Read more!

English | Telugu

ఎ.పి.. యు.పి.లా మారిందంటున్న పూనమ్‌ కౌర్‌.. ఏ విషయంలో?

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల మీద ఆమె ఇన్‌డైరెక్ట్‌గా వేసే ట్వీట్లు అందర్నీ ఆలోచింపజేస్తుంటాయి. ఆమె వేసే ట్వీట్స్‌లో ఆమెకు ఏతో అన్యాయం జరిగిందన్న విషయం ధ్వనిస్తూ ఉంటుంది. అయితే అది ఏమిటి అనేది మాత్రం ఆమె డైరెక్ట్‌గా ఎప్పుడూ చెప్పలేదు. అంతేకాదు, తనకు అన్యాయం చేసిందెవరో కూడా ఎప్పుడూ ప్రస్తావించదు. 

తాజాగా పూనమ్‌ కౌర్‌ వేసిన ట్వీట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అదేమిటంటే.. ఎపీ కాస్తా ఇప్పుడు యుపీ అయిందన్నది ఆమె ట్వీట్‌. అది ఏ విషయంలో అనేది క్లారిటీ ఇవ్వకుండా వదిలేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. మహిళల విషయంలో, మహిళల గురించి మాట్లాడే విషయంలో, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఏపీ ఇప్పుడు యూపీలా మారిపోయింది అనేది ఆమె ట్వీట్‌లోని సారాంశం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది.  

ఒకప్పుడు సినిమాలతో బాగా బిజీగా ఉండేది పూనమ్‌. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. దానికి కారణం ఏమిటో తెలీదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం ఆమె యాక్టివిటీ ఒక్కటే.. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పోరాటం. వారికి సరైన ఉపాధి కల్పించడం కోసమే తన సమయాన్ని వెచ్చిస్తోంది.