స్వామికార్యం స్వకార్యం చూసుకొచ్చిన పొన్నాల

అంధకారాంద్రప్రదేశ్‌ను ప్రజలు ఎక్కువ కాలం సహించరని తెలుసుకున్న  కిరణ్‌కుమార్‌ సర్కారు విద్యుత్‌ ఉత్పత్తి విషయమై కేంద్రంతో మాట్లాడటానికి గానూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిన్నీమధ్యూస్‌ , విద్వుత్‌ శాఖమంత్రిని ,పొన్నాలను పంపారు. వీరంతా కేంద్రానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. తక్షణమే  స్పందించిన కేంద్రం గెయిల్‌ సంస్థద్వారా 500 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఇవ్వడానికి అంగీకరించింది. కాగా ఈ ఒప్పందం తరువాత పొన్నాలలక్ష్మీనారాయణ, కేంద్రమంత్రి నారాయణస్వామిని సీక్రెట్‌గా కలుసుకున్నారని తెలిసింది. సీనియర్‌ మంత్రిగా ప్రాజెక్టుల టెండర్‌లలో అక్రమాలు జరిగాయని సిబిఐ పొన్నాలను కూడా పిలచి విచారణ చేపట్టింది. అవసరమైతే మరో సారి రావాల్సి వుంటుందని కూడా సిబిఐ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ కోరారు. అందువల్ల సీబిఐ మానిటరింగ్‌ అంతా నారాయణస్వామి పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయనను కలిసారని తెలుస్తుంది. మరో సారి సిబిఐ పిలుపు రాకుండా చూసుకుంటానికే ఇలా నారాయణస్వామిని కలిసారని తెలుస్తుంది. హోమ్‌ మినిస్టర్‌ గా చిదంబరం ఉన్నప్పటికీ ఆయన నుండి సిబిఐ కార్యకలాపాలను వేరు చేసి నారాయణస్వామికి కేంద్రం బాద్యతలు అప్పగించింది. ఈ నేపధ్యంలో పొన్నాల నారాయణస్వామిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

రాష్ట్రానికి టెటనస్‌ బ్యాక్టీరియా ముప్పు?

రాష్ట్ర రాజధానిలో పేరుగాంచిన గాంధీ హాస్పిటల్‌లో టెటనస్‌ బాక్టిరియా ట్రేస్‌ అయ్యింది. టెటనస్‌ సోకినవారికి కండరాలు అన్నీ బిగుసుకు పోతాయి. దీనివల్ల ఫిట్స్‌ వస్తుంది. నాడీవ్యవస్త దెబ్బతింటుంది. ఈ బాక్టీరియా సోకిన వారికి ముఖకండరాలన్నీ గట్టిపడి తినటానికి ఉండదు. శ్వాసతీసుకోవడం కష్టగా ఉంటుంది. ఈవ్యాది తీవ్రత వల్ల గుండెకండరాలు కూడా గట్టిపడి చనిపోయే అవకాశం ఉంది. పిల్లలు చాలా త్వరగా ఈ వ్యాది బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి గాను భారత ప్రభుత్వం గర్బిణీలకు టీకాలు అన్ని ప్రాధమిక ఆసుపత్రుల్లో  అందుబాటులో ఉంచింది.   ప్రసవ సమయంలో ఈ వ్యాధిసోకి బాధితురాలు చనిపోయే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్నే స్ధానికంగా గుర్రపు వాతం అంటారు. భారతదేశం నుండి ఈ వ్యాధిని తరిమికొట్టాం అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ వ్యాధి కారక బాక్టీరియా గాంధీ హాస్పిటల్‌ కనుగోవటం తీవ్రంగా కలవరపెడుతుంది. పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా మూడునెలల వయస్సునుండి 10 సంవత్సరాలవరకు 5 దఫాలుగా టీకాలు వేయడం జరుగుతుంది. ఏది ఏమైనా బాక్టీరీయా ద్వారా త్వరగా వ్యాప్తిచెందుతున్న ఈ వ్యాధి నివారణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

సింగరేణిపై సమరభేరి

సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలు పర్యావరణంపై ప్రభావం చూపుతోందని ఇటీవల తాజాపరిశోథనలు తేల్చిచెబుతున్నాయి. ఈ గనుల తవ్వకాల సమయంలో వచ్చే పొగ వంటివి కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యనిపుణులు ధృవీకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల భూమి కుంగిపోతోందని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తవ్వకాల కోసం వాడే మిషనరీ వేగం వల్ల సమీప గ్రామాల్లో భూమి కొద్ది కొద్దిగా కంపించి లోతుకు దిగుతోందని గుర్తించారు. సింగరేణి సమీప గ్రామాల్లో రైతులు ప్రత్యేకించి తమ పొలాల్లో భూమి లోతుపెరిగిందంటున్నారు. ఈ విషయమై యాజమాన్యానికి రైతులందరూ రాసిన వినతి పట్టించుకోలేదు.   దీంతో వీరు ప్రత్యక్షచర్యలకు సిద్థమయ్యారు. అదిలాబాద్‌  జిల్లాలోని ముత్యంపల్లి, కాశీంపేట గ్రామస్తులు సింగరేణి వల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై మండిపడుతున్నారు. కాశీపేట భూగర్భగని వల్ల తమ భూమి కుంగిందని, ఇలా గనులు తవ్వుకుంటే పోతే కొన్నాళ్లకు భూమి బాగా లోతుకు దిగిపోతుందని  వారు పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యగా కాశీపేట గనిలో పని చేసే మొదటిషిఫ్టు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఈ గని ప్రాంతంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. యాజమాన్యం కనుక ఎటువంటి చర్యలకు పూనుకోకపోతే కాశీపేట తవ్వకాలు జరగనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.