నేడు రాజ్యసభ ముందుకు ప్రత్యేక హోదా బిల్లు..
posted on Aug 5, 2016 @ 10:19AM
పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం ఈ బిల్లుపై చర్చ జరిగినా అది నామ మాత్రంగానే జరిగింది. అంతేకాదు దానిపై కొంతసేపు చర్చ జరిపిన అనంతరం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు.. అయినా దీని గురించి ఆలోచిస్తున్నాం అని..దీన్ని ద్రవ్యబిల్లుగా పేర్కొంటూ పక్కన పెట్టేశారు. ఇక అప్పటినుండి అటు పార్లమెంట్లో ఏపీ ఎంపీలందరూ.. ఇటు ఏపీ రాష్ట్రమంతటా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చివరికి ఆ బిల్లును ప్రైవేటు సభ్యుల వ్యవహారాల్లో చేర్చారు. దీంతో ఈరోజు మళ్లీ ఈ బిల్లుపై చర్చ జరపనున్నారు. బిల్లు సభలోకి పరిశీలనకు వచ్చిన సమయంలో తమ ఎంపీలంతా సభలోనే ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే విప్ జారీ చేసింది. మరి ఈ రోజైనా బిల్లుపై చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుందో లేదో చూడాలి.