English | Telugu

Brahmamudi : ఇంటిపెద్ద ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళిద్దరు.. పాప బారసాలలో అనామిక ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -639 లో.....అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. తనని చూసి కావ్య చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా చెల్లి ఎస్సై అయిందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ వేషం గెటప్ బాగుందని రుద్రాణి వెటకారంగా ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యడానికి వచ్చావా అంటూ మాట్లాడుతుంటుంది. నా భార్య ఎస్సై అయింది. పెద్దల ఆశీర్వాదం తీసుకుందామని వచ్చామని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి ముందుగా ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకోమని అపర్ణ అనగానే.. అంటే తనకి ఇష్టం ఉందో లేదో అని కళ్యాణ్ అంటాడు. నాకు నీ సంతోషం ముఖ్యమని ఆశీర్వాదం తీసుకోండి అన్నట్లుగా ముందు కి వస్తుంది. దాంతో అప్పు, కళ్యాణ్ లు ధాన్యలక్ష్మి, ప్రకాష్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

Illu illalu pillalu : ప్రేమ కోసం ధీరజ్ ఆ పని చేయగలడా.. అత్తకు కోడలు భరోసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.... రామరాజుపై ఉన్న కోపంతో చందు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడని, అందుకు తాగుతున్నాడని రామరాజుతో చెప్తుంది. దాంతో రామరాజు బాధపడుతూ లోపలకి వెళ్ళిపోతాడు.రాత్రి చందు బాధపడుతుంటే రామరాజు తన దగ్గరికి వెళ్తాడు. ఇంత బాధపడుతున్నావ్.. వాళ్ళలాగా నన్ను మోసం చెయ్యాలి అనిపించలేదా అని రామరాజు అడుగుతాడు. లేదు నాన్న నాకు నా ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదని రామరాజు గురించి గొప్పగా చందు మాట్లాడతాడు. నాకు నువ్వు అందరిలో మాట్లాడే ధైర్యం ఇచ్చావ్ రా.. నువ్వు అసలైన కొడుకు అంటే అని రామరాజు గర్వంగా మాట్లాడతాడు. అదంతా సాగర్, ధీరజ్,  వేదవతి లు వింటుంటారు.

Karthika Deepam2 : శివన్నారాయణ ఇంటికి దీప.. జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -274 లో...... కార్తీక్, దీప లు శౌర్య దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఇక నువ్వు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదని శౌర్యకి చెప్తాడు కార్తీక్. అప్పుడే డాక్టర్ వచ్చి.. పాపకి ఇంకేం ప్రాబ్లమ్ లేదని చెప్పగానే దీప, కార్తీక్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. శౌర్యని తీసుకొని ఇంటికి వెళ్ళగానే అనసూయ హారతి ఇస్తుంది. ఇంట్లోకి వచ్చిన శౌర్యని కాంచన ప్రేమగా దగ్గర కి తీసుకుంటుంది. అందరు శౌర్యని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. దూరం నుండి జ్యోత్స్న వచ్చి చూసి వెళ్లడం కార్తీక్ చూసి మళ్ళీ వస్తానంటూ వెళ్తాడు. జ్యోత్స్న కార్ కి కార్తీక్ సైకిల్ అడ్డుగా వదిలేస్తాడు. దాంతో జ్యోత్స్న కార్ ఆపుతుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ కార్తీక్ తన విశ్వరూపం చూపిస్తాడు.

Eto Vellipoyindhi Manasu : భర్తకి పొంచి ఉన్న ప్రమాదం.. సవతి తల్లి కపటప్రేమ సీతాకాంత్ తెలుసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో.... మమ్మల్ని క్షమించావ్ అది చాలు అని సందీప్ అనగానే.. ఎవరు మిమ్మల్ని క్షమించింది మిమ్మల్ని ఎప్పటికి క్షమించనని సీతాకాంత్ అనగానే.. అందరు షాక్ అవుతారు. మరి ఏంటి మిమ్మల్ని ఎప్పుడో క్షేమించాను.. ఇక జరిగింది అంత అందరు మర్చిపోండి అంటూ సీతాకాంత్ అందరి దగ్గర మాట తీసుకుంటాడు . శ్రీలత అందరికి వంట చేస్తుంది. అందరూ బాగుంది అంటూ తింటు ఉంటారు. అప్పుడే రామలక్ష్మికి ఫోన్ వస్తుంది. దాంతో ఫోన్ తీసుకొని పక్కకి వస్తుంది. ఏంటి స్వామి అంటూ మాట్లాడుతుంది. స్వామి రమ్మని చెప్పడంతో రామలక్ష్మి వెళ్తుంది.

Brahmamudi : స్వప్నకి పాప పుట్టినవేళ.. సీతారామయ్య కోమాలోంచి బయటకొచ్చాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -637 లో.... రాజ్, కావ్య డబ్బు డిపాజిట్ చెయ్యడానికి వెళ్తుంటారు. దారిలో రాజ్ కి వెక్కిళ్లు వస్తాయి. రాజ్ కి కావ్య ముద్దు పెడుతుంది. ఏంటి ఇది సినిమా అనుకున్నావా ముద్దు పెట్టగానే వెక్కిళ్లు ఆగిపోవడానికి అంటూ వాటర్ కోసం షాప్ దగ్గర ఆగగా రాజ్ వెళ్లడం చూసి రౌడీ వచ్చి డబ్బు తీసుకొని వెళ్తాడు. రాహుల్ కార్ లో పడేసి పారిపోతాడు. రౌడీని రాజ్ , కావ్య పట్టుకుంటారు. నిన్ను ఎవరు ఇలా చెయ్యమన్నారని బెదిరించగా రాహుల్ అని రౌడీ చెప్తాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.

బాలకృష్ణకు ఫోన్ చేసిన విశ్వక్..షాకైన సుమ

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లైలా మూవీ టీమ్ వచ్చింది.హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ ఆకాంక్ష శర్మ, డైరెక్టర్ రామ్ నారాయణ్, డిజె టిల్లు ఫేమ్ ప్రణీత్ రెడ్డి వచ్చారు. ఈ షో ప్రోమో ఫైనల్ లో బాలకృష్ణ మాట్లాడారు..ఎందుకు మాట్లాడారో చూద్దాం. ఐతే రీసెంట్ గా లైలా మూవీ టీజర్ రిలీజ్ సందర్భంలో బాలకృష్ణ అటు డిజె టిల్లుకి, ఇటు విశ్వక్ సేన్ కి ముద్దులు పెట్టేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుమ ఆ వీడియో ప్లే చేసి  చూపించింది. "అదేం లేదు మేడం మేమందరం కలిసి కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసాం" అని కవర్ చేసాడు విశ్వక్. కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మాన్షన్ బోటిల్ మూత తీసిన చప్పుడు వినిపించేసరికి "ఆ మాకు అర్ధమయ్యింది" అంది సుమ..కానీ మీ ప్రేమలు చూస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉంది" అంది సుమ. సరే "ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా"  అని విశ్వక్ ని అడిగింది సుమ.

చైనాలో, అమెరికాలో కూడా నూకరాజు వీడియోస్ వైరల్

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నూకరాజు మంచి జోష్ తో స్కిట్ చేసాడు. తాగుబోతు రమేష్, నూకరాజు స్కిట్ లో చాలా కామెడీ చూపించారు. ఐతే రీసెంట్ గా నూకరాజు "గుట్టకింద " అనే సాంగ్ పాడి ఆసియాతో కలిసి వీడియో సాంగ్ కూడా చేసాడు. ఆ సాంగ్ దాదాపు 11 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి. సోషల్ మీడియా ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే నూకరాజు డాన్స్ స్టెప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఏ షో ఎపిసోడ్ లో ఐనా కూడా నూకరాజు ఈ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా ఇదే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తాగుబోతు రమేష్ కూడా డాన్స్ వేసాడు.

కుంభమేళాలో మెరిసిన బిందు మాధవి..  వాళ్లకి చివాట్లు.. ఈమెకు పొగడ్తలు!

బిగ్ బాస్ అన్ని సీజన్లో  లేడి కంటెస్టెంట్స్ లలో ఎవరైతే చివరి వరకు ఉండి టాప్-5 లో ఉంటారో వారే ఎక్కువ క్రేజ్ ని తెచ్చుకుంటారు. వారిలో ప్రియాంక జైన్, ఇనయా ఉండగా ఓటీటీ సీజన్ లో సత్తా చాటిన బిందు మాధవి ఒకరు. ఆడపులిగా ఆట ఆడి.. అఖిల్‌ని ఆడ.. అంటూ ఓ ఆట ఆడించి.. ఫైనల్‌లో అతన్ని మట్టికరిపించి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచింది బిందు మాధవి. నీ ముందే టైటిల్ గెలుస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తానంటూ నటరాజ్ మాస్టర్ ముందు సవాల్ చేసి అన్నట్టుగానే అతని ముందే టైటిల్ గెలుచుకుంది. అయితే బిందు మాదవి బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా కనపడలేదు. అడపాదడపా సినిమాల్లో, సిరీస్ లలో కనపడినా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ భామ.

సిరి హనుమంతు, దీప్తి సునైన హగ్గులు.. వీడియోపై షన్ను ఫ్యాన్స్ ఫైర్! 

బిగ్‌బాస్‌ ద్వారా లాభమోచ్చిన వారికంటే నష్టపోయిందే ఎక్కువ మంది. అయితే నష్టపోయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ బెంచ్ లో ఉంటాడు. ఎందుకంటే యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన భారీ పాపులారిటీతో బిగ్‌బాస్ సీజన్-5లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్(Shanmuk Jashwanth). అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత సిరి హనుమంతుతో తన బిహేవియర్ కారణంగా దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాడు. దీంతో బిగ్‌బాస్ కప్పుపోయింది.. బయటికొచ్చిన తర్వాత లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పేసింది. అయితే షన్ను ఫ్యాన్స్ సిరి హనుమంతు, దీప్తి సునైనలపై ఫైర్ అయ్యారు.