English | Telugu

విజ‌య్.. వ‌రుస‌గా మూడోసారి అత‌నితోనే?

`మాస్ట‌ర్`తో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ విజ‌య్. ప్ర‌స్తుతం `కోల‌మావు కోకిల‌` (తెలుగులో `కోకోకోకిల‌` పేరుతో అనువాద‌మైంది) ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 65వ చిత్రం చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తోంది. కాగా, విజ‌య్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న జూన్ 22న రాబోతున్న‌ట్లు స‌మాచారం.