కేసీఆర్ గారూ..ఆ మంత్రులను బర్తరఫ్ చేయండి
తెలంగాణలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, ప్రభుత్వం ఎంసెట్-2 రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించాలని ఆదేశించడం చకాచక జరిగిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కూకటిపల్లి జేఎన్టీయూ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ను బర్తరఫ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.