Read more!

English | Telugu

పాన్ పరాగ్ తినేదానివి... పాన్ ఇండియా హీరోయిన్ అవుతావా!

ఢీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం ఆది ఏదో ఒక గెటప్ తో వస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆది మల్లెపూల బాబా వేషంలో వచ్చాడు. వచ్చి అందరి జాతకాలు చెప్పాడు. ఆది బాబాతో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి శ్వేతా నాయుడు వచ్చింది.. "నేనొక పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ ని కావాలనుకుంటున్నా.." అనేసరికి "ఈ పాన్ పరాగులు తిని ఊసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందట" అంటూ ఆది జోక్ వేసాడు. ఆ డైలాగ్ కి శ్వేతా షాకైపోయింది.

తర్వాత శేఖర్ మీద పడ్డాడు ఆది. "శేఖర్ తురాణాం న భయం న సిగ్గు" అని అన్నాడు...తర్వాత షోకి హీరో సత్యదేవ్ వచ్చాడు. "బట్టలన్నాక మాసిపోవడం మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్ సర్" అనే డైలాగ్ తో అందరినీ నవ్వించాడు. తరువాత రాఖీ వచ్చి "గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ " అనే సాంగ్ కి డాన్స్ ని పెర్ఫార్మ్ చేసాడు. "ఏదేమైనా ఈ టవల్ పడితే ఒక ఎనెర్జీ వస్తుంది" అంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మేడలో వేసుకునే ఎర్ర టవల్ ని చూపించాడు. తర్వాత సత్యదేవ్ ఆ టవల్ ని తన భుజం మీద వేసుకుని స్టేజి మీదకు వెళ్లి రాఖీతో కొరియోగ్రాఫర్ తో కలిసి పవన్ కళ్యాణ్ స్టెప్స్ వేసాడు. ఫైనల్ గా హోస్ట్ నందు ఒక ట్విస్ట్ పెట్టాడు. వర్షిణి, రాఖీ, సహృద ఈ ముగ్గురినీ పక్కన నిలబెట్టి ఒకరిని ఎలిమినేట్ చేయాలంటూ మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ ని అడిగాడు నందు. ఐతే శ్వేతా, ఆదర్శ్, సునంద  ముగ్గురూ కలిసి మాట్లాడుకునేసరికి శేఖర్ మాస్టర్ కి కోపం వచ్చింది. అలా ముగ్గురు కలిసి ఎలిమినేట్ చేయడం కాదు ఇండివిడ్యువల్ గా ఎలిమినేట్ చేయాలి అని చెప్పాడు. ఐతే సహృద మాత్రం ఫుల్ టెన్షన్ పడిపోతూ కనిపించింది.