English | Telugu

'హిడింబ' మూవీ రివ్యూ.. కాన్సెప్ట్ అదిరింది, స్క్రీన్ ప్లే తేడా కొట్టింది!

కొంతకాలంగా విభిన్న చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల విభిన్న చిత్రంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'హిడింబ'. అశ్విన్ బాబు, నందితా శ్వేత ప్రధానపాత్రధారులుగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు(జూలై 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'విరూపాక్ష' తరహాలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది అనిపించిన ఈ సినిమా అనూహ్యంగా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వరుస కిడ్నాప్ లు లేదా వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమాలు ఎన్నో చూసుంటాం. ఈ సినిమాలో కూడా వరుస కిడ్నాప్ లు ఉంటాయి. కానీ దర్శకుడు ఎంచుకున్న కథా నేపథ్యం మాత్రం కొత్తగా ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలోనే దర్శకుడు తప్పటడుగులు వేశాడు. ఇది రెండు భిన్న కాలాల్లో జరిగే కథ కావడంతో దర్శకుడు.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే పద్ధతిలో కథని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సన్నివేశం వర్తమానంలో నడుస్తుంటే, మరో సన్నివేశం గతంలో సాగుతుంటుంది. ఇది ప్రేక్షకులను గందరగోళానికి గురి చేయడమే కాకుండా, ప్రథమార్థం రెగ్యులర్ గానే సాగిపోయింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. అయితే ప్రథమార్థంతో పోలిస్తే, ద్వితీయార్థం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, పతాక సన్నివేశాలు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి. మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే పగడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.