English | Telugu

'భార్య అంటే ఎవ‌రు?' అంటూ నందూని ఇరికించిన యాంక‌ర్‌

నందు ఫ్యామిలీ, తులసి ఫామిలీ ఒక కాంటెస్ట్ కి వెళ్తారు. అక్కడ నందు, తులసి, అభి, దివ్య వీళ్లంతా ఆ పోటీలో విన్ అవుతారు. లాస్య ఈ హ్యాపీ మూమెంట్ ని చూసి కుళ్లిపోతూ ఉంటుంది. తర్వాత నందుకి యాంకర్ ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తుంది, 'అసలు భార్య అంటే ఎవరు?' అని. నందు నీళ్లు నములుతూ ఉంటాడు. ఇంతలో నందు వాళ్ళ నాన్న మధ్యలో ఎంటరై 'గడ్డ కట్టే చలిలో కూడా చెమటలు పట్టించేదే భార్య' అంటూ ఫన్ క్రియేట్ చేస్తాడు. 'విన్నర్స్ అందరికి కశ్మీర్ వెళ్ళడానికి ఫ్లయిట్ టికెట్స్ ఫోన్ చేసి ఇస్తాం' అని చెప్తుంది యాంకర్. తులసిని వదిలేసి వెళ్లిన నందుని ఈ కాంటెస్ట్ తర్వాత లాస్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది.

మరో వైపు నందు బిజినెస్ కోసం డబ్బు అవసరం అని చెప్పకుండా అభి.. భార్య‌ను డబ్బు కావాలి అని అడుగుతాడు. అంకిత మిస్ అండ‌ర్‌స్టాండ్‌ చేసుకుంటుంది. ప్రేమ్ చేసే ఆల్బం కోసం డబ్బు అడుగుతున్నాడనుకుని ఐదు లక్షల చెక్ ఇస్తుంది. అది చూసి అభి కోపంతో రంకెలేస్తాడు, 'మా నాన్నకు మాటిచ్చాను బిజినెస్ చేసుకోవడానికి డబ్బు తెస్తాను' అని. 'అది నాకు సంబంధం లేదు' అంటుంది అంకిత.

ఇక తులసి చెప్పే సంగీతం క్లాసెస్ కి ఆ కాలనీ కన్వీనర్ చాలా మంది పిల్లల్ని తెచ్చి చేర్పిస్తుంది. అప్పుడు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అంకిత పెట్టె సర్దుకుని పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చేస్తుంది. తులసి రావద్దని చెప్పినా అంకిత ఎందుకు మళ్ళీ అత్తగారింటికి వచ్చిందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారం అయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.