English | Telugu

చ‌ర‌ణ్ కి తండ్రిగా జ‌గ్గూ భాయ్?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచిన చిత్రం `రంగ‌స్థ‌లం`(2018). బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించిన ఈ పిరియ‌డ్ డ్రామాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో అల‌రించారు వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు. మ‌రీముఖ్యంగా.. ఈ సినిమాలో చ‌ర‌ణ్, జ‌గ్గూ భాయ్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. క‌ట్ చేస్తే.. స్ప‌ల్ప విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రు మ‌రోమారు క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. అయితే, ఈ సారి రామ్ చ‌ర‌ణ్ కి విల‌న్ గా కాకుండా తండ్రి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్న‌ట్లు టాక్.