటో" అన్నాడు సన్నీ. "నిల్వ ఆవకాయ ...జాడీలో పదేళ్ల అలాగే ఉండిపోయాడు లోపల..అది పాడవదు.. తియ్యలేము, పారేయలేము"  అన్నాడు రామ్ ప్రసాద్. దానికి జడ్జ్ శివాజీ ఐతే "అది ఊరతా  ఉంటది" అన్నాడు. "మరి మన గురించి చెప్పలేదేమిటి" అన్నాడు సన్నీ. "మనది ఉగాది పచ్చడిరా అన్నాడు రామ్ ప్రసాద్.

Illu illalu pillalu : కొత్త కోడలి ఆలోచనకి ఇంప్రెస్ అయిన మామయ్య.. విశ్వని కొట్టిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -138 లో...... శ్రీవల్లి మొదటిసారిగా అతింట్లో అడుగుపెట్టడానికి గుమ్మం ముందు నిల్చొని ఉంటారు. ఇక ఆడపడుచులు పేరు చెప్పి లోపలికి రండి అని ఆటపట్టిస్తారు. నర్మద, ప్రేమ మాత్రం తాము ఇలా  కాకుండా గొడవల్లో అత్తారింట్లో అడుగుపెట్టిన సిచువేషన్ గుర్తుచేసుకొని బాధపడతారు. చందు, శ్రీవల్లి తమ పేర్లు చెప్పి లోపలికి వస్తారు.‌ శ్రీవల్లి లోపలికి వెళ్లి దీపం పెడుతుంది. ముగ్గురు కోడళ్ళలో ఈ కోడలే సంప్రదాయంగా ఇంట్లో అడుగుపెట్టింది. మిగతా ఇద్దరు ఏదో హాస్టల్ కి వచ్చినట్లు వచ్చారని కామాక్షి అంటుంది. దాంతో ప్రేమ, నర్మద బాధపడుతుంది.

Karthika Deepam2 : షూట్ చేసింది దీపే అని చెప్పేసిన దశరథ్.. సంతోషంలో జ్యోత్స్న, పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -337 లో..... దీప దగ్గరికి కార్తీక్ భోజనం తీసుకొని వస్తాడు. మీరు అక్కడ పెట్టేసి వెళ్లిపోండి.. ఎస్ఐ గారు వస్తారని కానిస్టేబుల్ అంటుంది. నా భార్యకి నేను భోజనం తినిపిస్తానని కార్తీక్ అంటాడు. మీ ఆవిడకి ఆకలిగా లేదట అని కానిస్టేబుల్ అంటుంది. కన్నకూతురు కడుపునిండా తింది.. అక్కడ హాస్పిటల్ లో మావయ్య స్పృహలోకి వచ్చాడు.. ఇప్పుడు ఆకలి అవుతుందని కార్తీక్ అంటాడు. దీప నీ కోసం నేనే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీపకి కార్తీక్ భోజనం తినిపిస్తాడు.

Brahmamudi : రాజ్ కోసం రుద్రాణి కొత్త డ్రామా.. చిక్కుల్లో పడ్డ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -701 లో....రాజ్ ఇంటికి వచ్చి అపర్ణ గారితో కేక్ కట్ చేయించామని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ వెళ్ళిపోయాక.. ఏంటి అల్లుడు గారు అపర్ణ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. అసలు అపర్ణ ఎవరు అని యామినిని తన తల్లి వైదేహి అడుగుతుంది. రాజ్ కన్నతల్లి అపర్ణ.. ఎదో ఒక రకంగా ఆ కావ్య రాజ్ ని కలుస్తుందని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఎంతైనా కన్నతల్లి కదా అని యామిని వాళ్ళ నాన్న అంటుంటే.. నువ్వు మళ్ళీ వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడకని యామిని కోప్పడుతుంది.

డిస్కవరీ ఛానల్ లో తప్ప అన్ని ఛానెల్స్ లో హోస్ట్ చేసింది సుమ... 

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షో ఫైనల్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేకి మూడు జోడీలు వెళ్లాయి. ఆ మూడు జోడీలు ఎవరంటే అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, ప్రష్షు - ధరణి. ఇక గ్రాండ్ ఫినాలేలో ఈ మూడు జోడీలకు టాస్కులు గట్టిగానే ఇచ్చారు. 7 ఐటమ్స్ చేయాలి అంటూ చెప్పింది. సమీరా భరద్వాజ్ - దీపికా అలాగే ప్రసాద్ - విరాజిత ఎలిమినేట్ అయ్యారు. ఇక దీపికా ఐతే "నాకు కప్పు ఇవ్వని వాళ్ళను చంపుతా" అంటూ సుమని బెదిరించింది. ఇక ఈ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా యాంకర్ రవి రావడంతో  ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెరిగింది. ఈ షో గురించి చెప్పడానికి వచ్చాను అంటూ పాకెట్ లోంచి కళ్ళజోడు పెట్టుకున్నాడు. దాంతో సుమ "ఏంటి కళ్ళజోడు స్టేజికి వచ్చేసావా " అని రవి పరువు తీసేసింది సుమ. "ఎన్నో ఏళ్లుగా డిస్కవరీ ఛానల్ లో తప్పా ఏ ఛానెల్ పెట్టినా కనిపిస్తూ అలరిస్తున్నారు మన సుమ గారు.

ఫైబ్రాయిడ్స్ సమస్యని ఎదుర్కొన్నా యాంకర్ రష్మీ

రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే తన  ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ లో చేరాక అక్కడ వేసుకునే గౌన్ తోనే ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమె ఫాన్స్ అంతా కూడా చాలా బాధపడ్డారు. ఏమయ్యింది అంటూ మెసేజెస్ పెడుతుండేసరికి  తన ఆవేదన మొత్తాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. జనవరి నుంచి తన హెల్త్ ఏమీ బాగోడం లేదని  విపరీతమైన రక్త స్రావంతో బాధపడుతున్నానని చెప్పింది. ఒళ్ళు నొప్పులు పెరగడంతో పాటు ఆమె హిమోగ్లోబిన్ శాతం 9 కి పడిపోయిందని చెప్పింది.