English | Telugu

సుధీర్ ని హౌలే అంటూ గాలి తీసేసిన సాయి ప‌ల్ల‌వి

ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ జీ తెలుగులో ఫాద‌ర్స్ డే, మ్యూజిక్ డే సంద‌ర్భంగా  `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్ర‌త్యేక‌ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జూన్ 19న‌ ఈ ఆదివారం ఈ షో ప్ర‌సారం కానుంది. సుడిగాలి సుధీర్‌, శ్రీ‌ముఖి ఈ షోకు యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో టీవీ స్టార్లు, క‌మెడియ‌న్ లు, సింగ‌ర్స్‌, టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులు పాల్గొని సంద‌డి చేశారు. ఈ షోలో గెస్ట్ లుగా రానా, సాయి ప‌ల్ల‌వి, సురేష్ బాబు,  హీరో గోపీ చంద్‌, రాశీఖ‌న్నా, ద‌ర్శ‌కుడు మారుతి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

శ్రీముఖి జాతిరత్నాలు షోకి పవర్ఫుల్ అమ్మాయి

జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ షోకి చాలా ఛానెల్స్ మంచి వేదికలను అందిస్తున్నాయి. చిన్నవాళ్లు నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చి రకరకాల కామెడీ లైన్స్ తో ఉన్న కాసేపు జోక్స్ వేసి నవ్విస్తున్నారు. అందులో పవిత్ర స్టాండప్ కామెడీ మంచి పంచెస్ తో దూసుకుపోతోంది. ఈ వారం జాతిరత్నాలు ఎపిసోడ్ లో పిసినారి టాపిక్ తీసుకుని అందులో వాళ్ళ అమ్మను మెయిన్ ఎలిమెంట్ గా ప్రెజంట్ చేస్తూ ఆడియన్స్ ని నవ్వించింది పవిత్ర. "ఈ షోకి వచ్చేముందు పది పంచులు వేసి పది మందిని నవ్విద్దాం అని అనుకున్నా. కానీ మా అమ్మ పిసినారితనం వల్ల నాలుగు