English | Telugu

ఆర్జే కాజలా మాజాకానా..ఆస్కార్ అవార్డుకె గేలం వేసింది..

ఆర్జే కాజ‌ల్ అంటే తెలియని వాళ్లుండరు. ఆర్జేగా రేడియోలో గ‌ల గ‌ల మాట్లాడుతూ శ్రోత‌ల‌ను ఉర్రూతలూగిస్తూ ఉంటుంది. అంతే కాదు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంక‌ర్ గా షోస్ చేస్తూ ఉంది. అలాగే  బిగ్ బాస్ సీజ‌న్ - 5కి వెళ్లి ఫేమ‌స్ అయ్యింది. ఎన్నో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పింది. అలాగే ఎక్స్పోజ్డ్ అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. అలాంటి కాజల్ బుల్లితెర మీద ఎన్నో షోస్ కి వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చింది. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. రాగానే అందరికీ పులిహోర ఇచ్చింది సుమా. ఇక ఈ షోకి మహేష్ విట్టా, శ్వేతా వర్మ, నటరాజ్ మాష్టర్, ఆర్జే కాజల్ వచ్చారు.

రోజాతో ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయి

జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4  మార్చ్ 2 నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఇక దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రోజా డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఈ షోకి హోస్టస్ గా యాంకర్ రవి, అష్షు రెడ్డి వ్యవహిస్తున్నారు. ఇక ఈ షోకి అందాల నటుడు శ్రీకాంత్ ఆయనకు అటు రాశి, ఇటు రోజా నిలబడి చిన్న స్టెప్స్ వేశారు. ఇక శ్రీకాంత్ ఐతే వీళ్ళ మీద కామెంట్స్ కూడా చేసాడు. "రాశి నవ్వితే ముత్యాలు రాల్తాయి..రోజా దగ్గర ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాల్తాయి" అని చెప్పేసరికి రోజా, అష్షురెడ్డి నవ్వేశారు.

Karthika Deepam2 : జ్యోత్స్నని అర్థం చేసుకున్న శివన్నారాయణ.. కార్తీక్ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో.... జ్యోత్స్నతో పారిజాతం మాట్లాడుతుంది. రాను రాను మీ తాతయ్య దృష్ణిలో నీ మీద ఇంప్రెషన్ పోతుందని పారిజాతం అనగానే.. సత్యరాజ్ రెస్టారెంట్ విషయంలో అంతా ఒకే అయిపోయింది కానీ ఆ దీప వెళ్లి ఏదో మాయ చేసిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే జ్యోత్స్న అంటూ శివన్నారాయణ గట్టిగా పిలుస్తుంటాడు. మళ్ళీ ఏం చేసావే అంటూ పారిజాతం కంగారుపడుతుంది. ఎందుకు ఇలా చేశావ్.. అబద్ధాలతో ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావ్.. అడిట్ లో ఎందుకు తప్పుడు ప్రాఫిట్ చుపించావంటూ శివన్నారాయణ గట్టిగా నిలదీస్తాడు.

Eto Vellipoyindhi Manasu : అమ్మని తీసుకొని రమ్మని చెప్పిన రామలక్ష్మి.. రామ్ తీసుకొస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -336 లో..... సీతాకాంత్ స్కూల్ కి రావడం చూసిన శ్రీవల్లి, శ్రీలతకి చెప్తుంది. మనం వచ్చాము కదా స్కూల్ కి వాడేందుకు వచ్చాడు.. వాడి వెనకాలే వెళ్లి కనుక్కోవాలని శ్రీలత వాళ్ళు అనుకుంటారు. సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి కోసం వెతుకుతుంటాడు. రామలక్ష్మి ఎదరుపడి కిందపడిపోతుంటే.. సీతాకాంత్ పట్టుకుంటాడు. మళ్ళీ ఎప్పటిలాగే నువ్వు నా రామలక్ష్మివి అంటుంటాడు. కాదని రామాలక్ష్మి అంటుంది. అదంతా దూరం నుండి శ్రీలత వాళ్ళు చూస్తుంటారు కానీ సీతాకాంత్ అడ్డుగా ఉండడంతో రామలక్ష్మి మొహం కన్పించదు.

రష్మీకి కొత్త బాయ్ ఫ్రెండ్ ...అతనేనా ?

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. శంభో శివ శంభో పేరుతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో ఒక ఇంటరెస్టింగ్ విషయం ఐతే బయట పడింది. ఇంతకు అదేంటో చూద్దాం. నూకరాజు ఈ షోకి కాషాయ వస్త్రాలు వేసుకుని కమండలం పట్టుకుని దేశముదురులో గడగడా గుడుంబా శంకర్ అంటూ ఆలీ ఎలా ఉంటాడో ఆ గెటప్ లో వచ్చాడు. తర్వాత రామ్ ప్రసాద్ ని నూకరాజు పిలిచాడు. "రామ్ ప్రసాద్ గారు మీరొస్తే ఒకరి గురించి చెప్పాలి" అన్నాడు. తర్వాత రాంప్రసాద్ వచ్చి "స్వామి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా రష్మీకి పెళ్లవుతుందా" అని అడిగాడు. దానికి రష్మీ "ఇది ఒక ఎపిసోడ్ పడుతుందిలే" అంటూ కామెడీగా చెప్పింది. తర్వాత నూకరాజు నేల మీద కూర్చుని ఏదో ముగ్గు వేస్తూ "ఓం సుడిగాలిం..సుడిగాలిం" అన్నాడు దానికి రష్మీ ఓ రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.

హాస్పిటల్ కి వెళ్లిన శోభా...డాక్టర్స్ ఎం చెప్పారంటే ?

శోభా శెట్టి కొద్దీ రోజుల నుంచి హెల్త్ అప్ సెట్ అవడంతో వీడియోస్ చేయలేకపోతోందట. ఐతే ఈ విషయాన్నీ తన యూట్యూబ్ వీడియొ ద్వారా ఎక్స్ప్రెస్ చేసింది. ఐతే తేజ వాళ్ళ ఫామిలీ హైదరాబాద్ రావడంతో వాళ్ళను కలవాలని అది కూడా ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేయడానికి వెళ్లాలనుకుందట. కానీ వాళ్ళే శోభాకు సర్ప్రైజ్ చేసినట్టు చెప్పింది. శోభా వెళ్తున్న విషయమ్  తెలియకపోవడం వలన వాళ్ళు వేరే చోటికి వెళ్లిపోయారట. దాంతో అక్కడికి కాకుండా ఫైనల్ గా హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అని చెప్పింది. కొద్దీ రోజుల నుంచి తనకు థ్రోట్ పెయిన్ బాగా వస్తోందని చెప్పింది.