English | Telugu

ఇంద్రజ నోటా పవన్ కళ్యాణ్ మాటా...డొక్కా సీతమ్మ నిజంగా అన్నపూర్ణాదేవినే..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మ కాక మానవు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే. ఈరోజున ఈ షో లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ గా రాబోతోంది. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ తల్లిని అందరూ స్మరించుకున్నారు. నిజంగా ఆమె గురించి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన ఆ తల్లిని ఎన్నో సార్లు స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో ఆమెను తలుచుకోకుండా ఉండరు...ఏ దానానికి ఆ దానం గొప్పది కానీ  అలాంటి దానాల్లోకెల్లా అన్నదానం ఇంకా గొప్పది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆ మహనీయురాలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆమె గురించి తెలిసేలా చేసారు. ఆ తరువాత ఇంద్రజ ఆ విషయాన్ని ప్రస్తావించారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరుతో అన్నదానం జరిపించాలని అని చెప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆవిడ మీద అందరికీ ఒక అవగాహన వస్తోంది" అని చెప్పారు.

ఎవరింట్లోకి తొంగి చూడొద్దు ..బుద్దిగా మీ పెళ్లాలతో కాపురం చేసుకోండి

ఈ వారం జబర్దస్త్ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగింది. అందులోనూ ఇమ్ము వర్ష స్కిట్ లో ఆ మెసేజ్ ఇవ్వడం కనిపించింది. వర్షతో పాటు మరో ఇద్దరు లేడీ కమెడియన్స్ అలాగే ఇమ్ము, పండు, దుర్గారావు కలిసి ఈ స్కిట్ లో చేశారు. ఐతే దుర్గారావు వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఇక వర్ష సిస్టర్స్ ని పండు, ఇమ్ము పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు వాళ్ళ భార్యలు నచ్చరు. అలా ముగ్గురూ కూడా వర్ష మీదనే కన్నేశారు. ఐతే ఏమీ తెలియని దుర్గారావుకు వర్ష లాంటి మంచి భార్య వచ్చేసరికి పండు, ఇమ్ము కుళ్లిపోయి దుర్గారావును చంపేసి వర్షను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఐతే ఇమ్ము మూడు విషయం కలిపినా బాటిల్స్ తెచ్చి మిగతా ఇద్దరికీ ఇస్తాడు. అలా ముగ్గురు తాగేసాక పండు, ఇమ్ము కూడా గొంతు పట్టుకుంటారు. ఐతే వర్ష ఎవరికీ తెలీకుండా పండుని, ఇమ్ముని వేసేయాలని వాళ్ళ బాటిల్స్ విషం కలిపేసింది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరూ షాకయ్యారు.

Illu illalu pillalu : గొప్పింటి వాళ్ళమంటూ భాగ్యం అబద్దపు మాటలు.. డౌట్ పడిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -94 లో......రామరాజు కుటుంబం చందుకి మంచి సంబంధం దొరుకుందేమోనని స్వయంవరానికి వస్తారు. భాగ్యం కుటుంబం కూడా స్వయంవరానికి ఎవరైనా కోటీశ్వరులు వస్తారేమో చూద్దామని వస్తారు. స్వయం వరం లో భాగ్యం అందరి అబ్బాయిలని రిజెక్ట్ చేస్తుంది. చందు స్టేజ్ పైకి వెళ్లి తన గురించి చెప్తూ ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తాడు. నాకు కాబోయే పెళ్ళాం అందంగా ఉండాలంటూ నాకూ కోరికలు ఏం లెవ్వు కానీ నా పేరెంట్స్ ని వాళ్ల పేరెంట్స్ గా చూడాలని చందు చెప్తాడు.

Karthika Deepam2 : తల్లి దగ్గర జ్యోత్స్న కపటనాటకం.. తన ప్రాణధాత దీపే అని తెలుసుకున్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... దశరథ్ అన్న మాటలు జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఆ దాస్ ఎప్పుడైనా నిజం చెప్పేలా ఉన్నాడు.. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపాగలిగానంటే అది నా లక్.. నిజం తెలిసేలోపు ఎలాగైనా దీపని చంపెయ్యాలని జ్యోత్స్న అనుకొని ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను చెప్పిన దగ్గరికి రా అంటూ మాట్లాడుతుంది. దీప ఇలా చెయ్యక తప్పడం లేదంటూ తనలో తను మాట్లాడుకుంటుంది. దీప కుబేర్ ఫోటో దగ్గర దీపం పెడుతుంది. ఆ దీపం ఆరిపోవడం తో దీప బాధపడుతుంటుంది. అది చూసిన కార్తీక్.. గాలికి పోయిందని సర్దిచెప్తాడు. దాంతో దీప మళ్ళీ దీపం పెడుతుంది.