English | Telugu

చిరంజీవి మనసులో జూనియర్ పూజా హెగ్డే!

ఆహా ఓటిటి పై తెలుగు ఇండియన్ ఐడల్ షో మంచి స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఎవరు అనే విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ రాబోతున్నారు. ఆయన చేతులమీదుగా ఇండియన్ ఐడల్ టైటిల్ ని విన్నర్ కి అందించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టైంలో చిరంజీవి వాగ్దేవి మీద ఒక కవితను చెప్పారు.

"డియర్ వాగ్దేవి, నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి, నా రూములో పెట్టుకున్న ఫోటో నీది..." అంటూ గుటకలు మింగుతూ "ఇది నేను రాయలేదు ప్రామిస్" అంటూ చిరంజీవి వాగ్దేవి గురించి చదివిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్ ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీపడబోతున్నారు. ఈ ఐదుగురిలో వాగ్దేవి ఒకరు. 17 న జరగబోయే తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కాస్త మెగాస్టార్ రాకతో మెగా ఫినాలేగా మారబోతోంది.

ఇక వాగ్దేవి తన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది. బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ కూడా వాగ్దేవిని పూజా హెగ్డేతో పోల్చడం, తను సంతోషపడడం స్టేజి మీద చూసాం. బాలయ్య కూడా ఈ షోకి వచ్చి ఒక బిరుదు ఇచ్చేసారు. వాగ్దేవి కాదు వావ్ దేవి అని. ఈ మెగా ఫినాలే ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. మరి ఈ మెగా ఫినాలేలో వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.