భారత్ కు నిరాశ...పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించలేం..
posted on Oct 7, 2016 @ 12:38PM
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని.. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని.. అందుకే పాక్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని అగ్రరాజ్యమైన అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో భారత్ కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించలేమని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ సందర్బంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కిర్బీ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ లు సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చలు జరపాలని.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పారు. భారత్ కు సమస్యాత్మకంగా మారిన ఉగ్రవాద తండాల ఏరివేత కోసం తాము ఇరు దేశాల ప్రభుత్వాలతో కలసి పని చేస్తామని తెలిపింది. అంతేకాదు అణ్వాయుధాలు టెర్రరిస్టులకు దొరకకుండా పాకిస్థాన్ అన్ని చర్యలు తీసుకుందని భావిస్తున్నట్టు తెలిపారు.