న్యాయవాదులందు నాగమారుతీశర్మ వేరయా
న్యాయమూర్తులు న్యాయాన్ని ఎంత రేటుకు అమ్ముకుంటున్నారో సీరియల్లో చూపినట్టు రోజూ వార్తల్లో గాలి జనార్దన్రెడ్డి కేసు మన కళ్ళ ముందుంచింది. మాఫియా కేసుల్లోని నిందుతులు ఎంతకైనా ఎలా తెగిస్తారో తెలుసుకుంటున్నాము. కేవలం బెయిలు కోసం వందకోట్ల రూపాయలు ఇస్తున్నారంటే న్యాయానికి ఖరీదుకట్టే షరాబులు ఇలా ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది కదా. అలాగే న్యాయమూర్తులను ఎంతగా ప్రలోభాలకు గురిచేస్తున్నారో ఈ సంఘటనతో మనం తెలుసుకుంటున్నాం.
గతంలో కెఆర్ నారాయణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు బస్సుదోపిడీ కేసులో ఉరి శిక్షపడిన వారికి ఆఖరినిముషంలో యావజ్జీవ శిక్షగా మార్చినందుకు విమర్శల పాలయ్యారు. ఆ తరువాత రాఫ్ట్రపతిగా ఉన్న అబ్దుల్కలాం ఈ దేశంలో పేదలు మాత్రమే శిక్షలకు ఎందుకు గురి అవుతున్నారు? కార్పొరేట్ వ్యాపారులమీద అభియోగాలను ఎందుకు ఋజువు చేయలేకపోతున్నాం అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాదానం లభించిందని తెలుసుకోవాలి. ఇప్పటివరకు న్యాయమూర్తుల అవినీతిపై తు.తు మంత్రంగా మాత్రమే విచారణలు జరిగాయి.
అయితే 10 కోట్లకు బెయిలు వ్యవహారం పై న్యాయమూర్తి పట్టాభి ఆయన కుమారుడు, వారిద్దరినీ నడిపించిన న్యాయమూర్తులు, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, చలపతి, మొదలైన వాళ్ల గురించి రోజూ వింటున్నాం. పదికోట్లకు డీల్ను మాట్లాడిన మద్యవర్తి రౌడీ అయిన యాదగిరి రెండున్నర కోట్లు ఇచ్చి పట్టాభిని బురిడీ కొట్టించాడు. ఈ అవినీతి పరాణాల నేపధ్యంలో అక్షరాల 100 కోట్లు ఇస్తామని చెప్పినా ప్రలోభానికి గురికాకుండా న్యాయంకోసం నిలబడ్డ ఆదర్శ న్యాయమూర్తిగా నాగమారుతీశర్మను అభినందించక తప్పదు. రాజకీయాలు, రౌడీలు, మాఫీయాలు, న్యాయమూర్తులు కలిసి పోతున్న ఈ రోజుల్లో న్యాయానికి విలువనివ్వడం హర్షణీయం. ఈరోజు భారతమాత ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటుందని వేరే చెప్పనక్కర్తేదు. భ్రస్టు పట్టిన ప్రస్తుత వ్యవస్దలో ఇలాంటి న్యాయమూర్తులు మరింతమంది రావాలని కోరుకుందాం.