English | Telugu

చూసింది, విన్నదే మాట్లాడా...తప్పేంటి...నా మాటలను వక్రీకరిస్తే....

​అనసూయ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ కూడా అలాగే వైరల్ అయ్యింది. "నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నా తప్ప ఎవరిని నేను బ్లేమ్ చేసే ఉద్దేశం లేదు. అందరికీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను నేను అన్నట్టు ట్రోల్ చేయొద్దు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను..

అరుణాచల క్షేత్రం మోక్ష మార్గంలో టేస్టీ తేజా...భయంతో వణికిపోయానంటూ ..

టేస్టీ తేజ బుల్లితెర మీద ఎంతో సందడి చేస్తూ ఉంటాడు. సెలబ్రిటీస్ తో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి టేస్టీ తేజ రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాడు. ఇక అక్కడ తేజ చేసిన పని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అరుణాచలంలో ఉండే మోక్ష మార్గం గుండా తేజ రావడం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియొని ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ముందు ఆ రెండు రాళ్ళ మధ్య నుంచి రావడానికి ట్రై చేసాడు కానీ అతని వల్ల కాలేదు. "నేను మోక్ష మార్గం దగ్గరకు వెళ్లినప్పుడు నాలో ఒక భయం వచ్చింది.

ఐకానిక్ స్టార్ మనసు ఎంత గొప్పదో....యాంకర్స్ కి థ్యాంక్స్ చెప్పడం ఆయన సంస్కారం

చిన్న నవ్వు...ఒక్క థ్యాంక్స్ నిజంగా ఒక మనిషిని మార్చేస్తాయి..వాళ్ళను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేస్తాయి...అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా ఈవెంట్ జరిగితే ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ థ్యాంక్స్ చెప్తారు. ఐతే ఎంత పెద్ద ఈవెంట్ ని ఐనా, ప్రొమోషన్ ని ఐనా, ఒక షోని ఐనా, లీడ్ చేసేది అందరితో మాట్లాడించి వాళ్ళను ఎంటర్టైన్ చేసేది యాంకర్. ఫంక్షన్ అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది...ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ యాంకర్ ని ఎవరూ పట్టించుకోరు... యాంకర్ అంటే ఒక హీరోకి ఆడియెన్ కి మధ్య ఒక వారధి లాంటి వారు అని చెప్పొచ్చు. అలాంటి యాంకర్స్ ని సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.

హాస్పిటల్ లో రష్మీ...భుజానికి సర్జరీ...

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ రష్మీ ఇప్పుడు అనుకోని పరిస్థితిని ఎదుర్కుంటోంది. రష్మీ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు  పెడుతూ  ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.  అదొక ఎమోషనల్ పోస్టు. “నేను సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే భుజానికి తగిలిన ఆ గాయం నా డాన్స్ మూమెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నింటినీ నేను మిస్ అవుతున్నాను. డాన్స్ మూవ్స్ లో భుజం పట్టేసింది.  ఆ సర్జరీ అయ్యాక మళ్ళీ అంత సెట్ అవుతుందని భావిస్తున్నాను” అంటూ హాస్పిటల్ బెడ్ మీద సర్జరీ డ్రెస్ లో సెల్ఫీ తీసుకుని  ఆ ఫోటోని స్టేటస్ లో పెట్టింది.

Karthika Deepam2 : పూజ పూర్తిచేసిన కార్తీక్, దీప.. ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చింది ఎవరో శ్రీధర్ చెప్పనున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -277 లో.....శ్రీధర్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి కావేరికి సంబంధించిన ఎఫ్ డి లు గురించి తెలుసుకుంటాడు. ఆమె యాభై లక్షలు డ్రా చేసిందని అతను చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. కావేరి నా మాట దాటావ్.. మీ అందరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు.. రేపు పూజకి పిలిచారు కదా వస్తా అని శ్రీధర్ అనుకుంటాడు. మరుసటి రోజు కార్తీక్ పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాడు. కార్తీక్, దీప లు పీటలపై కూర్చొని ఉంటారు. మీ పుట్టింటివారు. మీ కోడలు పుట్టింటి వారు బట్టలు పెట్టాలని అనగానే.. కాంచన బాధపడుతుంది.

Eto Vellipoyindhi Manasu : చెల్లెలికి నొప్పులు.. భర్తని వెళ్ళొద్దన్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో...... రామలక్ష్మి, సీతాకాంత్ ని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ సీతాకాంత్ ఒక్కడి పేరున అర్చన చేపిస్తుంటే.. ఇద్దరం వచ్చాము కదా ఒక్కరికి అర్చన చేపిస్తున్నావని సీతాకాంత్ అడుగుగా.. మనం ఇద్దరం వేరు వేరు కాదని రామలక్ష్మి అంటుంది. మరొకవైపు శ్రీలత సందీప్ లు లాయర్ తో మాట్లాడుతుంటారు. ఈ ఆస్తులన్ని మీ పేరున రావాలంటే సీతాకాంత్ రామలక్ష్మిలు చనిపోవాలి. చావు కూడ సాధారణంగా ఉండాలి. అప్పుడే ఆస్తులు కుటుంబ సభ్యులు అయినా మీకూ వస్తుందని లాయర్ చెప్తాడు.