English | Telugu

చూసింది, విన్నదే మాట్లాడా...తప్పేంటి...నా మాటలను వక్రీకరిస్తే....

అనసూయ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ కూడా అలాగే వైరల్ అయ్యింది. "నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నా తప్ప ఎవరిని నేను బ్లేమ్ చేసే ఉద్దేశం లేదు. అందరికీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను నేను అన్నట్టు ట్రోల్ చేయొద్దు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను..

ఇలాంటి మాటలు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయలేవు ” అంటూ ట్వీట్ పెట్టింది. ఐతే ఈ ట్వీట్ ని అనసూయ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో జరిగిన రచ్చకి సంబంధించి పెట్టింది. అనసూయ తన డ్రస్సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బికినీ వేసుకుంటా లేదంటే మరొకటి చేస్తా మీకెందుకు అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. అనసూయ ఏది చేసినా, ఎం మాట్లాడినా బోల్డ్ గానే ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రంగస్థలం, పుష్ప, విమానం, రజాకార్ వంటి మూవీస్ లో స్ట్రాంగ్ రోల్స్ చేసింది. మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇన్హిబిషన్స్ ని పెట్టుకోదు...అనుకున్నది చెప్పేస్తుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.