English | Telugu

డిజె టిల్లు 2 ని రెండు సార్లు చూసా...

జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫైమా. ఆ క్రేజ్ తోనే  బిగ్ బాస్ షో సీజన్ 6 కి వెళ్ళింది. అక్కడ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది ఫైమా. అలాంటి ఫైమా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ " తో ఫాన్స్ ముందుకు వచ్చింది. ఇక నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఫైమా కూడా ఆన్సర్స్ ఇచ్చింది. "డిజె టిల్లు 2 చూసాక నువ్వు ఎలా ఫీలయ్యావ్" అని ఒక నెటిజన్ అడిగారు. "రెండు సార్లు చూసా చాలా ఫన్నీగా ఉంది..బాగా ఎంజాయ్ చేశా" అని చెప్పింది. "నువ్వు తన్వి అక్క చేసిన రీల్ లో నువ్వు వేసుకున్న షర్ట్ నాకు బాగా నచ్చింది ఇస్తావా అక్కా ప్లీజ్" అని ఒక నెటిజన్ అడిగింది.

100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోన్న ‘గామి’ 

ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాన్ స్టాప్‌గా అందించటంలో ఎప్పుడూ ముందుండే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి గామి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు అతి తక్కువ కాలంలో చేరువైంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ‘గామి’ చిత్రానికి రావటం విశేషం. 

మా జీవితాల గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి...

మల్లి సీరియల్ తో ఎంతో ఆకట్టుకున్న బుల్లితెర నటుడు పవన్ సాయి.  చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఐతే పవన్ సాయి కొంతకాలం క్రితం తన భార్య  మధుమిత నుంచి డివోర్స్ తీసుకున్నాడు. అతనికి  బాబు కూడా ఉన్నాడు.  అయితే పవన్ సాయి తన భార్యతో విడిపోవడానికి ఓ నటితో ఉన్న ఎఫైరే కారణమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సీరియల్‌లో తనతో నటించే అమ్మాయితో పవన్ సాయి ఎఫైర్ పెట్టుకోవడం వల్లనే గొడవలు వచ్చి, విడాకులు తీసుకున్నారని అంటున్నారు. ఐతే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండడంతో తాజాగా పవన్ సాయి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.

Krishna Mukunda Murari : సర్ ప్రైజ్ ఇచ్చిన మధు..‌ రగిలిపోయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -448 లో.. అందరు ఆదర్శ్, మీరాల గురించి హాల్లో ఉండి మాట్లాడుకుంటారు. అయితే మరోవైపు సంగీతతో మధు పులిహోర కలిపేస్తుంటాడు. సంగీతను పట్టుకుంటూ ఇలా ముఖం పెట్టి.. ఇలా నవ్వూ అంటూ ఫొటోలు తీస్తుంటాడు. కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన రజినీ.. అది చూసి.. మధుని తిట్టిపోతుంది. అప్పుడే కృష్ణ అడ్డుపడి.. మధుది ఏం తప్పుంది? గాజులవాడు చేయి పట్టుకుని గాజులు వేయడం తప్పా? అలానే ఇది కూడా.. మధు ఓ ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్. తనకు అందంగా ఉన్నదాన్ని మరింత అందంగా చూపించడం ఇష్టం.. మన మధునే కదా.. సంగీత అందంగా ఉంది. అందుకే ఫొటోలు తీస్తున్నాడు ఇందులో తప్పేముందని కృష్ణ అంటుంది.

Eto Vellipoyindhi Manasu : అమ్మ ఆపరేషన్ కి డబ్బులు కావాలి .. నాపై నమ్మకం లేదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -75 లో.. అభిని రామలక్ష్మి చూసి ఆగమని చెప్తుంది. ఎందుకు ఫారెన్ వెళ్ళలేదని అడుగుతుంది. నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదని అభి అనగానే.. అదేంటీ మీ అమ్మకి బాగోలేక వెళ్లలేదని సీతాకాంత్ సర్ చెప్పారు అని రామలక్ష్మి అంటుంది. దాంతో అభి షాక్ అవుతాడు. అది కూడా ఒక కారణమే అని అభి కవర్ చేస్తాడు. నువ్వు ఇంకా కొన్నిరోజులు సీతా సర్ భార్యగా నటించక తప్పదని అభి అంటాడు. దానికి రామలక్ష్మి కూడా సరేనంటుంది. నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఉంటే అంత డబ్బు సీతా సర్ దగ్గర నుండి లాగొచ్చని అభి అనుకుంటాడు.

Krishna Mukunda Murari : పండంటి బిడ్డకు జన్మనిస్తానంటూ మాటిచ్చిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -447 లో...  అక్కా.. ఆదర్శ్ పెళ్లి విషయం ఏం ఆలోచించారు? సంగీత గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని భవానిని రేవతి అడుగగా..  ఆదర్శ్‌ని నేను కనకపోయినా, నాకు వారసుడు ఇస్తాడనుకున్నాను. కానీ నేను ఊహించినట్లు వాడి జీవితం ఎప్పుడూ లేదు. చూద్దాం. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా.. ఆలోచిద్దాం. ఇక మీదట నా ఆశలన్నీ మురారీ, కృష్ణల మీదే అని అంటుంది. ఇంతలో మురారీ, కృష్ణలు కిందకు దిగి వస్తారు. వెంటనే భవాని లేచి నిలబడి కృష్ణతో మాట్లాడుతుంది. నాకు మనవడో, మనవరాలో కావాలి.. ఎప్పుడిస్తావ్ తింగరి.. నాకు త్వరలోనే వారసుడ్ని ఇస్తానని మాటిస్తావా అంటూ ప్రేమగా భవాని మాట్లాడుతుంది. అదంతా మీరా పైనుండి కోపంగా చూస్తుంటుంది.

Karthika Deepam2 : మల్లేశ్ ఇంట్లో పనిమనిషిలా అనసూయ.. భయపడిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'... ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -21 లో... దీప అన్న మాటలు పారిజాతం గుర్తుకుచేసుకుని దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంది. అప్పుడే బంటు వెళ్తుంటే.. పారిజాతం అతన్ని పిలుస్తుంది. ఇప్పుడే ఆ దీపని బయపెట్టి వచ్చాను.. పాపం బాగా బయపడిందని బంటు బిల్డప్ ఇస్తుంటాడు. నువ్వు దాన్ని బయపెట్టావా అంటు పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. ముందు దాన్ని ఇంట్లో నుండి బయటకు పంపంచే ఐడియా చూడని బంటూతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత మీ పెదాలపై చిరునవ్వు చూడడానికి ఈ బంటు ఏదైనా చేస్తాడని అంటాడు.