73 దారులన్నీ మూసేసిన రాగసుధ!
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో కూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తకర మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి ఈ సీరియల్ ని నిర్మించారు. వర్ష హెచ్ కె. అతనికి జోడీగా నటించింది. ఇతర పాత్రల్లో జయలలిత, జ్యోతి రెడ్డి, బెంగళూరు పద్మ, రామ్ జగన్, విశ్వమోహన్, అనుషా సంతోష్, వరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ నటించారు.