నేను టీడీపీ తొత్తును కాదు...
నేను టీడీపీ తొత్తును కాదు, ఆరోజు టీడీపీకి భుజం కాశాను.. చేతనైనంత సాయం చేశాను.. అప్పుడు నన్నూ, నా పార్టీని, నా కార్యకర్తలను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తప్పులను చూపిస్తుంటే మాత్రం విమర్శిస్తున్నారు అని తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు జనసేన కాదు మోడీ భజననేన అన్నారు.. కానీ ప్రజలకు, ప్రజా సమస్యలకు ఇది భజన సేన అని వ్యాఖ్యానించారు. తిట్టినా విమర్సించినా ప్రజల కోసం పడతాను.. నేను పార్టీలకు కాదు.. ప్రజలకు పక్షపాతిని.. సర్వమతాలు, కులాలు, ప్రాంతాలు నాకు ఒక్కటే.. అని అన్నారు. ఏదైనా అంటే పడతాను కాని.. నాకు కులం మాత్రం అంటించకండి.. ఒకవేళ నేను ఏం చేయలేని పరిస్థితి వస్తే క్షమాపణలు చెప్పుకుంటా.. దండం పెట్టి వదిలేస్తా అంతేకానీ... ప్రజల్ని మాత్రం మభ్యపెట్టను.. అబద్దాలు చెప్పను అని వెల్లడించారు.