English | Telugu

రూమర్స్ కి సమాధానమిచ్చిన మల్లెమాల టీమ్

ఒకప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ ఐన షో జబర్దస్త్. ఈ షోని ఫామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేసేవారు. ఐతే ఈ షోకి వున్న ఆదరణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. దీనికి రేటింగ్స్ తగ్గడం మొదలయ్యేసరికి ఎక్స్ట్రా జబర్దస్త్ ని లాంచ్ చేశారు. ఈ రెండు షోస్ కి కలిపి అనసూయ, రష్మీ, రోజా, నాగబాబు యాంకర్స్ గా, జడ్జెస్ గా ఉన్నారు. ముందు నాగబాబు, తర్వాత రోజా, కమెడియన్స్ అంతా వన్ బై వన్ దూరమవుతూ వచ్చారు. దీని కారణంగా జబర్దస్త్ షో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బుల్లితెర స్టార్ గా పేరు పడిన సుధీర్ వెళ్లిపోయేసరికి కావాలనే పక్కకు తప్పించారనే రూమర్స్ బయటికి వచ్చాయి. తర్వాత అతని ఫ్రెండ్స్ కూడా బయటికి వచ్చేసారు. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందని వస్తున్న ప్రచారాలపై మల్లెమాల సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. వెళ్లిన వాళ్ళు ఎలాగో వెళ్లిపోయారు. కొత్త వాళ్ళతో ఐనా షో నడిపిస్తాం కానీ ఈ షోని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు అన్నారు . ప్రస్తుతం ఈ షోకి అనుకున్నంత టాక్, రేటింగ్స్ కానీ రావడం లేదు. ఐతే ఇంతకుముందులా జబర్దస్త్ మళ్ళీ పుంజుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.